10, జూన్ 2025, మంగళవారం

రామో విగ్రహవాన్ ధర్మః

 *"నేటి సుభాషితం"*

_(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)_ 


రామో విగ్రహవాన్ ధర్మః 

సాధుః సత్యపరాక్రమః 

రాజా సర్వస్య లోకస్య 

దేవానాం మఘవానివ

_(వా.రా. 3.37.13)_


*అర్థం:*

శ్రీ రాముడు మూర్తీభవించిన ధర్మ అవతారము. ఆయన సత్పురుషులు. ఆయన బలం సత్యము. దేవతలకు ఇంద్రునివలె ఆయన సమస్త లోకాలకు రారాజు.


["రామో విగ్రహవాన్ ధర్మః" - ఈ మాట (శ్లోకం) అన్నది 'రాక్షసుడైన మారీచుడు', రావణునితో. 

ఒక రాక్షసుని చేతకూడా కీర్తించబడిన గొప్ప వ్యక్తిత్వం శ్రీ రామచంద్రులది.]



శ్రీ త్యాగరాజ స్వామి వారి _(మొట్టమొదటి కీర్తన అని విన్నాను)_ కీర్తనతో శుభోదయం.


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః

మూఢం అంటే ఏంటి?*

 *మూఢం అంటే ఏంటి?*

*మూఢం అనేది రెండు రకాలు*. 

1) గురు మూఢం,

2) శుక్ర మూఢం అని అంటారు. ఇక ఇప్పుడు వచ్చేది జూన్ 10వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు గురు మూఢం.ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ మూఢం రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మూఢం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు.ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఎప్పుడూ కూడా గురు బలం, శుక్ర బలం ఉంటేనే జరుపుతారు. ఈ మూఢం సమయంలో గురు గ్రహానికి శుక్ర గ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు. అందుకే దీనిని మూఢం అని అంటారు.


*మూఢం సమయంలో ఏం చేయకూడదు?*

మూఢం సమయంలో 1)పెళ్లిచూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు.

2)పెళ్లిళ్లు కూడా ఈ సమయంలో జరపకూడదు. ఒకవేళ పెళ్లిళ్లు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు. గొడవలు పడుతూ ఉంటారు. విడిపోయే అవకాశాలు ఉన్నాయి.

శుభకార్యాలని ఈ మూఢం సమయంలో ప్రారంభించకూడదు. అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంది.

3)లగ్న పత్రికలు రాసుకోకూడదు. పెళ్లి పత్రికల జోలికే వెళ్ళకూడదు.

4)మూఢం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడటం కూడా తప్పు.

5)పసి పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు.

6) కొత్త వ్యాపారాలని మొదలుపెట్టకూడదు. పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

7)చెవులు కుట్టించకూడదు.

8)కొత్త వాహనాలు కొనుగోలు చేయరాదు

9)శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేయకూడదు.

10)ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం, సొంత ఇంటికి వెళ్లిపోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి. 11)దేవుడికి మొక్కలు చెల్లించుకోవడం కూడా ఈ మూఢం సమయంలో చేయకూడదు.

12)వ్రతాలు చేయడం, విగ్రహ ప్రతిష్టాపనలు లాంటివి కూడా చేయకూడదు.

13)ఈ మూఢం సమయంలో వైభవంగా పుట్టిన రోజులు చేయకూడదు.

14)చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది.


*మూఢం సమయంలో ఏం చేయవచ్చు?*

1)చిన్న పిల్లలకు అన్నప్రాసన చెయ్యచ్చు.

2)దూర ప్రయాణాలు చెయ్యచ్చు.

3)ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా చేయించుకోవచ్చు.

4)భూముల అమ్మడం, భూములు కొనడం వంటివి చేయొచ్చు.

5)అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పులేదు.

6)రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేయొచ్చు.

7)విదేశాలకు వెళ్లడం, కొత్త ఉద్యోగంలో చేరడం వంటివి చేయొచ్చు. 

8)కొత్త బట్టల్ని కొనుగోలు చేయొచ్చు. 

9)ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లొచ్చు. 

10)దేవాలయాల్లో అన్నదానాలు చేయడం, సీమంతం వేడుకలు చేసుకోవడం, దైవ కార్యాలను నిర్వహించడం చేయొచ్చు.

11)నవగ్రహ శాంతులు, హోమాలు చేయించుకోవచ్చు.

12)మూఢం సమయంలో బాలింతలు, గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయొచ్చు.

⚜ శ్రీ యమై దేవి ఆలయం

 🕉 మన గుడి : నెం 1138


⚜ మహారాష్ట్ర : సతార 


⚜ శ్రీ యమై దేవి ఆలయం



💠 యమై దేవి ఆలయం భారతదేశంలోని మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఔంధ్ పట్టణంలోని ఒక కొండ సముదాయంలో ఉంది.


💠 యమై దేవి దుర్గామాత యొక్క అవతారం మరియు ఈ రూపంలో ఆమెను మహారాష్ట్రలో విస్తృతంగా పూజిస్తారు. 

మరాఠీలో 'యే మై' అంటే 'తల్లి రండి' అని అర్థం.

 యమై మాతను మహిషాసుర మర్దిని యమై అని కూడా పిలుస్తారు.


💠 యమై దేవికి అంకితం చేయబడిన ప్రసిద్ధ దేవాలయాలు సతారా సమీపంలోని ఔంధ్ వద్ద మరియు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ సమీపంలోని రాషిన్ వద్ద ఉన్నాయి.


💠 కొల్హాపూర్ లక్ష్మీదేవి మరియు జ్యోతిబా ప్రభువు ఆమెను 'యే మై' అని పిలిచి ఆహ్వానించారని పురాణాల ప్రకారం ఉంది. 

ఆ విధంగా ఆమె ఈ ప్రాంతానికి వచ్చి యమై దేవి అని పిలువబడింది.


💠 యమై దేవి మహారాష్ట్రలోని అనేక కుటుంబాలకు కులదేవత.


💠 కొల్హాపూర్ దేవత మహాలక్ష్మి మరియు విష్ణువు అవతారమైన శ్రీరాముడు ఆమెను మరాఠీలో 'యే మై' అని సంబోధించిన తర్వాత దేవత యమై పేరు పెట్టబడిందని పురాణ కథనం. అందువల్ల, ఔంధ్ దేవత యమై దేవిగా ప్రసిద్ధి చెందింది.


💠 యమై దేవి విగ్రహం నల్ల రాయితో తయారు చేయబడింది మరియు దాదాపు 2 మీటర్ల ఎత్తులో అడ్డంగా కాళ్ళు కూర్చునే స్థితిలో ఉంది. 


💠 మహారాష్ట్రలోని కెందూరుకు చెందిన శ్రీ కన్హురాజ్ మహారాజ్, జ్ఞానేశ్వర్ మహారాజ్ సాంగత్యం ద్వారా కూడా పవిత్రుడయ్యాడు. 

 కన్హురాజ్ మహారాజ్ తపస్సుకు సంతోషించిన రేణుకా దేవి. సమాధి స్థితిలో మునిగి ఉండగా, రేణుకా దేవి ప్రత్యక్షమై ఆశీర్వదించింది. 

మీ దర్శనం ఎప్పటికీ నాతోనే ఉండాలని కన్హురాజ్ మహారాజ్ తన కోరికను వ్యక్తం చేశాడు.


💠 ఇది విన్న దేవత సంతోషకరమైన హృదయంతో తథాస్తు అని చెప్పింది, కానీ నేను బహిర్గత రూపంలో రాను, కానీ అదృశ్య రూపంలో మరియు ఒక షరతుతో వస్తాను అని చెప్పింది.


💠 నేను నిన్ను మాత్రమే చూస్తాను మరియు నేను నిన్ను అనుసరిస్తాను, కానీ మీరు నా వాగ్దానాన్ని నమ్ముతారు మరియు మీరు వెనక్కి తిరిగి చూడరు. మీరు వెనక్కి తిరిగి చూస్తే, నేను ఎక్కడ ఉన్నానో నేను స్థాపించుకుంటాను, ముందుకు రాను.


💠 తదుపరి ప్రయాణం ప్రారంభమైంది, కన్హురాజ్ మహారాజ్ ముందుకు నడుస్తున్నాడు మరియు రేణుకా దేవి అతనిని అనుసరించడం ప్రారంభించింది. 

కన్హురాజ్ మహారాజ్ దేవత పాదాల నుండి చీలమండలు మరియు గోళ్ల శబ్దం అకస్మాత్తుగా ఆగిపోయింది.


💠 ఈ సమయంలో, కన్హురాజ్ మహారాజ్ వెనక్కి తిరిగి చూస్తుండగా, అదే సమయంలో, దేవత కన్హెర్సర్ గ్రామ వాగు ఒడ్డున అదృశ్యమైంది. 

కన్హురాజ్ మహారాజ్ తన తప్పును గ్రహించాడు మరియు ఆ సమయంలో, కన్హురాజ్ మహారాజ్ దేవతను స్తుతించడం ప్రారంభించాడు మరియు యే మై (రండి తల్లి) అని పిలిచాడు, అందుకే ఈ దేవతను ఇక్కడ యేమై అని పిలుస్తారు.


💠 కానీ దేవత విధించిన షరతుల ప్రకారం, దేవత ఇలా చెప్పింది, నేను ఇప్పుడు ఈ ప్రదేశంలోనే ఉంటాను, నదికి ఉత్తరాన ఉన్న దట్టమైన అడవిలో నేను ఎప్పటికీ అక్కడే ఉంటాను. 

ఈ ప్రదేశంలో నేను భక్తుల నుండి సేవ తీసుకుంటాను మరియు వారి భక్తికి నేను సంతోషిస్తాను మరియు వారి కోరికలను తీరుస్తాను.


💠 ఈ ప్రదేశంలో కూడా నేను మీ సేవ తీసుకుంటాను, ఈ ప్రదేశం కెందూర్ నుండి చాలా దూరంలో లేదు కాబట్టి మీరు వచ్చి వెళ్ళడం సులభం అవుతుంది. కాబట్టి మీరు చాలా సులభంగా పూజలు చేయవచ్చు. దేవతా మాత ఆదేశాలను అనుసరించి, కన్హురాజ్ మహారాజ్ ఈ ప్రదేశంలో కన్హెర్సర్ దేవిని క్రమం తప్పకుండా పూజించారు.


💠 ఈ విధంగా రేణుకా మాత, అంబాబాయి, జగదంబ ఇక్కడ అవతరించారు. తరువాత చివరికి ఈ ప్రదేశంలో ఒక ఆలయం స్థాపించబడింది.


💠 ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఇక్కడ హారతి నిర్వహిస్తారు.

ప్రతి మంగళవారం ఆలయం చుట్టూ ప్రదక్షిణ కూడా చేస్తారు. ప్రతి పౌర్ణమికి, గ్రామంలో పల్లకీలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది.


💠 ఈ ఆలయ రాతి నిర్మాణంపై, ఒక జంతువు నోటిలో ఏనుగును, తోకలో ఒకటి మరియు కాళ్ళలో నాలుగు పట్టుకుని ఉన్న చిత్రం ఉంది. మహారాష్ట్రలోని మురుద్‌లోని జంజీరా కోటలో కూడా ఇదే చిత్రం కనిపిస్తుంది.


💠 ఇది సతారా బస్ స్టేషన్ నుండి 44 కి.మీ దూరంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

18-10-గీతా మకరందము

 18-10-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - అట్టి త్యాగశీలుడు కర్మలందు ఇచ్ఛాద్వేషములు లేకుండునని తెలుపుచున్నారు-

      

న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలేనానుషజ్జతే | 

త్యాగీ సత్త్వసమావిష్టో  

మేధావీ ఛిన్నసంశయః || 


తాత్పర్యము:- సత్త్వగుణముతో గూడినవాడును, ప్రజ్ఞాశాలియు, సంశయములను బోగొట్టుకొనినవాడును నగు త్యాగశీలుడు, అశుభమును, కామ్యమును, దుఃఖకరమును నగు కర్మను ద్వేషింపడు; శుభమును, నిష్కామమును, సుఖకరమునగు కర్మయందు ఆసక్తుడుకాడు (అభిమానము గలిగియుండడు).


వ్యాఖ్య:- సత్త్వగుణముతో గూడిన కర్మఫలత్యాగి ద్వంద్వములందు సమబుద్ధి గలిగి యుండునని చెప్పబడుచున్నది. ఒకదానిని ద్వేషించుటగాని, మఱియొక దానియందు ఆసక్తిగలిగి తగుల్కొనుటగాని యతనికుండదు. అతడు ఇచ్ఛాద్వేషరహితుడై యుండును. అశుభకర్మను, కామ్యకర్మను ద్వేషింపడని చెప్పినంతమాత్రముచేత దానిని ప్రేమించునని అర్థముకాదు. జీవన్ముక్తునిపగిది దానియెడల తటస్థభావముగలిగి, తాను మాత్రము దాని నాచరింపక శుభకార్యమునే, నిష్కామకర్మమునే ఆచరించును. అట్లాచరించినను దానితో కలియక, దానియం దభిమానము (సంగము) లేకయుండును.


ప్రశ్న:- సత్త్వగుణశీలుడగు కర్మఫలత్యాగియొక్క స్వభావమెట్లుండును?

ఉత్తరము:- అతడు (1) సత్త్వగుణసంపన్నుడై (2) ప్రజ్ఞాశాలియై (3) సంశయరహితుడై (4) అశుభ (కామ్యాది) కర్మలను ద్వేషింపకయు, శుభ(నిష్కామాది) కర్మములందు తగుల్కొనకయు (అభిమానము లేకయు) నుండును.

తిరుమల సర్వస్వం -266*

 *తిరుమల సర్వస్వం -266*

 *శ్రీవారి సంవత్సర సేవలు - 3* 

 *రథసప్తమి* 


 తన పేరులోనే శ్రీమన్నారాయణుని పదిల పరచుకొన్న 'సూర్యనారాయణుడు' శ్రీమహావిష్ణువు యొక్క పరమ భక్తుడే కాకుండా ఆప్తమిత్రుడు, శ్రేయోభిలాషి కూడా! శ్రీమహాలక్ష్మికి కూడా సన్నిహితుడే! అటువంటి సూర్యుని జన్మదినమైన మాఘశుద్ధ సప్తమి నాడు హైందవులందరూ 'రథసప్తమి పర్వదినాన్ని వైభవోపేతంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపు కుంటారు. 


 తిరుమలలో జరిగే రథసప్తమి ఉత్సవంలో సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుని ఉత్సవమూర్తియైన మలయప్పస్వామి వారే ఉభయదేవేరుల సమేతంగా పాల్గొని ఉత్సవానికి వన్నె తెస్తారు. ఈ సందర్భంలో సూర్యుని గురించిన కొంత ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకుందాం.


 *సప్తాశ్వరథారూఢుడు* 


 సూర్యభగవానుడు సప్తాశ్వరథారూఢుడై, జగత్తంతా అవిశ్రాంతంగా వాయువేగ మనోవేగాలతో పర్యటిస్తూ తన దివ్యకాంతులతో సమస్త సృష్టిని చైతన్యవంతం చేస్తాడు. సూర్యుడు అధిరోహించిన రథం బృహతి, గాయత్రి, ఉష్టిక, జగతి, పంక్తి, త్రిష్టుప్, అనుష్టుప్ అనే ఏడు అశ్వాల ద్వారా లాగబడుతుంది. ఈ ఏడు గుర్రాల పేరిట, సంస్కృతభాషలో ఏడు 'ఛందస్సులు' ఉన్నాయి. సంస్కృతం లోని శ్లోకాలు, స్తోత్రాలు మొదలైనవన్నీ ఈ ఏడు ఛందస్సుల్లోనే వ్రాయబడ్డాయి. ఉదాహరణకు శ్రీవిష్ణుసహస్రనామం, శ్రీలలితాసహస్రనామం అనుష్టుప్ ఛందస్సులో రచించబడ్డాయి.

2ఈ రథం 'అనూరుడు' అనే రథికుని సారథ్యంలో నడుపబడుతుంది. అయితే, కొన్ని పురాణాలలో సూర్యుని రథం పేరు 'సప్త' అని, ఆ రథాన్ని కేవలం ఒకే ఒక్క అశ్వం లాగుతుందని, అందువల్ల ఆ అశ్వాన్ని 'సప్తాశ్వం' గా పిలుస్తారని, ఆ అశ్వమే ఏడు రూపాలలో గోచరిస్తుందని చెప్పబడింది.


 *రథసప్తమి ఉత్సవం* 


 తన ఆదేశం మేరకు విశ్వమంతా సంచరిస్తూ, కాలచక్రం గతులు తప్పకుండా తన వంతు కృషి సలుపుతున్న సూర్యనారాయణునికి, వారి జన్మదినోత్సవ సందర్భంగా అభినందనలు తెలుపడానికై మలయప్పస్వామి మాడవీధుల్లో ఊరేగడమే 'రథసప్తమి ఉత్సవం'. సూర్యుడు కాలచక్ర సంచాలనంలో వ్యస్తుడై ఉండటం వల్ల, తన భక్తుని అభినందించే నిమిత్తం శ్రీవారే ఆనందనిలయం నుంచి బయటకు వస్తారన్నమాట. భక్తుల దరి జేరటానికై భగవంతుడు సదా ఆరాట పడటం సహజమే కదా!


 *సప్తవాహనారోహణం* 


 రథసప్తమి నాడు, సప్తరథారూఢుని జన్మదినోత్సవంలో సప్తగిరీశుడు సప్తవాహనాలను అధిరోహిస్తాడు. శ్రీవారు ఉభయదేవేరుల సమేతంగా మొట్టమొదటగా సూర్యప్రభవాహనాన్ని అధిరోహిస్తారు. ఆ వాహనంలో ఊరేగుతున్న మలయప్పస్వామి వారి పాదపద్మాలను బాలభానుడు తన లేలేత కిరణాలతో స్పృశిస్తూ భక్తిపూర్వకంగా సేవించు కుంటాడు. తరువాత మలయప్పస్వామి వారు వరుసగా చిన్నశేషవాహనం, గరుడవాహనం, హనుమంతవాహనం, కల్పవృక్షవాహనం చివరగా చంద్రప్రభవాహనంపై ఊరేగుతారు. ఈ సందర్భంగా మలయప్పస్వామి వారు ఆదివరాహస్వామి ఆలయంలో పంచామృతాభిషేకాన్ని స్వీకరిస్తారు. తరువాత స్వామిపుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది.


 *ఒకరో'జు బ్రహ్మోత్సవం* 


 ఈ రథసప్తమి ఉత్సవం అత్యంత వైభవోపేతంగా, కన్నుల పండువగా జరగడం వల్ల; బ్రహ్మోత్సవాల తరువాత అతిపెద్ద సంఖ్యలో వాహనాలు పాల్గొనడం వల్ల దీనిని 'ఒకరోజు బ్రహ్మోత్సవం' గా కుడా పేర్కొంటారు. ఈ ఉత్సవాన్ని కాంచిన భక్తులపై శ్రీనివాసుని, సూర్యభగవానుని కరుణకిరణాలు ప్రసరించి ఐహికాముష్మికానందాలు సంప్రాప్తిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.


*అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ మహోత్సవం* 


 *'అష్టబంధనము', 'బాలాలయము'* మరియు *'మహాసంప్రోక్షణము'* అనే మూడు మహత్తర వైదిక క్రతువుల సమాహారమే ఈ ఉత్సవం. ఈ ఉత్సవం దాదాపు అన్ని వైష్ణవాలయాలలో జరిగినప్పటికీ తిరుమలలో జరిగే ఉత్సవానికి ఎన్నో విశిష్ఠతలు, ఎంతో ప్రాముఖ్యం ఉన్నాయి. ఈ ఉత్సవం ఎందుకు, ఎలా జరుగుతుందనే వివరాల్ని ఈరోజు తెలుసుకుందాం.


 *విష్ణువు అంశ* 


 వైఖానస ఆగమం లోని *'మరీచి సంహిత'* ననుసరించి, స్వామివారి అర్చామూర్తిలో శ్రీమహావిష్ణువు అంశ నిరవధికంగా ఉండదు. కలియుగంలో దానికి పన్నెండు సంవత్సరాల కాలపరిమితి ఉంది. ఈ గడువు ముగిసే లోపు, విస్తారమైన వైదిక ప్రక్రియల ద్వారా మూలవిరాట్టులో విష్ణువు అంశను పునఃప్రతిష్ఠింప జేసి, స్వామివారి తేజస్సును ద్విగుణీకృతం చేసే మహోత్కృష్టమైన కార్యక్రమాన్నే *'అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ'* గా వ్యవహరిస్తారు. 


 అయితే, దీనికో మినహాయింపు ఉంది. ఈ సంప్రోక్షణా కార్యక్రమం దేవతలు, ఋషులు, చక్రవర్తుల వంటి వారి ద్వారా ప్రతిష్ఠించబడ్డ దేవతామూర్తులకే అవసరమని; సాక్షాత్తు దేవదేవుడే స్వయంగా వెలయడం వల్ల, స్వయంవ్యక్త క్షేత్రాలలో ఈ సంప్రోక్షణ జరుపనవసరం లేదని కూడా శాస్త్రాలలో చెప్పబడింది. కానీ, తిరుమల ఆలయం మాత్రం దీనికి భిన్నం. శ్రీవారి మూర్తి స్వయంవ్యక్తమే అయినప్పటికీ మిగిలిన అన్ని వైదిక క్రతువుల లాగా, మహాసంప్రోక్షణ కూడా ఎప్పటినుండో ఆనందనిలయంలో జరుపబడుతోంది.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వం – తృతీయాశ్వాసం*


*403 వ రోజు*


*అర్జునుడి మీద కర్ణుడు నాగాస్త్రమును ప్రయోగించుట*


కర్ణుడు తన వద్ద ఉన్న సర్పముఖాస్త్రాన్ని బయటకు తీసాడు. ఆ అస్త్రానికి అధిపతి తక్షకుని కొడుకైన అశ్వసేనుడు. దానిని అర్జునుడిని చంపడానికే దాచి ఉంచాడు. ఇప్పుడు దానిని తీసి సంధించాడు. అర్జునుడి కంఠానికి గురిపెట్టాడు. కాని గురి కొంచెం కిందకు ఉండటం గమనించిన శల్యుడు " కర్ణా ! నీ గురి తప్పుతుంది. అర్జునుడి కంఠానికి సూటిగా గురిపెట్టు " అన్నాడు. తన గురిని అక్షేపించిన శల్యుని మీద ఆగ్రహించిన కర్ణుడు " శల్యా ! నా గురిని ఆక్షేపించే అర్హత నీకు లేదు. చూస్తూ ఉండు ఈ అస్త్రధాటికి అర్జునుడి తల తెగి నేల మీద పడుతుంది " అంటూ సర్పముఖాస్త్రాన్ని ప్రయోగించాడు. తమ వంక నిప్పులు కక్కుతూ వస్తున్న అస్త్రాన్ని చూసి కృష్ణుడు తన బలమంతా ఉపయోగించి రధమును భూమిలోకి అయిదు అంగుళాలు కూరుకుపోయేలా తొక్కాడు. అర్జునుడి కంఠానికి గురిపెట్టిన అస్త్రము గురి తప్పి అర్జునుడి తల మీదగా దూసుకుపోతూ కిరీటాన్ని ఎగురగొట్టింది. ఆ కిరీటాన్ని బ్రహ్మ దేవుడు దేవేంద్రునికి బహూకరించాడు. దేవేంద్రుడు నివాత కవచులను సంహరించిన సమయంలో అర్జునుడికి బహూకరించాడు. ఆకిరీటమే అర్జునుడికి కిరీటి అనే నామాన్ని ఇచ్చింది. ఇప్పుడది నాగాస్త్ర ప్రభావానికి ధ్వంసం అయింది. అర్జునుడు వెంటనే తెల్లని పాగాను కిరీటంలా చుట్టుకున్నాడు. అర్జునుడి కిరీటమును నేలపడేసిన అస్త్రము తిరిగి అర్జునుడి వైపు దూసుకు వస్తుంది. అది చూసిన అర్జునుడు " ఈ నాగాస్త్రం ఎవరు ఇది నన్ను ఎందుకు తరుముతుంది " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! అప్పుడే మరిచావా ! ఖాండవ వనదహన సమయంలో తక్షకుడి కుమారుడు నాగ తన తల్లిని రక్షించుకు పోతున్న సమయంలో నీవు ఆ నాగకన్యను చంపావు. ఆ తరువాత తక్షకుడి కుమారుడు అశ్వసేనుడిగా నిన్ను చంపడానికి కర్ణుని వద్ద నాగముఖాస్త్రంగా పూజలందుకుంటూ ఉన్నాడు . ఇప్పుడు నీవు నీ దివ్యాస్త్రాలతో ఆ అశ్వసేనుడిని సంహరించు " అన్నాడు. వెంటనే అర్జునుడు అశ్వసేనుడిని సంహరించి నాగాస్త్రాన్ని ముక్కలు చేసి కర్ణుడి శరీరం మీద పన్నెండు బాణాలు వేసాడు. తాను ప్రయోగించిన నాగాస్త్రం కృష్ణుడి కారణాన గురి తప్పిందని తెలుసుకుని కర్ణుడు పదమూడు బాణాలను కృష్ణుడి మీద నూరు బాణాలను అర్జునుడి మీద ప్రయోగించాడు. అర్జునుడు ఒకే బాణంతో కర్ణుడి కుండలములు కొట్టాడు. కర్ణుడు బెదరక అర్జునుడిమీద శరవర్షం కురిపించసాగాడు. కర్ణుడి శరములు మధ్యలోనే తుంచి వేస్తున్నాడు అర్జునుడు. కర్ణుడి శరీరం రక్తసిక్తం అయింది. సూర్యుడు అస్తమించే సమయమూ ఆసన్న మైంది. అప్పుడు యమధర్మరాజు అక్కడకు వచ్చి అదృశ్యరూపంలో ఉండి ఆకాశం నుండి " ఇప్పుడు కర్ణుడి రథం భూమిలోకి కుంగి పోతుంది. కర్ణుడికి అవసాన సమయం ఆసన్నమైంది " అన్నాడు. అది విన్నా కర్ణుడు ధైర్యమును వీడక భార్గవాస్త్రాన్ని స్మరించాడు. కాని అతడికి అప్పుడది గుర్తుకు రాలేదు. పరశురామ శాపం పనిచేయడం మొదలైంది అని తెలుసుకున్నాడు. కర్ణుడు మనసులో " నేను ధర్మపరుడిని ధర్మం నన్ను రక్షిస్తుంది అనుకున్నాను కాని అది అసత్యం అయింది " అనుకున్నాడు. అర్జునుడు కర్ణుని మీద శరములు గుప్పిస్తున్నాడు. కర్ణుడు తన బాహుబలాన్ని నమ్ముకున్నాడు. కర్ణుడు అర్జునుడు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అర్జునుడు ఇంద్రాస్త్రంతో దానిని అడ్డుకున్నాడు ఇంతలో అర్జునుడు రౌద్ర అనే అస్త్రం జపించ సాగాడు.ఇంతలో కర్ణుడి రథచక్రం భూమిలోకి కుంగి పోయింది.



*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *శరీరమేవాయతనం సుఖస్య*

         *దుఃఖస్యచాప్యాయతనం శరీరమ్l*

         *యద్యచ్ఛరీరేణ కరోతి కర్మ*

        

 *తేనైవ దేహీ సముపాశ్నుతే తత్ll*


       *(మహాభారతమ్ - శాంతిపర్వమ్)*


తా𝕝𝕝 *సుఖానికి దుఃఖానికీ కూడా శరీరమే నిలయం... కనుక మానవుడు శరీరంతో చేసిన పనులన్నింటి ఫలితాన్ని శరీరంతోనే అనుభవిస్తాడు.....*


 ✍️🌹💐🌸🙏

అమ్మ ఎట్లుండును

 అమ్మ ఎట్లుండును 

అమ్మ మాట వినేసరికి ' ఎవరా అమ్మ 'అనే ప్రశ్నలు వెంటనే ఉదయిస్తాయి . ఈ 

ప్రశ్నలతో బాటే ' అమ్మ ఎట్లా ఉంటుంది ' ఏమి చేస్తూ ఉంటుంది ? అమ్మను ఎట్లా ప్రసన్నం చేసుకోగలుగుతాం .? 

అమ్మను ఆశ్రయించడం ద్వారా చివరకు మోక్షాన్ని పొందగలుగుతామా ? 

మొదలైన చాలా ప్రశ్నలు manassulo మొదలటానికి అవకాశం ఉంది . 

1- అమ్మ ఎవరు ? 

ఆదిశంకరులు " మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః 

2- కవికులగురువు కాళిదాసు 

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ 

3- అమ్మ ఎవరు ? 

లలితాసహస్రనామావళి 

 'శ్రీమాత 'మొదటి పదంద్వారా పరమేశ్వరియే మన అందరికీ అమ్మ 

      నీవు సమస్త జగత్తులకు మూలకారణము . అంటే తల్లివి . నీవే సత్త్వ రజస్తమో గుణముల రూపములో ఉంటావు . ఏ విధమైన మాలిన్యము లేని దానవు . ! హరిహరాదులకు కూడా తెలియబడనిదానివి ! అన్నింటికీ ఆధారమైన ఈ జగత్తునీలో ఒక అంశ మాత్రమే ! ఏ రకమైన మార్పులు లేని పరమ ప్రకృతివి నీవే ! మొదటి దానవు నీవే ! 

బాబు దేవీదాస్ రావు. -------

Panchaag


 

9, జూన్ 2025, సోమవారం

Panchaag