8, జులై 2022, శుక్రవారం

వేడికోలు


నేడు మన భారతదేశం సర్వస్వతంత్ర ప్రజా రాజ్యం అయింది. ఇది నిజంగా గర్వకారణం. కాని దాదాపు నూటయేబది సంవత్సరాలనుండి పరదేశీయుల పాలనక్రింద నలిగిన హిందువుల ఆచారవ్యవహారాలు కాపుదల లేక రూపుడి అంతరించాయి. కడుపు కక్కు రితికై కడగండ్లు మెండైన కొద్ది ఆర్య సంతతియొక్క తేజస్సు తరుగడం జరుగుతోంది.

వేదశాస్త్రాలయందు ప్ర్రామాణ్యబుద్ధి తొలగి పోతోంది. పూర్వుల చరిత్రలు చెప్పే పురాణాలు కల్పిత గాధలుగా పరిగణింప బడుతున్నాయి. రామాయణం జంకు భారతం బొంకు అనే ప్రబుద్ధులు బయలుదేరారు. మతధర్మాలు మాయమై సాంకర్యం ప్రబలుతోంది. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు నేటి నాగరిక సోద రులు జుట్టు బొట్టు కట్టు మున్నగువాటిలో స్వధర్మాలు విడిచి పరధర్మాలు అవలంబిస్తూన్నారు. జందెం ధరించడం ఛాందసం కొందఱి ద్విజాతుల దృష్టిలో, వారి విష యంలో నిత్యకర్మానుష్ఠానం, శ్రాద్ధక్రియలు, అబ్దికాలు అనే వానిని గూర్చి వేతే చెప్పనక్కరలేదనుకొంటాను.

వేదవిద్య, సంస్కృతభాష విడిచి పెట్టి కేవలం

ఆంగ్లభాష అనే ఎంగిలికూడు జీర్ణంకావడం 'చేతనే

కొకొందఱికిట్టి హైన్యగతి పట్టింది. మహర్షుల ఆధ్యాత్మిక

చింత, తపశ్శక్తులు, దివ్యబోధలు, తిరుగులేని వాళ్ళుధ్ధి, అపూర్వమహిమలు వీరి చెవిని పడియుండవనితోస్తుంది. కారణం ఏదైనా కావచ్చు. తెలియక చెడేవారు, తెలి సినా ప్రమాదవశంచేత చెడేవారు, తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానంచేత చెడేవారు, చెడినవారిచే చెఱప బడేవారు ఇట్లా నూటికి తొంబదిమంది చెడడం జరుగు తోంది. ఇంతకు చెప్పవచ్చే దేమంటే పరధర్మం ఆశ్రయిం చడనుంచీ తాము నిర్వీర్యులై తమ వ్యక్తిత్వాన్ని చంపు కోవడం అన్నమాట. పెద్దలు స్వధర్మపాలనలో నిధన మైనా శ్రేయమేయని హెచ్చరించారు. మహాత్ముల మార్గం తు చాలు తప్పక అనుసరించడం నేటి వారికి శక్యం కాకపోవచ్చు. శ క్తివంచనలేకుండా ప్రయత్నిం చడమైనా మన కనీస ధర్మంగా భావించాలి. త్రోవ నున్న వాడు ఎన్నడు తప్పిపోడు. ఎన్నటికైనా గమ్య స్థానం చేరుతాడు.

సారాంశమేమం ఓ దేశకాలపాత్రతల ననుసరించి మంచివని మీకు తోచిన పూర్వుల సత్సాంప్రదాయాల నవలంబిస్తూ కగ్మభూమియైన పవిత్ర భారతదేశంయొక్క పూర్వపు బాన్న త్యాన్ని పునరుద్ధరణం చేయవలసినదిగా నా సోదర ప్రజానీకానికి వినయపూర్వకమైన వేడికోలు.

కామెంట్‌లు లేవు: