🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
మన కష్టాలను మనం స్వబుద్ధితో తొలగించుకోలేము.అలా తొలగించుకోగలిగితే వార్థక్యం, మరణం కూడా రాకుండా చేసుకోవచ్చు గదా !
అందువలన అన్ని సమస్యలకు పరిష్కారం ఈశ్వర శరణాగతే అంటున్నారు
శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు,
శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో.
శ్లో// ఆయుర్నశ్యతి పశ్యాతాం ప్రతిదినం, యాతి క్షయం యౌవ్వనం/
ప్రత్యాయాంతి గతాః పునర్నదివాసా: కాలో జగద్భక్షకః/
లక్ష్మీ స్తోయతరంగ భఙ్గ చపలా, విద్యుచ్చలం జీవితం/
తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాథునా//
(ప్రతి దినమూ చూస్తుండగానే ఆయుర్దాయము తగ్గిపోతున్నది.
భోగానుభవమునకు సమర్థమైన యౌవనం గతించి,అన్ని దుఃఖములకు స్థానమైన వార్ధక్యం వస్తోంది.
ఎన్ని భోగాలు అనుభవించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు గడించినా, ఆ గడిచి పోయిన రోజులు తిరిగి రావు.
కాలపురుషుడు అన్నింటినీ నశింపజేస్తున్నాడు. ఐశ్వర్యము నీటి తరంగం లాగా అశాశ్వతమైనది.
జీవితంకూడా మెరుపుతీగెవలె క్షణికమైనది.
నాది, నావాళ్ళు, అనుకొనే సమస్తముతోను వియోగాన్ని పొందించి దుఃఖం పాలుజేసే మరణం ఏ క్షణంలో సంభవిస్తుందో తెలియదు.
ఓ ఈశ్వరా! అందువల్ల నిన్నే శరణువేడుకుంటున్నాను.
దయతో నన్ను రక్షించు.
ఎప్పుడోకాదు, ఇప్పుడే రక్షించు).
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
20-2-'26.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి