16, సెప్టెంబర్ 2024, సోమవారం

మహాభారత సారాంశం*

 *లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం*


పది వాక్యాలలో..

   

1. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి,మీ ఆధీనంలోంచి దూరం అవుతారు..వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు. 

ఉదా: *"కౌరవులు."*


2. నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ.. ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. వాటిని *"అధర్మం కోసం వినియోగిస్తే"*.. అవి నిరుపయోగమవుతాయి. నువ్వు కూడ వినాశనం అవుతావు.

ఉదా: *కర్ణుడు* 


3. యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే *వినాశం* జరుగుతుంది.

ఉదా:*అశ్వత్థామ.*


4.పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది.

*ఉదా: " భీష్ముడు."*


5. సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము *దురహంకారం* తో *అధర్మంగా* వినియోగిస్తే తనకే కాదు, తన వారందరికి *వినాశం* జరుగుతుంది.

ఉదా: *"దుర్యోధనుడు "*


6. స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా *తనవారి పట్ల వల్లమాలిన అభిమానం* గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది.

ఉదా: *ధృతరాష్ట్రుడు* 


 7. *శక్తి యుక్తులకి, తెలివితేటలకి ధర్మం* తోడైతే *విజయం* తప్పక లభిస్తుంది.

ఉదా: *అర్జునుడు.*


8. ఒక మంచి శత్రువుని కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం.

ఉదా: *శకుని*


9. నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు, నీ వాళ్ళకి హానిచేయదు.

ఉదా : *యుధిష్ఠిరుడు*


10. అందరి బంధువైనా.. అన్ని తెలిసినా, చివరకి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండటమే భగవంతుడి కర్తవ్యధర్మం కూడా.

ఉదా : *శ్రీకృష్ణుడు*


కోటి కథల, లక్షల వ్యధల, వేల ఉప కథల, 100 మంది శత్రువుల, 5గురు మిత్రుల (అందరు సోదరులే)..

నాలుగు ధర్మాల సారాంశము భారతం.

📖🙏

కామెంట్‌లు లేవు: