🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*బుధవారం 11 మార్చి 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
1️⃣6️⃣1️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*161 వ రోజు*
*వన పర్వము సప్తమాశ్వాసము*
*యక్షుడు ధర్మరాజును పరీక్షించుట*```
ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు.
“ధర్మరాజా! నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తి పరిచావు. నీ తమ్ములలో ఒకరి ప్రాణం తిరిగి ఇచ్చెదను కోరుకొనుము” అన్నాడు.
ధర్మరాజు “మహాత్మా! నా తమ్ముడు నకులునకు ప్రాణములు తిరిగి ఇమ్ము” అన్నాడు.
యక్షుడు “అదేమిటి భీమార్జునులను వదిలి నకులుని కోరుకున్నావు” అని అడిగాడు.
ధర్మరాజు “అయ్యా! నా తల్లి కుంతీదేవి కుమారులలో నేను జీవించి ఉన్నాను. మా తండ్రి రెండవ భార్య మాద్రి పుత్రులలో నకులుడు పెద్దవాడు. అందుకని అతనిని కోరుట ధర్మం కదా?” అన్నాడు.
యక్షుడు “ధర్మరాజా నీ ధర్మ నిరతికి మెచ్చాను. నీ తమ్ములు అందరూ పునరుజ్జీవితులు కాగలరు” అని వరం ఇచ్చాడు.
వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్లు లేచారు.
ధర్మరాజు “మహాత్మా! నీవు మామూలు యక్షుడవు కావు. నీ వెవరో ఎరిగింపుము” అని ప్రార్థించాడు.```
*యక్షుని నిజ రూపం*```
యక్షుడు “ధర్మరాజా! నేను యమధర్మరాజును. నిన్ను చూడవలెనని కోరిక కలిగి వచ్చాను. సత్యము, సౌచము, దానము, తపము, శమము, కీర్తి, వివేకము నా యొక్క మూర్తులు. పైగుణములను ఆశ్రయించిన వారు దుర్గతిని పొందరు. నీవు కోరిన వరాలు ఇస్తాను కోరుకో!” అన్నాడు యమధర్మరాజు.
ధర్మరాజు “యమధర్మరాజా! నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుని అరణిని ఒక లేడి అపహరించింది. దానిని తిరిగి ప్రసాదింపుము” అని అడిగాడు.
యమధర్మరాజు “ధర్మరాజా! నేనే ఆ లేడిని, నీ మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ఆ అరణిని నేనే తీసుకు వచ్చాను, ఇదిగో అరణి తీసుకో” అని అరణిని తిరిగి ఇచ్చాడు.
యమధర్మరాజు “పాండవులారా! మీకు పన్నెండేళ్ళు అరణ్యవాసం పూర్తి అయింది. ఇక ఒక సంవత్సరం అజ్ఞాత వాసం మిగిలి ఉంది. అజ్ఞాత వాస సమయంలో మీకు ఏరూపాలు కోరితే ఆరూపాలు వస్తాయి. మిమ్మల్ని ఎవరూ గుర్తింపకుండా వరం ఇస్తాను. మరొక వరం కోరుకో!” అన్నాడు.
ధర్మరాజు “దేవతలలో ఆది దేవుడవైన నీ దర్శనం కంటే నాకు కావలసినది ఏముంది. నా మనస్సు ఎల్లప్పుడూ ధర్మమార్గాన చరించేలా, క్రోధము, మోహం వంటి దుర్గుణాలు నా దరి చేరకుండా వరం ప్రసాదించు!” అన్నాడు.
యమధర్మరాజు అలాగే వరం ఇచ్చి అంతర్ధానం అయ్యాడు.
ధర్మరాజు అరణిని బ్రాహ్మణునికి ఇచ్చి అతని ఆశీర్వాదం పొందారు.
ఆ ప్రకారం పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేసారు.```
*వన పర్వము సమాప్తం*
*వన పర్వము సప్తమాశ్వాసము సమాప్తం*
*(సశేషం)*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి