23, ఫిబ్రవరి 2026, సోమవారం

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము


*659 వ రోజు*

పవిత్ర తీర్ధము

ధర్మరాజు " పితామహా ! ఎన్నోతీర్ధాలు ఉన్నాయి కదా ! అందులో పరమ పవిత్రమైన తీర్ధము ఏది వివరించండి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! తీర్ధములు అన్నీ మేలైనవే. అందులో పవిత్రము అపవిత్రము అంటూ ఏమి లేదు. అన్ని తీర్ధములలో మానసతీర్ధము పరమ పవిత్రమైనది. దాని పేరు సత్యము. దానికి స్థానము ధృతి అనే సరోవరము. ఎవరైతే రజస్సు, తమోగుణాలను పక్కననెట్టి సత్యాన్ని చేతధరించి ఆ సరోవరంలో స్నానము చేస్తాడో అతడు పరిశుద్ధుడౌతాడు. రాగద్వేషములను వదిలి ఇంద్రియనిగ్రహము పాటించు మహాత్ములందరూ పవిత్రతీర్ధముతో సమానులే. వారిని సేవించడం ద్వారా మానవుడికి పుణ్యతీర్ధసేవనఫలం దక్కుతుంది. తపస్సుచేయడం, ఇంద్రుయనిగ్రహము కలిగి ఉండడం, అహింసనుపాటించడం, మనస్సును నిగ్రహించడం, శుభ్రతకలిగి ఉండడం ఇవన్నీ పుణ్యతీర్ధనసేవతో సమానములే. పైగుణములు లేకుండా కేవలం నదీజలాలలో మునిగినంత మాత్రాన పుణ్యతీర్ధసేవన ఫలము దక్కదు. కేవలం శరీరము శుభ్రపడుతుంది కాని మనసు శుభ్రపడదు కదా ! దొరకని వాటి కొరకు ఆశపడకపోవడం, దొరికిన వాటితో తృప్తి చెందడం, ఎల్లప్పుడు తృప్తితో సంతృప్తితో ఉండడం, ఆశాపాశములు విడిచి పెట్టడం పాటించే నరులకు వేరు తీర్ధములు అవసరం లేదు " అని భీష్ముడు పలికాడు.

ఉత్తమ పదము

ధర్మరాజు " తాతగారు ! మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తే ఉత్తమపదము చేరుకుంటాడు. మానవుడు చనిపోయిన తరువాత ఈ దేహము విడిచి పెట్టి తనతో దేనిని సాయంగా తీసుకు వెడతాడు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు" ధర్మనందనా ! నీవు అడిగినవి నిగూఢమైనవి. వాటిని చెప్పడానికి ఒక్క బృహస్పతి మాత్రమే తగిన వాడు. ఆయన ఇక్కడకు వస్తున్నాడు. నీ సందేహములను ఆయనను అడిగి తెలుసుకో " అని భీష్ముడు చెప్పాడు. భీష్ముడు ఆ మాటలు అంటూ ఉండగానే దేవగురువు బృహస్పతి అక్కడకు వచ్చాడు. ధర్మరాజు తన తమ్ములతో సహా అతడికి ఎదురేగి బృహస్పతికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉచితాసనము మీద ఆసీనుడిని చేసి ధర్మరాజు తాను ముందు భీష్ముడిని అడిగిన ప్రశ్నను అడిగాడు. బృహస్పతి " ధర్మనందనా ! పుట్టే ముందు, చచ్చిన తరువాత, పుణ్య లోకములలోను, నరకంలోను జీవుడు ఉంటాడు. ఈ లోకంలో తల్లి, తండ్రి, భార్య, కుమారులు, కుమార్తెలు, బంధువులు స్నేహితులు శ్మశానం వరకు మాత్రమే వెళ్ళి తిరిగి పోతారు. నరుడు చనిపోయిన తరువాత అతడి ధర్మమే అతడికి తోడుగా వస్తుంది. కనుక బ్రతికి ఉన్నప్పుడే మానవుడు ధర్మకార్యములు చెయ్యాలి. అలా ధర్మకార్యములు చేయని వాడు, ధర్మము వదిలి ప్రవర్తించే వాడు, నరకానికి పోతాడు " అని పలికాడు బృహస్పతి.

జీవుడు ధర్మము

ధర్మరాజు " ఈ శరీరాన్ని వదిలపెట్టి వెళ్ళే జీవుడిని ధర్మము ఎలా అనుసరిస్తుంది ? " అని అడిగాడు. బృహస్పతి " ధర్మనందనా ! పంచభూతములు, వాటి గుణములు అయిన శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాదులూ బుద్ధి, ధర్మము జీవుడిని అనుసరించి వెడతాయి " అని పలికాడు. ధర్మరాజు " మహాత్మా ! రేతస్సు ఎలా ఏర్పడుతుంది ? " అని అడిగాడు. బృహస్పతి " ధర్మనందనా ! మానవుని శరీరము పంచభూతాత్మకము. మనస్సు దేహంలో ఉంటుంది. అన్నం దేహాన్ని పోషిస్తుంది. మానవుడిలో కలిగిన కామము రేతస్సును ఏర్పరుస్తుంది. స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీ గర్భాశయము చేరిన రేతస్సు గర్భము ధరింపచేసి పిండరూపము పొందుతుంది. అలా జన్మించిన మానవుడు తాను చేసుకున్న పుణ్యఫలముగా సుఖములు అనుభవిస్తాడు. పాపాలు చేసుకుంటే దుఃఖములు అనుభవిస్తాడు. పూర్వజన్మలో తాను చేసుకున్న పాపపుణ్యాలు ధర్మాధర్మములు అతడికి సుఖదుఃఖములు కలుగచేస్తాయి. కనుక మానవుడు సదా ధర్మకార్యములు చేయాలి. పాపకార్యములకు దూరంగాఉండాలి. పూర్వజన్మలో అధర్మము, పాపకార్యములు చేసిన వారు మానవజన్మకు బదులు పశుపక్ష్యాదులుగా క్రిమి కీటకాలుగా జన్మిస్తాడు. అదే నరకము. నరకము అంటూ వేరీది లేదు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్ర*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము


*659 వ రోజు*

పవిత్ర తీర్ధము

ధర్మరాజు " పితామహా ! ఎన్నోతీర్ధాలు ఉన్నాయి కదా ! అందులో పరమ పవిత్రమైన తీర్ధము ఏది వివరించండి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! తీర్ధములు అన్నీ మేలైనవే. అందులో పవిత్రము అపవిత్రము అంటూ ఏమి లేదు. అన్ని తీర్ధములలో మానసతీర్ధము పరమ పవిత్రమైనది. దాని పేరు సత్యము. దానికి స్థానము ధృతి అనే సరోవరము. ఎవరైతే రజస్సు, తమోగుణాలను పక్కననెట్టి సత్యాన్ని చేతధరించి ఆ సరోవరంలో స్నానము చేస్తాడో అతడు పరిశుద్ధుడౌతాడు. రాగద్వేషములను వదిలి ఇంద్రియనిగ్రహము పాటించు మహాత్ములందరూ పవిత్రతీర్ధముతో సమానులే. వారిని సేవించడం ద్వారా మానవుడికి పుణ్యతీర్ధసేవనఫలం దక్కుతుంది. తపస్సుచేయడం, ఇంద్రుయనిగ్రహము కలిగి ఉండడం, అహింసనుపాటించడం, మనస్సును నిగ్రహించడం, శుభ్రతకలిగి ఉండడం ఇవన్నీ పుణ్యతీర్ధనసేవతో సమానములే. పైగుణములు లేకుండా కేవలం నదీజలాలలో మునిగినంత మాత్రాన పుణ్యతీర్ధసేవన ఫలము దక్కదు. కేవలం శరీరము శుభ్రపడుతుంది కాని మనసు శుభ్రపడదు కదా ! దొరకని వాటి కొరకు ఆశపడకపోవడం, దొరికిన వాటితో తృప్తి చెందడం, ఎల్లప్పుడు తృప్తితో సంతృప్తితో ఉండడం, ఆశాపాశములు విడిచి పెట్టడం పాటించే నరులకు వేరు తీర్ధములు అవసరం లేదు " అని భీష్ముడు పలికాడు.

ఉత్తమ పదము

ధర్మరాజు " తాతగారు ! మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తే ఉత్తమపదము చేరుకుంటాడు. మానవుడు చనిపోయిన తరువాత ఈ దేహము విడిచి పెట్టి తనతో దేనిని సాయంగా తీసుకు వెడతాడు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు" ధర్మనందనా ! నీవు అడిగినవి నిగూఢమైనవి. వాటిని చెప్పడానికి ఒక్క బృహస్పతి మాత్రమే తగిన వాడు. ఆయన ఇక్కడకు వస్తున్నాడు. నీ సందేహములను ఆయనను అడిగి తెలుసుకో " అని భీష్ముడు చెప్పాడు. భీష్ముడు ఆ మాటలు అంటూ ఉండగానే దేవగురువు బృహస్పతి అక్కడకు వచ్చాడు. ధర్మరాజు తన తమ్ములతో సహా అతడికి ఎదురేగి బృహస్పతికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉచితాసనము మీద ఆసీనుడిని చేసి ధర్మరాజు తాను ముందు భీష్ముడిని అడిగిన ప్రశ్నను అడిగాడు. బృహస్పతి " ధర్మనందనా ! పుట్టే ముందు, చచ్చిన తరువాత, పుణ్య లోకములలోను, నరకంలోను జీవుడు ఉంటాడు. ఈ లోకంలో తల్లి, తండ్రి, భార్య, కుమారులు, కుమార్తెలు, బంధువులు స్నేహితులు శ్మశానం వరకు మాత్రమే వెళ్ళి తిరిగి పోతారు. నరుడు చనిపోయిన తరువాత అతడి ధర్మమే అతడికి తోడుగా వస్తుంది. కనుక బ్రతికి ఉన్నప్పుడే మానవుడు ధర్మకార్యములు చెయ్యాలి. అలా ధర్మకార్యములు చేయని వాడు, ధర్మము వదిలి ప్రవర్తించే వాడు, నరకానికి పోతాడు " అని పలికాడు బృహస్పతి.

జీవుడు ధర్మము

ధర్మరాజు " ఈ శరీరాన్ని వదిలపెట్టి వెళ్ళే జీవుడిని ధర్మము ఎలా అనుసరిస్తుంది ? " అని అడిగాడు. బృహస్పతి " ధర్మనందనా ! పంచభూతములు, వాటి గుణములు అయిన శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాదులూ బుద్ధి, ధర్మము జీవుడిని అనుసరించి వెడతాయి " అని పలికాడు. ధర్మరాజు " మహాత్మా ! రేతస్సు ఎలా ఏర్పడుతుంది ? " అని అడిగాడు. బృహస్పతి " ధర్మనందనా ! మానవుని శరీరము పంచభూతాత్మకము. మనస్సు దేహంలో ఉంటుంది. అన్నం దేహాన్ని పోషిస్తుంది. మానవుడిలో కలిగిన కామము రేతస్సును ఏర్పరుస్తుంది. స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీ గర్భాశయము చేరిన రేతస్సు గర్భము ధరింపచేసి పిండరూపము పొందుతుంది. అలా జన్మించిన మానవుడు తాను చేసుకున్న పుణ్యఫలముగా సుఖములు అనుభవిస్తాడు. పాపాలు చేసుకుంటే దుఃఖములు అనుభవిస్తాడు. పూర్వజన్మలో తాను చేసుకున్న పాపపుణ్యాలు ధర్మాధర్మములు అతడికి సుఖదుఃఖములు కలుగచేస్తాయి. కనుక మానవుడు సదా ధర్మకార్యములు చేయాలి. పాపకార్యములకు దూరంగాఉండాలి. పూర్వజన్మలో అధర్మము, పాపకార్యములు చేసిన వారు మానవజన్మకు బదులు పశుపక్ష్యాదులుగా క్రిమి కీటకాలుగా జన్మిస్తాడు. అదే నరకము. నరకము అంటూ వేరీది లేదు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*హం పొందండి*

కామెంట్‌లు లేవు: