2, సెప్టెంబర్ 2020, బుధవారం

పంచభక్ష్య భోజనం

పంచభక్ష్య భోజనం అంటే ఏమిటి.....???

1) భక్ష్యము : నమిలి తినుట !
2) భోజ్యము : చప్పరిస్తే కరిగిపోయేది !
3) చోష్యము : పీల్చుకునేది / జుర్రుకునేది !
4) లేహ్యము : నాక్కుంటూ తినదగిన !
5) పానియము : త్రాగేది !

        ఈ 5 విధాలైన పదార్దలతో కూడిన భోజనమే పంచభక్ష్య భోజనము అని అంటారు .

      ......తీర్థ ప్రసాదాలు 4 రకాలు......

1) జల తీర్థం
2) కషాయ తీర్థం
3) పంచమృత తీర్థం
4) పానకా తీర్థం

                 ......జల తీర్థం .....

ఈ తీర్థం ద్వారా అకాల మరణం , సర్వరోగాలు నివారించాబాడుతాయి....అన్నీ కష్టాలు , ఉపసమానాన్ని ఇస్తాయి.....బుద్ది అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది.....

             ......కషాయ తీర్థం .......
 
     ఈ తీర్థం కొల్హపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం , కొల్లూరు ముకాంబిక దేవాలయం , హిమచల ప్రదేశ్ జ్వాలమాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాచి దేవాలయములో ఇస్తారు .....రాత్రి పూజ తరువాత తీర్థని కషాయం రూపంలో పంచుతారు.....వీటిని సేవించటం ద్వారా కనిపెంచే - కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి .....

    ..పంచామృత అభిషేక తీర్థం ..
   
     పంచామృత సేవనం ద్వారా చేపట్టిన అన్నీ పనులు దిగ్విజయముగా పూర్తికావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది....

      ..పానకా తీర్థం ..

శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి , అహోబిలం నరసింహ దేవునికి పానకం నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు ..... కారణం స్వామి పానకాన్ని నివేధ్యంగా పెట్టి , వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు..

పానకా తీర్థాలు వలన ప్రయోజనాలు.
   
 దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది !
 కొత్త చైతన్యం వస్తుంది !
దేహంలో ఉండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది.!
 రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం , నోరు ఎండిపోవునట్లు ఉండడం జరుగదు !
రుమాటిజం , ఎముకలుకు సంభందించిన వ్యాధులు నయం అవుతుంది !
దేవుని తీర్థమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది !
జీవితంలో శత్రువుల బాధ ఉండదు!
బుద్ది చురుకుగా పని చేస్తుంది !
జ్జాపకశక్తి పెరుగుతుంది !
      గోవింద !! గోవింద !! గోవింద !!
 అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం.

కామెంట్‌లు లేవు: