శ్లో. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !!
వాగర్థావివ = వాక్కు, అర్థముల వలె, సంపృక్తౌ = కూడియున్న
వారును, జగతః = ఈ జగత్తునకు, పితరౌ = తల్లి దండ్రులును
అయిన, పార్వతీ పరమేశ్వరౌ = పార్వతీ పరమేశ్వరులను, వాగర్థ =
వాక్కుల, అర్థముల, ప్రతిపత్తయే = సంప్రాప్తి కొఱకు , వందే =
నమస్కరిస్తున్నాను.
అర్థం: మాటలు, వాని అర్ధముల ఙ్ఞానము కొరకు, వాటి వలెనే
ఎప్పుడూ కలిసియుండెడి, జగత్తునకు తల్లిదండ్రులైన పార్వతీ
పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను.
మహాకవి కాళిదాసు 'రఘువంశం' కావ్యానికి మొదట ఈ
మంగళ శ్లోకం రచించాడు. జగత్తుకు అనగా ప్రపంచానికి
పార్వతీపరమేశ్వరులు తలిదండ్రులవలె ఉన్నారు, అని
ఆ మహాకవి అన్నాడు.
ఇదేవిధంగా శంకర భగవత్ పాదులు కూడా 'మాతా చ
పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః, బాంధవా శ్శివభక్తాశ్చ
స్వదేశో భువనత్రయమ్' అని ఒకచోట నిర్ధారించారు.
*సేకరణ*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి