6, ఏప్రిల్ 2023, గురువారం

అత్యద్భుతమైన కథ ఇది ప్రతి భారతీయుడికి వస్తుంది

 అత్యద్భుతమైన కథ ఇది ప్రతి భారతీయుడికి వస్తుంది


🙏🏾


అనగనగా ఒక అడవి,

ఆ అడవిలో ఎన్నో జంతువులు. 

ఆ అడవికి సింహం రారాజు..


సింహం ఆకలేసినపుడు మాత్రమే వేటాడుతూ మిగతా సమయంలో తన గుహలో నిద్రపోయేది,


ఇదిలా ఉండగా పక్క ఇంకో అడివి నుండి కొన్ని అడవి పందులు వచ్చాయి,

వాటిని చూసి సింహం .."ఆ పందులే కదా మనకు ఏందిలే"అని ఊరుకుంది ,


ఆ పందులు కొన్నాళ్ళకు గుంపులు, గుంపులుగా పిల్లల్ని కని అడవంతా ఆక్రమించుకుని అడవిని నాశనం చేయసాగాయి.


సింహం ఎప్పటిలాగే ఆకలేసినపుడు లేడినో, జింకనో వేటాడి, తిని గుహలో పడుకునేది. 


ఇంకొంత కాలం పోయాక ఆ అడవిలో కొండగొర్రెలు ప్రవేశించాయి, 


బద్దకానికి అలవాటు పడిన సింహం వాటిని వేటాడక దొరికింది తిని పడుకునేది. 


మరి కొంతకాలం గడిచే సరికి అడవి నిండా పందులూ, గొర్రెలే కనిపించసాగాయి. 


పందులు .. దుంపలు, వేర్లు పెకలిస్తూ చెట్లు నాశనం చేస్తుంటే, గొర్రెలు పచ్చని ఆకులు, చక్కని కాయలు తినేస్తూ అడవిని ఎడారిలా మార్చేసాయి ,


ఇది చూసిన మిగతా జంతువులు వేరే అడవికి వలస పోగా, మిగిలినవి ఆకలితో చచ్చాయి.


సింహం పరిస్థితి చేయిదాటి పోతుందని గ్రహించి సమావేశం పెట్టిి. "నేను రాజుగా అజ్ఞాపిస్తున్నా, వెంటనే ఈ అడవి వదిలి పోండి" అని పందులు,గొర్రెలను హెచ్చరించింది 


కానీ సంఖ్యాబలం ఉన్న పందులూ, గొర్రెలూ కలిసి సింహాన్ని చంపేసాయి..


ఇక్కడ సింహం చేసిన తప్పులు👇


1.తన సంతానాన్ని పెంచుకోకపోవడం.


2.తన అడివి లోకి వచ్చిన రోజే పందుల్ని, గొర్రెల్ని తరిమేయక పోవడం.


3.నాకెందుకులే , నా ఆహారం, నా ఆధారం ఉంటే చాలు అని అనుకోవడం.


4.తన అడివి పట్ల బాధ్యత, కృతజ్ఞత లేకపోవడం.


5.తన దాకా వచ్చే వరకు ముప్పుని గ్రహించకపోవడం.


6.తన బద్దకంతో దుష్టులకు ఆశ్రయం ఇవ్వడం.


7.ఆకులు, దుంపలు తినే పందులు, గొర్రెలు నన్ను ఏం చేస్తాయిలే అనే మొద్దు స్వభావం తో వుండడం.


*నీతి :-* శత్రువు ఆకారం కాదు, వాడి ఆలోచన చూసి జాగ్రత్త పడాలి..

కామెంట్‌లు లేవు: