15, ఏప్రిల్ 2023, శనివారం

పసిపిల్లలు పుట్టగానే చేయవలసిన పని



పసిపిల్లలు పుట్టగానే చేయవలసిన పని మరియు పుట్టగానే ఏడవని బిడ్డలకు ప్రాణం పోసే విధానం - 


  పసిపిల్లలు పుట్టగానే చేయవలిసిన పని  - 


      సహజమయిన కాన్పు జరిగినప్పుడు తల్లికి చీకట్లు కమ్మినట్లుగా ఉండి తన ఒళ్లు తనకే తెలియనట్లుగా ఉంటుంది. ఆ స్థితిలో ఆమెకి గట్టిగా నడుము బిగించి కట్టి వెల్లికిలా పడుకొపెట్టి ఉంచాలి. పక్కన సహాయకులుగా ఉన్నవారు బిడ్డని జాగ్రత్తగా ఎత్తుకొని గోరువెచ్చటి నీరుతో శుభ్రంగా కడిగి స్నానం చేయించి మెత్తని పొడి గుడ్డల్లో పడుకోపెట్టాలి. పక్కన ఉన్నవారు తమ చేతులకు నిప్పుసెగని కాచుకొని ఆ చేతులను బిడ్డ శిరస్సు , కడుపు భాగాలకు వేడి కలిగేలా చేయాలి . తరువాత ఆ చేయి శుభ్రంగా కడుక్కొని చూపుడు వ్రేలితో అతి కొద్ది ఆముదాన్ని తీసుకుని బిడ్డకు నాకించాలి.


  పుట్టగానే ఏడవని బిడ్డకు ప్రాణం పోసే విధానం  -


     

      కొన్ని సమయాలలో బిడ్డ పుట్టగానే ఏడవకుండా ఉండటం జరుగును. అట్టి సమయాలలో గాబరా పడకుండా మావిత్రాడు ని సవరిస్తూ ఉండాలి. దానివలన ఆ మావిత్రాడు లొని ప్రాణవాయువు బిడ్డ గర్భములొకి చేరి వెంటనే శరీరానికి చైతన్యం కలిగి అంటే ప్రాణం చేరి బిడ్డ కదులుతూ ఏడుస్తుంది. ఇంకా బిడ్డని అటుఇటు కదిలించి వేడివేడి చేతులతో తాకుట వలన బిడ్డ తుంటి పైన మెల్లగా సుతారంగా తట్టుట వలన ప్రాణం శరీరంలోకి ప్రవేశించి బిడ్డ ఏడుస్తుంది . 


        ఒకవేళ బిడ్డ ఎడవకపోతే పైన చెప్పిన పనులు చేసిన తరువాత బిడ్డ క్షేమంగా సజీవంగా ఉందని తెలిసిన తరువాతే బొడ్డు కోయాలి. పదిపదిహేను నిమిషాల పాటు పైన చెప్పినట్టుగా చేస్తూ ఉంటే నిర్జీవంగా ఉన్న బిడ్డలో ప్రాణం వస్తుంది. ఆముదం తడిపిన వ్రేలు బిడ్డ నోటిలో పెట్టడం వలన కూడా బిడ్డలో ప్రాణం చేరి ఉలిక్కిపడి ఏడుస్తుంది . మావిత్రాడులో ప్రాణ నాడి కొట్టుకుంటూ ఉంటుంది. ఆ ప్రాణం బిడ్డ శరీరంలో చేరి బిడ్డకు చైతన్యం కలిగి ఏడ్చే వరకు మావిత్రాడుని కదిలిస్తూ ఉండాలే కాని ఎట్టి పరిస్థితులలో మావిత్రాడు కోయడం కాని , ముడి వేయడం కాని చేయకూడదు .


           వైద్యులు , పురుడు పోసే మంత్రసానులు ఈ విషయాన్ని తప్పక గుర్తు ఉంచుకోవాలి .


           మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  : మధుమేహం లో పనిచేసే ప్రధాన మూలికలు  - 


 *  పొడపత్రి ఆకు  - 


     దీన్నుంచి తీయబడ్డ ఒక ఎంజైమ్ కు గ్లూకోజ్ ద్రావణాన్ని బలహీనపరిచే గుణం ఉన్నట్లుగా కనుగొన్నారు. దీన్ని తిన్న తరువాత తీపి రుచిని కొంతసేపటి వరకు కనిపెట్టలేక పోవడం ఈ మొక్కకి ఉన్న ప్రత్యేకత . దీని ఆకుల నుంచి తీయబడిన జిమ్నిమిక్ ఆసిడ్ కి ఇన్సులిన్ ఉత్పత్తికి కారణం అయిన బీటా కణాలను బలోపేతం చేసే నైజం ఉన్నట్లుగా కనుగొన్నారు . 


 *  కాకర  - 


       కాకర కాయల నుంచి విత్తనాలు నుంచి తీసే పాలి పెప్టైడ్ కు బోవైన్ ఇన్సులిన్ తో సమానం అయిన గుణ ధర్మం ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఇది రక్తంలోని గ్లూకోజ్ ని శరీర కణాలు గ్రహించేలాగా చేస్తుంది . 


 *  పెద్దేగి  - 


       ప్రయోగశాలల్లో జాగిలాలకు ఎల్లోక్సాన్ అనే పదార్ధంతో కృత్రిమంగా మధుమేహాన్ని కలిగించి పెద్దేగి సారాన్ని ఇచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. అలాగే ఎలుకల మీద ప్రయోగించినప్పుడు వాటి అన్నవాహిక నుంచే గ్లూకోజ్ శరీరంలోకి వెళ్ళకుండా ఆగిపోవడం గమనించారు.


              పెద్దేగి మూలిక  విషయంలో ఇంకా ఆసక్తి గొలిపే విషయం ఏమిటంటే ఇది ఇన్సులిన్ కి అవసరం అయిన ప్రో ఇన్సులిన్ నిర్మాణంలో సహాయపడగలదు అని కనుగొన్నారు . ఇది కొలెస్ట్రాల్ ని సమర్ధవంతంగా నియంత్రిస్తుంది.


 *  నేరేడు  - 


       నేరేడు పండ్లకు , విత్తనాల చూర్ణం కి మధుమేహానికి వ్యతిరేకంగా పనిచేసే గుణం ఉన్నట్లు కనుగొన్నారు . 


 *  తులసి  - 


       ప్రయోగశాలల్లో ఎలుకలకు streptojotosin అనే పదార్థంతో మదుమేహాన్ని కలిగించి తులసి సారాన్ని ఇథనాల్ సహయంతో తీసి ప్రయోగించి చూసినప్పుడు రక్తంలో షుగర్ నిలువలు గణనీయంగా తగగినట్లు గుర్తించారు.


 *  శిలాజిత్   - 


        అష్టాంగ హృదయం అనే ఆయుర్వేద గ్రంధం శిలాజిత్ ని మదుమేహ నివారణకి ప్రముఖ ఔషధంగా చెప్పింది. దీనిని ప్రతిరోజూ 500 మిల్లి గ్రాముల చొప్పున రెండు పూటలా తీసుకుంటూ ఉంటే వ్యాధి శమించడమే కాకుండా ధాతు స్థిరత్వం  ఏర్పడి వృద్ధాప్య  చాయలు రాకుండా కాపాడుకోవచ్చు అంటుంది. ఈ గ్రంథరాజం. 


     అదే విధంగా మదుమేహంలో స్వర్ణమాక్షిక భస్మాన్ని గూర్చి కూడా ప్రముఖంగా చెప్పారు. అయితే మదుమేహానికి శిలజిత్ ని కాని , స్వర్ణమాక్షిక భస్మాన్ని గాని తీసుకుంటున్నప్పుడు జీవితాంతం ఉలవలు, పావురం మాంసాన్ని వాడకూడదు అని షరతు విధిస్తుంది. శాస్త్రం . 


  మధుమేహం పైన పనిచేసే కొన్ని ప్రయొగాలు  - 


 *  వసంత కుసుమాకరం 100 మి.గ్రా , శిలాజిత్తు 500 మి.గ్రా , పొడపత్రి చూర్ణం 500 మి.గ్రా , తేనేతో కలిపి రోజుకీ రెండు సార్లు భోజనం చేసిన తరువాత తీసుకోవాలి . ఇక్కడ తేనే అన్నప్పుడు మదుమేహంలో తీసుకోవచ్చా అన్న సందేహం కలగవచ్చు. తేనే సహజమైనంత వరకు దాని మోతాదు 5 మి.లి మించనంత వరకు తేనే ని తీసుకోవడాన్ని శాస్త్రం సమ్మతిస్తుంది.


 

 *  నాగభస్మం  125 మి.గ్రా , శిలజిత్ 250 మి.గ్రా , తేనేతో రోజుకి మూడు సార్లు తీసుకోవాలి . ఇది తీసుకున్న తరువాత , తిప్పతీగ నుంచి తీసిన రసాన్ని తాగితే మంచిది.


 *  జాతీపలాది వటి 100 మి.గ్రా మాత్రలని పొడపత్రి ఆకుల చూర్ణం తో సహా తీసుకోవాలి .


 *  అష్టాంగ హృదయం ప్రమేహంలో పచ్చిపసుపు , ఉచిరికవలపు కాంబినేషన్ ని అత్యంత గుణకారిగా చెప్పింది. ఈ రెండింటిని పొడి చేసుకోని డబ్బాలో భద్రపరచుకొని ప్రతిరోజూ భోజనానికి ముందు చెంచాడు చొప్పున తీసుకుంటే సరిపోతుంది.


    మధుమేహ చూర్ణం కొరకు నన్ను సంప్రదించగలరు. 


   ఫొన్ నంబర్ - 9885030034 .        


గమనిక  - 


   భస్మాలు ఉపయోగించేప్పుడు అనుభవ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడవలెను. విషముష్టి వంటి కొన్ని మూలికలు వాడేప్పుడు శరీరతత్వాన్ని బట్టి డొసేజ్ తీసికొనవలెను . మిగిలిన మూలికలు నిరపాయకరమైనవి ...


 

          మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక  -


     నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

కామెంట్‌లు లేవు: