*మనం అనుకుంటూ ఉంటాం మనవాళ్ళు ఎవరో మనల్ని ఉద్ధరిస్తారని!
*కానీ ఇలలో ఎవరినెవరూ కూడా ఉద్ధరించేదేదీ ఉండదు.
*నిజానికి ఏ ఒక్కడూ వేరొకరికి హాని చేసేందుకు కానీ ఉద్ధరించేందుకు కానీ శక్తి గలవాడు కానేకాదు.
*కర్మఫలమే ఆ విధముగా అన్నింటికీ కారణమౌతుంది.
*మనం ఈ లోకంలోకి వచ్చినది మన కర్మఫలాన్ని అనుభవించడానికే తప్ప వేరెవరినో ఉద్ధరించడానికి కాదు.
*వేరే ఎవరూ మనలను కూడా ఉద్ధరించేది లేదు.
*ఈ విషయమై మనం భ్రమ చెంది భగవంతుని విడచిపెట్టి జన్మను భ్ర్రష్టపరచుకుంటున్నాం.
*నిద్రలో చూసేది కేవలం కల్పితమే కదా!! నిద్ర నుండి మేల్కున్నపుడే నిజం కనిపిస్తుంది.
కనుక..
*ఇంతవరకునూ నిద్రించినది చాలు!. ఇకనైనా మేల్కొందాం. సత్యాన్ని గ్రహిద్దాం. సత్యనారాయణుణ్ణి ఆశ్రయిద్దాం. జన్మను సార్థకం చేసుకుందాం. సుఖశాంతులతో జీవనం సాగిద్దాం.
.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి