23, ఫిబ్రవరి 2026, సోమవారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 

         *శ్రీ మహావిష్ణు పురాణం* 

                 ➖➖➖✍️

                    4వ భాగం 


*ఆది సృష్టి-పరమాత్మ ఆవిర్భావం* 


```

సూత మహర్షి శౌనకాది మునులకు వ్యాస మహర్షి, పరాశర మహర్షి జన్మ వృత్తాంతాలు చెప్పిన తరువాత మునులను చూసి “మునులారా! ఇప్పుడు మనం మహావిష్ణు పురాణాన్ని ప్రారంభించుకుంటున్నాము.


ఈ మహావిష్ణు పురాణాన్ని పులస్త్య బ్రహ్మ పరాశర మహర్షికి వినిపించాడు. వ్యాసమహర్షి రచించాడు. పరాశర మహర్షి వద్ద మైత్రేయుడు శిష్యరికం చేస్తూ వేద శాస్త్రాలు అభ్యసించాడు. ఒకరోజు ప్రభాత సమయంలో గురువుగారికి శుశ్రూష చేస్తూ నమస్కరించి “గురుదేవా! మీ అనుగ్రహంతో వేదాలు, సకల శాస్త్రాలు చదివాను. అభ్యసించాను. చదివిన తరువాత నా మదిలో ఒక సందేహం కలిగింది. తమరు మాత్రమే నా సందేహం తీర్చగలరు.


లోకాలన్నింటికి ఆధారభూతుడు ఎవ్వరు? ఇంద్రాది దేవతలకు ప్రభువై దేవతలను అనుక్షణం రక్షించేది ఎవ్వరు? సామాన్యుల కష్టనష్టాలు తీరుస్తూ కాపాడేది ఎవ్వరు? తన లీలాకధలతో భక్తి పరవశం కలిగించి ముక్తి నిచ్చువాడు ఎవ్వరు? ఈ సకల సృష్టి కర్త, భర్త, సంహర్త అయిన ఆ దేవుని గురించి వివరంగా తెలుపండి!” అని ప్రార్ధించాడు.


పరాశర మహర్షి సంతోషించి “మా తల్లి కోరిక మేరకు దానవ సంహారం కోసం యాగం చేసాను. ఆ యాగంలో దానవులు మంత్ర బద్దులై ఎక్కడ దాగున్నా వచ్చి యాగకుండంలో పడి చనిపోసాగారు. దానవులు మా తాత వసిష్ట మహర్షిని శరణు వేడారు. తాతగారు నా వద్దకు వచ్చి దానవ సంహార యాగం ఆపమని చెప్పారు. తాతగారి మాట పాటించి యాగం ఆపాను. దానవ సంహారం ఆగిపోవడంతో దానవ రాక్షస వంశ మూల కర్త పులస్త్య బ్రహ్మ సంతోషంతో ప్రత్యక్షమై వరం ఇచ్చారు. నేను పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు దివ్య లీలలతో నిండిన పురాణాలు ప్రబోధించమని కోరాను. నా కోరిక మన్నించి పురాణాలన్ని బోధించారు.


మైత్రేయా! నీవడిగిన ప్రశ్నలకు సందేహాలకు సమాధానం ఒక్కటే. అవ్యయము, ఆది తత్త్వము, ఆది పురుషుడు సృష్టి స్థితి లయ కర్త అయిన పరమాత్మ శ్రీ మహావిష్ణువు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేగాని “శ్రీ మహావిష్ణు పురాణం” వినాలనే కోరిక కలుగదు. దేవదేవుని అనుగ్రహంతో నీ మనస్సులో ఈ అభిలాష కలిగింది. నీవడిగిన ప్రశ్నలకు సమాధానాలన్ని మహావిష్ణు పురాణంలో లభిస్తాయి. నీకు వినిపిస్తాను. భక్తి శ్రద్థలతో సావధానంగా వినుము” అని మహావిష్ణు పురాణ ప్రవచనం ఆరంభించాడు.


మనం చూస్తున్న, చూడలేకుండా ఉన్న ఈ సమస్త విశ్వ జగత్తుకు మూలము పరమాత్మ తత్త్వము. సమస్త జగమలు ఆయనలో, ఆయన సమస్త జగములలో ఉండటం వలన ఆ పరమాత్మను వాసుదేవుడు అన్నారు. పరమాత్మ తత్త్వము నిరకారము. అనగా ఏ రూపము, ఆకారము లేనిది. కానీ తానే సకల రూపములు, ఆకారములు ధరిస్తాడు. సృష్టి చరాచరము పరమాత్మే! ఆ రూపాలు ఉపసంహరిస్తే అంతా శూన్య జగత్తు మాత్రమే ఉంటుంది.


అవ్యక్తము అయిన ఆ పరతత్త్వానికి విశ్వ సృష్టి చేయాలి అనే సంకల్పం కలిగింది. అందుకోసం నిరాకార రూపము వదలి ఆకారం ధరించాడు. ఆ రూపం మహాద్భుతంగా ఉంది. విశ్వానికి ఆత్మగా మారాడు. విశ్వమే ఆత్మగా కలిగి ఉన్నాడు. విశ్వమంతా వ్యాపించాడు. విశ్వానికి అధినాధుడై, తాను సృజించిన మహా విశ్వము తనలో ఉంచుకున్నాడు. కనుక మహా విష్ణువు అయ్యాడు


తేజోరూపముగా ఉన్న ఆ పరబ్రహ్మము జగత్తు సృష్టి స్వయంగా చేయదలచుకోలేదు. తన తేజస్సు నుండి చతుర్భుజుడైన నీలమేఘ స్వరూపుని ఆవిర్భవింప చేశాడు. ఈ నీల వర్ణానికి "కృష్" అన్నది భక్తి వాచకం, "న" అన్నది దాస్య వాచకము. అలాగే కృష్ అన్న శబ్దం సర్వవాచకం. న అన్నది బీజ వాచకం. కనుక విశ్వానికి స్రష్ట అనగా సృష్టికర్త తానే, మూల బీజము తానే. కనుక ఆ చతుర్భుజుడు పరబ్రహ్మానికి ప్రతిరూపంగా కృష్ణుడు అయ్యాడు.


పరబ్రహ్మ, మూల పురుషుడు అయిన కృష్ణునికి తాను ఒక్కడే జగత్ సృష్టి చేయలేనని భావించాడు, శక్తి రూపమైన ప్రకృతి కూడా కావాలి అని అనిపించింది. తన నుంచి రెండు రూపాలను ఆవిర్భవింప చేశాడు. దక్షిణ భాగం పురుషుడిగా, వామ భాగం స్త్రీ రూపంగా అవతరించాడు. పురుష రూపం ద్విభుజ కృష్ణుడు అయితే, శక్తి స్వరూపిణి స్త్రీ కృష్టాదేవి అయ్యింది. 


కృష్ణుడు కృష్ణాదేవి కలయికతో సృష్టి ఆరంభమైంది. బ్రహ్మ కాలమానం ప్రకారం ఒక రోజు అయితే, మానవ కాలమానం ప్రకారం అనేక కల్పాలు గడచిపోయాయి. రాసక్రీడలో కృష్ణాదేవి అలసిపోయింది. కృష్ణుడి తేజస్సు వలన ఆమె శరీర నుండి స్రవించిన స్వేదజలం, ఆమె నిట్టూర్పుల నుండి ఉత్పన్నమైన గాలి తాకిడికి విశ్వమంతా జలరాశులూగా వ్యాపించాయి. ఈ జలరాశులే సప్త సముద్రాలుగా మారాయి. ఈ జలరాశులుకు అధినేత వరుణుడు అయ్యాడు.


కృష్ణాదేవి నిట్టూర్పుల నుండి వాయువు రూపం పొంది పురుషుడయ్యాడు. కృష్ణుడి వామభాగం నుండి "ప్రాణ వల్లభ" అనే పేరుతో స్త్రీ మూర్తి అవతరించింది. వాయువుతో జత అయ్యింది. వారిరువురికి "ప్రాణ - అపాన - సమాన - ఉదాన - వ్యాన" అనే పంచ ప్రాణాలు కుమారులుగా జన్మించారు. ఈ పంచ వాయు పుత్రులు సమస్త జీవుల మనుగడకు ఆధారంగా మారాయి.✍️

తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.✍️

శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

 -సేకరణ:పెండ్యాల ఉపేంద్ర రావు

 ```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూ2224f;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀



         *శ్రీ మహావిష్ణు పురాణం* 

                 ➖➖➖✍️

                    4వ భాగం 


*ఆది సృష్టి-పరమాత్మ ఆవిర్భావం* 


```

సూత మహర్షి శౌనకాది మునులకు వ్యాస మహర్షి, పరాశర మహర్షి జన్మ వృత్తాంతాలు చెప్పిన తరువాత మునులను చూసి “మునులారా! ఇప్పుడు మనం మహావిష్ణు పురాణాన్ని ప్రారంభించుకుంటున్నాము.


ఈ మహావిష్ణు పురాణాన్ని పులస్త్య బ్రహ్మ పరాశర మహర్షికి వినిపించాడు. వ్యాసమహర్షి రచించాడు. పరాశర మహర్షి వద్ద మైత్రేయుడు శిష్యరికం చేస్తూ వేద శాస్త్రాలు అభ్యసించాడు. ఒకరోజు ప్రభాత సమయంలో గురువుగారికి శుశ్రూష చేస్తూ నమస్కరించి “గురుదేవా! మీ అనుగ్రహంతో వేదాలు, సకల శాస్త్రాలు చదివాను. అభ్యసించాను. చదివిన తరువాత నా మదిలో ఒక సందేహం కలిగింది. తమరు మాత్రమే నా సందేహం తీర్చగలరు.


లోకాలన్నింటికి ఆధారభూతుడు ఎవ్వరు? ఇంద్రాది దేవతలకు ప్రభువై దేవతలను అనుక్షణం రక్షించేది ఎవ్వరు? సామాన్యుల కష్టనష్టాలు తీరుస్తూ కాపాడేది ఎవ్వరు? తన లీలాకధలతో భక్తి పరవశం కలిగించి ముక్తి నిచ్చువాడు ఎవ్వరు? ఈ సకల సృష్టి కర్త, భర్త, సంహర్త అయిన ఆ దేవుని గురించి వివరంగా తెలుపండి!” అని ప్రార్ధించాడు.


పరాశర మహర్షి సంతోషించి “మా తల్లి కోరిక మేరకు దానవ సంహారం కోసం యాగం చేసాను. ఆ యాగంలో దానవులు మంత్ర బద్దులై ఎక్కడ దాగున్నా వచ్చి యాగకుండంలో పడి చనిపోసాగారు. దానవులు మా తాత వసిష్ట మహర్షిని శరణు వేడారు. తాతగారు నా వద్దకు వచ్చి దానవ సంహార యాగం ఆపమని చెప్పారు. తాతగారి మాట పాటించి యాగం ఆపాను. దానవ సంహారం ఆగిపోవడంతో దానవ రాక్షస వంశ మూల కర్త పులస్త్య బ్రహ్మ సంతోషంతో ప్రత్యక్షమై వరం ఇచ్చారు. నేను పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు దివ్య లీలలతో నిండిన పురాణాలు ప్రబోధించమని కోరాను. నా కోరిక మన్నించి పురాణాలన్ని బోధించారు.


మైత్రేయా! నీవడిగిన ప్రశ్నలకు సందేహాలకు సమాధానం ఒక్కటే. అవ్యయము, ఆది తత్త్వము, ఆది పురుషుడు సృష్టి స్థితి లయ కర్త అయిన పరమాత్మ శ్రీ మహావిష్ణువు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేగాని “శ్రీ మహావిష్ణు పురాణం” వినాలనే కోరిక కలుగదు. దేవదేవుని అనుగ్రహంతో నీ మనస్సులో ఈ అభిలాష కలిగింది. నీవడిగిన ప్రశ్నలకు సమాధానాలన్ని మహావిష్ణు పురాణంలో లభిస్తాయి. నీకు వినిపిస్తాను. భక్తి శ్రద్థలతో సావధానంగా వినుము” అని మహావిష్ణు పురాణ ప్రవచనం ఆరంభించాడు.


మనం చూస్తున్న, చూడలేకుండా ఉన్న ఈ సమస్త విశ్వ జగత్తుకు మూలము పరమాత్మ తత్త్వము. సమస్త జగమలు ఆయనలో, ఆయన సమస్త జగములలో ఉండటం వలన ఆ పరమాత్మను వాసుదేవుడు అన్నారు. పరమాత్మ తత్త్వము నిరకారము. అనగా ఏ రూపము, ఆకారము లేనిది. కానీ తానే సకల రూపములు, ఆకారములు ధరిస్తాడు. సృష్టి చరాచరము పరమాత్మే! ఆ రూపాలు ఉపసంహరిస్తే అంతా శూన్య జగత్తు మాత్రమే ఉంటుంది.


అవ్యక్తము అయిన ఆ పరతత్త్వానికి విశ్వ సృష్టి చేయాలి అనే సంకల్పం కలిగింది. అందుకోసం నిరాకార రూపము వదలి ఆకారం ధరించాడు. ఆ రూపం మహాద్భుతంగా ఉంది. విశ్వానికి ఆత్మగా మారాడు. విశ్వమే ఆత్మగా కలిగి ఉన్నాడు. విశ్వమంతా వ్యాపించాడు. విశ్వానికి అధినాధుడై, తాను సృజించిన మహా విశ్వము తనలో ఉంచుకున్నాడు. కనుక మహా విష్ణువు అయ్యాడు


తేజోరూపముగా ఉన్న ఆ పరబ్రహ్మము జగత్తు సృష్టి స్వయంగా చేయదలచుకోలేదు. తన తేజస్సు నుండి చతుర్భుజుడైన నీలమేఘ స్వరూపుని ఆవిర్భవింప చేశాడు. ఈ నీల వర్ణానికి "కృష్" అన్నది భక్తి వాచకం, "న" అన్నది దాస్య వాచకము. అలాగే కృష్ అన్న శబ్దం సర్వవాచకం. న అన్నది బీజ వాచకం. కనుక విశ్వానికి స్రష్ట అనగా సృష్టికర్త తానే, మూల బీజము తానే. కనుక ఆ చతుర్భుజుడు పరబ్రహ్మానికి ప్రతిరూపంగా కృష్ణుడు అయ్యాడు.


పరబ్రహ్మ, మూల పురుషుడు అయిన కృష్ణునికి తాను ఒక్కడే జగత్ సృష్టి చేయలేనని భావించాడు, శక్తి రూపమైన ప్రకృతి కూడా కావాలి అని అనిపించింది. తన నుంచి రెండు రూపాలను ఆవిర్భవింప చేశాడు. దక్షిణ భాగం పురుషుడిగా, వామ భాగం స్త్రీ రూపంగా అవతరించాడు. పురుష రూపం ద్విభుజ కృష్ణుడు అయితే, శక్తి స్వరూపిణి స్త్రీ కృష్టాదేవి అయ్యింది. 


కృష్ణుడు కృష్ణాదేవి కలయికతో సృష్టి ఆరంభమైంది. బ్రహ్మ కాలమానం ప్రకారం ఒక రోజు అయితే, మానవ కాలమానం ప్రకారం అనేక కల్పాలు గడచిపోయాయి. రాసక్రీడలో కృష్ణాదేవి అలసిపోయింది. కృష్ణుడి తేజస్సు వలన ఆమె శరీర నుండి స్రవించిన స్వేదజలం, ఆమె నిట్టూర్పుల నుండి ఉత్పన్నమైన గాలి తాకిడికి విశ్వమంతా జలరాశులూగా వ్యాపించాయి. ఈ జలరాశులే సప్త సముద్రాలుగా మారాయి. ఈ జలరాశులుకు అధినేత వరుణుడు అయ్యాడు.


కృష్ణాదేవి నిట్టూర్పుల నుండి వాయువు రూపం పొంది పురుషుడయ్యాడు. కృష్ణుడి వామభాగం నుండి "ప్రాణ వల్లభ" అనే పేరుతో స్త్రీ మూర్తి అవతరించింది. వాయువుతో జత అయ్యింది. వారిరువురికి "ప్రాణ - అపాన - సమాన - ఉదాన - వ్యాన" అనే పంచ ప్రాణాలు కుమారులుగా జన్మించారు. ఈ పంచ వాయు పుత్రులు సమస్త జీవుల మనుగడకు ఆధారంగా మారాయి.✍️

తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.✍️

శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

 -సేకరణ:పెండ్యాల ఉపేంద్ర రావు

 ```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూ2224f;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀



         *శ్రీ మహావిష్ణు పురాణం* 

                 ➖➖➖✍️

                    4వ భాగం 


*ఆది సృష్టి-పరమాత్మ ఆవిర్భావం* 


```

సూత మహర్షి శౌనకాది మునులకు వ్యాస మహర్షి, పరాశర మహర్షి జన్మ వృత్తాంతాలు చెప్పిన తరువాత మునులను చూసి “మునులారా! ఇప్పుడు మనం మహావిష్ణు పురాణాన్ని ప్రారంభించుకుంటున్నాము.


ఈ మహావిష్ణు పురాణాన్ని పులస్త్య బ్రహ్మ పరాశర మహర్షికి వినిపించాడు. వ్యాసమహర్షి రచించాడు. పరాశర మహర్షి వద్ద మైత్రేయుడు శిష్యరికం చేస్తూ వేద శాస్త్రాలు అభ్యసించాడు. ఒకరోజు ప్రభాత సమయంలో గురువుగారికి శుశ్రూష చేస్తూ నమస్కరించి “గురుదేవా! మీ అనుగ్రహంతో వేదాలు, సకల శాస్త్రాలు చదివాను. అభ్యసించాను. చదివిన తరువాత నా మదిలో ఒక సందేహం కలిగింది. తమరు మాత్రమే నా సందేహం తీర్చగలరు.


లోకాలన్నింటికి ఆధారభూతుడు ఎవ్వరు? ఇంద్రాది దేవతలకు ప్రభువై దేవతలను అనుక్షణం రక్షించేది ఎవ్వరు? సామాన్యుల కష్టనష్టాలు తీరుస్తూ కాపాడేది ఎవ్వరు? తన లీలాకధలతో భక్తి పరవశం కలిగించి ముక్తి నిచ్చువాడు ఎవ్వరు? ఈ సకల సృష్టి కర్త, భర్త, సంహర్త అయిన ఆ దేవుని గురించి వివరంగా తెలుపండి!” అని ప్రార్ధించాడు.


పరాశర మహర్షి సంతోషించి “మా తల్లి కోరిక మేరకు దానవ సంహారం కోసం యాగం చేసాను. ఆ యాగంలో దానవులు మంత్ర బద్దులై ఎక్కడ దాగున్నా వచ్చి యాగకుండంలో పడి చనిపోసాగారు. దానవులు మా తాత వసిష్ట మహర్షిని శరణు వేడారు. తాతగారు నా వద్దకు వచ్చి దానవ సంహార యాగం ఆపమని చెప్పారు. తాతగారి మాట పాటించి యాగం ఆపాను. దానవ సంహారం ఆగిపోవడంతో దానవ రాక్షస వంశ మూల కర్త పులస్త్య బ్రహ్మ సంతోషంతో ప్రత్యక్షమై వరం ఇచ్చారు. నేను పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు దివ్య లీలలతో నిండిన పురాణాలు ప్రబోధించమని కోరాను. నా కోరిక మన్నించి పురాణాలన్ని బోధించారు.


మైత్రేయా! నీవడిగిన ప్రశ్నలకు సందేహాలకు సమాధానం ఒక్కటే. అవ్యయము, ఆది తత్త్వము, ఆది పురుషుడు సృష్టి స్థితి లయ కర్త అయిన పరమాత్మ శ్రీ మహావిష్ణువు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేగాని “శ్రీ మహావిష్ణు పురాణం” వినాలనే కోరిక కలుగదు. దేవదేవుని అనుగ్రహంతో నీ మనస్సులో ఈ అభిలాష కలిగింది. నీవడిగిన ప్రశ్నలకు సమాధానాలన్ని మహావిష్ణు పురాణంలో లభిస్తాయి. నీకు వినిపిస్తాను. భక్తి శ్రద్థలతో సావధానంగా వినుము” అని మహావిష్ణు పురాణ ప్రవచనం ఆరంభించాడు.


మనం చూస్తున్న, చూడలేకుండా ఉన్న ఈ సమస్త విశ్వ జగత్తుకు మూలము పరమాత్మ తత్త్వము. సమస్త జగమలు ఆయనలో, ఆయన సమస్త జగములలో ఉండటం వలన ఆ పరమాత్మను వాసుదేవుడు అన్నారు. పరమాత్మ తత్త్వము నిరకారము. అనగా ఏ రూపము, ఆకారము లేనిది. కానీ తానే సకల రూపములు, ఆకారములు ధరిస్తాడు. సృష్టి చరాచరము పరమాత్మే! ఆ రూపాలు ఉపసంహరిస్తే అంతా శూన్య జగత్తు మాత్రమే ఉంటుంది.


అవ్యక్తము అయిన ఆ పరతత్త్వానికి విశ్వ సృష్టి చేయాలి అనే సంకల్పం కలిగింది. అందుకోసం నిరాకార రూపము వదలి ఆకారం ధరించాడు. ఆ రూపం మహాద్భుతంగా ఉంది. విశ్వానికి ఆత్మగా మారాడు. విశ్వమే ఆత్మగా కలిగి ఉన్నాడు. విశ్వమంతా వ్యాపించాడు. విశ్వానికి అధినాధుడై, తాను సృజించిన మహా విశ్వము తనలో ఉంచుకున్నాడు. కనుక మహా విష్ణువు అయ్యాడు


తేజోరూపముగా ఉన్న ఆ పరబ్రహ్మము జగత్తు సృష్టి స్వయంగా చేయదలచుకోలేదు. తన తేజస్సు నుండి చతుర్భుజుడైన నీలమేఘ స్వరూపుని ఆవిర్భవింప చేశాడు. ఈ నీల వర్ణానికి "కృష్" అన్నది భక్తి వాచకం, "న" అన్నది దాస్య వాచకము. అలాగే కృష్ అన్న శబ్దం సర్వవాచకం. న అన్నది బీజ వాచకం. కనుక విశ్వానికి స్రష్ట అనగా సృష్టికర్త తానే, మూల బీజము తానే. కనుక ఆ చతుర్భుజుడు పరబ్రహ్మానికి ప్రతిరూపంగా కృష్ణుడు అయ్యాడు.


పరబ్రహ్మ, మూల పురుషుడు అయిన కృష్ణునికి తాను ఒక్కడే జగత్ సృష్టి చేయలేనని భావించాడు, శక్తి రూపమైన ప్రకృతి కూడా కావాలి అని అనిపించింది. తన నుంచి రెండు రూపాలను ఆవిర్భవింప చేశాడు. దక్షిణ భాగం పురుషుడిగా, వామ భాగం స్త్రీ రూపంగా అవతరించాడు. పురుష రూపం ద్విభుజ కృష్ణుడు అయితే, శక్తి స్వరూపిణి స్త్రీ కృష్టాదేవి అయ్యింది. 


కృష్ణుడు కృష్ణాదేవి కలయికతో సృష్టి ఆరంభమైంది. బ్రహ్మ కాలమానం ప్రకారం ఒక రోజు అయితే, మానవ కాలమానం ప్రకారం అనేక కల్పాలు గడచిపోయాయి. రాసక్రీడలో కృష్ణాదేవి అలసిపోయింది. కృష్ణుడి తేజస్సు వలన ఆమె శరీర నుండి స్రవించిన స్వేదజలం, ఆమె నిట్టూర్పుల నుండి ఉత్పన్నమైన గాలి తాకిడికి విశ్వమంతా జలరాశులూగా వ్యాపించాయి. ఈ జలరాశులే సప్త సముద్రాలుగా మారాయి. ఈ జలరాశులుకు అధినేత వరుణుడు అయ్యాడు.


కృష్ణాదేవి నిట్టూర్పుల నుండి వాయువు రూపం పొంది పురుషుడయ్యాడు. కృష్ణుడి వామభాగం నుండి "ప్రాణ వల్లభ" అనే పేరుతో స్త్రీ మూర్తి అవతరించింది. వాయువుతో జత అయ్యింది. వారిరువురికి "ప్రాణ - అపాన - సమాన - ఉదాన - వ్యాన" అనే పంచ ప్రాణాలు కుమారులుగా జన్మించారు. ఈ పంచ వాయు పుత్రులు సమస్త జీవుల మనుగడకు ఆధారంగా మారాయి.✍️

తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.✍️

శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

 -సేకరణ:పెండ్యాల ఉపేంద్ర రావు

 ```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖డా నేర్పండి.

          ➖▪️➖డా నేర్పండి.

          ➖▪️➖

కామెంట్‌లు లేవు: