6, ఏప్రిల్ 2023, గురువారం

: శ్లోకం:

: శ్లోకం:☝️

*సాహాయ్యం కస్యచిత్ కర్తుం*

  *అవసరస్త్వయాప్యతే l*

*భవతు సారథిస్తస్య*

  *స్వార్థీ మా కదాచన ll*


భావం: ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే, వారికి సారధిగా ఉండండి కాని స్వార్థంతో ఉండవద్దు! చేతనైతే శ్రీకృష్ణుడిలా దగ్గరుండి గెలిపించండి, కానీ స్వార్థంతో శల్య సారథ్యం చేయవద్దని భావం!🙏

[06/04, 9:10 am] +91 76590 87625: *మృత్యువును జయించడం అంటే జీవన్ముక్తి పొందడమే... అదెలా?*

 

మృత్యువును జయిస్తే మరణం ఉండదు.. 


*అసలు మృత్యువును జయించడం అంటే ఏమిటి?* 


మరణం అంటే శరీరంలో

ప్రాణం పోవడం ఒకటే కాదు... భయాల కారణంగా నీవు పడుతున్న మానసిక ఒత్తిడి కూడా మరణమే .. అందుకే

*నీ భయమే నీకు మరణం* అంటాను......అనవసర భయాలతో అనుక్షణం మరణించే కంటే... ఆ భయాన్నే వదిలేస్తే, అసలు మరణమే ఉండదు కదా!!


*మరి ఈ భయాన్ని వదిలేయడం ఎలా?*

 

భయాన్ని వదలడం అంటే ఏ భావన లేకుండా ప్రతి అనుభవాన్నీ కూడా ఒక కర్మ ఫలితంగా స్వీకరించడమే.. అంతిమ మరణంతో సహా.....

మనం చేసే కర్మల ఫలితాన్ని సుఖ దుఃఖాల రూపంలో ఎలా అనుభవిస్తామో అలాగే మరణాన్ని కూడా ఒక కర్మ ఫలితం అనుకుని అనుభవించడమే మనం చేయవలసింది... అలా అనుకున్నప్పుడు తిరిగి ఏ జన్మ లభిస్తుందో అనే భయం ఉండదు... మరణం తరువాత జీవి గతి ఏమిటి అనే ప్రశ్న ఉదయించదు. అప్పుడే జీవన్ముక్తి లభిస్తుంది.. 



నా మరణం తరువాత నేను లేని నా కుటుంబం ఏమవుతుందో అనే భయం ఉండకూడదు... నీ కుటుంబంలో నీ పూర్వీకులు లేకుండా నీవు బ్రతకడం లేదా? కొంతకాలానికి నీవు కూడా ఆ పూర్వీకుల జాబితాలోకి చేరిపోతావు... అంతే.. అంతకు మించి ఏమీ జరగదు.. 


అందుకే అన్ని వ్యర్థమైన ఆలోచనలు మానేసి భగవన్నామ స్మరణ చేయాలి అని పెద్దవారు అంటూ ఉంటారు... 


అలా భగవన్నామ స్మరణ ఫలితంగా మరణం తరువాత శూన్యంగా, చీకటిగా, అంతుచిక్కని ప్రశ్నగా కనబడే జీవితం, ప్రకాశవంతంగా కనిపిస్తుంది... 

*అదే జ్ఞానం..* 

*అదే మృత్యువును జయించడం అంటే...*

*అదే జీవన్ముక్తి....*


 

*నామస్మరణాధన్యోపాయం*

*నహిపశ్యామో భవతరణే*

*రామ హరే.. కృష్ణ హరే*

*తవ నామవదామి సదా నృహరే...*




*భయవిమోచన ప్రాపిరస్తు!!* 

*తథాస్తు!తథాస్తు!తథాస్తు.!*

💐🙏💐🙏💐

[06/04, 11:29 am] +91 92988 01428: 🙏 నమస్కారం అండి 🙏


🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏


*గ్రంథం:* నమ్మిన వారికి సొమ్ము - నమ్మకుంటే (వారి ప్రారబ్దం),  భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*శ్రీ స్వామివారి ఆజ్ఞ - పాక్షిక ఆచరణ ఫలితం*


 చీట్ల ద్వారా వచ్చే ఆజ్ఞలను శ్రీ స్వామివారి ఆజ్ఞగా భావించలేరు మరియు తృణీకరించలేరు. మన మధ్య వుండగా శ్రీ స్వామివారిని దర్శిస్తే భక్తురాలకు చీటీ వ్రాయిస్తూ 'మీ వాముల దొడ్డి కంచె బడీగా మునగ చెట్లు, చింత చెట్లు పెంచండి' అని వ్రాయించారు. వాళ్ళీ ఆజ్ఞలను పూర్తిగా పాటించలేరు, పాటించకుండా వుండలేరు. శ్రీ స్వామివారు చెప్పారు కాబట్టి రెండు చింత గింజలు వాముల దొడ్డి కంచె వెంబడి వేశారు. ఆ గింజలు మొలచి చక్కగా పెద్ద మానులయ్యాయి. 


ఇరవై సంవత్సరాలలో ఆ ప్రాంతంలో తెలుగు గంగ ప్రాజెక్టు కాలువ త్రవ్వుచున్నారు. కాలువ త్రవ్వకానికి అడ్డు వచ్చిన చెట్లకు ఒక్కొక్క మానుకు పదివేల రూపాయలు గవర్నమెంటు వారు ఆయా రైతులకిచ్చి ఆ మానులు కొట్టించి వేసారు. శ్రీ స్వామివారి మాట ప్రకారం కంచె చుట్టూ కనీసం ఒక వంద చెట్లు పెంచినా 10,00,000 (పది లక్షల) రూపాయలు వారికి ప్రభుత్వం చెల్లించేది గదా. అయ్యో శ్రీ స్వామివారి మాట ప్రకారం ఇంకా కొన్ని విత్తనాలు గుచ్చి పెడితే లక్షలు వచ్చేవి గదా! అని ఇప్పుడు ఏడ్చి ఏమి ప్రయోజనం.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

       *సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 22*

                   *స్థిత ప్రజ్ఞుడు*

                              - శ్రీ రామచంద్రరావు


ఒకసారి నాతో "సినిమాల్లో ఏముంది? సందేశాత్మకత లేదు. అలాంటి సినిమాలు చూస్తూ టైమిని వేస్ట్ చేసుకొనే బదులు ఎన్నో మంచి కార్యాలకు వుపయోగించుకోవచ్చు" అని అన్నారు. ఆయన మాటల్లో ఏ సమ్మోహనా శక్తి వుందో గాని అప్పట్నించీ నాకు సినిమాలపై కోరిక నశించి పోయింది. మాస్టర్ గారి బుక్స్ ఏది నిజం, నిజానికి నిచ్చెనలు మొదలైన వారి బుక్స్ ఎంతో విలువైనవని గ్రహించాను. ఆధ్యాత్మిక జీవితం గడపాలని నిశ్చయించుకున్నాను.


                    🙏జై సాయిమాస్టర్🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*సాయి అంటే...?*

   సాయి యింతటి మహనీయులు గాబట్టే భగవదాదేశంగా ఆ పేరు ఆయనకు సార్థకంగా నిలిచింది. 'సాయి' అంటే 'మహాత్ములలో శ్రేష్ఠుడు' అని బెంగాల్ రాష్ట్రంలో వాడుక. ఆ పేరుకు *సర్వానికీ అతీతుడు'* అని అర్థమని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు. (వచనామృతము, i1, 55)

  ఒకనాడు పరమహంస, *తమకు చిలిం పీలుస్తున్న మహాత్ముని చిత్రపట మొకటి, ధుని నిర్వహించే మహనీయుని పటమొకటి కావాలని కోరి, “వాటిని చూడటంవలన తీవ్రమైన భక్తి కలుగుతుంది” అన్నారు.* 

 ఎప్పుడూ చిలిం పీల్చేవారు షేగాం నివాసి శ్రీ గజానన్ మహరాజ్, నిరంతరమూ ధుని నిర్వహించినది, చిలిం త్రాగినది శ్రీ సాయిబాబా.(షిరిడీ)..

సాయి లీలామృతం నుంచి

ఆన్లైన్ లో పారాయణ చేయుటకు

www.saibharadwaja.org 

ను పరిశీలించ గలరు..

జై సాయి మాస్టర్👏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*కుమారుడి వివాహం..*


"ఎన్నో ఏళ్లనుంచీ స్వామివారిని నమ్మి కొలుస్తున్నాము..మా పిల్లలకూ స్వామివారంటే అపరిమితమైన భక్తీ..విశ్వాసం..ఏనాడూ ఏ కోరికా కోరుకోలేదు..మా సంసారాన్ని చల్లగా చూడు తండ్రీ అని మాత్రం ఎప్పుడూ మొక్కుకునేవాళ్ళము..ఎందుకిలా జరిగిందో అర్ధం కావడం లేదు.." అంటూ విశ్వేశ్వరరావు, అతని భార్య వెంకటలక్ష్మి పరి పరి విధాల నా దగ్గర వాపోయారు..నిమిషానికోసారి.."మేము ఏ పాపం చేయలేదు కదా..మరి మాకెందుకీ తలవంపులు కలిగాయి.."? అంటూ ఆక్రోశపడసాగారు..ముఖ్యంగా వెంకటలక్ష్మి మరీ ఎక్కువగా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకోసాగింది..


విశ్వేశ్వరరావు వెంకటలక్ష్మి దంపతులు చాలా కాలంగా మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి పట్ల భక్తి భావం కలిగి ఉండేవాళ్ళు..వాళ్లకు ఇద్దరు పిల్లలు..అమ్మాయి పెద్దది..అబ్బాయి రెండవ సంతానం..వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం తలపెట్టినా..ముందుగా మొగిలిచెర్ల కు వచ్చి, శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని..ముందుగా తాము తలపెట్టిన కార్యక్రమం గురించి స్వామివారి సమాధి వద్ద విన్నవించుకొని..ఆపై ఆ కార్యక్రమాన్ని జరిపేవారు..అంతటి భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవారు..విశ్వేశ్వరరావు పిల్లలకు కూడా స్వామివారి పట్ల అపరిమిత భక్తి ఉండేది..అమ్మాయి పెళ్లీడు కొచ్చిన తరువాత సంబంధాలు చూడసాగారు..అమ్మాయికి పెళ్లి చేయదల్చుకున్నారని బంధువులకు తెలిసిన రెండు మూడు రోజుల్లోనే..వెంకటలక్ష్మి తాలూకు దూరపు బంధవులు తమంతట తామే వచ్చి, అమ్మాయిని తమ అబ్బాయికి ఇవ్వమని అడిగారు..పైగా పైసా కట్నం వద్దన్నారు..ఈడూ జోడూ సరిపోయింది..విచారించుకుంటే మంచి సంబంధం అని తెలిసింది..నిశ్చితార్థం కూడా స్వామివారి సన్నిధిలో చేశారు..ఆపై పెళ్లి కూడా ఉన్నంతలో చక్కగా జరిపారు..పిల్లలిద్దరూ హాయిగా కాపురం చేసుకుంటున్నారు.."మేము ఏమాత్రం శ్రమ పడకుండా..మా అమ్మాయికి మంచి సంబంధం స్వామివారి దయవల్ల దొరికింది.." అని చెప్పుకునేవారు..


మరో రెండేళ్లకు అబ్బాయికి వివాహం చేయాలని విశ్వేశ్వరరావు దంపతులు నిశ్చయించుకున్నారు..విశ్వేశ్వరరావు కుమారుడు చండీగఢ్ లో ఉద్యోగం చేస్తున్నాడు..ఎప్పటిలాగానే స్వామివారి మందిరానికి వచ్చి దర్శనం చేసుకొని, తమ మనసులోని కోరికను చెప్పుకొని వెళ్లారు..మూడురోజుల తరువాత..విజయవాడ నుంచి ఒక సంబంధం వచ్చింది..తల్లిదండ్రులకు ఒకటే కూతురు..తానూ ఇంజినీరింగ్ చదివింది..విశ్వేశ్వరరావు తనకున్న పరిధిలో విచారిస్తే..వాళ్ళది మంచి కుటుంబం అని తెలిసింది..ఆ తరువాత వారం రోజుల్లోనే..పిల్లలిద్దరూ ఇష్టపడటం..నిశ్చితార్థం చేసుకోవటం చక చకా జరిగిపోయాయి..మరో ఇరవై రోజుల్లో ముహూర్తం అని కూడా అనుకున్నారు..శుభలేఖలు అచ్చు వేయిద్దామని విశ్వేశ్వరరావు అనుకున్న రోజు.."మేము ఈ సంబంధం చేసుకోవటం లేదు..మాకున్నది ఒకటే కూతురు..దూరం పంపలేము..బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.." అని అమ్మాయి తరఫు తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పారు..విశ్వేశ్వరరావు వెంకటలక్ష్మి ఈ మాటవిని బాగా బాధపడ్డారు..బంధువులందరికీ చెప్పుకున్నాము..ఇలా జరిగిందేమిటా అని తల్లడిల్లిపోయారు..నేరుగా స్వామివారి మందిరానికి వచ్చి వాపోయారు..


"దిగులు పడకండి..స్వామివారిని నమ్ముకుంటే ఎటువంటి ఇబ్బందీ జరగదు..ఏదో బలమైన కారణం వల్లే ఆ సంబంధం తప్పిపోయిందని భావించండి..చూద్దాం..ఏం జరుగుతుందో.." అని శతవిధాల నచ్చచెప్పాను..వాళ్ళ కు ఉపశమనం కలుగలేదు కానీ.."స్వామీ నీదే భారం .." అని పదిసార్లు చెప్పుకొని తిరిగి వెళ్లారు..


ప్రక్కరోజు విశ్వేశ్వరరావు చిన్ననాటి స్నేహితుడు కనబడి..ఆమాటా ఈమాటా చెప్పుకుంటూ..తాను రిటైర్ అయిన తరువాత పెళ్లి సంబంధాలు చూస్తున్నానని..ఆర్ధిక లాభం కొఱకు కాకుండా సేవా దృక్పథంతో చేస్తున్నానని..ప్రస్తుతం ఒక మంచి సంబంధం ఉందనీ..ఆ అమ్మాయికి తగ్గ అబ్బాయి కోసం వెతుకుతూ ఉన్న సమయం లో విశ్వేశ్వరరావు కుమారుడి గురించి తెలిసిందని..అందుకోసమే ఇంతదూరం వచ్చానని చెప్పాడు..విశ్వేశ్వరరావు దాచుకోకుండా జరిగిన విషయమంతా చెప్పేసాడు..ఆ స్నేహితుడు నవ్వి.."ఈ సంబంధం మీవాడికే కుదురుతుంది..అమ్మాయి తల్లిదండ్రులది చాలా పెద్ద మనసు..రెండురోజుల్లో ముందుగా ఆ తల్లిదండ్రులతో మీరిద్దరూ మాట్లాడే ఏర్పాటు చేస్తాను.."అన్నాడు..అనుకున్న విధంగానే మాట్లాడుకున్నారు..ఫోటోలు మార్చుకున్నారు..పిల్లలిద్దరూ ఒకరికొకరు నచ్చారు..మరో పదిరోజుల్లో ముహూర్తం ఉన్నది..దానికే పెళ్లిచేయాలని అనుకున్నారు..


విశ్వేశ్వరరావు, వెంకటలక్ష్మి లకు అంతా కలగా ఉంది..తాము ముందు సంబంధానికి అనుకున్న ముహూర్తం కూడా ఇదే..నేరుగా మొగిలిచెర్ల వచ్చారు..ఈసారి వాళ్ళిద్దరి ముఖాల్లో పట్టరాని ఆనందం ఉంది..స్వామివారు తమకు అన్నివిధాలా తోడ్పడి..మంచి సంబంధాన్ని కుదిర్చారని..తామే తొందరపడి ఏదో మాట్లాడామని..నాతో చెప్పుకొని..శ్రీ స్వామివారి సమాధివద్ద క్షమాపణలు చెప్పుకొని వెళ్లారు..అబ్బాయి వివాహం ఏ ఇబ్బందీ లేకుండా జరిగింది..


తన భక్తులకు..ఏది, ఎప్పుడు, ఎలా అమర్చాలో స్వామివారికి తెలుసు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

[06/04, 12:43 pm] +91 93971 15559: *మహాభారతంలో ధృతరాష్ట్రుడు అంటే తెలియని వారు ఉండరు... అసలు ఆ మాటకు అర్థం తెలుసా??* 


ధృత అంటే దృఢమైన, నిశ్చయమైన నిశ్చితమైన అని అర్థం... 


రాష్ట్ర అనే మాటకు ఉనికి, స్పేస్ అని అర్థంగా తీసుకోవచ్చు... 


కాసేపు నిశ్చయమైన ఉనికి అనుకుందాం ... 


అంటే ఏమిటి?  


ఉనికిని శరీరంగా అనుకుంటే.. 


శరీరమే *నేను* అనుకునే దృఢత కలిగిన వాడు...


శరీరమే *నేను* అనుకునే అహంకారి..  


ఇప్పుడు *ధృతరాష్ట్రుడు* అనే మాటకు అర్థం ఏం చెప్పొచ్చు అంటారు?  


నేనైతే జీవుడు అంటాను...  

ఈ జీవుడే ధృతరాష్ట్రుడు... 

ఈ ధృతరాష్ట్రుడు అంధుడు... 

*నేను* ఆత్మగా గుర్తించలేని అంధుడు.. 

 

మహా భారతంలో ధృతరాష్ట్రుడు అంధుడైనా శక్తి సామర్థ్యాలు కలవాడు.. మహా యోధుడు కూడా... 

  

నేటి సమాజంలో జీవుడు, అంధుడు కాకపోయినా శక్తి సామర్థ్యాలు ఎన్ని ఉన్నా కూడా అహంకారంతో కళ్ళు మూసుకు పోయి అంధుడిగానే ప్రవర్తిస్తాడు.... అలాంటి వాడు ధృతరాష్ట్రుడితో సమానం...


అలాంటి ధృతరాష్ట్రులే ఎక్కువగా కనిపిస్తారు ఈ సమాజంలో... 


🙏🙏🙏🙏

[06/04, 4:54 pm] +91 94409 42213: మానవ జాతి అంతానికి ఏర్పడిన మతం... కమ్యునిజం


కమ్యునిస్టు మతం...మరొక విదేశీ మతం...అడవుల్లో ఎక్కువ ఉండడానికి కారణం....


నదీ తీరాల్లో ఉన్న అడవుల్లో అపారమైన ఖనిజ సంపద...


అద్భుతమైన వృక్ష సంపద...గంధం..చందనం వంటి విలువైన చెట్లు...


అరుదైన అటవీ ఉత్పత్తులు ...ఔషధీ మొక్కలు...


మరెన్నో వాటిపై ఆధిపత్యం సాధించడం...


దాన్ని సొమ్ము చేసుకోవడం..


విదేశాలకి సహకరించడం కోసం..ఇక్కడి ఖనిజ అన్వేషణ ఆపడం...


అటవీ వివరాలు విదేశాలకు కీలక సమయాల్లో అందజేయడం ...


ఇంకా ఘోరం...వనవాసుల మతాన్ని మార్చి..వారి సంస్కృతి సాంప్రదాయాలు...నాశనం చేయడం...


పర్యావరణం పరిరక్షణ పేరుతో...ప్రభుత్వాన్ని...కంపెనీలను బ్లాక్ మెయిల్ చెయ్యడం...


వీళ్ల అసహజ కదలికల వల్ల జీవ జంతు జాలానికి విపరీత హాని చేశారు... చేస్తున్నారు...


దీనివెనుక ఉన్న మరొక విషం..దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చే ప్రణాళిక... నిలువెల్లా కంపింప జేస్తుంది...


అదే...రె..డ్...కా..రి..డా..ర్...


ఇది నేపాల్ దగ్గర మొదలై వయనాడ్ తో ముగియడం బహుశా యాదృచ్చికం కాదేమో...


ఇక్కడ జల విద్యుత్..లేదా అణు విద్యుత్ ఉత్పాదలు అడ్డుకోవడం ద్వారా...బయటి దేశాలకు ఇతోధిక లాభం కలిగించారు...


బాగా గమనించండి...


వీళ్ళు విద్వంసం ఊపిరిగా జీవిస్తారు...దాన్ని ప్రణాళికా బద్దంగా చేస్తారు...


దేన్నైనా వ్యతిరేకించడం..ధ్వంసం చెయ్యడమే పనిగా ఉంటుంది...


నిర్మాణాత్మక మైన పని ఏమీ ఉండదు...


ఈ అటవీ ప్రాంతంలో వీరి ఆయుధాలకు...యుద్ధానికి నిధులు ఎలా వస్తాయి...


ఏ విదేశీ సహకారం లేకుండా...కేవలం పేద వనవాసుల డబ్బుతో..వాళ్ల విముక్తి చేసేస్తారా...


ఈ వర్గాలకు నిధులు పాకిస్తాన్ నుంచి కూడా అందుతుండడం ఏం సూచిస్తుంది...


దేశాన్ని విధ్వంసం చేసే కుట్రలో విదేశీ మూడు మతాలు చేతులు కలిపాయనే కదా అర్థం...


ఇంక మరోవైపు..మనకు మన పోలీసులపై ఎటువంటి సానుభూతి రాకుండా...


మన ఎమోషన్స్ అటువైపు మరలేట్టుగా..సినిమాలూ...కథలూ..కవితలూ.. కావ్యాలను వదులుతారు...


మన సైన్యాన్ని కించపరుస్తూ...ప్రచారం ఉధృతంగా చేస్తారు..


మన జవాన్లను విలన్లుగా చూపిస్తూ ప్రజల స్థైర్యం సడలిపోయెట్టు కళా రూపాలు ప్రదర్శిస్తారు...


అందుకే మన పోలీసులపై.. జవానులపై అమానుషంగా దాడులు జరుపుతూ...పొట్టన పెట్టుకుంటున్నారు..


ఈ మావోయిస్ట్ హింసలో కేవలం ఈ రెండు దశాబ్దాల్లో చనిపోయిన పౌరులే పన్నెండు వేలు...


భద్రతా బలగాలు రెండువేల ఏడువందల మంది...


ఏ ప్రజా విముక్తికి ఈ ప్రస్థాన

కామెంట్‌లు లేవు: