25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

హాత్ సే కామ్ మన్ మే రామ్"

 *జైశ్రీరామ్*

                "

🌺🌺🌺🌺🌺🌺🌺🌺 *సుభాషితం*


" మా నిషాద ప్రతిష్టాం

   త్వమగమః శాశ్వతీః సమాః |

   యత్ క్రౌంచ మిధునా దేక

   మవధీః కామ మోహితమ్"||

                     (వాల్మీకి మహర్షి)


                              *భావం*


ప్రపంచ భాష లన్నిటికి తల్లిఅయిన సంస్క్రుత భాషలో *వాల్మీకిమహర్షి* నోటినుండి యాదృచికంగా వెలువడిన మొట్టమొదటి శ్లోకం. ఇది సంస్కృత సాహిత్యంలో మొదటి శ్లోకం.ఈ శ్లోకం *అనుష్ఠప్* చందస్సు లో ఉంటుంది. మొత్తం వాల్మీకి రామాయణంలో ఉన్న 24000 శ్లోకాలు కూడా ఇదే ఛందస్సులో ఉంటాయి.

      కామమోహితమైన క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్ఛిని బోయవాడు తన బాణంతో కొట్టి చంపినపుడు ఆగ్రహంతో మహర్షి వాల్మీకి అన్న మాటలివి.

ఓరీ! కామపరవశమై ఉన్న క్రౌంచ మిధునంలోని ఒక పక్ఛిని నిష్కారణంగా చంపావుకదరా. ఇంత ఘోరానికి ఒడిగట్టిన నువ్వు కూడా ఇక ఎక్కువ కాలం జీవించవు.


                         *అమృతవచనం* 

                              *భరతవర్షం* 


 *ఇస్కాన్* సంస్థకి చెందిన పూజ్య *శ్రీ నితాయి సేవిని మాతాజీ* వారు ఒక సందర్భంలో భరతవర్షం గురించి మాట్లాడిన విషయం మీకు అందిస్తున్నాను.

        *భరతవర్షం* అంటే చాలామంది *ఇండియా* అనుకుంటారు, కాదు భరతవర్షం అంటే మొత్తం ప్రపంచం.ఒకప్పుడు *యుధిష్ఠిరుడు* (ధర్మరాజు) *హస్తినాపురం* రాజధానిగా చేసుకుని మొత్తం ప్రపంచాన్ని పరిపాలించాడు. ఇండియా అన్ని దేశాలకు నాయకుని (leader) వంటిది. అందరూ మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం (developing country) గా చెబుతూ ఉంటారు. కాని మనదేశం ఎప్పుడో చాలా అభివృద్ధి చెందింది. చాలామంది అనేక చోట్లనుంచి వచ్చి భారత్ మీద దాడులు చేసి ఆక్రమించుకున్నారు. ఎందుకని ప్రపంచ దేశాలన్నీ భారత్ నే ఆక్రమణకు ఎంచుకున్నాయంటే ఇక్కడ ఉన్న సంపద ఎక్కడా లేదు కాబట్టే.

      *సోమనాథ్* దేవాలయాన్ని 11 వ శతాబ్దంలో *గజనీ* వెండి, బంగారాలు ఎంత దోచుకుని తరలించినా అవి తరగలేదు. సోమనాథ్ దేవాలయ ప్రధాన ద్వారాలన్ని పూర్తిగా బంగారంతో చేసినవి.

     కేరళలోని *అనంతపద్మనాభ* *స్వామి* వారి ఆలయంలో ఎంత సంపదవుందో అది లెక్కించటం కూడా ఎవరితరం కాదు,అంతు చిక్కని సంపద ఉంది.అందరూ దోచుకుని పోగా ఇంకా ఎంతో మిగిలిఉంది.కేరళలో ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఎలా కాజెయ్యాలా అని చూస్తోంది.

       భారత్ ఎంతో ధనిక దేశం.ఖనిజాలు, రత్నాలు అన్నీ భారత్ నుంచే ఎగుమతి అయ్యేవి. కట్టుకునే బట్టలు మనమే ఎగుమతి చేసేవాళ్ళం.

     పూర్వం మీద ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉంది అని అంటారు. 800,900 మంది ఎక్కే *జంబోజెట్* విమానాలు తయారు చేసారు అని చెబుతారు. కాని ఆరోజుల్లో *కశ్యపముని* తన భార్యకోసం ఊరంత విమానాన్ని తయారుచేసాడు. అందులో లభ్యం కానిదంటూ ఏమీ ఉండదు. షాపింగ్ మాల్స్ కూడా అందులో ఉండేవి.

      ఆ రోజుల్లో కూడా *ప్లాస్టిక్*సర్జరీ* చేసేవారు. ప్రపంచంలో 2500 సంవత్సరాలకు పూర్వం మొట్టమొదటి శస్త్రచికిత్స చేసినది *సుశ్రృతుడు* .

సుశ్రుతుని గురువు

 *ధన్వంతరి* .ఈయన వైద్య పితామహుడు. 

మనది డెవలప్డు కంట్రీ అల్లా ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ గా మారిపోయింది. *చరకుడు* , *ధన్వంతరి* , *సుశృతుడు* వైద్యరంగంలో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. 

     భూమి గుండ్రంగా ఉంటుందని *కోపర్నికస్* , *గెలీలియోలు* మొదటగా చెప్పారు అంటారు. వీరు ఈమధ్య కాలంలోవారే 16,17 శతాబ్దాలకు చెందినవారు. కాని వేల సంవత్సరాలకు పూర్వం ఋగ్వేదంలో "చక్రాణాసః పరీణహం పృధివ్యా" అనివుంది. అంటే గుండ్రంగా ఉన్న భూమి అంచున మానవులు ఉన్నారు అని అర్ధం.

బ్రహ్మాడం మధ్యలో భూగోళం ఆకాశంలో నిలచిఉన్నది అని *ఆర్యభట్టు* 5 వ శతాబ్దంలో చెప్పాడు. దీనిని ఆధారం చేసుకునే అరబిక్ ఖగోళశాస్త్రం పట్టికలు ఏర్పాటు చేసుకున్నారు.

      *భూమాకర్షణశక్తి* (law of gravitation) కనుగొన్నది *న్యూటన్* అంటారు. అతను 17 వ శతాబ్దం (1643-1727) వాడు. కానీ *వరాహమిహిరుడు* 6 వ శతాబ్దం ప్రారంభంలో 505 లో *పంచసిద్ధాంతి* అనే గ్రంధంలో ఈ విషయం వ్రాసాడు.

       *ఆస్ట్రేలియా* అని పిలువబడే దేశం అసలుపేరు *అస్త్రాలయా* . అంటే పాండవులు వాళ్ళ అస్త్రాల నన్నిటిని అక్కడ పెట్టారు.

        *మారిషస్* అంటున్నాము అక్కడ *మారీచుడు* ఉండేవాడు. మారీచ,సుబాహువులు సూర్పణక కుమారులు. గొప్ప బలవంతులు.ఇద్దరూ కూడా రాముని చేతిలో మరణిస్తారు.

       *ఆఫ్రికాఖండం* అసలుపేరు *కుషినగర్* . రాముని కుమారులు కుశ, లవులలో కుశుడు అక్కడ నివసించేవాడు.

     జర్మనీదేశ నియంత *హిట్లర్* యొక్క సైనిక గుర్తు *స్వస్తిక్* . 

 *రష్యా* అనేది *ఋషులు* ఉండే ప్రదేశం. అక్కడ బహుసీతలంగా ఉంటుంది.అక్కడ వారి అనుష్ఠానానికి ఆటంకాలు ఉండవని ఋషులు అక్కడ ఉండేవారు. *ఋషియా* రష్యాగా మారింది.

 *కుతుబ్ *మినార్* అసలుపేరు *విష్ణుద్వజం* . ఢిల్లీలోని కుతుబ్ మినార్ వాస్తవానికి 2300 సంవత్సరాలకు పూర్వం *సముద్రగుప్తుడు* నిర్మించిన నక్ఛత్ర వేదశాల యొక్క ధ్వజస్తంభం అని చరిత్రకారులు చెబుతున్నారు.

       సంస్క్రతభాష అన్ని భాషలకు తల్లి. అన్ని భాషల్లోనూ గమనిస్తే సంస్కృత ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. Hand అనేది హస్తం నుంచి, Mind అనేది మన (మనసు) నుంచి, Simha అనేది సింహ నుంచి, Man అనేది మనుష్య నుంచి వచ్చాయి. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రపంచమంతా ధర్మరాజు పరిపాలించాడు.ఎటువంటి వివక్ఛ లేకుండా ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసేవాడు.ప్రజలు అన్నిచోట్లా వేదధర్మాన్ని పాటించేవారు. *మలేషియాలో* అనేక రామాలయాలు ఉన్నాయి. అక్కడ రాజులపేర్లు రామ్-1, రామ్-2 అలా ఉంటాయి.

ముస్లిందేశం *ఇండోనేషియా* ఐర్లైన్సు పేరు *గరుడ*(విష్ణుమూర్తి వాహనం).

16' ఎత్తుఉన్న చదువులతల్లి *సరస్వతి* అమ్మవారి విగ్రహాన్ని ఇండోనేషియా అమెరికాకు బహూకరించింది. రాజధాని వాషింగ్టన్ డి సి లో ఆ విగ్రహాన్ని పెట్టారు. 

        వీటన్నింటినీ బట్టి చూస్తే ప్రపంచమంతా భారతీయ సంస్కృతి,వేదధర్మం ఉండేవని అర్ధమవుతోంది. భరతవర్ష అంటే కేవలం ఇండియా కాదు అన్నది సుస్పష్టం.

కామెంట్‌లు లేవు: