*భగవంతుడు - పూజ - ధ్యానము*
సభ్యులకు నమస్కారములు.
1) *సామాన్య భక్తి*
భక్తి అనగానే ఆ పరమాత్మను పువ్వులతో పూజచేసి, నారికేళాలు, కదళి ఫలాలు అర్పించి తీర్థ ప్రసాదాలు పంచుకుని ఆరగించడం. *కాని, సర్వమూ భగవద్రూపమే* అన్న విశ్వాసాన్ని పెంచుకోవాలంటే ఎన్నో మార్గాలు
2) *బద్నాతి ప్రీతిమితి బంధుః*
భగవంతుడు జీవులకు సర్వ విధ బంధువు.
3) *ప్రీతి పూర్వ మను ధ్యానం భక్తి రిత్యాభిధియతే*.
ప్రీతి (సంతోషము, ఇష్టము) తో నిరంతరము భావన చేస్తే, ఆ భావన సంపూర్ణ భక్తి అనబడుతుంది. తద్వారా మనకు భగవత్ అనుభవం కలుగుతుంది. భగవత్ పూజలు, ధ్యానము మ్రొక్కుబడిగానో, భయం చేతనో, కోరికలతో లేక ప్రేరణలతో చేయకుండా, ఇష్టముగా, మనః స్పూర్తిగా సంతృప్తి మరియు సంతోషాలతో చేయవలసి ఉన్నది, ఉంటుంది. ప్రార్థన లేక పూజ పూర్తి విశ్వాసము, ఇష్టము మరియు సంతోషములతో చేస్తే భగవంతుడిని కరిగిస్తుంది. భక్తులకు ధర్మాన్ని, బలాన్ని మరియు శుభాలను అందజేస్తుంది.
4) *ఉపచారాపదేశేన్ కృతాన్ హర హర్మయా,*
*అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్య పురుషోత్తమ*
స్వామీ పురుషోత్తమా నీకు ఉపచారములు, పూజలు చేసే నెపంతో, ప్రతి రోజు నేను చేసే అపకారములను మన్నించి క్షమించగలవు. భక్తులు ప్రతి రోజు *పూజ లేక భగవత్ ధ్యానము తదుపరి, భగవంతుని పై విధంగా వేడుకొనుట ఒక మర్యాద మరియు సంస్కారము*.
5) *యోగ కర్మ సుకౌశలమ్*
అంటే సంసారిక జీవనాన్ని అర్థం చేసుకుని, ఇందులో చిక్కుకొనని విధంగా, సర్వ విధ ప్రవృత్తుల్ని, చాలా మెళుకువతో, కౌశల పూర్ణంగా కొనసాగించడం.
పైన తెల్పిన గీతా వచనం బాగా అవగాహనలో ఉండటమే గాక ఆచరణలో ఉండడం గూడా మహానుభావుల విశేష లక్షణం. వీరికి తాము చేసే సంసారిక వ్యవహారాలన్నీ, తమకు అంటకుండా ఉండేలా చేసే విధానం పట్ల అవగాహన ఉన్నదను విషయం స్పష్టం. ఏమిటా అవగాహన.... చేసే ఏ కర్మైనా భగవత్ ప్రీతి కోసమే చేస్తున్నాం తప్ప, వ్యక్తిగత ప్రయోజనానికి కాదన్న భావన దృఢంగా ఉంటుంది. *అందువలననే తాము చేయవలసిన ధార్మిక, సమాజ హితకర పనులను ఎట్టి అవాంతరాలు ఏర్పడినా భయంతో మానడమొ లేక వైరాగ్య భావనతో పూర్తిగా విడిచి పెట్టడమొ చేయరు*. శాస్త్రం విధించిన సత్కర్మలు చెసి, ఫలాన్ని పరమాత్మకు విడిచిపెడతారు. ఈలా వివేచనతో కర్మాచరణ సాగించడమే వీరి విశిష్టత.
ధన్యవాదములు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి