*గురువారం 11 జూన్ 2026*
**🙏🌹*శ్రీ హనుమాన్ చాలీసా*
*జ్ఞాన యజ్ఞం - 38వ రోజు **🙏🌹
మన **హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం**లో భాగంగా ఈరోజు అత్యంత ధైర్యాన్నిచ్చే, సంకటాలను హరించే **36వ చౌపాయి** విశేషాలను తెలుసుకుందాం.
నిన్నటి చౌపాయిలో హనుమంతుని మాత్రమే సేవించడం వల్ల కలిగే సర్వ సుఖాల గురించి తెలుసుకున్నాం.
ఈరోజు, ఆయనను స్మరించడం వల్ల కష్టాలన్నీ ఎలా నశించిపోతాయో తెలుసుకోబోతున్నాం.
**36వ చౌపాయి**
**సంకట కటై మిటై సబ పీరా |**
**జో సుమిరై హనుమత బలబీరా ||**
**ప్రతిపదార్థం:**
* **సంకట కటై:** ఆపదలు లేదా కష్టాలు తొలగిపోతాయి.
* **మిటై సబ పీరా:** సమస్త బాధలు, వేదనలు అంతమైపోతాయి.
* **జో సుమిరై:** ఎవరైతే స్మరిస్తారో (ధ్యానిస్తారో).
* **హనుమత బలబీరా:** అనంతమైన బలవంతుడైన హనుమంతుడిని.
**విస్తృత ఆధ్యాత్మిక వివరణ:**
**1. సంకట విమోచనం (సంకట కటై):**
భయంకరమైన కష్టాన్ని సంకటం అంటారు. ఆ సంకటమోచన మాటనే తులసీదాసు ఇక్కడ పెట్టారు హనుమదుపాసన వల్ల సంకటములన్నీ, 'కటై' తొలగిపోతాయి. 'మిటై సబపీరా' అన్ని పీడలూ నశిస్తాయి. ఎవరికి ? 'జోసుమిరై హనుమత బలబీరా' - బలవీరుడైన హనుమంతుని స్మరించినవారికి
అయ్యా! ప్రారబ్దం ఎవరూ త్రుంచలేరు కదా! సంకటాలు మాత్రం హనుమంతుడు ఎలా తీస్తాడంటే బ్రహ్మ వ్రాసిన వ్రాత ఎవరూ తీయలేరు! కానీ బ్రహ్మవ్రాతను చెరిపి కొత్తవ్రాతను వ్రాయగలిగే శక్తి... అబద్ధమాడిన బ్రహ్మ తలను గిల్లేసిన పరమేశ్వరునికే ఉంది.
ఖాబిగు మేట సకై త్రిపురారి - బ్రహ్మవ్రాత కూడా చెరిపి వేయగలిగే సమర్ధత శివునకు ఉంది. పదహారేళ్ళ ఆయువును కలిగిన మార్కండేయుడు శివుని ఆశ్రయించి దానిని చెరుపుకోగలిగాడు. ఆ త్రిపురారి మరో రూపమే హనుమంతుడు. తాపత్రయ హారకుడే పీడా పరిహారకుడు.
జీవితంలో ఒక్కోసారి మనం బయటపడలేము అనుకున్న క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటి 'సంకట' సమయంలో హనుమంతుడిని తలచుకుంటే,ఆ సంకటాలనే గొలుసులు తెగిపోతాయి. ఇప్పటికే ఎన్నోవృత్తాంతాలుచెప్పుకున్నాం, దీనికి సంబంధించి''.
సీతమ్మ జాడ దొరక్క రాముడు సంకటంలో ఉన్నప్పుడు, లక్ష్మణుడి ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు హనుమంతుడే ఆ ఆపదల నుండి గట్టెక్కించారు ఇలా ఎన్నో చెప్పుకున్నాం. మన జీవితంలో కూడా ఆయన అదే పని చేస్తారు.
**2. బాధల నివారణ (మిటై సబ పీరా):**
'పీరా' అంటే శారీరకమైన నొప్పి మాత్రమే కాదు, మానసికమైన వేదన కూడా. భయం, ఆందోళన, ఈర్ష్య వంటివి మనల్ని లోలోపల దహిస్తుంటాయి. బలబీరుడైన హనుమంతుని స్మరించడం వల్ల మన మనస్సులోకి ఆయన శక్తి ప్రవహిస్తుంది, తద్వారా మనలోని బలహీనతలు పోయి ప్రశాంతత లభిస్తుంది.
**తులసీదాసు గారి సందేశం:**
తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా ఒక గొప్ప **"అభయాన్ని"** ఇస్తున్నారు. భగవంతుని స్మరణకు ఉన్న శక్తిని ఆయన ఇక్కడ చాటిచెప్పారు. "మీరు బలహీనులు కాదు, మీ తోడుగా బలబీరుడైన హనుమంతుడు ఉన్నాడు" అని గుర్తు చేస్తున్నారు. నిరంతర స్మరణ అనేది ఒక కవచం లాంటిదని, అది ఉన్నప్పుడు ఏ కష్టం కూడా మనల్ని తాకలేదని తులసీదాసు గారి విశ్లేషణ.
కాబట్టి ఏదో కొన్ని రోజులు చేసి వదలటం కాకుండా రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, భక్తితో హనుమాన్ చాలీసా చదవండి ఆయనే అన్ని చూసుకుంటాడు.
**జై శ్రీరామ్! జై హనుమాన్!**
రేపటి చౌపాయిలో హనుమంతుని జయజయధ్వానాల గురించి మరియు గురువుగా ఆయన ఇచ్చే కృప గురించి తెలుసుకుందాం.🙏🌹🙏
*🌷సేకరణ🌷*
🌹🌷🍁🍁🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి