1, జులై 2021, గురువారం

*🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏* *14.ఋభు మహర్షి* ఋభు మహర్షి బ్రహ్మకి ఇష్టమయిన పుత్రులంటారే వాళ్ళల్లో ఒకడు . అంటే బ్రహ్మ మానసపుత్రుడన్నమాట . ఈయనకి పూర్వజన్మ జ్ఞానం ఉంది . అసలు ఋభు మహర్షి ముందు జన్మలో వత్సుడు అనే పేరుతో గొప్ప తపస్సు చేసి విష్ణుమూర్తి నుండి వరం తీసుకున్నాడు . అదేంటో తెలుసా ? వచ్చే జన్మలో నేను ఋభువు అనే పేరుతో పూర్వజన్మ జ్ఞానం , గొప్ప తత్త్వజ్ఞానం కలిగి మోక్షం పొందాలని , వత్సమహర్షి ఆ జన్మ అయిపోయాక ఋభువు అనే పేరుతో మళ్ళీ పుట్టాడు . భగవంతుడు వరాహావతారం ఎత్తినపుడు ఋభువు ఆయనకి శిష్యుడుగా ఉండేవాడు . చాలా సంవత్సరాలు తపస్సు చేసినవాడు మంచి నిష్ట కలిగిన వాడు అయిన ఋభు మహర్షి దగ్గరికి పులస్త్య మహర్షికి కొడుకయిన నిదాఘుడు అనే మహర్షి వచ్చి శిష్యుడిగా చేర్చుకోమన్నాడు . గొప్ప తపశ్శక్తితో సంపాదించిన జ్ఞానాన్ని ఉపదేశించడానికి తగిన శిష్యుడు దొరికాడని అనుకుని ఋభువు సరేనన్నాడు . నిధాఘుడు గురువయిన ఋభువు నుండి అన్ని శాస్త్రాల జ్ఞానాన్ని నేర్చుకున్నాడు . ఒక్క ఆద్వైతాన్ని గురించి మాత్రం నేర్పలేదు ఋభువు . ఒకనాడు ఋభు మహర్షి శిష్యుణ్ణి చదువు అయిపోయింది వెళ్ళి పెళ్ళి చేసుకుని హాయిగా ఉండు అన్నాడు . నిదాఘుడు పెళ్ళి చేసుకుని యజ్ఞాలు , యాగాలు , జపాలు , తపస్సు , అతిధులకి సేవచేస్తూ , గురువుని పూజిస్తూ కాలం గుడుపుతుండగా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి . ఒకరోజు అయన ఇంటికి ఒక మహర్షి వచ్చాడు .. నిధాఘుడు ఆయన్ని ఆదరించి మహాత్మా ! భోజనం చెయ్యండి అన్నాడు . నాకు అన్నం తినాలని లేదు . ఆరు రుచులు కలిగిన భోజనం పెట్టమన్నాడు . నిదాఘుడు భార్యకి చెప్పి వండించి భోజనం పెట్టాడు . మహర్షి భోజనం పూర్తయ్యాక నిదాఘుడు మహాత్మా ! ఆకలి తీరిందా ? భోజనం బాగుందా ? అనడిగాడు . ఆకలి వున్నవాడికి ఆకలి తీరిందా ? లేదా ? తెలుస్తుంది . నాకు ఆకలి అంటే ఏమిటో తెలియదు . భోజనము రుచిగా ఉందా ? లేదా ? అనేది దేహానికి సంబంధించింది . మట్టిగోడలు మళ్ళీ మట్టి రాస్తే ఎలా గట్టిపడతాయో ఈ శరీరం కూడ పంచభూతాల వల్ల పుట్టింది కాబట్టి ఆ పదార్థాలతోనే పోషింపబడుతుంది . ఏది రుచి ఏది రుచి కాదు , నువ్వు , నేను ఇల్లాంటివన్నీ విడిచి పెట్టి ముక్తికి మార్గం చూసుకో అన్నాడు . నిదాఘుడు మహాత్మా ! మీ పేరు చెప్పలేదు అన్నాడు . ఆ మహర్షి నా పేరు బుభుడు . నేను నీ గురువుని అనగానే నిదాఘుడు ఆయన కాళ్ళమీద పడి మిమ్మల్ని చూసి వేయి సంవత్సరాలయిపోయింది . అందుకే గుర్తించలేకపోయాను క్షమించండి అన్నాడు . ఇంకొక వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి . మళ్ళీ ఋభు మహర్షి శిష్యుడు ముందు ఉన్న నగరానికి వచ్చాడు . నిదాఘుడు అడవికి వెళ్ళి కట్టెలు , పండ్లు మొదలయినవి పట్టు కోస్తూ దార్లో నడవడానికి వీలపక ఒకచోట కూర్చున్నాడు . ఋభుమహర్షి నిదాఘుట్టి చూసి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావేమిటి ? అని అడిగాడు . శిష్యుడికి మళ్ళీ మామూలే . గురువుగార్ని గుర్తుపట్టలేదు . నడుస్తుంటే రాజబలగం అడొచ్చింది , అందుకే ఆగానన్నాడు . గురువు మళ్ళీ అడిగాడు . ఇందులో రాజెవరు ? బలం ఎవరు ? అని . శిష్యుడు అది కూడ తెలియదా ! ఏనుగు మీద ఉన్నవాడు రాజు అన్నాడు . గురువు గారు ఊరుకోలేదు . రాజెవరు ? ఏనుగెవరు ? అన్నాడు . శిష్యుడు ఓపిగ్గా పైన ఉన్నది రాజు , క్రింద ఉన్నది ఏనుగు అన్నాడు . గురువు శిష్యుణ్ని వదిలి పెట్ట దలుచుకోలేదు . పైన అంటే ఏమిటి ? క్రింద అంటే ఏమిటి ? అన్నాడు . ఇంక శిష్యుడికి కోపం ఆగలేదు . ఒక్క ఉరుకు ఉరికి గురువుగారి మెడమీద కూర్చుని ఇప్పుడు నేను పైన నువ్వు క్రింద అన్నాడు . గురువుగారు ఇంకా వదలదల్చుకోలేదు శిష్యుణ్ణి . నువ్వంటే ఎవరు ? నేనంటే ఎవరు ? అన్నాడు . శిష్యుడు వెంటనే క్రిందకి దూకేసి గురువుగారి పాదాలమీద పడి మహాత్మా ! వేయి సంవత్సరాలు గడిచిపోయింది కదా..మిమ్మల్ని గుర్తించలేదు . క్షమించండి అన్నాడు . ఋభు మహర్షి నిదాఘుడ్ని లేవదీసి నీకు బ్రహ్మవిద్య గురించి చెప్పాలని వచ్చాను . నీకేమయినా సందేహాలుంటే అడుగు . ఇంక రాను అన్నాడు . శిష్యుడు మహాత్మా ! ఈ సంసార సాగరాన్ని దాటే ఉపాయం చెప్పండి అన్నాడు . ఆత్మ అంటే భగవంతుడే అని తెలుసుకో . సర్వకర్మల్ని చేయించేవాడు పరమాత్మ , చేసేది నువ్వు . కనుక నువ్వనేది లేదు . ఆత్మ ఒక్కటే సత్యం . ఆత్మ అంటే నేనే . భగవంతుణ్ణి కూడ నేనే . నాకు చిత్తము లేదు కాబట్టి చింత లేదు , దేహం లేదు కనుక రోగం లేదు , పాదాలు లేవు కనుక నడక లేదు , చేతులు లేవు కనుక పనులు లేవు , రోగం లేదు కనుక చావు లేదు , బుద్ధి లేదు కనుక సుఖం లేదు , శుభం లేదు అశుభం లేదు , భయం లేదు , బంధాలు లేవు , మోక్షము లేదు , ఉన్నది ఒక్కటే , అదే పరబ్రహ్మం . లోకమంతా బ్రహ్మమే కాబట్టి నాకున్న ఆలోచన కూడ అదే ఆ పరబ్రహ్మ గురించే కదా ... అన్నాడు . ఋభు మహర్షి నిదాఘుడికి ఇంకా ఇలా చెప్పాడు . మాటలతో చెప్పడం , మనస్సుతో చింతించడం , బుద్ధితో నిశ్చయించడం అన్నీ మిథ్య , శాస్త్రాల వల్ల చెప్పబడింది , కళ్ళతో చూస్తున్నది . చెవులతో వింటున్నదీ అన్నీ మిథ్యే . నాది నీది , నాకు - నీకు , నాకోసం - నీకోసం అనుకోవడం కూడ మిథ్యే అని చెప్పాడు . నిదాఘుడు స్వామీ ! మీరు చెప్పిన బ్రహ్మజ్ఞానం బాగానే ఉంది . కానీ , ఈ సంసార సాగరాన్ని దాటడం ఎలాగా అని అడుగుతున్నాను చెప్పండి అని అడిగాడు . ఋభువ మహర్షి వత్సా ! ఈ శరీరం మాయచే కప్పబడింది . మేలుకొని వున్నంతవరకు ఈ శరీరం సుఖాలు కోరుతుంది . నిద్రపోయినపుడు అజ్ఞానాంధకారంలోకి వెళ్ళిపోతుంది . పూర్వజన్మ కర్మల వల్లనే మనిషి సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాడు . ఆత్మే పరబ్రహ్మం . దాని వల్లనే సర్వేంద్రియాలు పంచభూతాలు పుడుతున్నాయి . ఏది పరబ్రహ్మ స్వరూపమో , ఏది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో , ఏది నిత్యమో అదే నేను . బ్రహ్మము నేను , నాలోంచే అన్నీ పుడుతున్నాయి . నశిస్తున్నాయి . నేనే విశ్వమంతా ఉన్నాను . కళ్ళు లేకపోయినా చూడగలను , చెవులు లేకపోయినా వినగలను , నాకు పాపము లేదు , చావు లేదు , వేరే జన్మము లేదు , నాకు దేహబుద్ధి లేదు అంతా నేనే . నేనే బ్రహ్మను అని తెలుసుకున్నప్పుడు నీకు దేని గురించి చింత ? అంతా నేనే వేరే ఏమీ లేదు . నేనే పరబ్రహ్మ అని అనుకున్నప్పుడు ఈ సంసారం కూడ పరబ్రహ్మ కదా ... దాని గురించి నీకు ఆలోచన ఎందుకు ? అది కూడ వదిలేసి పరబ్రహ్మని అంటే నీ ఆత్మని గురించి తెలుసుకో . అప్పుడు నీకు ప్రపంచంలో ఏమీ లేదు అనేది తెలుస్తుంది . అప్పుడే ఈ సంసారంతో బంధం కూడ ఉండదు . నువ్వు ఎక్కడనుండయితే వచ్చావో అక్కడికి పోవడానికి దారి వెతుక్కో , దానికి మార్గం భగవన్నామం భగవన్నామం చేసుకుని నువ్వు ఎవరో ఎక్కడనుండి , ఎందుకు వచ్చావో తెలుసుకుని అక్కడకి వెళ్ళడానికే నీ తపస్సు ఉపయోగించుకోమని ఋభు మహర్షి నిదాఘుడుకి బ్రహ్మజ్ఞానం గురించి చెప్పాడు . శిష్యుడికి గురవెంత ముఖ్యమో , గురువుకి మంచి శిష్యుడు కూడ అంతే ముఖ్యం . గురువు ఎప్పుడూ శిష్యుడికి మంచి జరగాలనే కోరుకుంటాడు . చూశారా ! గురువుగారు ఎన్ని వేల సంవత్సరాలయినా తన శిష్యుణ్ణి ఎలా కాపాడుకుంటూ , జ్ఞానం , మోక్షం కలిగేలా బోధిస్తూ ఉన్నాడో ! అదే ! గురశిష్య సంబంధం , తండ్రికి కొడుక్కి భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే సంబంధం కన్న కూడా పవిత్రయిందన్నమాట ! *14.ఋభు మహర్షి* *Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*🙏

 *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

*14.ఋభు మహర్షి*


ఋభు మహర్షి బ్రహ్మకి ఇష్టమయిన పుత్రులంటారే వాళ్ళల్లో ఒకడు . అంటే బ్రహ్మ మానసపుత్రుడన్నమాట . ఈయనకి పూర్వజన్మ జ్ఞానం ఉంది . అసలు ఋభు మహర్షి ముందు జన్మలో వత్సుడు అనే పేరుతో గొప్ప తపస్సు చేసి విష్ణుమూర్తి నుండి వరం తీసుకున్నాడు . అదేంటో తెలుసా ? వచ్చే జన్మలో నేను ఋభువు అనే పేరుతో పూర్వజన్మ జ్ఞానం , గొప్ప తత్త్వజ్ఞానం కలిగి మోక్షం పొందాలని , వత్సమహర్షి ఆ జన్మ అయిపోయాక ఋభువు అనే పేరుతో మళ్ళీ పుట్టాడు . భగవంతుడు వరాహావతారం ఎత్తినపుడు ఋభువు ఆయనకి శిష్యుడుగా ఉండేవాడు . చాలా సంవత్సరాలు తపస్సు చేసినవాడు మంచి నిష్ట కలిగిన వాడు అయిన ఋభు మహర్షి దగ్గరికి పులస్త్య మహర్షికి కొడుకయిన నిదాఘుడు అనే మహర్షి వచ్చి శిష్యుడిగా చేర్చుకోమన్నాడు . గొప్ప తపశ్శక్తితో సంపాదించిన జ్ఞానాన్ని ఉపదేశించడానికి తగిన శిష్యుడు దొరికాడని అనుకుని ఋభువు సరేనన్నాడు . నిధాఘుడు గురువయిన ఋభువు నుండి అన్ని శాస్త్రాల జ్ఞానాన్ని నేర్చుకున్నాడు . ఒక్క ఆద్వైతాన్ని గురించి మాత్రం నేర్పలేదు ఋభువు . ఒకనాడు ఋభు మహర్షి శిష్యుణ్ణి  చదువు అయిపోయింది వెళ్ళి పెళ్ళి చేసుకుని హాయిగా ఉండు అన్నాడు .


నిదాఘుడు పెళ్ళి చేసుకుని యజ్ఞాలు , యాగాలు , జపాలు , తపస్సు , అతిధులకి సేవచేస్తూ , గురువుని పూజిస్తూ కాలం గుడుపుతుండగా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి . ఒకరోజు అయన ఇంటికి ఒక మహర్షి వచ్చాడు .. నిధాఘుడు ఆయన్ని ఆదరించి మహాత్మా ! భోజనం చెయ్యండి అన్నాడు . నాకు అన్నం తినాలని లేదు . ఆరు రుచులు కలిగిన భోజనం పెట్టమన్నాడు . నిదాఘుడు భార్యకి చెప్పి వండించి భోజనం పెట్టాడు . మహర్షి భోజనం పూర్తయ్యాక నిదాఘుడు మహాత్మా ! ఆకలి తీరిందా ? భోజనం బాగుందా ? అనడిగాడు . ఆకలి వున్నవాడికి ఆకలి తీరిందా ? లేదా ? తెలుస్తుంది . నాకు ఆకలి అంటే ఏమిటో తెలియదు . భోజనము రుచిగా ఉందా ? లేదా ? అనేది దేహానికి సంబంధించింది . మట్టిగోడలు మళ్ళీ మట్టి రాస్తే ఎలా గట్టిపడతాయో ఈ శరీరం కూడ పంచభూతాల వల్ల పుట్టింది కాబట్టి ఆ పదార్థాలతోనే పోషింపబడుతుంది . ఏది రుచి ఏది రుచి కాదు , నువ్వు , నేను ఇల్లాంటివన్నీ విడిచి పెట్టి ముక్తికి మార్గం చూసుకో అన్నాడు . నిదాఘుడు మహాత్మా ! మీ పేరు చెప్పలేదు అన్నాడు . ఆ మహర్షి నా పేరు బుభుడు . నేను నీ గురువుని అనగానే నిదాఘుడు ఆయన కాళ్ళమీద పడి మిమ్మల్ని చూసి వేయి సంవత్సరాలయిపోయింది . అందుకే గుర్తించలేకపోయాను క్షమించండి అన్నాడు . ఇంకొక వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి . మళ్ళీ ఋభు మహర్షి శిష్యుడు ముందు ఉన్న నగరానికి వచ్చాడు . నిదాఘుడు అడవికి వెళ్ళి కట్టెలు , పండ్లు మొదలయినవి పట్టు కోస్తూ దార్లో నడవడానికి వీలపక ఒకచోట కూర్చున్నాడు . 


ఋభుమహర్షి నిదాఘుట్టి చూసి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావేమిటి ? అని అడిగాడు . శిష్యుడికి మళ్ళీ మామూలే . గురువుగార్ని గుర్తుపట్టలేదు . నడుస్తుంటే రాజబలగం అడొచ్చింది , అందుకే ఆగానన్నాడు . గురువు మళ్ళీ అడిగాడు . ఇందులో రాజెవరు ? బలం ఎవరు ? అని . శిష్యుడు అది కూడ తెలియదా ! ఏనుగు మీద ఉన్నవాడు రాజు అన్నాడు . గురువు గారు ఊరుకోలేదు . రాజెవరు ? ఏనుగెవరు ? అన్నాడు . శిష్యుడు ఓపిగ్గా పైన ఉన్నది రాజు , క్రింద ఉన్నది ఏనుగు అన్నాడు . గురువు శిష్యుణ్ని వదిలి పెట్ట దలుచుకోలేదు . పైన అంటే ఏమిటి ? క్రింద అంటే ఏమిటి ? అన్నాడు . ఇంక శిష్యుడికి కోపం ఆగలేదు . ఒక్క ఉరుకు ఉరికి గురువుగారి మెడమీద కూర్చుని ఇప్పుడు నేను పైన నువ్వు క్రింద అన్నాడు . గురువుగారు ఇంకా వదలదల్చుకోలేదు శిష్యుణ్ణి . నువ్వంటే ఎవరు ? నేనంటే ఎవరు ? అన్నాడు . శిష్యుడు వెంటనే క్రిందకి దూకేసి గురువుగారి పాదాలమీద పడి మహాత్మా ! వేయి సంవత్సరాలు గడిచిపోయింది కదా..మిమ్మల్ని గుర్తించలేదు . క్షమించండి అన్నాడు .

ఋభు మహర్షి నిదాఘుడ్ని లేవదీసి నీకు బ్రహ్మవిద్య గురించి చెప్పాలని వచ్చాను . నీకేమయినా సందేహాలుంటే అడుగు . ఇంక రాను అన్నాడు . శిష్యుడు మహాత్మా ! ఈ సంసార సాగరాన్ని దాటే ఉపాయం చెప్పండి అన్నాడు . ఆత్మ అంటే భగవంతుడే అని తెలుసుకో . సర్వకర్మల్ని చేయించేవాడు పరమాత్మ , చేసేది నువ్వు . కనుక నువ్వనేది లేదు . ఆత్మ ఒక్కటే సత్యం . ఆత్మ అంటే నేనే . భగవంతుణ్ణి కూడ నేనే . నాకు చిత్తము లేదు కాబట్టి చింత లేదు , దేహం లేదు కనుక రోగం లేదు , పాదాలు లేవు కనుక నడక లేదు , చేతులు లేవు కనుక పనులు లేవు , రోగం లేదు కనుక చావు లేదు , బుద్ధి లేదు కనుక సుఖం లేదు , శుభం లేదు అశుభం లేదు , భయం లేదు , బంధాలు లేవు , మోక్షము లేదు , ఉన్నది ఒక్కటే , అదే పరబ్రహ్మం . లోకమంతా బ్రహ్మమే కాబట్టి నాకున్న ఆలోచన కూడ అదే ఆ పరబ్రహ్మ గురించే కదా ... అన్నాడు . ఋభు మహర్షి నిదాఘుడికి ఇంకా ఇలా చెప్పాడు . మాటలతో చెప్పడం , మనస్సుతో చింతించడం , బుద్ధితో నిశ్చయించడం అన్నీ మిథ్య , శాస్త్రాల వల్ల చెప్పబడింది , కళ్ళతో చూస్తున్నది . చెవులతో వింటున్నదీ అన్నీ మిథ్యే . నాది నీది , నాకు - నీకు , నాకోసం - నీకోసం అనుకోవడం కూడ మిథ్యే అని చెప్పాడు .


 నిదాఘుడు స్వామీ ! మీరు చెప్పిన బ్రహ్మజ్ఞానం బాగానే ఉంది . కానీ , ఈ సంసార సాగరాన్ని దాటడం ఎలాగా అని అడుగుతున్నాను చెప్పండి అని అడిగాడు . ఋభువ మహర్షి వత్సా ! ఈ శరీరం మాయచే కప్పబడింది . మేలుకొని వున్నంతవరకు ఈ శరీరం సుఖాలు కోరుతుంది . నిద్రపోయినపుడు అజ్ఞానాంధకారంలోకి వెళ్ళిపోతుంది . పూర్వజన్మ కర్మల వల్లనే మనిషి సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాడు . ఆత్మే పరబ్రహ్మం . దాని వల్లనే సర్వేంద్రియాలు పంచభూతాలు పుడుతున్నాయి . ఏది పరబ్రహ్మ స్వరూపమో , ఏది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో , ఏది నిత్యమో అదే నేను . బ్రహ్మము నేను , నాలోంచే అన్నీ పుడుతున్నాయి . నశిస్తున్నాయి . నేనే విశ్వమంతా ఉన్నాను . కళ్ళు లేకపోయినా చూడగలను , చెవులు లేకపోయినా వినగలను , నాకు పాపము లేదు , చావు లేదు , వేరే జన్మము లేదు , నాకు దేహబుద్ధి లేదు అంతా నేనే . నేనే బ్రహ్మను అని తెలుసుకున్నప్పుడు నీకు దేని గురించి చింత ? అంతా నేనే వేరే ఏమీ లేదు . నేనే పరబ్రహ్మ అని అనుకున్నప్పుడు ఈ సంసారం కూడ పరబ్రహ్మ కదా ... దాని గురించి నీకు ఆలోచన ఎందుకు ? అది కూడ వదిలేసి పరబ్రహ్మని అంటే నీ ఆత్మని గురించి తెలుసుకో . అప్పుడు నీకు ప్రపంచంలో ఏమీ లేదు అనేది తెలుస్తుంది . అప్పుడే ఈ సంసారంతో బంధం కూడ ఉండదు . నువ్వు ఎక్కడనుండయితే వచ్చావో అక్కడికి పోవడానికి దారి వెతుక్కో , దానికి మార్గం భగవన్నామం 


భగవన్నామం చేసుకుని నువ్వు ఎవరో ఎక్కడనుండి , ఎందుకు వచ్చావో తెలుసుకుని అక్కడకి వెళ్ళడానికే నీ తపస్సు ఉపయోగించుకోమని ఋభు మహర్షి నిదాఘుడుకి బ్రహ్మజ్ఞానం గురించి చెప్పాడు .  శిష్యుడికి గురవెంత ముఖ్యమో , గురువుకి మంచి శిష్యుడు కూడ అంతే ముఖ్యం . గురువు ఎప్పుడూ శిష్యుడికి మంచి జరగాలనే కోరుకుంటాడు . చూశారా ! గురువుగారు ఎన్ని వేల సంవత్సరాలయినా తన శిష్యుణ్ణి ఎలా కాపాడుకుంటూ , జ్ఞానం , మోక్షం కలిగేలా బోధిస్తూ ఉన్నాడో ! అదే ! గురశిష్య సంబంధం , తండ్రికి కొడుక్కి భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే సంబంధం కన్న కూడా పవిత్రయిందన్నమాట !  

*14.ఋభు మహర్షి*

*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*🙏

కామెంట్‌లు లేవు: