20, ఫిబ్రవరి 2026, శుక్రవారం

మన కష్టాలను మనం

 


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏




మన కష్టాలను మనం స్వబుద్ధితో తొలగించుకోలేము.అలా తొలగించుకోగలిగితే వార్థక్యం, మరణం కూడా రాకుండా చేసుకోవచ్చు గదా ! 

అందువలన అన్ని సమస్యలకు పరిష్కారం ఈశ్వర శరణాగతే అంటున్నారు 

శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు, 

శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో.


శ్లో// ఆయుర్నశ్యతి పశ్యాతాం ప్రతిదినం, యాతి క్షయం యౌవ్వనం/

ప్రత్యాయాంతి గతాః పునర్నదివాసా: కాలో జగద్భక్షకః/

లక్ష్మీ స్తోయతరంగ భఙ్గ చపలా, విద్యుచ్చలం జీవితం/

తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాథునా//


(ప్రతి దినమూ చూస్తుండగానే ఆయుర్దాయము తగ్గిపోతున్నది.

భోగానుభవమునకు సమర్థమైన యౌవనం గతించి,అన్ని దుఃఖములకు స్థానమైన వార్ధక్యం వస్తోంది.

ఎన్ని భోగాలు అనుభవించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు గడించినా, ఆ గడిచి పోయిన రోజులు తిరిగి రావు. 

కాలపురుషుడు అన్నింటినీ నశింపజేస్తున్నాడు. ఐశ్వర్యము నీటి తరంగం లాగా అశాశ్వతమైనది.

జీవితంకూడా మెరుపుతీగెవలె క్షణికమైనది.

నాది, నావాళ్ళు, అనుకొనే సమస్తముతోను వియోగాన్ని పొందించి దుఃఖం పాలుజేసే మరణం ఏ క్షణంలో సంభవిస్తుందో తెలియదు. 

ఓ ఈశ్వరా! అందువల్ల నిన్నే శరణువేడుకుంటున్నాను.

దయతో నన్ను రక్షించు.

 ఎప్పుడోకాదు, ఇప్పుడే రక్షించు).


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

20-2-'26.

కామెంట్‌లు లేవు: