2, సెప్టెంబర్ 2020, బుధవారం

మహాలయ పక్షము

🔥కర్ణుడు భూలోకంలో గడిపి.. స్వర్గానికి వెళ్లిన పక్షమే మహాలయ పక్షం!🚩


*♦మహాలయ పక్షం..*
*🔹 భాద్రపద బహుళ పాడ్యమి నుంచి ప్రారంభమై మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది.*
*🔹 ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి,*
*🔹 మీ పితృదేవతలను స్మరించి,*
*🔹 వారికి నమస్కారము చేస్తూ,*
*🔹 ” నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి’ అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.*
*🔹 ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.*
*🔹 భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో,*
*🔹 బహుళ పక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్ఠమైనది.*
*🔹 పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు.*


*♦ఈ పక్షం ముగిసే వరకు..*
*🔹 ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి.*
*🔹కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.*
 *🔹తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి.*
*🔹 తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి.*
*🔹 ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య నైనా చేసి తీరాలి.*


*♦దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి...*
*🔹 మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది.*
*🔹 ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి.*
*🔹 ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది.*
*🔹పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు.*
*🔹 ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.*
 *🔹ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది.*
*🔹ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికయినా తీర్చుకుందామనుకుని..*
*🔹 సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు.*
*🔹 ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.*
 *🔹స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది.*
*🔹 దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా...*
*🔹 ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు.*
*🔹 చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు.*
*🔹 అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ,*
*🔹కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు.*
*🔹 అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.*


*♦కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా,*
*🔹 ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు.*
*🔹 నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి,*
*🔹అతడిని పెంచిన మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.*
 *🔹ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు.*
*🔹అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు.*
*🔹 పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.*


*♦ఎప్పుడైతే కర్ణుడు తిరిగి వచ్చి భూలోకంలో..*
*🔹 అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది*
*🔹ఆకలి తీరింది.*
*🔹 కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు.*
*🔹ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.*🚩

కామెంట్‌లు లేవు: