10, సెప్టెంబర్ 2023, ఆదివారం

బసవ పురాణం - 27 వ భాగము .

 🎻🌹🙏 బసవ పురాణం - 27 వ భాగము ....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸జంగమ వేషం ధరించి వచ్చాడు. సిరియాలుడు తపసిని అర్చించి తన గృహానికి రమ్మన్నాడు. నాకు నరమాంసం కావాలి అని తపసి అడిగాడు. అంతే కదా! రండి. 


🌿మీకు ఎట్టి నియమాలున్నా నెరవేరుస్తాను అని సిరియాలుడు పిలిచాడు. తపసి సిరియాలుని ఇంటికి వచ్చాడు. ఈలోపల సిరియాలుడు లోపలికి వెళ్లి తన భార్యకీ సంగతి చెప్పాడు. 


🌸సంగళవ్వ ఏమీ విచారపడకుండా చదువుకోవడానికి పోయిన తన కొడుకును పిలిచింది. కొడుకు వచ్చాడు. ‘ఇవ్వాళ మన ఇంట్లో పండుగ’ అని చెప్పి కొడుకుకు వధ్య శృంగారం చేసి తల్లీ దండ్రీ ఇద్దరూ కలిసి కొడుకును చంపారు. 


🌿ఆ మాంసం వండి ఇతరులెరుగకుండా తపసికి పెట్టారు. 

ఏమయ్యా ఇందులో తలను వండినట్లు లేదు అని అడిగాడు తపసి.వెంట్రుకలు వస్తాయని వండలేదు. 


🌸ఇదుగో క్షణంలో వండి తెస్తాము అని వెళ్లి వారు తల కూడా వండి తెచ్చి వడ్డించారు. బాగుంది. ఇప్పుడు సహపంక్తి లేకుండా నేను భుజించను, రమ్మన్నాడు. 


🌿సంగళవ్వ భయభ్రాంతురాలైంది.

సిరియాళుడు మాత్రం ధైర్యంగా పదమన్నాడు. అంతా భోజనానికి కూర్చున్నాడు. తపసి ‘సెట్టీ! నీ కొడుకును కూడా పిలువు, భోజనానికి!’ అన్నాడు. 


🌸వాడెక్కడికో ఆడుకోవడానికి పోయి వుంటాడు’ అని మాట తప్పించాడు సిరియాళుడు. ‘అదెట్లా! నీ కొడుకు సరసన లేకుంటే నేను భుజించను పిలువు’ అన్నాడు.


🌿సంగళవ్వ ‘నాయనా! రమ్మని పిలిచింది దుఃఖంతో. వెంటనే చిన్న కూకటి జుట్టుతో చెవులకు కుండలాలతో పరుగెత్తుకుంటూ కొడుకు వచ్చాడు. శివుడు సిరియాళ దంపతులకు సాక్షాత్కరించాడు. 


🌸సెట్టి కుటుంబం పార్వతీ పరమేశ్వరులకు శరణు చేసింది. శివుడు వారిని తన వెంట కైలాసానికి తీసుకొనిపోయాడు.


🌷నిమ్మవ్వ కథ


🌸(చతుర్థ- మాచయ్య బసవనికి చెప్పినది)పూర్వం నిమ్మవ్వ అనే భక్తురాలుండేది. 


🌿ఆమె భక్తిని పరీక్షింపదలచి, సిరియాలునికి ‘నన్ను మించిన త్యాగిలేడు’ అనేగర్వం తగ్గించదలచీ, శివుడు సిరియాలుని వెంటబెట్టుకొని మారువేషంలో నిమ్మవ్వ ఇంటికి వచ్చాడు. 


🌸నిమ్మవ్వ జంగమయ్యలకు వంట మొదలుపెట్టింది. ఇంతలో నిమ్మవ్వ కొడుకు వచ్చాడు. అతడు శివశరణుల ఇండ్లలోని గొడ్లు కాయడం కాయకంగా స్వీకరించిన వాడు. 


🌿అలసిపోయి ఆకలితో వచ్చిన నిమ్మవ్వ కొడుకు బూరెలు సిద్ధం కావడం చూచి ఒక బూరెను తిన్నాడు. నిమ్మవ్వ అది చూచి కుక్కా! శివ నైవేద్యం కాకుండానే నీవు ఎంగిలి చేశావా?’ 


🌸కట్టెతో తల పగలగొట్టి చంపింది. మరుక్షణమే ఆ శవాన్ని ఆవతలకి లాగి గడ్డిలో దాచి ఏ మాత్రం మోహం లేకుండా వచ్చి అయ్యలను అర్చనకు పిలిచింది. 


🌿చూచావా! చిరుతొండనంబీ! నిమ్మవ్వ భక్తి’ అని శివుడు చిరుతొండనికి ప్రత్యక్షంగా ఇది చూపాడు. తర్వాత ‘నిమ్మవ్వా! నీ కొడుకును కూడా భోజనానికి పిలు’ అన్నాడు శివుడు. 


🌸అప్పుడు నిమ్మవ్వ ఇలా అన్నది.

ఏమయ్యా! శివుడా! నీ మాయలు నా దగ్గర సాగవు. జాగ్రత్త. చచ్చిన కొడుకు సహపంక్తికి ఎలా వస్తాడు? వాడు శివద్రోహి, చంపాను. 


🌿అంతే. నాకేదో కైలాసం ఆశ జూపి సిరియాలుణ్ణి చేసినట్లు నన్ను చేద్దామనుకుంటున్నావేమో. నాకు నీ కైలాసం అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదు. భోంచేయకుండా కదిలావో చూసుకో ఏం చేస్తానో’ అని బెదిరించింది. 


🌸అది చూచి శివుడు సిగ్గుపడ్డాడు. శివుడు తన నిజరూపం చూపించాడు. నిమ్మవ్వ నవ్వి ‘గుండయ్య ఇంటికీ, భోగయ్య ఇంటికీ, దాసయ్య ఇంటికీ ఏ నిజ స్వరూపంతో వెళ్లావు? 


🌿మానకంజారుని ఇంటికీ, చిరుతొండని ఇంటికీ నిజరూపంతో వెళ్లావా? అప్పుడు లేని చమత్కారం ఇప్పుడెందుకు చూపుతున్నావయ్యా స్వామీ!’ అన్నది. 


🌸శివుడు మారు మాట్లాడలేక సిరియాలునితో సహా నిమ్మవ్వ పెట్టిన విందు ఆరగించాడు. తర్వాత నిమ్మవ్వ కొడుకును బతికించి కైలాసాన్ని ఇచ్చాడు. 


🌿నిమ్మవ్వ మాత్రం ‘మోక్షంకన్నా నాకు జంగమ లింగ పూజనమే’ ఇష్టమని కైలాసాన్ని కూడా తిరస్కరించింది.



🌷నరసింగ నాయనారు కథ


🌸(శివుడు సిరియాలునికి చెప్పిన కథ)

పూర్వం నరసింగ మొన్నయనారు అనే చోళరాజు ఉండేవాడు. ఆయన పట్టమహిషి శివపూజకు పోయింది. 


🌿దోవలో పూజా పుష్పాలలో ఒకదాన్ని వాసన చూచింది. పూజారి చూచాడు. పట్టమహిషి రాగానే పూజారి పిల్లవాడు ఆమె ముక్కును కోసివేశాడు. 


🌸ఈ విషయం చోళరాజుకు తెలిసింది. ఆయన పరుగు పరుగున వచ్చి పూజారిని పట్టుకున్నాడు.నేనేం తప్పు చేశాను?...సశేషం...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

కామెంట్‌లు లేవు: