19, సెప్టెంబర్ 2021, ఆదివారం

నేను ఒక జీవ శాస్త్రవేత్తని

 ✍️

ఒక తల్లి 

తన నిత్యపూజ అయిన తర్వాత 

విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి 

తన కుమారుని కి ఖాళీ గా ఉన్నాడా లేడా అని కనుక్కున్న తరువాత తన వీడియో చాట్ లో జరిగిన సంభాషణలు. 

మీ~మన కోసం.


తల్లి...

నాయనా .!

పూజా పునస్కారాలు అయినాయా?


కుమారుడు...

అమ్మా!

నేను ఒక జీవ శాస్త్రవేత్తని.

అది కూడా అమెరికాలో మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. 


మీరు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు.

అలాంటి నేను పూజలు అవి ఏం బాగోదు.


తల్లి మందహాసం తో..

కన్నా!

నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసు కన్నా.

కానీ అతను కనిపెట్టినవి అన్ని మన పురాతన ధర్మంలో ఉన్నవేకదా నాన్నా.


కొడుకు వ్యంగ్యంగా..

అలాగా అమ్మ 

నాకు తెలీదే.


(అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది.)


నీకు దశావతరాలు అది మహా విష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా.....

కొడుకు ఆసక్తిగా అవును తెలుసు దానికి ఈ జీవ పరిణామానికి ఏమిటీ సంభంధం అని ప్రశ్నించాడు.


 అప్పుడు ఆ తల్లి...

హా సంభంధం ఉంది. 

ఇంకా నువు నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను.

     

మొదటి అవతారం 

మత్స్య అవతారం.

అది నీటిలో ఉంటుంది.

అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది.

ఇది నిజమా కాదా.


కొడుకు కొంచెం అలెర్ట్ గా వింటున్నాడు.


తర్వాత రెండవది 

కూర్మ అవతారం. అంటే.


తాబేలు.

దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించిన ట్టుగా గమనించాలి.

అంటే ఉభయచర జీవులు లాగా తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.


మూడవది వరాహ అవతారం అంటే పంది.

ఇది అడవి జంతువు లను అంటే బుద్ధి పెరగని జీవులు అదే డైనోసార్లని గుర్తు కు తెస్తుంది.


ఇక నాలుగో అవతారం నృసింహ అవతారం.

అంటే సగం మనిషి సగం జంతువు.

దీన్ని బట్టి మనకు జీవ పరినామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమై న జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది.


ఇక ఐదో అవతారం వామన.

అంటే పొట్టివాడు అయిన ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు.

నీకు తెలుసుకదా .


మానవులు మొదట హోమో erectes మరియు హోమో సేపియన్స్ అని వున్నారు అని వాళ్లలో హోమో సేపియన్స్ మనుషులుగా వికాసం చెందారు.


కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండి పోయాడు.


తల్లి..

_కన్నా .!!_

ఆరో అవతారం పరశురాముడు. 

ఈ పరశురాముడు గండ్రగొడ్డలిని పట్టుకు తిరిగేవాడు.


దీని వల్ల ఎం తెలుస్తుందంటే ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకొన్నాడు.

మరియు అడవులు గుహలో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడు.


ఇక ఏడో అవతారం

రామావతరం.

మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచన పరుడైన సామాజిక వ్యక్తి.

 

అతను సమాజానికి నీతి నియమాలు, సమస్త కుటుంబ బంధుత్వనికి అది పురుషుడు.


 ఇక ఎనిమిదవది 

కృష్ణ పరమాత్మ. 

రాజనీతిజ్ఞుడు పాలకుడు ప్రేమించే స్వభావి.

అతడు సమాజ నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు.

 

వాటితో సమాజములో వుంటూ సుఖ~దుఃఖ, లాభ~నష్టాలు అన్ని నేర్పినవాడు.


కొడుకు ఆశ్చర్యంగా

విస్మయంతో వింటున్నాడు.

ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ


 తర్వాత తొమ్మిదో అవతారం

 బుద్ధ అవతారం.


ఆయన నృసింహ అవతారం నిండి మానవుడిగా మారిన క్రమంలో మర్చిపోయిన 

తన సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు. 


ఇంకా అతను 

మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటు చేసే ఆవిష్కరణ లకు మూలం.

ఇక వచ్చేది.


కల్కిపురుషుడు.

అతను నీవు ఏ మానవునికై వేతుకోతున్నావో అతనే ఇతను. 

అతను ఇప్పటివరకు వరసత్వానిగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తిగా వెలుగొందుతాడు.


కొడుకు తన తల్లివంక అవాక్కాయి చూస్తున్నాడు

   

అపుడా ఆ కొడుకు ఆనంద భాష్పలతో అమ్మా...

హిందు ధర్మం ఎంతో అర్థవంతమైన నిజమైన ధర్మం. అని అన్నాడు

    



ఆత్మీయులారా !!!

                 

మన వేదాలు,

గ్రంథాలు,

పురాణాలు,

ఉపనిషత్తులు,

ఇత్యాది అన్ని ఎంతో అర్థవంతమైనవి. 


కానీ మనం చూసే 

దృష్టి కోణం మారాలి.

మీరు ఎలా అనుకొంటే 

అలా వైజ్ఞనికమైనవి కావచ్చు.

లేదా ధర్మ పరమైనవి కావచ్చు.

 

శాస్ట్రీయతతో కూడిన ధర్మాన్ని నేడు మూఢచారాలు పేరిట మన సంస్కృతి ని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం.


ఇకనైనా మేలుకోండి ఋషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం.


*_మనంమారుదాం యుగంమారుతుంది._*


🙏🙏

      _సదా మీ సేవకుడు_

                        🙏🙏

కామెంట్‌లు లేవు: