17, సెప్టెంబర్ 2024, మంగళవారం

పాలు సేవించుట

 పాలు సేవించుట  వల్ల ఉపయోగాలు - సేవించువారు తీసుకోవలసిన జాగ్రత్తలు  -  


 

  పాలు సేవించుట వల్ల ఉపయోగాలు - 


   పాలు మధురంగా ఉండును. జిడ్డుని కలిగి ఉండును. వాతాన్ని , పిత్తాన్ని హరించును . శీతలం , అన్ని తత్వముల వారికి మంచిది . బలం కలుగజేయును . మేధస్సుకు మంచిది . ఆయువుని వృద్ది చేయును . బాలురు , వృద్ధులు, క్షీణించినవారు, ఆకలిచే కృశించిన వారు పాలు సేవించిన ఆరోగ్యం కలుగును.


              పాలు పితుకుతున్నప్పుడు వేడిగా ఉండు పాలు బలం , అమృత తుల్యంగా ఉండును. అలా కాకుండగా పితికిన తరువాత చల్లబడిన పాలు తాగినచో అనేక రోగాలు తెచ్చి పెట్టును. 


              పంచదార , పటికబెల్లం కలిపిన పాలు తాగినచో శుక్రం పెంచును.  బెల్లం కలిపిన పాలు తీసుకున్నచో మూత్రం బొట్లుబొట్లుగా పడు రోగంని నివారించును. పిత్తాన్ని , శ్లేష్మాన్ని పెంచును. రాత్రుల యందు పాలు తాగుచున్న యొడల అనేక దోషాలను పోగొట్టును . అలా పాలు సేవించాలి అనుకునేవారు భోజనం వేళకు , పాలు తాగు సమయానికి 2 గంటల వ్యవధి ఉండవలెను . భోజనం చేయకుండా పాలు తాగవచ్చు . పాలలో అన్నం కలిపి తినకూడదు.  అలా తినినచో " అజీర్ణం" కలుగును. రాత్రి నిద్రపట్టదు. 


  ప్రతిదినం పాలు తాగువారు పాటించవలసిన నియమనిబంధనలు  - 


 *  మంచి రంగు లేకుండా మంచి రుచి కలిగి ఉండని , పుల్లటి మరియు చెడు వాసన , గడ్డలుగా ఉన్న పాలను తాగరాదు.


 *  పాలతో ఎల్లపుడూ పంచదార మాత్రమే కలిపి వాడవలెను. లేనిచో పటికబెల్లం చూర్ణం కూడా వాడవచ్చు 


 *  పాలల్లో ఉప్పు కలిపి వాడరాదు.


 *  చేపల కూర తిని పాలు మరియు పాలపదార్థాలు తీసుకోరాదు . అలా తీసుకున్నచో తప్పక కుష్టువ్యాది కలుగును. 


 *  కొన్నిరకాల పుల్లటి వస్తువులు పాలతో చేరినపుడు విరుద్దముగా మారును . కావున పాలు తాగు సమయంలో కాని ఆ తరువాతనైనా పుల్లని వస్తువులను భుజించరాదు . 


 *  ఉలవలు , పరిగెలు , కొర్రలు, అనుములు , అడవి పెసలు మొదలైనవి పాలతో విరోధించును. కావున వీనిలో ఏ ఒక్కటి పాలతో కలిపి లోపలికి తీసుకోకూడదు . 


 *  అనుములు , మినుములు ముఖ్యంగా పాలతో విరోధించును.ఈ రెండు పదార్థాలకు సంబంధించిన ఆహారాలు తీసుకున్నప్పుడు పాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు . అనారోగ్యం కలుగును.


 *  ముల్లంగి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు పాలు వాడరాదు.


 * రాత్రుల యందు వేడివేడి గోధుమ చపాతీలు ఇగురు కూరలతో కాని , తీపి పదార్థాలతో కాని లేక పంచదారతోగాని కలిపి భుజించి కాచిన పాలలో పంచదార కలిపి తాగిన చక్కటి ఆరోగ్యం కలుగును. 


 *  పాలయందు వెన్న ఆవులు, గేదెలు తిను ఆహారం నుండి పుట్టును . చిట్టు , పచ్చగడ్డి , పత్తిగింజలు , మినపరొట్ట మెదలైనవి తినిన పశువుల పాలు శ్రేష్టము. పల్లపు ప్రదేశాలలో ఉండు పశువులు ఇచ్చు పాలకన్నా మెట్ట ప్రాంతాలలో ఉండు పశువులు ఇచ్చు పాలు శ్రేష్టం. 


 *  ఆవుపాలు గేదెపాలకన్నా శ్రేష్టమైనవి . గేదెపాలల్లో ఆవుపాలు కంటే మందంగా ఉండును. కారణం వెన్నశాతం ఎక్కువుగా ఉండటం అందువలన ఆలస్యముగా జీర్ణం అగును. గేదెపాలు నిద్రను కలుగజేయును. చలవ చేయును . 


 *  మేకపాలు కారం, చేదు రుచులు కలిగి ఉండును. ఆకులను తినుట చేతను కొద్దిగా నీరు తాగుటచేతను , ఎక్కువ దూరం నడుచుట వలన మేకపాలు అన్ని వ్యాధులను పొగొట్టును. ముఖ్యంగా రక్తపిత్తవ్యాధి అనగా నోటి నుండి రక్తం బయటకి వెలువడు వ్యాధి తగ్గును. క్షయరోగం , దగ్గు , జ్వరములను తగ్గించును .  చంటిబిడ్డలకు తల్లిపాల తరువాత మేకపాలు శ్రేష్టమైనవి . 


      

      మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: