16, ఏప్రిల్ 2023, ఆదివారం

భయానికి విరుగుడు భాగవతం*




*భయానికి విరుగుడు భాగవతం*

                  ➖➖➖✍️


*ఆహారం, నిద్ర, భయం, మైథునం అనేవి మనిషికి నాలుగు సహజమైన విషయాలు.*


*వీటిలో ఆహారం, నిద్ర, మైథునాలు, సహజ అవసరాలైతే, భయం సహజ లక్షణం.*


*భయం నుంచి తప్పించుకున్నవారు ఎవ్వరూ కనిపించరు. ఈ నాలుగు విషయాలు మానవులకే కాకుండా, పశుపక్ష్యాదులకూ సమానమే.*


*అనివార్యంగా ఉండే భయానికి విరుగుడు ఇవ్వడానికే భాగవతం ఉదయించింది.*


*సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని భయాన్ని తొలగించడానికి మొట్టమొదటిసారి భాగవతం ప్రకటితమైంది.


*నారాయణుడి నాభికమలంలో ఆసీనుడైన బ్రహ్మ సృష్టి విషయంలో భీతావహుడైన సందర్భంలో అతనిపై కరుణతో చతుఃశ్లోకి భాగవతం ఉపదేశం జరిగింది.*


*నిత్యం భాగవత ధ్యానంతో, బ్రహ్మదేవుడు భయాన్ని వీడి సృష్టికార్యం కొనసాగించాడు. ఈ బృహత్తర కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తిస్తున్నానని కలిగిన గర్వభయం కూడా భాగవత ధ్యానంతో తొలగిపోయింది.*


*బ్రహ్మ భయాన్ని తొలగించిన భాగవతాన్ని, జనుల భయాలను, కష్టాలను తొలగిస్తుందని ఆ దివ్య ఉపదేశాన్ని బ్రహ్మలోకం నుంచి భూలోకానికి తీసుకొని వచ్చాడు నారదుడు.*


*భాగవత అమృతాన్ని ముందుగా వ్యాస మహర్షికి తెలియజేసి ఆయన నైరాశ్యాన్ని పోగొట్టాడు. దాని మహత్తును సంపూర్ణంగా అనుభవించాడు వ్యాసుడు.*


*ఆ భాగవత సుధను మాయా భయాన్ని తొలగించడానికి శుకమహర్షికి ఉపదేశించాడు.*


*శుక మహర్షి ద్వారా భాగవతఅమృతాన్ని గ్రహించి మృత్యుభయాన్ని జయించాడు పరీక్షితుడు.*


*తర్వాత కలి భయంతో విచారానికి, అంతులేని చింతకు లోనైన శౌనకాది రుషులకు ఉపశమనం కలిగిస్తూ, నైమిశారణ్యంలో వారికి భాగవతాన్ని ఉపదేశించాడు సూత మహర్షి.*


*ఈ విధంగా భయానికి విరుగుడుగా భాగవతం ఈ సృష్టిలో అవతరించింది.*


*‘మనిషి తన మనసును, నిగ్రహించుకొని, పుష్కర తీర్థం, మథుర, ద్వారకలో ఉపవసిస్తూ భాగవతాన్ని పఠిస్తే సర్వభయాలకూ దూరం అవుతాడు’ అంటుంది భాగవతం (12.12.61).*


*భాగవత రచయిత వ్యాసభగవానుడి అనుభవాన్ని గమనించినా ఆ పురాణం మహిమ మనకు స్పష్టంగా తెలుస్తుంది. తన గురువైన నారదముని ఆజ్ఞ మేరకు శ్రీకృష్ణుడి లీలలను వర్ణించడానికి ముందు వ్యాసుడు శ్రీకృష్ణుణ్ని గాఢంగా ధ్యానించాడు. ఆ ధ్యానంలో వ్యాసమహర్షికి సాక్షాత్తుగా శ్రీకృష్ణుడి దర్శనం కలిగింది. ఆ దర్శనంతోపాటుగా కృష్ణుడి వెనుక నీడలా ఉన్న మాయాశక్తి దర్శనమైంది. ఆ మాయ వెనుక నిలిచిన జీవుడూ కనిపించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడికి, జీవుడికి మధ్య మాయ వచ్చిందనే సత్యాన్ని ధ్యానంలో గ్రహించాడు వ్యాసుడు.*


*మాయను దాటి శ్రీకృష్ణుడి ముందుకు చేరుకొని నేరుగా భక్తిలో నెలకొనడమే జీవుడి సమస్త దుఃఖాల వినాశనానికి ఏకైక మార్గం అని గుర్తించాడు మహర్షి. ఆ మాయా భయాన్ని జయించడానికి శ్రీమద్భాగవత రచనకు పూనుకున్నాడు.* 


*ఆ దివ్య భాగవత శ్రవణం వల్ల శోకమోహభయాలు నశించి కృష్ణభక్తి కలుగుతుందని భాగవత ఫలశృతిగా తెలియజేశాడు.


*సమస్త వేద సాహిత్యాన్ని కలియుగంలో మానవాళికి అందించింది భగవదవతారమైన శ్రీల వ్యాసదేవుడే.*


*ఆయన తన రచనలన్నీ పూర్తిచేసిన తర్వాత పరిపక్వ స్థితిలో గురుదేవుల ఆదేశం మేరకు చివరగా భాగవతాన్ని అందించాడు. సమస్త భయాలకు విరుగుడు భాగవతమేనని తెలియజేశాడు.* 


*అందుకే భయరహితులం కావాలంటే ఉన్న మార్గం భాగవతాన్ని ఆశ్రయించడమే.*


*భాగవతాన్ని నిత్యం సేవించేవారికి మాయతెరలు తొలగిపోయి, భయాలన్నీ పటాపంచలవుతాయన్న మహత్తర సత్యం శీఘ్రమే అనుభవంలోకి వస్తుంది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం...

* గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...9493906277

లింక్ పంపుతాము.🙏

[16/04, 8:51 am] +91 94939 06277: 0110.      1-5.  160423-6.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*ఆచరిస్తే అద్భుతాలు జరుగుతాయి*


                   *బయోక్లాక్!*

                  ➖➖➖✍️

                 *BIO-CLOCK*


*మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే,  4.00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము.*


*కానీ కొన్నిసార్లు మనం  అలారం లేకపోయినా అనుకున్న టైం కి  లేస్తాము.  ఇదే ‘బయో-గడియారం!*


*చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు.* 


*50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని నమ్మి చాలామంది తమ సొంత బయోక్లాక్‌ను ఏర్పాటు చేసుకున్నారు.  అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు  మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌ను తప్పుగా సెటప్ చేస్తాము.*


*చైనాలో చాలా మంది ప్రజలు 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారు.*

 *వారి బయోక్లాక్ అలా ఏర్పాటు చేయబడింది.*



*కాబట్టి మిత్రులారా ఈ "8" సూత్రాలు తప్పకుండా పాటించాలి! అందులో…* 


*1). మనము బయో-గడియారాన్ని సర్దుబాటు చేసి, రోజూ క్రమం తప్పకుండా ‘ధ్యానం’ చేస్తే…. తద్వారా మనం కనీసం120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు!*


*2.) 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.*


*3.)సహజ సిద్ధమైన రంగు ( తెల్లజుట్టు ఉంటే) వెయ్యండి యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ  యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే  ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు.*


*4.) మనం తీసుకునే భోజనం కల్తీ, కలుషితం, అనుకుని తీసుకోవద్దు. ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది,  ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి! జరిగి తీరుతుంది.*


*5.) చురుకుగా ఉండండి. నడవండి. వీలైతే జాగింగ్ కూడా తప్పకుండా చేయండి. *


*6.) వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి! (ఇది నిజం కూడ).*


*7.) ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు. కనుక ఆనందంగా ఉండండి తద్వారా ఆరోగ్యంగా ఉండండి!*

*(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి! మనసులో కాకుండా పైకి నవ్వండి)*

(అదేదో సినిమాలో మనసులోనే నవ్వుకుంటుంది, మనసులోనే డాన్స్ కూడా చేస్తుందట! - అలాకాదు!)


*8). ప్రతిదానికీ కారణం మన మనస్సు.  మన ఆలోచన. ముఖ్యంగా మన మాట, సరదాకు కూడ old age అనే మాటను అనకండి.  ధర్మరాజుకు యువరాజా పట్టాభిషేకం జరిగింది 105 సంవత్సరాల వయసులో!*    


**బయో క్లాక్ ని మీ  తక్కవ ఆయుర్దాయం కోసం సెట్ చేయవద్దు...!*

ALL THE BEST..

                 *ద్వి శతమానం భవతి!*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

[16/04, 8:52 am] +91 94939 06277: 150423g1659.    160423-5.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*దేవుడంటే ఏంటి?  పూజ చేయకపోతే ఏమవుతుంది?*

అని...

              ➖➖➖✍️


*చిన్నపిల్లలే కాదు ..  నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.*


*మనవాళ్లు వెంటనే చెప్పే సమాధానం.. "అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని!*


*మనకు భవవంతుని గురించి అవగాహన లేనప్పుడు... చెప్పడం చేతగానప్పుడు మనం వాడే మాట అదే!.*


*కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌ కాదు గదా !*


*మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు.*

*తెలియని వారికి అలా చెప్పడం వల్ల ... వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.*


*"పూజ" అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, మనసుతో చేసే వ్యాయామం. మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ.* 


*"దీప ప్రజ్వలనం" అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ.*

*రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.*


*ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు. అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది, ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే...స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.*


*పూజ అంటే చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి.* 


*మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి. అదే సమయంలొ మూఢ విశ్వాసాలకు దూరం గా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన బాధ్యత కూడా పెద్దవారిపై ఉంది.*


*1. మూలవిరాట్ 🚩 భూమిలో ఎక్కడైతే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.*

 

*2. ప్రదక్షిణ🚩 మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు, కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.*


 *3. ఆభరణాలతో దర్శనం 🚩 ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.*


 *4. కొబ్బరి కాయ 🚩 ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.*


 *5. మంత్రాలు 🚩 ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే    మనకి తెలియకుండానే neurons ని ఏక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి.*


*6. గర్భగుడి 🚩 గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.*


*7. అభిషేకం 🚩 విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించి నపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించు కుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.*


*8.  హారతి 🚩 పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో ‘స్వేదకర్మ’ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.*


*9. తీర్థం 🚩 ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు.*


*10.  మడి 🚩 తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోస0 గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

[16/04, 8:54 am] +91 94939 06277: 150423f1639.   160423-4.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



మానవ జన్మ పుట్టుక లక్ష్యం ఏమిటి?

             ➖➖➖✍️



మానవ జన్మ పుట్టుక లక్ష్యం ఏమిటి? జన్మలు అంటే ఏమిటి? అందులో మానవ జన్మకు గల కారణం ఏమిటి? 


మొదట మనం జన్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. ..


జన్మ అంటే మళ్ళి పుట్టడం. అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ. కాని తిరిగి మానవ జన్మే వస్తుంది అని మాత్రం చెప్పలేము ఎందుకంటే మరల మనం పొందే జన్మ మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడుతుంది. 


అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమోత్తమమైనది. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ కర్మలకు ఫలితాలను తప్పక అనుభవించి తీరాలి,   వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. 


అన్నీ పుణ్య కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు దేవ లోకాలలో దేవ జన్మ నెత్తుతాడు, అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది   భోగ భూమి   కనుక  అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం లేదు. అందువలన పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలను  ఆచరించే అవకాశం లేదు. తన కర్మ ఫలాల ననుసరించి భోగాలను మాత్రమే అనుభవించి   ఆ కర్మ ఫలాలు అయిపోగానే…  'క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి'   అన్నట్లు ఈ మర్త్య లోకాన్ని మానవ లోకాన్ని చేరవలసిందే. మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే.  దేవ జన్మలో కేవలం మనోబుద్దులుంటాయే కానీ కర్మచేయుటకు సాధనమైన స్థూల శరీరం ఉండదు.  కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు ఈ దేవ జన్మ. 


ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా జన్మిస్తాడు. 


ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించ బడుతాడు. ఈ జన్మలలో కర్మలు చేస్తున్న అవి అన్నియు బుద్ధి పరంగా కాదు అవి అన్నియు కేవలం ప్రకృతి ప్రేరణలతో పర తంత్రంగా చేస్తాయి. ఈ జంతు జన్మలలో శరీరం - మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించడమే కానీ పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడ ఉపయోగపడదు.


ఇక పుణ్యపాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ మానవ జన్మలో పుణ్య కర్మల ఫలంగా సుఖాలు మరియు పాప కర్మల ఫలంగా దుఃఖాలు అనుభవిస్తాడు.


అయితే ఇలా కర్మ ఫలాలను అనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవజన్మలోనే ఉంది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ ఇది.   కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది అని అన్నారు. 


ఈ మానవ జన్మ తీసుకోవడానికి జీవుడు 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ ఈ మానవ జన్మ. 


కనుకనే ఈ మానవ జన్మను 'జంతూనాం నర జన్మ దుర్లభం' అని పెద్దలు తెలియజేసారు.


ఇలాంటి ఈ అపురూపమైన, ఉత్తమోత్తమమైన మరియు దుర్లభమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి.


వేరే జన్మలు అయితే ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి కాని ఎందుకు మనం ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పుట్టవలసి వస్తుంది. పుట్టిన మన జన్మ లక్ష్యం ఏమిటి ? జంతు జన్మలు పొందిన వాటి లక్ష్యం అయితే ఒకటే, అవి మానవ జన్మ పొందడానికి కర్మలను ఆచరిస్తు వుంటాయి. మరి మనిషిగా పుట్టిన మనం ఏమి చేస్తున్నాం, మన లక్ష్యం ఏమిటి అన్నది,  అంటే మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి. సార్ధకం చేసుకోవడం అంటే ఏమిటి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి…


సార్ధకం చేసుకోవడం అంటే ఏమిటి, సాధారణంగా మనం అంతా ( మనుషులందరూ ) బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి లేదా పెద్ద పెద్ద పదవులు చేపట్టాలి. బాగా సంపాదించి భార్యబిడ్డలతో సహా తను అనేక భోగాలు అనుభవించాలి. అయితే ఇక్కడ ఎవ్వరు తాము కోరుకున్నట్లుగా జీవించలేక పోతున్నారు. ఎన్ని సుఖాలు, భోగాలు అనుభవించినా ఈ మనస్సుకు ఏదో ఒక వెలితి వుంటుంది. దీనికి కారణం మనం అనుభవించేవి ఏవి కూడ నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు.


ఇవి అన్నియు అనిత్యమైన వస్తువుల ద్వారా వచ్చే సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన సుఖం కావాలంటే నిత్య వస్తువు, పరిపూర్ణ వస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే లభిస్తుంది. ఏమిటది? ఆ నిత్యమైన వస్తువు ఏకమైన "పరమాత్మ" మాత్రమే. 'నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం' అని తత్వబోధ లో శంకరాచార్యులవారు స్పష్టం చేసారు. 


అంటే నిత్య వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. దానికి వేరుగా ఉన్న సర్వమూ అనిత్యమైనవే అని అర్థం.


కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం - ఆనందం అందుకునేవరకు మానవుడికి తృప్తిలేదు.


అసంతృప్తి తీరదు. అట్టి శాశ్వాతానందాన్ని అందుకోవడమే జన్మను సార్ధకం చేసుకోవడమంటే. ఆ శాశ్వతానందాన్నే మోక్షం, ముక్తి అన్నారు.


ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి భగవంతునిలో ఐక్యం (పరమాత్మునిలో విలీనం అదియే మోక్షం) కావాలంటే ఇక్కడ చేసిన అన్ని కర్మలని సంపూర్ణంగా నిర్మూలించుకొని అంటే ఆత్మ స్వరూపుడవైన నీవు వీటి అన్నిటినుండి విముక్తిని పొందాలి. 


ఈ విధంగా విముక్తిని పొందడమే ముక్తి అని కూడ అంటారు. దానికి సరియైన జన్మ ఈ ఒక్క మానవ జన్మ మాత్రమే! ఇది యే జన్మలలోనూ సాధ్యం కాదు!!


జంతు జన్మలలో అయితే మనస్సు మాత్రమే ఉంటుంది కాని వాటికీ బుద్ధి ఉండదు. 


అందువలన మనం అజ్ఞానంతో, అవివేకంతో మరియు అవిద్యతో ఏర్పరచుకున్న ఈ కర్మ బంధనాల నుండి విముక్తి పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ మానవ జన్మే. 


ఈ మానవ జన్మలో మనిషికి దేవుడు ఒక ఆయుధాన్ని ప్రసాదించాడు అదియే బుద్ధి.    దీని ద్వారా శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన, నాశనం లేనిది ఏది అని గ్రహించి అదే విధంగా జ్ఞానాన్ని గ్రహించి, అంటే నేను ఎవరు, ఎందుకు పుట్టాను, ఎవరికోసం రావలసి వచ్చింది, నా లక్ష్యం ఏమిటి, నా కర్తవ్యం ఏమిటి, అని తెలుసుకొని మనస్సును అదుపులో పెట్టుకొని పరమాత్మ తత్వాన్ని నిత్య సత్యమైన దానిని సంపుర్ణముగా తెలుసుకొని అదే విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించడమే జ్ఞానం అని అంటారు.


ఎప్పుడైతే నీలో ఈ ధ్యాస, అంటే దేవుని గురించి తెలుసుకోవాలని నీలో తపన మొదలవుతుందో అప్పుడు ఆ దేవుడే నీకు ఖచ్చితంగా మార్గాన్ని     లేకపోతే ఒక మంచి సద్గురువును ప్రసాదిస్తాడు. 


ఇక్కడ సద్గురువును ప్రసాదిస్తాడు అంటే దేవుడు తెచ్చి నీ ముందర సద్గురువును పెట్టడు. నువ్వు ప్రయత్నించు దానికి భగవంతుడు సహకారం అందిస్తాడు అని భావం. 


అంటే మనం అజ్ఞానంలో ఉంటూ కర్మలను ఆచరిస్తూ అన్నియు దుష్కర్మలే చేస్తే నూటికి నూరు శాతం మనం మానవ జన్మ పొందడం మాత్రం సాధ్యం కాదు.


అన్ని చెడ్డ పనులే చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచున్న కర్మ బంధనములు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని నరకంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మ భూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు ఏదో ఒక జన్మ వస్తుంది. మరి సత్కర్మలు ఆచరిస్తే మానవ జన్మ ఎత్తవచ్చా అంటే ఎక్కువ శాతం మానవ జన్మ ఎత్తే అవకాశాలు ఉంటుంది.


కానీ సత్కర్మలు చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచున్న కర్మ బంధనములు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని స్వర్గంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మ భూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు జన్మ వస్తుంది. 


నీవు సత్కర్మలు ఆచరించి ఎంతో కొంత దేవుని గురించి తెలుసుకొని ఉంటే నీవు మంచి యోగుల కుటుంబంలో జన్మిస్తావు.


భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ధ్యాన యోగంలో చెప్తాడు. “అర్జునా! ఎవరు అయితే నా జ్ఞానాన్ని గ్రహించి యోగాన్ని (కర్మ, జ్ఞాన మరియు ధ్యాన)పద్ధతిని అవలంభించి ఉంటారో వారికి ఇంకా ఏదైనా కర్మలు చేయాల్సిన విషయం ఉంటే వారికి ఖచ్చితంగా ఒక మంచి జన్మ అది ఉన్నతమైన ఆధ్యాత్మిక కుటుంబంలో జన్మ వస్తుంది. ఇందులో ఏ మాత్రం సందేహం ఉండదు” అని శ్రీ కృష్ణుడు అర్జునకు వివరిస్తాడు.


అందుకే మనం ఈ మానవ జన్మ పొందినపుడు జీవన, జీవిత సత్యాన్ని గ్రహించి సత్ సాంగత్యం చేస్తూ సత్ కార్య జీవనం సాగించాలి. మానవ సేవే మాధవ సేవగా భావించి అందరిలో దైవాన్ని చూస్తూ నీలో ఉన్న దైవాన్ని నీ పనులలో, ప్రవర్తనలో చూప గలిగిననాడు, దేనికీ ప్రలోభ పడక జీవిస్తే తప్పక మోక్షాన్ని పొందుదురు.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం… గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

[16/04, 8:57 am] +91 94939 06277: 150423c1452.   160423-3.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀326.


                శ్రీ మహాభారతం 

                 ➖➖➖✍️

                 326 వ భాగం

    శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:



#పిండప్రధానం:

పార్వతీదేవి “నాధా ! మానవులు చనిపోగానే మరలాజన్మ ఎత్తాలి కదా! మరి ఎవరి కొరకు ఈ పితృ కార్యాలు పిండప్రదానాలు చెయ్యాలి. వివరంగా తెలియ జెయ్యండి” ఆ ప్రశ్న పార్వతీదేవి అడగగానే అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. పరమశివుడు ఏమి సమాధానం ఇస్తాడో అని ఆతురతగా ఎదురు చూసారు. 


పరమశివుడు “పార్వతీ! నువ్వు అడిగిన ప్రశ్న చాలా సందేహాలతో కూడుకున్నది పరమ రహస్యము కూడా. పితరులు కూడా దేవతల వంటివారే ! దేవతలు ఉత్తరదిక్కున ఉంటారు. దేవతాపూజకు హవ్యము అనీ పితృకార్యములకు కవ్యము అని పేర్లు. పితృకార్యములు చేస్తే దేవతలు సంతోషించి ఆ కర్తకు ఆయుష్షు, ధనము, కీర్తి ప్రసాదిస్తారు. పితృగణములు దేవతలకు, అసురులకు, గరుడులకు, యక్షులకు మొదలగు వారు పూజనీయులు. పార్వతీ శ్రద్ధగా విను!   కుంచెడు ధాన్యము కలవాడు ఆ కుంచెడు ధాన్యమును దానంగా ఇచ్చినా కోటి రూపాయలు ధనం ఉన్న వాడు ఆ కోటి రూపాయలు దానంగా ఇచ్చినా రెండూ సమానమే. కనుక దానములు తన శక్తికి తగ్గట్టు చేయాలి. అప్పుడే ఫలితాన్ని ఇస్తాయి. ఏ దానము చేసినా మనసులో తిట్టుకోకుండా ప్రేమతో మనసారా ఇస్తే ఆ దానము సత్ఫలితాన్ని ఇస్తుంది” అని చెప్పాడు ఈశ్వరుడు.



#ధర్మములు:


పార్వతీదేవి “నాధా! ధర్మము నానా విధములుగా ఉంటుంది కదా ! ఆ ధర్మము యొక్క విశేషముల గురించి తెలియజెయ్యండి” అని అడిగింది. 


పరమశివుడు “పార్వతీ! శృతులలో చెప్పిన ధర్మముల గురించి వివరిస్తాను. ధర్మములలో జాతిధర్మములని, కులధర్మములనీ, గుణధర్మములనీ, శరీరములను బట్టి కాలము బట్టి మారే ఆపద్ధర్మము అని ధర్మములు అయిదు విధములు.



#పుణ్యము లోకములు:


పార్వతీదేవి “నాధా ! పుణ్యలోకములో భోగములు ఎలా ఉంటాయో వివరించండి” అని అడిగింది. 


పరమశివుడు “పార్వతీ ! ఆ లోకములో పుష్పములు ఆయా ఋతువులను పూస్తూ ఉంటాయి. కల్పతరువుల నుండి శరీరానికి లేపనము సువాసనలు వెదజల్లు తుంటాయి. అక్కడ అమృతమే ఆహారము. అక్కడ దుస్తులు మలినము లేనివి. ఆభరణములు నిరుపమానంగా మెరుస్తూ ఉంటాయి. అక్కడ అందరూ పరస్పర స్నేహభావంతో మెలగుతుంటారు. అక్కడ ఉన్న వారి మనసులో మార్దవము, సుగుణములు విరాజిల్లుతుంటాయి. అక్కడ సుఖము తప్ప దుఃఖము లేదు. అక్కడ కోపము మొదలైన దుర్గుణాలకు తావు లేదు. అక్కడ ఉన్న వారు రోగములు, ముసలితనము అనేది తెలియకుండా నిరంతరము ఆనందములో తేలియాడు తుంటారు” అని మహేశ్వరుడు చెప్పాడు.



#సుగతి దుర్గతి:


పార్వతీదేవి “నాధా ! చనిపోయిన తరువాత వీరు సుగతికి పోవాలి. వీరు దుర్గతికి పోవాలి అని ఎవరు నిర్ణయిస్తారు” అని అడిగింది. 


పరమశివుడు “పార్వతీ! తనతోటి వారికి కీడుతలపెట్టని వారు, ఎల్లప్పుడు సదా ధర్మంగా బ్రతికేవారు, సజ్జనులను, గురువులను పూజించేవారు, ఎల్లప్పుడూ సత్యమునే మట్లాడేవారు, దీనులను ఆదరించు వారు, అతిధులను పూజించు వారు, ఇతరులపట్ల దయ జాలి కలిగిన వారు, వీరంతా స్వర్గమునకు పోవడానికి అర్హులు అని తెలుసుకొన వలెను” అని చెప్పాడు.



#ఉత్తమ ధర్మము:


పార్వతీదేవి “స్వామీ! ధర్మాలు ఎన్నో ఉన్నాయి కదా ! అందులో ఉత్తమధర్మము ఏది ?” అని అడిగింది. 


పరమేశ్వరుడు “పర్వతరాజపుత్రీ ! పురుషార్ధములు నాలుగు. ధర్మము, అర్ధము, కామము, మోక్షము. అందులో మొదటి మూడు అయిన ధర్మ, అర్ధ, కామముల వలన కలిగే సుఖములు అశాశ్వతములు. అవి ఎన్నటి కైనా నశిస్తాయి. కాని ఆఖరిది అయిన మోక్షము శాశ్వతమైనది, సుఖప్రథమైనది. అది ఎన్నటికీ నశించదు. కనుక మొదటి మూడు పురుషార్ధముల కంటే మోక్షము అత్యుత్తమమైనది. మోక్షము ఎలా పొందాలో నీకు చెప్తాను. మానవుడు గృహస్తాశ్రమము స్వీకరించిన తరువాత ఋణములు అన్నీ తీర్చుకుంటాడు. అంటే దేవ ఋణము, పితృఋణము, ఋషిఋణము, మనుష్యఋణము తీర్చుకుంటాడు. తరువాత వానప్రస్థముకు వెళతాడు. అక్కడ అడవులలో నివసిస్తాడు. ప్రశాంత వాతావరణంలో నిర్మలమైన మనస్సుతో మునుల నుండి సాంఖ్యమును అభ్యసిస్తాడు. సాంఖ్యమనగా 25 తత్వముల జ్ఞానము తెలుసు కొనడమే. తరువాత యోగాభ్యాసము చేస్తాడు. సాంఖ్యము యోగము రెండూ ఒక్కటే. తరువాత సుఖదుఃఖములు, రాగద్వేషములు మొదలగు ద్వందములను జయిస్తాడు. తరువాత శౌచము, బ్రహ్మచర్యము, శాంతజీవనము, మితాహారము తీసుకోవడము పాటిస్తాడు. మనస్సును అంతర్ముఖంచేస్తాడు. మధ్య మధ్య వచ్చే అవాంతరములను తొలగించుకుంటూ మోక్షమార్గాన పయనిస్తాడు. ఇదీ మోక్షమార్గము. ఇది నిరంతర అభ్యాసము వలన మాత్రమే కలుగుతుంది. ఈ మోక్షమార్గము మానవుడిని జననమరణచక్రము నుండి విముక్తుడిని చేస్తుంది. మానవుడు సంసారము నందు విముఖత చెందనంత వరకూ మోక్షమార్గములో పయనించ లేడు. ఈ ప్రాపంచిక విషయముల మీద మనసు విరక్తి కలిగినప్పుడే మానవుడు మోక్షమును పొందగలడు. పార్వతీ ! మనసులో ఉన్న చింతలన్నీ వదిలి పెడితే కాని అందరి అందు సమత్వము, సమభావన కలిగితే కాని తృష్ణ, ఆశ, లోభత్వము విడిచి పెడితే కాని పైన చెప్పిన విరక్తి కలుగదు. వాటి స్వభావము వివరిస్తాను. ధనము ఉన్నా పోయినా, దగ్గర బంధువులు చని పోయినా దాని గురించి విచారించడం మానుకోవాలి. పోయిన ధనము గురించి, చనిపోయిన బంధువుల గురించి దుఃఖించడం వలన దుఃఖము పెరుగు తుందే కాని తరగదు. కనుక దుఃఖించడం అనవసరము.

ఎందుకంటే సుఖము, దుఃఖము ఒకదాని వెంట వస్తూ పోతుంటాయి. స్వర్గలోకాధిపతి దేవేంద్రుడికి కూడా సుఖము దుఃఖము ఒకటి వెంట ఒకటి వచ్చాయి. ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించే ప్రతి ప్రాణి ప్రతి వస్తువు పరిణామం చెందడం కానీ నాశనం కావడం కాని తధ్యము. ఈ సత్యము తెలిస్తే దుఃఖము కలుగదు. కనుక నాశనం అయ్యే వాటి గురించి చింతించడం అవివేకము. ఇతరుల నుండి ధనమును వస్తువును స్వీకరించే వాడు పట్టు పురుగు తన దారములతో తనను ఎలా బంధించుకుంటుందో అలా తనను తాను బంధించుకుంటాడు. పార్వతీ ! మానవుడికి ధనము సంపాదించడం, సంపాదించిన ధనం కాపాడడడం, ఆ ధనమును ఖర్చు చెయ్యడం, ఆ ధనము పోతే దాని కొరకు దుఃఖించడం ప్రధాన వ్యాపకాలు. కనుక ధనము అన్ని దుఃఖములకు మూలకారణము. ధనము లేకపోతే దుఃఖము ఉండదు.



#ఆశ:


ధనము తరువాత ఆశ మానవుడిని నాశనం చేస్తుంది. ఆశను మించిన దుఃఖము మరొకటి లేదు. ఆశను వదిలితే కలిగే సుఖము దేనికీ సమానము కాదు. ఆశ అనేది మనిషితోపాటు పుడుతుంది. మనిషి చచ్చేదాకా అతడిలో ఉన్న ఆశచావదు. కనుక ఆశ ప్రాణాలను తీయకలిగిన ప్రాణాంతక వ్యాధి. కోరికలు అనేవి ఒకటి వెంట ఒకటి పుడుతూ ఉంటాయి. కోరికలు అనుభవిస్తే తీరేవి కాదు. అగ్నిలో నెయ్యి వేస్తే అగ్ని ఆరిపోతుందా ! అలాగే అనుభవించే కొద్దీ కొత్త కొత్త కోరికలు పుట్టుకు వస్తుంటాయి. కోరికలను ఆశను అదుపులో పెట్టుకుంటే అంతులేని సుఖంకలుగుతుంది. మానవుడు ఇంద్రియములను నిగ్రహించుకోవాలి. ఇంద్రియములను వాటి ఇష్టము వచ్చినట్లు పోనిస్తే అవి చేయకూడని పనులు చేసి దుఃఖముకలిగిస్తాయి. అలాకాకుండా కోరికలను నిరోధిస్తే మానవునికి సుఖము కలుగుతుంది. మరణం తరువాత సద్గతులు కలుగుతాయి. ఎప్పుడూ ధనము సంపాదించడం లోనూ ఇంద్రియ సుఖములు అనుభవించడంలోనూ మునిగి తేలే వాడిని మృత్యువు ఒక్క సారిగా మీదపడి అడవిలో పెద్దపులి మేకమీద పడి కబళించినట్లు కబళిస్తుంది. మానవుడు సంపాదించిన ధనము, అతడు చేసిన ధర్మములు, యజ్ఞములు, యాగములు, అతడిని మృత్యువు నుండి కాపాడ లేవు. పుట్టిన వాడు చావక తప్పదు. కేవలం మోక్షసాధనతోనే ఈ జనమరణ చక్రము నుండి విముక్తి పొందగలడు. మానవుడి జీవితంలో ఒక్కొక్కరోజు, ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంవత్సరం గడిచేకొద్దీ అతడి ఆయువు క్షీణిస్తుంది. అతడు మృత్యువుకు దగ్గర ఔతుంటాడు. కనుక రేపటి పని ఈ రోజు, తరువాత చెప్పిన పని ఇప్పుడే చెయ్యాలి. కాలయాపన, అలసత్వము, సోమరితనము పనికి రాదు. కాలముకు వశుడైన మానవుడికి ఏమరిపాటు సహజము. కాలం గడిచే కొద్దీ ఆయుష్షు తరిగి పోతుందని గ్రహించిన నాడు ఈ సంసారం మీద విరక్తి కలుతుంది. ఆ విరక్తిమార్గము ముక్తికిసోపానము. పార్వతీ ప్రాపంచిక సుఖముల మీద కోరిక ఆశ లేక పోతే అతడు మనస్సును జయించగలడు. దాని వలన ముక్తి లభించి జరామరణచక్రము నుండి విముక్తి పొందగలడు.”



#సాంఖ్యము:

“పార్వతీ ! ఇప్పుడు నీకు సాంఖ్యము గురించి చెప్తాను. ఈ సాంఖ్యయోగము సంసారము అనే జబ్బుకు మంచి మందు. సాంఖ్య యోగులు జ్ఞాన సముపార్జనతో ముక్తి చెందుతారు. కాని ఈ శరీరముతో తపస్సు చేయడము, శరీరాన్ని సుష్కించచేయడం వృధా ప్రయాశ. కేవలం జ్ఞానము వలనే మోక్షం పొందగలము. ఈ ప్రకృతికి అవ్యక్తము అనే పేరు కూడా ఉంది. ఈ ప్రకృతిలో నుండి మహత్తత్వము, అహంకారము, మనస్సు, ఇంద్రియములు, పంచభూతములు, వాటి గుణములు, ఆవిర్భవించాయి. ఇవి అన్నీ కలిపి 24. 25వ తత్వము ఆత్మ. ఈ ఆత్మ సత్వ, రజొ, తమో గుణముతో ప్రభావితం ఔతుంది. వీటి ఆధారంతో ప్రకృతిలో సృష్టి జరుగుతుంది. అవ్యక్తమైన ప్రకృతి ఏక అణువు. అనగా అణువు ఒక్కటే అవిచ్చిన్నము. కంటికి కనపడదు. ఇదే సృష్టికి ప్రధానము.



#త్రిగుణములు:


సౌఖ్యము, తృప్తి, ప్రకాశము సత్వగుణ లక్షణములు. సుఖదుఃఖాలు, రాగద్వేషములు, మొదలగు ద్వందములు రజోగుణ లక్షణములు. అజ్ఞానము, భయము, అంతా తనకు తెలుసు అనే భ్రాంతి, విపరీతమైన జ్ఞానము కలిగి ఉండడం, ఏ పనీ చెయ్యకపోవడం, అలసత్వము ఇవి తమోగుణ లక్షణములు. సత్వగుణము ప్రధానంగా కలవాడికి, ధైర్యము, విజ్ఞానము, శ్రద్ధ, దేని మీద మోహము లేకపోవడము, ఇతరుల పట్ల దయ, ఎప్పుడూ సంతోషంగా ఉండడం అనేవి ప్రధాన గుణములు. ఈ గుణములు లేకపోతే సత్వగుణము కూడా నశించి పోతుంది. కోపము, లోభము, కామము, ద్రోహచింతన, దుఃఖము ఇవి రజోగుణ గుణములు. ఈ గుణములు విడిచిపెడితే రజోగుణము నశించిపోతుంది. ఎల్లప్పుడూ ప్రతిదానికి సంశయించడము, విషాదము, జడత్వము ఇవి తమోగుణ లక్షణములు. ఈ గుణములు తగ్గించుకుంటే తమోగుణము నశించి పోతుంది. ఈ మూడు గుణాలు ప్రతి మనిషిలోనూ హెచ్చుతగ్గులుగా ఉంటాయి. ఒక్కటి ఎక్కువైతే మిగిలినవి తగ్గుముఖం పడతాయి. రెండు ఎక్కువగా ఉంటే మిగిలినది తగ్గుముఖం పడుతుంది. సత్వగుణము ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి తేజస్సుతో ప్రకాశిస్తుంటాడు. సదా సంతోషంగా ఉంటాడు. రజోగుణము ఎక్కువగా ఉన్న మనిషి ఎప్పుడూ కోపంగా ఉంటాడు. సదా దుఃఖిస్తుంటాడు. తమోగుణము అధికంగా ఉంటే కామము, కోరికలు, సకలము అన్నీ తనకు కావాలని అనుకొని అవి దక్కక పోతే జితేంద్రియుడు ఔతాడు. ఈ గుణముల ప్రభావంతో చేసేపనుల వలననే మానవులకు దేవలోకప్రాప్తి మనుష్యలోకములో పుట్టడం లేక జంతువులలో పశుపక్ష్యాదులలో పుట్టడం జరుగుతూ ఉంటుంది. మహతత్వమును బుద్ధి అనికూడా అంటాము.


ఈ బుద్ధి వివేకముకు, జ్ఞాననముకు గుర్తు. ఈ బుద్ధి వివేకముకు జ్ఞానముకు గుర్తు. అహంకారము సృష్టికి మూలము. అహంకారము వదిలితే ముక్తి దానంతట అదే వస్తుంది. ఇక మనస్సు ఇది ఇంద్రియముల ద్వారా ప్రకృతిలో సంచరిస్తుంటుంది. ఇంద్రియ లోతత్వమునకు, ఇంద్రియ నిగ్రహముకు ఈ మనసే కారణము. ఈ శరీరము పంచభూతముల గుణములైన శబ్ద, స్పర్శ, రస, గంధ రూపములు ఈ శరీరము ద్వారా ప్రకటించబడుతూ ఉంటాయి. ఈ దేహము ఆత్మ కాదు, ఆత్మ కంటే వేరైనది. జీవాత్మ ఈ శరీరంలో అవ్యక్తంగా ప్రకాశిస్తున్నాడు. కాని మానవులు తామే ఆత్మ అనే అజ్ఞానంలో ఉంటాడు. అన్నీతామే చేస్తున్నామని, తమవలనే అన్నీ జరుగుతున్నాయని భ్రమ పడుతుంటారు. తాను వేరు మనసు వేరు అనుకుని మనసును ప్రకృతి నుండి పరమాత్మ వైపు మళ్ళించిన మానవుడు ముక్తి పొందుతాడు. దేహాభిమానము పూర్తిగా నశిస్తేగాని ఇది సాధ్యము కాదు. ఈ తత్వమే 25వ తత్వము.. ప్రకృతిని వదిలి పెట్టి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ విజ్ఞానము పరమ శాంతిప్రథము. అన్నింటికీ అధిష్టానం అయినది 26వ తత్వము. దానికి ఈ శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాలు అంటవు. ఇది నిత్యము, శాశ్వతము, అవ్యయము. అన్నింటిలోను ఉంటుంది. సర్వే సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అతి సూక్ష్మమైనది. అత్యంత విశాలమైనది, ఇంద్రియములకు గోచరము కాదు. ఇదే 26వ తత్వము. ఆ తత్వమును పరమాత్మ అని పిలుస్తారు. ఇదే మోక్షపదము. సమదృష్టి కలిగిన వారు మోక్షముకు అర్హులు. పార్వతీ నీకు చెప్పిన ఈ సాంఖ్యము కపిల మహర్షి సేవించిన ధర్మము.”



#యోగము:


“పార్వతీ ! ఇక యోగమార్గము గురించి వివరిస్తాను…” ఈ దేహము, ఇంద్రియములు, మనసు, బుద్ధీ, ఆత్మ ఇవన్నీ ఒకటే కాని వేరు కాదు అనుకోవడమే యోగము. ప్రతిరోజూ అగ్నిహోత్రము చెయ్యడం, అధికంగా మాట్లాడకుండా ఉండడం, సత్వగుణము కలిగి ఉండడడం, అర్హులైన వారికి దానంచెయ్యడం, వేదాభ్యాసంచెయ్యడం, ఎల్లప్పుడూ శుచిగా ఉండడం, సత్యము పలకడం, వీటిని అనుసరించడం వలన మానవుడిలోని పాపాలునశిస్తాయి . శుచిగాశుభ్రంగా ఉండాలి. ఏకాంత ప్రదేశంలో ఒక ఆసనముమీద కూర్చోవాలి. నడుము దగ్గర నుండి తల వరకు నిటారుగా కూర్చోవాలి. ఇంద్రియములను మనస్సును ఏకం చెయ్యాలి. మనస్సును ఆత్మలో లీనము చెయ్యాలి. ప్రాణ, ఆపాన వాయువులను క్రమబద్ధం చెయ్యాలి. మానవుడు మనసును ఈ దశకు రాగానే ఇష్టం వచ్చినట్లు పోనీయరాదు. ప్రాణవాయువు ఆపానవాయువుతో కూడి ఊర్ధ్వ ముఖంగా పయనించి శిరస్సు దగ్గరకు చేరుతుంది. అప్పుడు జీవాత్మ పరమాత్మగా మారుతుంది. ఈ యోగమును అనుసరించడానికి సోమరితనము, పరధ్యానము, అత్యాశ, ఇతరులపట్ల ఆదరం లేకపోవడం, రోగములు, స్వప్నములు, లోభత్వము, భయము, కామము, క్రోధము, సుఖములు అనుభవించాలన్న కోరిక, చంచలత్వము మొదలైన దుష్టగుణములు అత్యంత విరోధములు. పైన చెప్పిన గుణములు ఉన్నవారు యోగాభ్యాసానికి అర్హులు కారు. ఈ యోగాభ్యాసమును నిష్ఠతో చేసిన అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. అలాంటి యోగి స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ తిరగగలడు. యోగి ఎక్కువగా నిద్ర పోకూడదు. అలాగని అసలు నిద్రపోకుండా ఉండ కూడదు. ఎక్కువగా తిన కూడదు. అలాగని అసలు తినకుండా ఉండ కూడదు. మితభోజనం, మితనిద్ర యోగికి యోగసిద్ధి కలిగిస్తుంది. యోగధర్మము ఇదే” అని మహేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు.



#పరమాత్మలో లీనం:


పార్వతీదేవి…  “మీ దయ వలన సాంఖ్యము, యోగము గురించి తెలుసుకున్నాను. భక్తులు పర్మమాత్మలో లీనం కావడానికి ఎటువంటి పరిచర్యలు చేయాలి” అని అడిగింది. 


పరమశివుడు “పార్వతీ! దేవతలకు కాని మానవులకు కాని పరమాత్మను గురించి తెలుసుకోవడం అసాధ్యం. ఎందుకంటే సాంఖ్యము, యోగము రెండూ పరమాత్మ స్వరూపాలే. ఆ పరమాత్మను నేనే. నేను సనాతుడను, అవ్యయుడిని, సత్యమే నాస్వరూపము. నా దయలేనిది ఎవరూ నన్ను దర్శించలేరు. నన్ను చేరుకోవడానికి మంత్రము, జపము, నిరంతర పరమాత్మ చింతన, స్తోత్రములు, నమస్కారములు ఇవన్నీ నిష్టతో చేసిన పరమాత్మను చేరుకోవచ్చును. పూర్వము నేను నాలుగు ఆశ్రమములను గురించి పాశుపత్రవ్రతము గురించి నలుగురు విప్రులకు బోధించాను. వారు దానిని తమ శిష్యులకు బోధించారు. అలా లోకమంతా వ్యాపించింది. సకల శుభములు కలగడడానికి, శుచిగా ఉండడానికి, నా స్వరూపమైన లింగార్చనకు నేను విభూతిని రూపొందించాను. యోగులు ఆ విభూతిని, శరీరము అంతా అలముకొని, కపాలము చేత బూని, తలగొరిగించుకుని, భిక్షాటన చేస్తూ, మనోనిగ్రహంతో మెలగుతూ, నా మీదనే మనసు నిలిపి, ఇతర కోరికల మీదకు మనసు పోనీయక పరమానందకరమైన అనుభూతిని అనుభవిస్తారు. కేవలం ఈ ప్రకారం సంగమును విడిచిన యోగులు నా సాయుజ్యమును పొందగలరు. నిరాకారంగా నిస్సంగంగా నన్ను పూజించుట కొరకు నేను మూడు లోకములలో ఏ ఆకారము లేని శివలింగాలను స్థాపించాను. ఆ లింగములను నా స్వరూపంగా పూజిస్తే నేను వారికి ప్రసన్నుడను ఔతాను. ఆ లింగములను ఎవరికి ఎలా తోచినట్లు అలా పూజ చేయవచ్చు. వారివారి శక్తిని అనుసరించి పూజించవచ్చు. పాలతో, నేతితో, నీటితో ఆ లింగములను అభిషేకించ వచ్చు. నాకు మారుగా ఆ లింగములను గంధము, పుష్పములు, ధూపము, దీపము, నైవేద్యము శక్తికి తగిన విధంగా ఆరాధించ వచ్చు. ఆ లింగములను పూజించిన నన్ను పూజించినట్లే.”✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం… గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

[16/04, 8:59 am] +91 94939 06277: 150423b1527.   160423-2.

🍀🌺🍀 🌺🍀🌺🍀🌺🍀🌺🍀X51.



                   పక్షవాతం - 

              పేకముక్కల చికిత్స!

                  ➖➖➖✍️️


         ఒక పెద్దాయనకు  పక్షవాతం వల్ల కుడిపక్కన అవయవాలన్నీ   చచ్చుబడి పోయి చలనం లేకుండా పోయింది. 


      వైద్య చికిత్స వల్ల ఫలితం అంతగా కనిపించడం లేదు.    అతనికి మాటలు రాక జ్ఞాపకశక్తి కూడా నశించిపోయింది. అతని భార్య  పరమాచార్య స్వామి వారి వద్దకువెళ్ళి కన్నీళ్ళు కారుస్తూ తన గోడు చెప్పుకుంది.     “మహాస్వామి వారు ... కరుణించి నా భర్తను మళ్ళా మామూలు మనిషిని   చేయవలసినది...! ”    అని ప్రార్థించింది.


      స్వామి వారు    కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.


       ”అతను కోలుకోవడానికి    ఏమైనా చెయ్యడానికి సిద్ధమా?” అని అడిగారు.


     ”ఎంత ఖర్చైనా పర్లేదు పెరియవ ” అన్నది ఆవిడ.


   ”నా ఆంతర్యం    అది కాదు!     నేను చెప్పిన విషయం    తేలికగా    తీసుకోరు కదా?” అని అడిగారు.


    ”లేదు పెరియవ మీరు చెప్పినట్టే.... చేస్తాను”


   “రెండు కట్టల పేకముక్కలు తీసుకుని ఎల్లప్పుడూ  అతని  కంటికి కనబడేట్టు పెట్టండి.   నిదానంగా అతని జ్ఞాపకశక్తి పెరిగి    మాటలు వస్తాయి.....”    అని సెలవిచ్చారు.


      ఆ వచ్చినావిడ తెల్లబోయింది. కాని అది  సరైన వైద్యమే  అని    నిర్ధారించు కుంది.       కాని ఒక్క విషయం ఆవిడకి అర్థంకాలేదు  “నాభర్త పేకాటకు బానిస అని స్వామి వారికి ఎలా తెలుసు”  అని అనుకుంది. కాని రోజంతా పేకముక్కలు చూసినంతమాత్రాన       తన భర్త.. పక్షవాతం నుండి బయటపడతాడా?


       పరమాచార్య స్వామి    ఆజ్ఞప్రకారం ఆవిడ అలాగే చేసింది.  కొద్దిరోజులలోనే ఆ పెద్దమనిషి కోలుకోవడం    ప్రారంభిం చాడు.  అతని జ్ఞాపకశక్తి పుంజుకోవడం ప్రారంభించింది.    కొద్దిరోజుల తరువాత పూర్తిగా కోలుకున్నాడు.


  మనవళ్ళతో పేకాట ఆడటం మొదలు పెట్టాడు.   పిల్లలు తప్పు చేస్తే ప్రేమతో... మందలిస్తూ., “నువ్వు  ఇప్పుడు   స్పేడ్ వెయ్యాలి....    హార్ట్స్ కాదు” అనేవాడు. పడిపోయిన   నోరు కూడా      బాగుపడి మాట్లాడడం మొదలు పెట్టాడు.


   ఎంటువంటి పరిహారం సూచించారు మహాస్వామి వారు?    ఇంటి వైద్యమా? పేక వైద్యమా? ఏదేమైనా గెలుపు ముక్క ఉన్నది వారిచేతుల్లోనే...!


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


:

 జై శ్రీరామ్ *అష్టోత్తర శతం*🙏🕉️🙏


108. ఏమిటి ఈ సంఖ్య?  ఏదైనా మంత్రం చదివితే, 108 సార్లు అంటారు. ప్రదక్షిణాలు చేసినా, 108 సార్లు చేస్తే మంచిదంటారు. ఇది చాదస్తమా?  సాంప్రదాయమా? లేక,  ఈ అంకె వెనక ఏదైనా మిస్టరీ ఉందా? భారతీయుల అద్భుత గణిత పరిజ్ఞానానికి  సంఖ్య 108. అవును. దిమ్మతిరిగే  పరిశోధనలను భారతీయులు వేల ఏళ్ళ క్రితమే ఎలా చేశారు? అని చెప్పడానికి ప్రపంచానికి ఇచ్చిన ఎన్క్రిప్టెడ్ కోడ్  108.  ఆలయంలో ప్రదక్షిణలు ఎన్ని చేయాలి? అంటే, చదువు రానివారు కూడా 108 చేస్తే మంచిది అంటారు. రుద్రాక్ష తులసి, ఇలా ఏ మాల తీసుకున్నా,, 108 పూసలు ఉన్నాయా? అని గుచ్చి గుచ్చి మరీ అడుగుతాం. "ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి, మంచిది" అంటాడు పురోహితుడు. ఏమిటి ఈ  108? కొందరు దేవుడిని నమ్ముతారు. కొందరు నమ్మరు కూడా . కానీ, అందరూ నమ్మేది సైన్స్. కనుకే, అందరూ నమ్మే పరిశోధనలు చేశారు, భారతీయు ఋషులు. అవి అలాంటి ఇలాంటి పరిశోధనలు కాదు, అందుకు సరైన ఉదాహరణ ఈ 108. ఈ 108 వెనుక అంతరిక్ష శాస్త్రమే దాగుంది. ఈ భూమి ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఖగోళం అనే వృత్తంలో సూర్యుడు, సూర్యుడు చుట్టూ ఎంత దూరంలో తిరుగుతున్నాడు? వీటన్నిటికీ సమాధానం 108..


 వేదకాలంలో ఎన్నో అద్భుత పరిశోధనలు జరిగాయి వాటిలో అంతరిక్ష శాస్త్రం కూడా ఒకటి. సూర్యుడికి భూమికి, చంద్రుడికి భూమికి మధ్య దూరాలు ఓ రెండు మూడు వందల ఏళ్ళ క్రితమే కనుక్కున్నారని పుస్తకాల్లో చదివాం. కానీ, వేదాల్లో ఈ దూరాల్ని ఎప్పుడో చెప్పేసారు. ఎలా అంటే, 108 తో.. భూమికి, చంద్రుడికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు. భూమికి సూర్యునికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి 108 రెట్లు. సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు. ఏంటి? ఆశ్చర్యంగా ఉందా? అవును. మనం నివసించే భూమి, మన భూమికి ప్రాణాన్నిచ్చే సూర్యుడు, భూమి ఆకర్షణను బ్యాలెన్స్ చేసే చంద్రుడు, అన్నిటి లెక్కలు ,అన్నిటి దూరాలు ఈ 108తో కలిపి ఉన్నాయి. ప్యూర్ ఎస్ట్రనామికల్ సైన్స్. ఊహించారా?  108 వెనక ఇంతకథ ఉందని.. ఇవన్నీ కాకి లెక్కలు కావు. ఆధునిక సైన్స్ పెద్దపెద్ద కంప్యూటర్లతో, మిషన్లతో, శాటిలైట్లతో కనిపెట్టిన గ్రహాల దూరాలకి వేద కాలంలో భారతీయ ఋషులు 108 కోడ్ తో చెప్పిన ఈ తేడాకి  సరిగ్గా సరిపోయాయి. మరి ఎవరు గొప్ప? ఇక్కడితో ఆగిపోతే మనం భారతీయులం ఎలా అవుతాం? మన జీన్స్ లోనే ఫిలాసఫీ ఉంది.  సైన్స్ ఉంది. 


ఆయుర్వేదం అందరికీ తెలిసిన వైద్యగ్రంథం. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో 107+1 మర్మ స్థానాలు ఉంటాయి. ఈ మర్మస్థానాలే మన శరీరంలో అన్ని భాగాలకు ప్రాణాన్ని సరఫరా చేస్తే శక్తి ఉత్పత్తి కేంద్రాలు.


 మర్మకళ అని ప్రాచీన కేరళ వద్ద కళ ఒకటి ఉంది. వాళ్లు మన మర్మాల మీద దాడి చేసి ఆ పార్టులు పనిచేయకుండా చేయగలరు.


 శ్రీ చక్రం వినడం వినడమే కానీ, శ్రీ చక్రం అంతరార్థం ఏంటో చాలామందికి తెలియదు. సృష్టి రహస్యానికి బ్లూ ప్రింట్ అది., శ్రీ చక్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. మొత్తం 108. పాజిటివ్ నెగిటివ్ కలిస్తే ఎనర్జీ. శక్తిని ఉత్పత్తి చేసే ప్రాచీన యంత్రం,అది. .శ్రీ చక్రం ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీలను పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుందని విశ్వాసం.


 జ్యోతిష్య శాస్త్రం కొంతమందివల్ల అది మూఢనమ్మకమనే మచ్చ పడింది. కానీ, జ్యోతిష్యం అంటే పూర్తిగ సైన్స్. కంప్లీట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. దీనికి 108కి సంబంధమేంటి? అంటే, మనిషిలోని ప్రవర్తనలకు సూచికలు. ప్రతి మనిషిలోనూ వారి వారి ప్రవర్తనలకు సూచికలు 27 నక్షత్రాలు. మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రం, ఏ గ్రహం, ఈ భూమి మీద ప్రభావం చూపిస్తాయో, వాటి ప్రవర్తనలే మన జాతకాల మీద, మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. అశ్విని, భరణి 27 నక్షత్రాలు. ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు 27 నక్షత్రాన్ని ఈ నాలుగు పాదాలతో గుణిస్తే, అక్కడ 108 వస్తుంది. ఇందులో 9 పాదాలు ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అలా రాశులు మళ్ళీ 12 ఉంటాయి.


 ఆధునిక మానసిక తత్వశాస్త్రం కూడా మనిషిలో ముఖ్యమైన ప్రవర్తనలం 108 ఉంటాయని చెబుతోంది.


 మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనిషి సగటున ప్రతి రోజు 21,600 సార్లు శ్వాస తీస్తాడు. అందులో పదివేల ఎనిమిది వందల సూర్యాంశ, అంటే ప్రాణశక్తి. పదివేల ఎనిమిది వందల సార్లు చంద్రాంశ. అంటే, మనం వదిలే కార్బన్డయాక్సైడ్ అనుకోవచ్చు. ఆక్సిజన్ పీల్చుకొని, కార్బన్డయాక్సైడ్ ని వదలడం అన్నమాట. పదివేల ఎనిమిది వందలని అంటే 108 వందలే కదా.


 భరతుని నాట్య శాస్త్రంలో చేతులు, కాళ్లు కలిపి చేసే నాట్య భంగిమలు 108 ఉంటాయి. ఈ ఒక్కో భంగిమ ఒక్కో సంకేతాన్ని చెప్తూ ఉంటుంది. నటరాజస్వామి చేసే నాట్య భంగిమలు కూడా 108.


 మన ఉపనిషత్తుల సంఖ్య 1080. మన ఇంట్లో, ఆలయాల్లో అష్టోత్తర శతనామావళి అంటాం. అంటే, 108 నామాలను జపించాలని.


  ఇలా, మన శాస్త్రాలన్నీ మొత్తం 108తో ముడిపడి ఉన్నాయి. అందుకే, ఆ సంఖ్యకి మన ప్రాచీన ఋషులు అంత ప్రాధాన్యతనిచ్చారు.🙏 మీ *శ్రీ రామాలయం*🕉️🛕🕉️

కామెంట్‌లు లేవు: