హరికధల్లో హాస్యం:
ఓ హరిదాసుగారు ఆలస్యంగా
హరికధ మొదలు పెట్టారు. ఆలస్యంగా ఎందుకు రావలసివచ్చిందో సభా
సదులకు సంజాయిషీ ఇచ్చుకుంటూ
ఓపిట్టకధ చెప్పారు.
మీ ఊరుకి రవాణా సదుపాయాలు లేక
గుర్రంబండ్లు ఉన్నా ఎక్కడానికి భయం
వేసి.నడిచి వచ్చే టప్పటికి ఇంతఆలస్యం
అయింది.గుర్రంబండెందుకు ఎక్కలేదను
కుంటున్నా రా! ఆకధచెబుతావినండి
నాయనా!.శ్రీ మద్రరమారమణ గోవింద.
మీఊరికి రావడానికి బండి బేరం చేసా
తీరా సంచీ పుచ్చుకొనిబండిలో కాలు
మోపేలోపు గుర్రం ఫెఢీల్మని తన్నిందండి.
దానికి బండివాడు నవ్వుతూ కంగారు
పడకండి దాసుగారు మాగుర్రం మూడు
సార్లు తన్నితేకాని నడవదండిఅన్నాడు.
అయతే ఓపనిచెయ్యరా!అబ్బీ.నేను
సంచీపుచ్చుకొని.ఆచెట్టు కింద నిలబడతా ఆ రెండు తాపులు కూడా
అయ్యాక.ఎక్కుతా అన్నా.
దానికి వాడు.నవ్వుతూ భలే వోరే అలా
కుదరండి మాగుర్రానికో తిక్కుంది దానికో
లెక్కుందండండి. ఎవరైనా ఎక్కితే కాని
తన్నదండి అన్నాడు.
ఎందుకు.రిస్కుతీసుకోవడం అని నడిచి
వచ్చే టప్పటికి ఇంత సమయం పట్టింది.
ఇక కధలోకి వెడదాం.
శ్రీ మద్రరమారమణ గోవిందో హరి:
.......
జె.ఎల్. నరసింహం,హాస్యావధాని, హైదరాబాద్.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి