10, సెప్టెంబర్ 2023, ఆదివారం

బ్రాహ్మణ విద్యార్థులకి

 *ఫ్లాష్... ఫ్లాష్... ఫ్లాష్....*


*ఇది చాలా ముఖ్యమైన విషయం దయచేసి ఓపికగా చివరివరకు చదవండి, మీకు ఉపయోగం లేకపోతే దీనిని మరొక బ్రహ్మణునికి పంపించండి*


*బ్రాహ్మణ విద్యార్థులకి శుభవార్త*


*ప్రస్తుత కాలమాన పరిస్థితులలో రిజర్వేషన్లు విధానం అమలువల్ల బ్రాహ్మణ విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా ఎంసెట్ లో ర్యాన్క్ తెచ్చుకున్న మనకి ఒక గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయం లో ఇంజనీరింగ్ సీటు రాకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో మానసికంగా కృంగిపోతుంటారు.*


*ఈ విషయాన్ని సవివరంగా పరిశీలించిన జగద్గురువులు శ్రీ కంచి కామకోటి పీఠ మహాసంస్థానం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి  వారు బ్రాహ్మణ్యమునకు  సముచిత ప్రాధాన్యత ఇచ్చి వారికి కంచి యూనివర్సిటీ లో సీటు ఇప్పించడమే కాకుండా బ్రాహ్మణ విద్యార్థులు కి ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేసి అక్కడ కూడా సాయంత్రం సమయంలో, యూనివర్సిటీ సెలవుల్లో వేదం, స్మార్తము, జ్యోతిష్యం, వైదికధర్మంలో అనేక అంశాలపై అవగాహన పెంపొందిస్తూ విద్యార్థులు కి చక్కని మార్గం చూపించాలని నిండు మనస్సుతో నిర్ణయం తీసుకున్నారు.*


*యూనివర్సిటీ లో హాస్టల్ లో నామమాత్రంగా ఫీజుల తీసుకొని హాస్టల్ నుండి యూనివర్సిటీ వరకు కూడా ఉచితంగా బస్ ఏర్పాట్లు కూడా చెయ్యాలని సంకల్పం చేశారు. IT, EEE, CSE, MECHANICAL, వంటి అన్ని కోర్సులు యూనివర్సిటీ లో ఉన్నాయి.*


*ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులలో, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు అర్హులు. యూనివర్సిటీ ఫీజులు నామమాత్రంగా వుండును.

యూనివర్సిటీ లో 60% పైన మార్కులు సాధించినవారికి 60,000 రూపాయలు పైన పారితోషకం కూడా ఇచ్చే ఏర్పాట్లు కలవు*


 *కచ్చితంగా విద్యార్థులు సాంప్రదాయ పాఠశాల హాస్టల్లో మాత్రమే ఉండవలెను, సాంప్రదాయ వైదికధర్మంలో క్లాసులకు కచ్చితంగా సాంప్రదాయ దుస్తులతో హాజరు కావలెను, యూనివర్సిటీ కి వెళ్ళినపుడు వారి ఇష్టానుసారంగా ఫాంట్ షర్ట్ వెసుకోవచ్చు. హాస్టల్ ఫీజు కూడా బ్రాహ్మణ విద్యార్థులకి నామమాత్రంగా వుండును. ఈ అవకాశం అంతయూ కేవలము కంచిలో మాత్రమే అని తెలియచేస్తున్నాము.*


*ఆసక్తి ఉన్న విద్యార్థులు వారి ఇంటిపేరు గోత్రము, వూరు, సెల్ నెంబరు పాఠశాల ప్రతినిధి వారికి ఫోన్ ద్వారా 9866765439  *రవిచంద్ర గారు* *నెంబరుకి తెలియచేయవలెను.* 


*ఉపనయనం అయిన విద్యార్థులు కు ప్రాధాన్యత కలదు, లేదా పీఠం వారు ఉపనయనం చేయుదురు దానికి అంగీకారాన్ని తెలియజేయాలి. ఇది కేవలం 100 మంది తెలుగు బ్రాహ్మణ విద్యార్థులు కి మాత్రమే అవకాశం కావున ఇంజనీరింగ్ లో సీటు పొందలేని వైదికధర్మం అనుసరించడానికి అంగీకారం కలవారు మాత్రమే పై నెంబరుకి ఫోన్ చెయ్యండి. 100 మంది విద్యార్థులు వివరాలు అందగానే శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ వారి ఆశీస్సులతో విద్యార్థులకు గోదావరి జిల్లాలలో ఒక నగరంలో ఒక సెమినార్ నిర్వహించి సెలెక్ట్ అయిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. పేర్లు నమోదు చేసుకోవడానికి చివరితేదీ 14-9-22.*


*ఇది బ్రాహ్మణులకు మంచి అవకాశం కావున ఇది అన్ని బ్రాహ్మణ గ్రూపులకు, బ్రాహ్మణ విద్యార్థులకి షేర్ చెయ్యండి.*


*సర్వసాధారణంగా ఇటువంటివి అనేక ఫెక్ మెసేజ్ లు వాఁట్సాప్ లో చక్కర్లు కొడుతూఉంటాయి, అందువల్ల మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నెంబరు కి కూడా ఫోన్ చేయవచ్చు.*


*సదా భరతమాత సేవలో* 

*తూములూరి శ్రీకృష్ణచైతన్య శర్మ*

9491755938

కామెంట్‌లు లేవు: