26, సెప్టెంబర్ 2020, శనివారం

ఆచార్య సద్భోదన


భక్తి అనేది అంతరంగంలో కలిగేది, దానికి అపారమైన శక్తి ఉంది.


సరళత్వం, శుద్ధత, భగవంతుని పొందాలనే ఆకాంక్షను కలిగి ఉన్న భక్తుని హృదయంకన్నా శక్తిమంతమైనది మరొకటి ఉండదు.


అతని ప్రార్థనలో శక్తి ఎందుకు వస్తుందంటే అతడు తన కొరకు ఏమీ కోరుకోడు.


అతని ప్రార్థన ఫలిస్తుంది.


ఎందుకంటే అందులో స్వార్థపరత్వంకానీ, కపటం కానీ ఉండదు.


అతడు తన ఉనికిని కూడా మరచి ధ్యానిస్తాడు.


తనకంటే విలువైనది భగవంతుడేనని గ్రహిస్తాడు.


ఆ జ్ఞానకిరణాల ముందు అన్ని సందేహాలు, సంశయాలు, పోరాటాలు అదృశ్యమవుతాయి.

సర్వేజనా స్సుఖినోభవంతు.




*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

కామెంట్‌లు లేవు: