9, సెప్టెంబర్ 2020, బుధవారం

శంకరాచార్యుల వారు y

ఆది శంకరాచార్యుల వారు రచించిన గ్రంథాలను మూడింటిగా మనం విభజించుకోవచ్చు.

1) భాష్యగ్రంథం రచన
2) ప్రకరణ రచన
3) స్తోత్రవాఙ్మయం

భాష్యగ్రంథములంటే
1) ఉపనిషత్తులు,
2) బ్రహ్మసూత్రములు,
3) భగవద్గీత - వీటికే ప్రస్థాన త్రయం అని పేరు.

 ప్రకరణగ్రంథాలు ఏకశ్లోకి నుండి సహస్రశ్లోకముల వరకు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి వివేకచుడామణి, అపరోక్షానుభూతి మొదలగునవి.

తరువాత స్తోత్ర వాఙ్మయం ఇది అపారంగా ఉన్నది. భారత దేశంలో ఏపాటి భక్తి ఉన్నవారికైనా శంకరుల స్తోత్ర వాఙ్మయ స్పర్శ ఉండి తీరుతుంది. ఆయన ఇచ్చిన స్తోత్రములలో మణిపూస వంటివి శివానందలహరి, సౌందర్య లహరి.

శంకరులు రచించిన ఈ నూరు శ్లోకాల గ్రంథంలో ఒక సూత్రంగా ఉన్న ప్రత్యేకత : శివశక్తుల ఏకస్వరూపంగా అమ్మవారిని సంభావించడం.

ఇంతటి మహాగ్రంథానికి అద్భుతమైన ప్రత్యేక సైలిలో భావార్ధాన్ని రచించారు శ్రీ సామవేదం వారు. ఇది ఒక భావార్ధబోధక గ్రంథం, శ్రీ లలితాసహస్ర నామాలలోని ఎన్నో నామాలు సౌందర్యలహరి శ్లోకాలలో ధ్వనిస్తున్నాయి, వాటిని కూడా ఇందులో సూచించడం జరిగింది.

విశ్వవ్యాపకమైన , నిత్యమైన పరమేశ్వర చైతన్యమే స్త్రీపుం భావాతీతమైన సచ్చిదానంద తత్త్వం, అదే సౌందర్యం . ఇంతటి ప్రసిద్ధి చెందిన "సౌందర్య లహరి" శ్లోకాలకు సూటిగా, తేటగా, ఎదనెడ ముఖ్యాంశాలను తెలియజేస్తూ, అంతరార్థాలను తెలియచేసే చక్కని "ఉపోద్ఘాతం"తో పూజ్యులు సమన్వయ సరస్వతి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు రచించిన ప్రత్యేక భావానువాద గ్రంథం ఋషిపీఠం కార్యాలయాలలో లభ్యం అవుతుంది. ఆసక్తి కలవారు ఋషిపీఠ కార్యాలయన్ని సంప్రదించవచ్చు. ఇది కేవలం ₹30/- లకే లభ్యం అవుతుంది..

పూర్తి వివరాలకు సంప్రదించవలసిన చిరునామా -

Bharata Rushipeetham
Plot No: 1-9-46, HIG A-40,
Dr A S Rao Nagar,
 Hyderabad - 500 062, TS, India

040-2713 2550 , 2713 4557

Online purchase : https://rushipeetham.com/rushipeetham-store/

Mail: info@rushipeetham.org

కామెంట్‌లు లేవు: