7, మే 2025, బుధవారం

నిమిత్త మాత్రులం

 *🙏🏻🙏🏻🙏🏻జై శ్రీ సంతోషిమాత 🙏🏻🙏🏻🙏🏻*


💎 *ఒక రోజు హనుమంతుడు శ్రీరాముణ్ణి కలుసుకున్నాడు. తన మనసులో కదులుతున్న ఆలోచనలను విన్నవించుకున్నాడు. "ప్రభూ! ఒక వేళ నేను లంకకు వెళ్ళకపోతే నా జీవితంలో ఎంతో పెద్ద లోపం మిగిలిపోయేది. అన్నిటికంటే ముందు విభీషణుడి ఇంటిని నేను చూశాను "ఈ రావణ లంకలో సాధువులు కూడా ఉంటారా" అనుకున్నాను. నేను లంకలో సీతాదేవిని వెతక లేకపోతే విభీషణుణ్ణి కలిసినప్పుడు ఉపాయం చెప్పాడు.*💎


              *నేను ఎంత ప్రయత్నించినా తెలియని విషయం లంకలో ఉన్న ఆ సాధువు ద్వారానే నాకు తెలిసింది ప్రభూ! బహుశా ఈ దృశ్యం చూపించడానికే ఇక్కడకు నన్ను పంపిచారేమో! అశోక వాటికలో రావణుడు వచ్చినప్పుడు ఆయన క్రోధంతో కత్తి దూసి సీతమ్మను చంపబోతుంటే, నాకు ఒక్కసారిగా దూకి, ఆ కత్తిని లాక్కొని, అతని తల ఖండించా లనిపించింది.*💎


        🔔 *కాని మరుక్షణమే మండోదరి రావణాసురుని చెయ్యి పట్టుకుని ఆపింది. ఆ దృశ్యం చూసి నేను పులకరించిపోయాను. ఓ తండ్రీ! మీరు ఎంతమంచి పాఠాన్ని నేర్పించారు! ఒకవేళ నేను సీతమ్మను రక్షించి ఉంటే "నేను లేకపోతే ఏమయ్యేది" అనే భ్రమ ఏర్పడేది. చాలమందికి "నేను లేకపోతే ఎలా?" అనే ఇలాంటి భ్రమ ఏర్పడుతుంది. నాకు కూడా అదే జరిగేది. ప్రభూ!*🔔


            *మీరు సీతమ్మను రక్షించడమే కాదు, ఆ పనిని రావణుడి భార్యకే అప్పగించారు. సీతమ్మకు ఏమవుతుందనే చింత, భయం నాకు తొలగిపోయాయి. అలాగే, త్రిజట లంకలోకి కోతి వచ్చిందని చెప్పింది. నాకు త్రిజట కూడా ఒక గొప్ప సాధ్విని అనిపించింది. ఈ కోతి లంకను తగుల బెడుతుందని చెప్పింది. కాని మరి "నా శ్రీరాముడు లంకను తగుల బెట్టమని చెప్పలేదు కదా? ఎలా?" అని ఆలోచనలో పడిపోయాను.*🔔


       🤔 *రావణాసురుడి సభలో నేను బంధితుణ్ణి అయితే ఎలా ఉంటుందో చూడ్డానికి బందీని అయ్యాను. రావణుడి సైనికులు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నన్ను రక్షించుకోవడానికి నేను ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. కాని దూతను చంపడం సరికాదని విభీషణుడు చెప్పాడు. నన్ను రక్షించడానికి ఈ ఉపాయం మీరే చేశారని నాకు అర్థమయింది.*🙂


            *ముందు విభీషణుణ్ణి నాకు చూపి నా భ్రమను తొలగించారు. సీతమ్మను రక్షించడానికి మండోదరిని నియమించారు. నన్ను రక్షించడానికి రావణుడి తమ్ముణ్ణి పంపించారు. ప్రభూ! అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం...రావణుడు " కోతిని చంపకూడదు. కాని దాని తోకకు నూనెలో ముంచిన వస్త్రాన్ని చుట్టి నిప్పు అంటించవచ్చు" అన్నాడు. ఆ విధంగా లంకలో త్రిజట చెప్పిన మాట సత్యమయింది. "లంకను తగులబెట్టడానికి నూనెనూ, నిప్పునూ నేను ఎక్కడినుంచి తీసుకురాగలను" అనుకున్నాను. కానీ ఆ ఏర్పాట్లు కూడా రావణాసురుడే చేశాడు. రావణుడితో కూడా మీరు పని చేయించు కున్నప్పుడు నాతో చేయించు కోవడం పెద్ద విషయమేమీ కాదు" అన్నాడు వినయంగా.*


          *అందుకే ఈ ప్రపంచంలో ఏది జరుగుతున్నా అది కర్మసిద్ధాంతం ప్రకారమే, దైవ సంకల్సం తోనే. మనం కేవలం "నిమిత్త మాత్రులం" అని గుర్తుంచుకోవాలి*👍🏼🔔🙏🏼🙏🏼.. *ఆంధ్ర ఫోకస్✍️*సర్వేజనా సుఖినోభవంతు🙏🏻🙏🏻*

జై గణేష్

 జై గణేష్

ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః

శుభోదయం.


శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే


ఓం గం గణపతయే నమః


అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః 

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః 


ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః 

వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః 


షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి 

విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా 

సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య


శ్రీ గురుభ్యోన్నమః


గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।

గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ।।


సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం

అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం


పూజ్యాయ రాఘవేంద్రాయ, సత్య ధర్మ రతాయచ, భజతాం కల్పవృక్షాయ, నమతాం కామధేనువే.


లోకాః సమస్తాః సుఖినోభవంతు ॥

శుభమస్తు, 

ఓం శాంతి.. శాంతి.. శాంతిః

ఇద్దరే బలవంతులు

 *ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను అంటుంది🌲*


*కాళిదాసు*


*🌻మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు. మిట్టమధ్యాహ్న సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.*


*🌻ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది. ఆమెను చూసి బాలికా! నాకు దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వమని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక,‘మీరెవరో నాకు తెలియదు నీళ్లు ఎలా ఇచ్చేదను’అని బదులిచ్చింది.*


*🌻కాళిదాసు ‘నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? పెద్ద పండితుడను ఎవరిని అడిగినా చెబుతారు’అని అన్నాడు. అహంకార పూరితమైన ఆ మాటలు విని బాలిక నవ్వి,మీరు అసత్యమాడుతున్నారు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది.*


*🌻అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి. ‘నాకు తెలియదు గొంతు ఎండిపోతోంది ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు. ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం.*


*🌻ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు? అని అడుగుతుంది బాలిక. ‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు. మళ్లీ అసత్యమాడుతున్నారు. బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి.*


*🌻మీరేమో అలిసిపోయారు కదా, ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు. వారే సూర్యచంద్రులు! అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.*


*🌻దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందే నిలబడి, ‘మాతా నీళ్లు ఇవ్వండి దాహంతో చనిపోయేలా ఉన్నాను’ అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి ‘మీరెవరో సెలవివ్వండి నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా ‘నేను అతిథిని!’ అని బదులిచ్చాడు.*


*🌻మీరు అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు. ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు అంటుంది. కాళిదాసు ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు. కానీ ఆమె మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఉన్నారు. ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు? అని అడిగింది.*


*🌻ఓపిక నశించిన కాళిదాసు, ‘నేను మూర్ఖుడను ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు. ఆ అవ్వ నవ్వుతూ, ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు, అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది.*


*🌻ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. ‘కాళిదాసా! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా! కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’ అని జలమును అనుగ్రహిస్తుంది.*


*🌻విద్య, అధికారం, ధన బలముతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి.*


🙏ఓంనమఃశివాయ హరహరమహదేవశంభోశంకర🙏

6, మే 2025, మంగళవారం

వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు

 అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు


ఇంట్లో వంట ఆగిపోవడంతో అమెరికాలో ఏం జరిగింది?


1980ల నాటి ప్రఖ్యాత అమెరికన్ ఆర్థికవేత్తలు, కుటుంబంలో బయటి నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేస్తే, దేశంలో కుటుంబ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతుందని అమెరికన్ ప్రజలను హెచ్చరించారు.


కుటుంబ సభ్యులకు బదులు బయటి నుంచి వచ్చే పిల్లల పెంపకానికి ఏర్పాట్లు చేస్తే పిల్లల మానసిక వికాసానికి, కుటుంబానికి కూడా ప్రాణాపాయం తప్పదని రెండో హెచ్చరికతో పాటు.


కానీ చాలా తక్కువ మంది మాత్రమే అతని సలహాను పాటించారు. ఇంట్లో వంట చేయడం దాదాపు ఆగిపోయింది మరియు ఆర్డర్ చేయడం (ఇది ఇప్పుడు ఆచారం) అమెరికన్ కుటుంబం అంతరించిపోయేలా చేసింది, నిపుణులు హెచ్చరించారు.


ఇంట్లో వంట చేయడం అంటే కుటుంబ సభ్యులతో ప్రేమగా కనెక్ట్ అవ్వడం.


వంట అంటే కేవలం ఆహారాన్ని వండడమే కాదు. బదులుగా, కుటుంబ సంస్కృతి కేంద్ర బిందువు.


ఇంట్లో కిచెన్ లేదు, ఒకే బెడ్ రూమ్ ఉంటే అది ఇల్లు కాదు, హాస్టల్.


ఇప్పుడు తమ వంటగదిని మూసివేసి, పడకగది ఒక్కటే సరిపోతుందని భావించిన అమెరికన్ కుటుంబాలు ఎలా ఉంటాయి?


1971-72లో, దాదాపు 72% అమెరికన్ కుటుంబాలు భార్యాభర్తలు, వారి పిల్లలతో నివసిస్తున్నారు.


2020 నాటికి, ఈ సంఖ్య 22%కి తగ్గింది.


2-ఇంతకుముందు సహజీవనం చేసిన కుటుంబాలు ఇప్పుడు వృద్ధాశ్రమంలో (వృద్ధాశ్రమం) నివసిస్తున్నాయి.


3- అమెరికాలో, 15% మహిళలు అణు కుటుంబాలలో నివసిస్తున్నారు.


4-12% మంది పురుషులు కూడా న్యూక్లియర్ కుటుంబాలుగా జీవిస్తున్నారు.


USలో 5-19% కుటుంబాలు ఒకే తండ్రి లేదా తల్లికి చెందినవి.


ప్రస్తుతం అమెరికాలో పుట్టిన పిల్లల్లో 6- 38% మంది పెళ్లికాని మహిళలకు జన్మించారు.వారిలో సగం మంది బాలికలు, కుటుంబ రక్షణ లేకుండా చిన్నవయసులోనే శారీరక వేధింపులకు గురవుతున్నారు.


యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 52% మొదటి వివాహాలు విడాకులతో ముగుస్తాయి.


8- 67% రెండవ వివాహాలు కూడా సమస్యాత్మకమైనవి.


వంటగది మరియు పడకగది మాత్రమే లేకపోతే అది పూర్తి ఇల్లు కాదు.


వివాహ వ్యవస్థ విచ్ఛిన్నానికి యునైటెడ్ స్టేట్స్ ఒక ఉదాహరణ.


మన ఆధునికవాదులు కూడా అమెరికాలో లాగా దుకాణాల నుండి లేదా ఆన్‌లైన్‌లో ఆహారాన్ని కొనుగోలు చేయడాన్ని సమర్థిస్తున్నారు మరియు మేము వంట సమస్య నుండి విముక్తి పొందామని సంతోషిస్తున్నారు. దీనివల్ల భారత్‌లోని కుటుంబాలు కూడా అమెరికా కుటుంబాల మాదిరిగానే మెల్లమెల్లగా నాశనమవుతున్నాయి.


కుటుంబాలు నాశనం అయినప్పుడు, మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండూ క్షీణిస్తాయి. అనవసరమైన ఖర్చుతో పాటు, బయటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరం లావుగా మారి ఇన్‌ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.


ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం చాలా అవసరం.


అందుకే బయట తిండికి దూరంగా ఉండమని మా ఇంటి పెద్దలు సలహా ఇచ్చేవారు.


అయితే ఈరోజు మనం నా కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌లో తింటాము...",


Swiggy మరియు Zomato ద్వారా తెలియని వ్యక్తులు (వివిధ రసాయనాలతో) వండిన ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం మరియు తినడం ఉన్నత విద్యావంతులు, మధ్యతరగతి ప్రజలలో కూడా ఫ్యాషన్‌గా మారుతోంది.


ఈ అలవాటు దీర్ఘకాలిక విపత్తుగా మారుతుంది.


ఈ రోజు మనం మన ఆహారాన్ని నిర్ణయించడం లేదు, దీనికి విరుద్ధంగా ఆన్‌లైన్ కంపెనీలు మనం ఏమి తినాలో మానసికంగా ప్రకటనల ద్వారా నిర్ణయిస్తాయి.


మన పూర్వీకులు ఆరోగ్యంగా మరియు దీర్ఘకాలం జీవించారు ఎందుకంటే వారు ప్రయాణానికి వెళ్ళే ముందు కూడా వండిన తాజా ఆహారాన్ని ఇంటికి తీసుకెళ్లేవారు.


అందుకే ఇంట్లోనే తయారు చేసుకొని కలిసి తినండి. పౌష్టికాహారం కాకుండా, ప్రేమ మరియు ఆప్యాయత ఉంటుంది.


ఈ సందేశాన్ని కనీసం 5 గ్రూపులకు పంపాలి


కొంతమంది పంపరు కానీ మీరు ఖచ్చితంగా పంపుతారని నేను నమ్ముతున్నావ


(వాట్సప్ సేకరణ)

దేవుని మరువ రాదు*

 *దేవుని మరువ రాదు*

మనం ఎంత తెలివైన వారమైనా, భగవంతుని దయ లేకుండా మనము చేపట్టిన పని విజయవంతం కాదని మనం అంటాము.  అందుకే, మన పూర్వీకులు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు.  

 వ్యక్తి జీవితం రథం లాంటిది.రథానికి రెండు వైపులా రెండు చక్రాలు అవసరం.ఆ చక్రాలలో ఏదైనా ఒకటి లేకపోయినా, రథం కదలదు. అలాగే, మానవ జీవిత రథానికి రెండు చక్రాలు ఏమిటని మనం అడిగితే, ఒకటి మన ప్రయత్నం, మరొకటి భగవంతుని దయ. మన జీవిత రథం ఈ రెండు చక్రాలపైనే కదులుతుంది. మనం మన రథాన్ని ఒకే చక్రంతో నడపాలని చూస్తాము.  అది సాధ్యం కాదు.  

అందుకే కొంతమంది అదృష్టాన్ని నమ్మరు, "నేను మనసు పెడితే ఏదైనా సాధించగలను" అనే అహంకారం కలిగి ఉంటారు.ఇది తప్పు, కొంతమంది ఆలోచిస్తారు, "నాకు దేవుని దయ ఉంటే, ప్రతిదీ జరుగుతుంది, నేను దాని కోసం ఎందుకు కష్టపడాలి?"  జాత్యం (జడత్వం) అనే స్వభావం ఉంటుంది.

ఇది కూడా తప్పు.  మీరు ప్రయత్నం చేస్తే, దేవుని కృప మీకు తోడుగా (సహాయకుడిగా) ఉంటుంది, కానీ మీరు ప్రయత్నమే చేయకుండా దేవుని కృప మాత్రమే సరిపోతుందని చెప్పకుండా మీరు కూర్చుంటే, ఆ పని జరగదు.  కాబట్టి, మనం ఎంత తెలివైన వారమైనా, దేవుడిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయనను నిత్యం స్మరిస్తూ, ఆరాధిస్తూనే ఉండాలి.ఆయన కృపకు పాత్రులు కావాలి.

*— జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు*

4, మే 2025, ఆదివారం

జానపదసాహిత్యం

 జానపదసాహిత్యం ----స్త్రీల పాటలు

   🙏🙏🙏 మొదటి భాగము 

జానపద సాహిత్యంలో స్త్రీల పాటలకు విశేష ప్రాధాన్యం కలదు.జానపద సాహిత్యం అంటేనే స్త్రీల పాటలు అనే అర్ధం స్థిర పడింది.

జీవిత ప్రవాహంలో ప్రతి సందర్భంలోను స్త్రీల పాటలు చోటు చేసుకున్నాయి. జానపదుల జీవితమే సాహిత్యం అయింది.

జానపద సాహిత్యమున గేయ, వచన, రూపకము అను మూడు ప్రధాన శాఖలున్నవి. గేయశాఖ కథా సహితమనియు, కథారహిత మనియు రెండు విధములు. కథా సహితమైన గేయములను కథాగేయములనియు, కథా రహితమైన గేయములను జానపద గేయములని, పల్లె పాటలని అంటారు. ఒకప్పుడు రేడియో లో రోజూ పల్లెపాటలు అనీ జానపద గేయాలని వినిపిస్తూ ఉండేవారు. ఇప్పుడు టీవీలు వచ్చిన తరువాత సంవత్సరానికి ఏదో ఒక్క రోజు మొక్కుబడి వినిపిస్తున్నారు.జానపద కవిత్వంలో గేయానిదే అగ్రస్థానం . గేయరూపంలో భావ ప్రధానంగా వెలువడే ఆశురచన జానపద గేయం.

. బ్రతుకులోని ఆనందాన్ని , విషాదాన్ని జానపదుడు తన జానపద గేయంగా రూపొందించాడు . ఒకరి చెవి నుండి మరొకరికి మౌఖిక ప్రసరంలో వ్యాపించిన సామాన్య ప్రజాసమూహ గీతాలే జానపదగేయాలు. సంగీత సాహిత్యాలతో కూడిన నిరక్షరాస్యుని భావగీతం జానపద గేయం. జానపదులు పనులు చేసేటప్పుడు కష్టము కనబడకుండా ఉండడము కోసం అప్రయత్నముగా కూనిరాగాలు తీయడం ఏవో ఏవో మాటలు లయతో అనడము సంభవిస్తుంది. పొలాల దగ్గర పనిచేసేవాళ్ళు, బండ్లు లాగేవాళ్ళు, కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు పాటలు పాడటం వింటూనే ఉంటాం. అలా ఏర్పడినవే జానపద గేయాలు. వేట ఆదిమానవుని ప్రధాన వృత్తి. వేటాడిన తర్వాత వేట ద్వారా కలిగిన భావోద్వేగంతో నృత్యాలు చేస్తూ మాట్లాడిన భాష లయబద్ధంగా వుండేదని ఊహించవచ్చు. ఆదిమానవులు తమ సుఖదుఃఖాలను మానవాతీత శక్తులకు విన్నవించు కునేటప్పుడు లయాత్మక గీతాలు ఆలపించి ఉండవచ్చు.

మహాభారతంలో నన్నయ వాడిన సీసము, గీతము, మధ్యాక్కర, తరువోజులను జానపద గేయాలుగా పేర్కొనవచ్చు. నన్నెచోడుడు కుమారసంభవంలో గౌడు గీతములు, రోకటి పాటలు, అంకమాలికలు, మొదలగువాటిని పేర్కొన్నాడు. పాల్కురికి సోమన బసవపురాణంలో అతీత బసవపురాతన భక్తగీతార్థ సమితియే మాతృకగా రచించినట్లు చెప్పాడు. పండితారాధ్య చరిత్రలో తుమ్మెద పదములు, పర్వత పదములు, వ్రాలేశు పదములు, వెన్నెల పదములు, నివాళి పదములు, రోకటి పాటలు మొ||వాటిని పేర్కొన్నారు.

సీతమ్మ వారి సమర్త పాట మరియు రోకటి పాట

 

సువ్వి రామచంద్ర సువ్వి సువ్వి కీర్తిసాంద్ర సువ్వి

సువ్వి సీతమ్మ మాకు శుభములిమ్మా॥


సృష్టిలో సీతమ్మ సమర్త కొట్నాలు దంచ

వేడ్కతో పేరంటాండ్రు వేగవచ్చిరీ ॥సు॥


పసిడిరోకళ్ళు బట్టి పద్మకుఖులు సువ్విదంచ

కనుల పండుగాయె కౌసల్య కప్పుడు

ఘల్లు ఘల్లుమనుచు హస్త కంకణమ్ము లెల్ల కదల

కొబ్బరీ బెల్లమ్ము కోరిదంచిరీ॥


నువ్వులా పప్పుదంచి నూటికీ పంచిబెట్ట

ఘనముగా పేరంటాండ్రు కలసి దంచిరీ॥


చిమిలి పళ్ళెరముల సమ్మతిగా దోడుకొని

ఇమ్ముగ నుండలు చేసిరి కొమ్మలు॥


కౌసల్యపుడు వచ్చి కాంతలందరిని బిలిచి

బంగరూ తబుకులతో పంచిబెట్టెను॥


తెలుగు వారి పండగలలో సంక్రాంతి పండగకి ఒక ప్రత్యేకత ఉంది . తెలుగు వారికి పెద్ద పండగ . సంక్రాంతి ముందు ఆడపిల్లలు గుంపులుగా వచ్చి గుండ్రంగా తిరుగుతూ గొబ్బి,’ పాటలు పాడతారు .

గొబ్బి యెల్లో గొన్ని గొన్ని పాడరమ్మా /గొబ్బాలి లాల యో /చందమామ , చందమామ ఓ చందమామ / చందమామ కూతుళ్ళు నీలగిరి కన్నెలు

/నీలగిరి కన్నెలకు నిత్య మల్లె తోట /నిత్య మల్లె తోటలో నిమ్మల్ల బావి

/నిమ్మల్ల బావికి గిళ కల్ల తాడు /గిళ కల్ల తాడుకు బుడిగి బుడిగి చెంబు” అంటూ సాగుతుంది .

సీతమ్మ వేవిళ్ళు , జానపదుల కల్పనలో సిరి మంతు లయ్యేది చక్రవర్తులయ్యేది . జానపదుల మాటలే వాడతారు .🪀

ఓ యమ్మ సీతకి యెన్నమ్మ నెలలు ?

/ఒకటాయే , రెండాయే మూడు నెల లాయె /మూడు నెలలకు సీత కేమి మనసాయె

/పులిపాలు తెమ్మని పురుషునితో జెప్పు /తన మరిది లక్ష్మన్న పులి వేటగాడు

/పుట్ట మీద బొనోగ్గి పులిని బడగొట్టి /పులి జలపి పులి పాలు దొన్నెల్ల

/యిదిగోను వదినమ్మ నీ కోరికల్లు /ఇంకొక్క కోరి కుంది మరిది లక్ష్మన్న

/నట్టేట సముద్రాన నది దిబ్బ మీద /టేకి చెట్టుల మీద తేనె మనసాయె “ఈ పాట ద్వారా జానపదుల కల్పనలు తెలుస్తాయి .

అల్లుళ్ళకు అత్త దగ్గర చనువు ఎక్కువ . నవ మాసాలు మోసి కని పెంచి పెద్ద వారిని జేసిన కూతుళ్ళను అల్లునికి కాళ్లు గడిగి కన్యాదానము చేయుటచే గదా !

“అల్లుడల్లూడంటే ఒళ్లు మండేను /అల్లు డత్తకు తెచ్చె అద్దాల రైక

అల్లుడత్తకు తెచ్చె అద్దాల రైక /యిప్పూట తోడగ బోతే నిప్పుల్లు రాలె….నిప్పుల్లు రాలె

మరగేసి తోడగ బోతే మల్లెల్లు రాలె/ ఇది ఏమి అల్లుడా ఇంక సోద్యాము 

కాదత్తానే సేబుతా నువ్వాలకించు /నిత్తె మల్లెలు రైక నీకు అందమ్ము

నువు కన్న కూతురూ నాకు అందమ్ము “ అంటూ అత్తా , అల్లుళ్ళ మధ్య చనువు , వెతకారం తెలియజేసారు .

పుట్టింటిలో తన మాటకు గల చెల్లుబడిని గూర్చి ఈమె చెప్పుచున్నది . పుట్టింటికి అత్తింటికి మధ్య గల ఆటంకాల అరల పొరలను తొలగించినందుకు తిరుపతి తిమ్మప్ప నూటొక దీవెనలతో తిరు పూజలయినవి .

“అక్కలను చెల్లెండ్ల నొకూరి చిచ్చ/ వొక్కడే అన్నయ్య వచ్చెనన పోతూ

పచ్చెన్న పోతుంటే యేరడ్డమాయే /తీగాకీ తిరుపతీ కొండడ్డమాయే”అత్తింటికి , పుట్టింటికి మధ్య గల వ్యత్యాసాన్ని వివరించారు .

తాళి గట్టిన మగడు వినా , ఎందరున్నను ఆ సోఖ్యము , సౌభాగ్యము రావని ఈ క్రింది విసురు రాతి పాట చాటుచున్నది .

“రాగల్ల యిసిరేటి వొ రామ చిలుకా /మొగుడెందు బోయెనే మొగము కళ దప్పె

నాగలోకము బోయి నరుడయ్యి నిలిచి /దేవలోకము బోయి దేవుడై నిలిచె

చింతల నీలమ్మ చెల్లె లున్నాది /చేతి గాజులు పోయే చెల్లె లేవరమ్మా

యేడోద్దు నీలమ్మ తల్లి వున్నాది /తల మింద నీడ బోయె తల్లి ఎవరమ్మా “ స్త్రీ తన భర్త సుఖ శాంతులు గురించి ఏ విధంగా ఆలోచిస్తుందో తెలియజేసిన జానపద గేయం .

“పుట్టింటి పై గల మమకార మొక యువతీ మనసులో లేపిన తీయని కోరికలు ఈ పాటలో ఉన్నవి .

“సూర్యుని చేతికి సులగె కానైతు /పసులోవి చేతికి పరిగె శానైతు

నా తల్లి శ్రీలక్ష్మి చల్ల జెయ్యంగ /చిల్లి పోయి కవ్యాన రిలుకగా నైదు

నా యేడుగు రాన్నలు నాగలి దున్నంగ /నాగాల్లో నేనొక్క నాగాలన్న నైదు

నా యేదుగురు వదినెలు నాలె దియ్యంగ /నాలెలో నే వొక్క మొగలి పువునైదు “.

అత్తల ఆరళ్లు ప్రసిద్ధము . చీటికి మాటికి కోడలిపై నేరములు మూపు అత్తగారి బాధలు పడజాలక ఒక కోడలు విరక్తితో వేదన ఈ పాటలో కన్పిస్తుంది .

మొదటి అయిదు పంక్తులు అత్తగారి ప్రశ్నల పరంపరలు . తరవాత పంక్తులు కోడలి హృదయపు గాయాలు …..

కోడలా కోడలా కొలికి ముత్యామా /పచ్చి పాలా మీది మీగడేమాయే

వేడి పాల మీది వెన్న లేమాయె /తేనె కుండల మీది తెప్ప లేమాయే

నూనె కుండల మీది నురుగు లేమాయే /అత్తనువు బెట్టిన ఆరళ్ళ వలన

అట్లుపోయి అడవిలో మాను గానైతి /మానన్న గానైతి మంచెలేతూరు

చెట్టన్న గానైతి చెలగి వేతూరు /ఆకన్న గానైతి మేక లారగించు

కాయన్న గానైతి కాకు లారగించు “ కోడల మీద అత్త గారి సాధింపులకి నిదర్శనం ఈ గేయం .

అన్నదమ్ముల నుండి వేరు పడుటకై , తన భర్తను ప్రోత్సహించుచున్న దొక యుపాయశాలిని . వేరు బడినచో తన ప్రజ్ఞ చూపించి సంసారము అభివృద్ధి చేతుననియు మొగనికి మొలత్రాడు చేయింతు ననియు ముఖములు చూరలిత్తు ననియు పురి కొల్పుచున్నది .

“ ఎరు బడితేనే మేలు మొగడా ..మనము /పొత్తు లుంటేనే పోరు మొగడా

ఎరు బడ్డ తెల్లారి ఏకమై మన ముండి /ఏకించి పీకించి నెలకొక్క పోగొడికి

మోట దండెడ దొడ్డు మొలతాడు చేయిస్తు /మొక్క జొన్న చెను మన పాలికే వస్తే

నక్క బెదురూ బెట్టినా ప్రజ్ఞ చూపించి /యిద్దూము పండేది నల్తూము పండిస్తూ “

ఈ విధంగా స్త్రీలు తమ నిత్య వ్యవహారంలోని ప్రతి సంఘటనని పాట కింద మలచి పాడుకోవడం జరుగుతుంది . జానపద గేయాలలో స్త్రీల పాటలు వారి జీవన స్థితి గతులను తెలియజేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు .

                     సశేషం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సుఖాన్ని పొందగలరు

 యే చ మూఢతమా లోకే యే చ బుద్ధిః పరం గతాః|


తే నరాః సుఖమేధంతే క్లిశ్యత్యంతరితో జనః||


లోకంలో మరీ మూర్ఖులు, మహాజ్ఞానులు మాత్రమే సుఖాన్ని పొందగలరు. మధ్యస్థాయిలోని వారు బాధపడుతూనే ఉంటారు.


నిత్యం ప్రముదితా మూఢాః దివి దేవగణా ఇవ! అవలేపేన మహతా పరిభూత్వా విచేతసః ||


మూర్ఖులు దేవలోకంలోని దేవతలవలె ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. వారి మనస్సులు ఏదో ఒక అనవసర అసక్తులలో కూరుకొని పోవటం వలన వ్యామోహితులై ఉంటారు.


సుఖం దుఃఖాంతమాలస్యం దుఃఖం దాక్ష్యం సుఖోదయమ్! భూతిస్త్యేవం శ్రియా సార్ధం దక్షే వసతి నాలసే!|


సోమరితనం, బద్దకం మొదట సుఖంగా కనిపించినా కడకు దుఃఖాన్నే కలిగిస్తుంది. సామర్థ్యప్రదర్శనం కష్టంగా కనిపించినా కడకు సుఖాన్నే కలిగిస్తుంది.


ఐశ్వర్యలక్ష్మి అనేది సమర్థునిలో నివసిస్తుంది. కానీ బద్ధకస్తులలో నిలువదు.

3, మే 2025, శనివారం

రామం స్కందం హనూమంతం

 రామం స్కందం హనూమంతం

 వైనతేయం వృకోదరం 

శయనే యః స్మరేన్నిత్యం 

దుస్వప్న-స్తస్యనాశ్యతి


అర్థం: ప్రతిరోజూ నిద్రపోయే ముందు రాముడు, స్కందుడు, హనుమంతుడు, గరుడుడు మరియు భీముడిని ప్రార్థించడం వల్ల కలలు కలగకుండా ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది.


ఈ శ్లోకం చెడు కలలు మరియు పీడకలల నుండి రక్షణ పొందడానికి పఠించబడే శక్తివంతమైన శ్లోకం. ఇది పూజనీయమైన దేవతలైన శ్రీరాముడు, కార్తికేయుడు (స్కందుడు), హనుమంతుడు, గరుడుడు మరియు వృకోదరుడు (భీముడు) ల ఆశీస్సులు లభిస్తాయి.నిద్రపోయే ముందు ఈ   పేర్లను స్మరించే మరియు జపించే వారు చెడు కలల ప్రభావాల నుండి విముక్తి పొందుతారని ఈ శ్లోకం నొక్కి చెబుతుంది.


వాల్మీకి ఆదికావ్యం శ్రీమద్రామయణం అనుష్టుప్ ఛందస్సులో ఉన్నది. 

అనుష్టుప్ వృత్త ఛందస్సుల కన్నాపురాతనమైనది.

 అనుష్టుప్ శ్లోకం వృత్త ఛందస్సు కాదు. ఇది వేద ఛందస్సు. కాని కావ్యాదులలో శ్లోకానికి, వేదాలలో వలె స్వరభేదం  భేదం నిర్దేశం లేదు.

 అనుష్టుప్ శ్లోకానికి ప్రతి శ్లోకానికి 8 అక్షరాలు కలిగి నాలుగు పాదాలు ఉంటాయి.

  

 అనుష్టుప్ శ్లోక ఛంధమున ప్రతి చరణము నందును 5వ అక్షరము లఘువు, 6వ అక్షరము గురువు;   ప్రధమ, తృతీయ చరణములందును దీర్షముగాను; ద్వితీయ,చతుర్ధ చరణములందు హ్రస్వముగాను కూడా ఉండును.

అన్ని అనుష్టుప్ శ్లోకాలకి ఈ నియమం లేదు. అక్షర సంఖ్య మాత్రమే ప్రధానము.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సోరియాసిస్ వ్యాధి గురించి

 సోరియాసిస్ వ్యాధి గురించి సంపూర్ణ వివరణ -


      మనుష్యులకు వచ్చు అత్యంత తీవ్రమైన మరియు అంత సులభముగా  లొంగని ఒక వ్యాధి గురించి మీకు వివరిస్తాను. దాని పేరు  "సిద్మ కుష్టు"  దీనిని " సోరియాసిస్ " అంటారు. ఇది ఒక రకమైన కుష్టు వ్యాథిగా ఆయుర్వేదం పరిగణించినది . 18 రకాల కుష్టు వ్యాధులలో ఇది ఒకటి. ముఖ్యంగా దీని లక్షణాలు చర్మం పైన పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడి పొట్టు రాలడం . అదే విధముగా కీళ్ల భాగములో సోరియాసిస్ వచ్చినపుడు "సోరియాసిస్ ఆర్థరైటిస్ "

వచ్చును. ఇది అత్యంత మొండి వ్యాధి . 


             ఇది రావడానికి ప్రధానమైన కారణం . విరుద్దమైన ఆహారాలు భుజించటం వలన శరీరం నందలి రక్తం దోషం పొందటం వలన , తీవ్రమైన మానసిక ఒత్తిడి వలన ఈ వ్యాధి సంప్రాప్తించును. దీనికి చికిత్స చేయడం అత్యంత సవాలుతో కూడుకుని ఉన్నది. అల్లోపతి వైద్యవిధానము నందు దీనికి సంపూర్ణమైన చికిత్స లేదు . ఒక్క ఆయుర్వేదం మాత్రమే దీనికి సంపూర్ణ పరిష్కారం చూపించగలదు. ఈ సమస్యని నేను నయం చేయుటకు ఎంతో పరిశోధించి కొన్ని ఔషధ మిశ్రమాలను తయారుచేశాను . వీటితో అత్యంత సులభముగా " సోరియాసిస్ " సమస్యను నిర్మూలించవచ్చు. మొదటి 2 నుంచి 3 నెలలలో మీకు మార్పు వస్తుంది . 6 నెలలపాటు ఆపకుండా వాడవలెను .  


       పైన చెప్పిన విధముగా ఒక వ్యక్తికి నేను చేసిన చికిత్స ఫలితాన్ని ఫొటో రూపంలో మీకు చూపిస్తాను. ఇది కేవలం 15 రోజుల్లొ వచ్చిన మార్పు మాత్రమే . మరికొన్ని రోజుల్లొ ఆ వ్యక్తి ఆ పరమేశ్వరుడి దయవలన సంపూర్ణముగా సమస్య నుంచి బయటపడతాడు . ఇది తధ్యం . 


          నేను చెప్పిన విధముగా ఔషధ సేవన చేస్తూ పథ్యం పాటించగలిగిన వారు మాత్రమే చికిత్స కొరకు నన్ను సంప్రదించండి. 


                     కాళహస్తి వేంకటేశ్వరరావు 


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                          9885030034

నిద్ర పోయే ముందు చెప్పుకునే శ్లోకము*

 *నిద్ర పోయే ముందు చెప్పుకునే శ్లోకము*


రామ స్కందం 

హనూమంతం వైనతేయం వృకోదరం |

శయనే యః స్మరేన్నిత్యమ్ దుస్వప్నం- తస్య నశ్యతి ‖


*అపరాధ క్షమాపణ స్తోత్రం*


అపరాధ సహస్రాణి, క్రియంతేఽహర్నిశం మయా |

దాసోఽయమితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ‖


కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా

శ్రవణ నయనజం వా మానసంవాపరాధమ్ |

విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ

శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ‖