18, ఏప్రిల్ 2024, గురువారం

వేదాంతంలో వైరాగ్యానికే

 జీవుడు ఓక చిలక


పంజరము వంటి శరీరములో జీవుడను ఓక చిలుక                 నివశిస్తుంది.

ఆథ్యాత్మిక జ్ఞానము వినుట చెప్పుట దీనికిఉంది,


కానినిద్ర పోతున్నది.


తనకు సమీపములోనే ఆత్మకూడా ఉన్నది.


కాని ఈ రెండింటిని మాయాపొర ఆవరించియున్నది.

అందుకే ఓకరినొకరు కలువలేకపోతున్నాయ్.


ఆత్మకు తెలుసు తనదగ్గరలో యున్న జీవుని గురించి,కాని మాయా ప్రభావము వలన జీవునికి ఆత్మ గురించి తెలియదు.


ఈ రెండు కలిగిన స్ధితియే మెాక్షము.  


దీనికే జీవ బ్రహ్మైక్య రాజయెాగమని పేరు.


వీటికలఇకయే యెాగము.


యెాగసాధనఅనిపేరు.


మనస్సు యెక్క సహయముతో జీవుడు గాలిలోఎగిరి,ఎగిరి,గగన మార్గము నసంచరించి గూటికి చేరుచున్నాడు.


జీవుని శరీరము ఓకగూడు,నగరము,కోట.


మనస్సు, బుద్థి,చిత్తము,అహంకారము జీవునకు ప్రథానవస్తువులు . ఆదిత్యయోగీ..


వీటితో తన కర్తవ్యములను,బాథ్యతలను,

శరీరఉపాధిని నిర్వహిస్తుంటుంది.


బంధ మెాక్షములకు,కర్మలకు ఈ జీవుడే కారణము.

సర్వకాల సర్వావస్ధలయందు ప్రతి జన్మలోను కుటుంబ విష  చక్రమందు ప్రీతి కలిగి,అందు తగుల్కోని పరిభ్రమిస్తూ కాలమును గడుపుచుంటాడు.


ఈ జీవాత్మ నాభి,హ్రదయ కమలము,బ్రహ్మరంధ్రముల యందు ప్రవర్తిస్తూంటాడు.


జీవుడు భ్రూమధ్యమున 'స' అను మంత్రమును, 'హ' అను మంత్రమును తనకు తానుగానే  ముక్కురంధ్రముల ద్వారా జపముచేస్తుంటాడు...

.

చిరంజీవత్వమును పొందుటకు సాథనలు 


చిత్తము సంపూర్ణముగా విశ్రాంతిపొందవలెెను.

ప్రాణ వాయువు నిర్మలాత్మమున విశ్రాంతి పొందవలెను. 


ప్రాణ సమాధిస్ధితిలో ఓక క్షణమైనాచలింపరాదు.  ప్రాణా ప్రాణగమనములననుసరించి పరమాత్మనుదర్శించవలెను.


ఆత్మ సమాధి యందే వెలసియుండాలి.


సమాధిస్ధితికి విరుద్ధమైన విషయములును స్మరించరాదు.


ధీర చిత్రమును మహప్రళయ కాలమున ప్రదర్శించవలయును.


గడచిన దానిని లేదా రాబోవు దాని గురించి చింతించ రాదు.

వర్ధమాన దృష్టిని, సాక్షి దృష్టిని అవలంబించిఆత్మ యందు లీనమై పోవాలి.


ఫలేచ్ఛను త్యజించవలెను. సుషుప్తి వ్యక్తివలె నిరభిమాన పూర్వకముగా కేవలీ స్వభావమున జీవించవలెను.


ఇష్టానిష్టాదులతో కూడిన వాటిని త్యజించ వలెను.


ఇదినాది, అదినాది ,నా,ఇదికావలయును,అదివలదు,దానిని నేడు పొందితిని, దానిని రేపుపొందదెను అను సంకల్పబంధాలు ఉండరాదు.


దేనినిఎపుడు,ఎన్నడుస్తుతించరాదు,నిందింపరాదు. స్వవిషయమున పర విషయముల యందు కూడా వాటిని పాటించవలెను.


మనస్సును శుభమును పొంది సంతోషింప చేయవలెను.

అ శుభ సంకల్పములతో దుఃఖము,రాగద్వేషాలు ఉద్భవిస్తాయ్.

చిరంజీవత్వము ప్రాప్తించదు.


త్యాగము అను గుణము వ్యక్తిగత లక్షణముగా ఉండవలెను.

స్వర్గమును పొందవలెనను కోరిక ఉండరాదు. అట్టి ఆసక్తిని ఎల్లప్పుడు త్యజించవలెను.


మరణ భయము ఉండరాదు. దానిని త్యజించవలెను.


చాపల్యము,శోకము,స్వస్ధము ఉండరాదు.


కాష్టము,సుందర,శైలము,తృణము,అగ్ని,హిమములను సర్వత్ర సమానముగా చూడవలెను.


ఈరోజు నేను ఏమి చేసితిని,రేపు ఏమి కానున్నది అను చింతాజ్వరము లేకుండవలెను.


జనమరణాది దుఃఖములు,రాజ్యలాభాది సుఖములు సంభవించినను శోకము దుఃఖము ఉండరాదు.


ఓకరు మిత్రుడు,ఇంకొకరు శత్రువు,వాడు నాకంటే అన్యుడు అను భావన ఉండరాదు.


చైతన్యము నేనే బ్రహ్మను నేనే, అహంబ్రహ్మస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అను ఇతర వేద మహవాక్యాలను పాటించాలి.


నూతన విషయములను గ్రహించునపుడు మనస్సు గర్వించరాదు.


ఈ జగత్తును ఎల్లపుడు నూతనము వలె ఆత్మ దృష్టితో చూడవలెను...

.

*ఈ జన్మలో అనుభవించిన ప్రారబ్ధకర్మలు పోను, మిగిలిన పూర్వ జన్మల్లోని సంచిత కర్మలని, ఈ జన్మలో చేసిన ఆగామి కర్మలన్నింటినీ ఆఖరిశ్వాసతో ప్రతి జీవి తర్వాతిజన్మకి తీసుకువెళ్తుంది.*


 *వాసనలని గాలి ఎలా తీసుకువెళ్తుందో,  అలా కర్మలన్నింటినీ శ్వాస తీసుకువెళ్తుంది. సూక్ష్మశరీరం ఈ కర్మలతో ఏర్పడుతుంది. అదే జడ శరీరాన్ని ఆవరించుకుని ఉండేది.*


 *”అర్థా గృహే వివర్తంతే స్మశానే మిత్ర బాంధవా సుకృతం*

*దుష్కృతం చైవ గచ్ఛన్తమనుగచ్ఛతి*


 *మరణించిన మనిషి యొక్క సంపద తనఇంట్లోనే ఉంటుంది. బంధుమిత్రులు స్మశానం దాకే వస్తారు. వెంటవచ్చేవి మనిషి చేసుకునే దుష్కర్మలు, సుకర్మలే.* ఆదిత్యయోగీ*


*కర్మ వల్లనే జన్మలు వస్తాయి. ఓ జన్మలో ఓ జీవి చేసిన కొంత కర్మ యొక్క ఫలాన్ని ఆ జీవి ఆ జన్మలో అనుభవించగా కొంత మిగిలితే, ఆ శేష కర్మ ఫలాన్ని అనుభవించడానికి మరో జన్మని తీసుకుంటాడు.*


 *మళ్ళీ ఆ రెండో జన్మలో ఈ ఫలాన్ని అనుభవిస్తూ చేసే కొత్త కర్మని అనుభవించడానికి మళ్ళీ కొన్ని పునర్జన్మలని పొందుతాడు. ఇలా కర్మ, జన్మ, మళ్ళీ కర్మల చక్రంలో జీవులమైన మనమంతా ఎంతో కాలంగా చిక్కుకుని తిరుగుతున్నాం.  ఈ కర్మ చక్రం గురించి శ్రీ ఆది శంకరాచార్య భజగోవిందంలో  ఇలా చెప్పారు."*


 *”పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం"* 


 *”మళ్ళీమళ్ళీ పుడతారు, మళ్లీ మళ్లీ మరణిస్తారు, మళ్లీ మళ్లీ తల్లి గర్భాన పడతారు".*


 *మనిషిలో మరణ సమయంలో ఏ గుణం అధికంగా వుంటే దాన్ని బట్టి తర్వాతి జన్మ లభిస్తుందని (భగవద్గీత 14 -15) శ్రీకృష్ణుడు చెప్పాడు. తమో గుణ ప్రధానులకి జంతు జన్మలు వస్తే, రజో గుణస్థులు మనుషులుగా పుడతారు. సత్వ గుణస్థులు ఆథ్యాత్మిక సంపద అధికంగా గల ఇళ్ళల్లో పుడతారు."*


 *”రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే"*


 *”రజోగుణం వృద్ధి చెందినప్పుడు మరణిస్తే, అతడు కర్మంటే ఆసక్తి గల మనుషుల్లో పుడతాడు. అలాగే తమో గుణం అధికమైనప్పుడు మరణించిన మానవుడు పశు పక్షి కీటకాది నీచ యోనుల్లో పుడతాడు".*


 *సత్వగుణ సంపన్నులు వచ్చే జన్మలో ఎలా పుడతారు?*


 *”యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్* 

*తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే"*

 *(భగవద్గీత 14-14)*


 *”సత్త్వ గుణం ఎక్కువగా ఉన్నప్పుడు మరణిస్తే అతడు ఉత్తమ కర్మలని ఆచరించేవారు చేరే నిర్మలమైన స్వర్గం మొదలైన దివ్య లోకాలని చేరుతాడు."* 


*”యోగ భ్రష్టుడు స్వర్గం మొదలైన దివ్య లోకాలలో అనేక సంవత్సరాలు గడిపాక పవిత్రులు, ధనవంతులు ఐనవారి ఇంట్లో పుడతాడు. (భగవద్గీత 6-41) ఒకోసారి పై లోకాలకి పోకుండానే అతను జ్ఞానులైన వారి కుటుంబంలో పుడతాడు."*


 *”ఐతే ఇది చాలాదుర్లభ జన్మ. (భగవద్గీత 6-42) లేదా ఆథ్యాత్మికంగా వున్నత స్థితిలోని యోగి కుటుంబంలో పుట్టి తిరిగి తన సాధనని కొనసాగిస్తాడు. (భగవద్గీత 6-43)"*


*దీన్ని బట్టి మరణ సమయంలో ఏ గుణం అధికంగా వుంటే తిరిగి అదే గుణంతో, అదే గుణానికి చెందిన జీవిగా పుడతారని తెలుస్తోంది. చేసిన కర్మలు కూడా మనిషి తర్వాతి జన్మని నిర్ణయిస్తాయి.*


 *”సుకర్మలు అధికంగా ఉంటే మనిషి జన్మ, మరీ అధికంగా ఉంటే ఉత్తమ మానవ జన్మ, దుష్కర్మలు అధికంగా ఉంటే జంతువు, పక్షి, లేదా కీటకం, వృక్షాలు లాంటి జన్మలు వస్తాయి అని శాస్త్రం చెప్తోంది. మన కర్మని బట్టే దేవుడు మనల్ని సృష్టిస్తున్నాడు. (గీత 9-8)"*


 *”ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూత గ్రామమిమం కృత్స్నమ్ అవశం ప్రకృతేర్వశాత్"*


 *”తమతమ స్వభావ వశంలో పరతంత్రమైయున్న భూత సముదాయాన్ని నా ప్రకృతి నాశ్రయించి మాటిమాటికీ వాటి కర్మానుసారం సృష్టిస్తున్నాను."*


 *శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో “నిష్కారణంగా భార్యని హింసించిన భర్త బాల వితంతువుగా అనుభవించడానికి ఏడు సార్లు  పుడతాడు." అని చెప్పబడింది.*ఆదిత్యయోగీ*


 *పురుషుడు నలుగురైదుగురు స్త్రీలని వివాహం చేసుకుంటే, తర్వాతి జన్మలో ఆ పురుషుడు స్త్రీగా జన్మిస్తాడు. అతని మీద తమ కామ వాసనలు నశించని స్త్రీలు పురుషులుగా జన్మించి, ఆ స్త్రీని అనుభవిస్తారు. ఒకే జన్మలో ఇది జరిగితే వ్యభిచారదోషం కలుగుతుంది.*


*వేరు వేరు జన్మల్లో వివాహం చేసుకుంటే ఆ దోషం ఉండదు. కర్మ ప్రభావాన్ని బట్టి ఇది జరుగుతుంది.*


 *”భార్యాభర్తలని విడదీసిన పాతకులు స్త్రీ, పురుష జన్మ కాని నపుంసక జన్మని ఎత్తి, సంసార సుఖం అంటే ఏమిటో తెలీక మనస్థాపాన్ని అనుభవిస్తారు."*


*”తీరని తీవ్రమైన కోరిక కూడా తర్వాతి జన్మని నిర్ణయిస్తుంది. మరణించే సమయంలో మామిడి పండు తినాలన్న కోరిక కలిగితే, తర్వాతి జన్మలో మామిడి పండులో పురుగుగా పుట్టొచ్చు.*


 *మరణించేప్పుడు ఆఖరి శ్వాస సమయంలో ఏ ఆలోచన కలిగితే ఆ ఆలోచన ఫలితమైన జన్మ తర్వాతి జన్మగా వస్తుంది. ఇది భగవద్గీతలోని మాట (గీత 8-6)"*

* “మన సంకల్పాలే మన తర్వాతి జన్మని నిర్ణయిస్తాయి. ఆబ్బాయిలంతా తన వెంటపడాలనే కోరికగల అమ్మాయి సంకల్పం ఈ జన్మలో తీరకపోతే, తర్వాతి జన్మలో ఆడకుక్కగా పుడుతుంది. మగకుక్కలన్నీ ఏక కాలంలో ఆ ఆడకుక్క వెంట పడుతూంటాయి.” అని చెప్పారు.*


 *కనుక చిన్నవే కావచ్చు, పెద్దవే కావచ్చు …కోరికలనే ఉంచుకోవడం మంచిదికాదని అర్ధమవుతోంది."*


 *వేదాంతంలో వైరాగ్యానికే పెద్ద పీట వేశారందువల్లనే......*

.

కామెంట్‌లు లేవు: