2, సెప్టెంబర్ 2020, బుధవారం

శివామృతలహరి శతకం

.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||
తనలోనే పరమాత్మయున్నదను సత్యం బావగింజంతయున్
కనలేడాయెను జీవి; నిన్ను వెదకున్ కానల్ గుహల్ దూరుచుక్
మనసే అద్దము గాదె నిన్గనుటకున్ మాయామషిన్ బాయఁ ద్రో
చిన భవ్యంబగు యోగహస్తమున నో శ్రీ సిద్ధలింగేశ్వరా!

భావము;
దేవుడు వెరెక్కడో లేడు, మనలోనే దాగి ఉన్నాడు అని మనిషి గ్రహించలేక, నీ కోసం అడవుల్లోనూ, కొండ గుహల్లోనూ వెతుకుతూ ఉంటాడు.
మనస్సు అనే అద్దంలో నీ దర్శనం ప్రతి నిత్యము దొరుకుతుంది కదా!
కాక పోతే మాయ అనే మసితో ఆ అద్దం మసక బారి ఉంటుంది. నిత్యం భక్తి ప్రపత్తులతో నిన్నే ధ్యానిస్తూ నీ మీద మనసుని లగ్నం చేస్తే గనుక, నీ దివ్య హస్తము తో మనసుకు పట్టిన మాయ అనే మసిని తుడిచి వేసి నీ దర్శన భాగ్యాన్ని కలుగజేస్తావు కదా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!అని నాన్నగారి భావన.

కామెంట్‌లు లేవు: