25, నవంబర్ 2025, మంగళవారం

ప్రేమ చాలా విలువైనది

 *నేటి సూక్తి*


*ప్రేమ చాలా విలువైనది ఆ విలువ తెలిసిన వారు ఎప్పటికీ మోసం చేయరు.* 


*క్రాంతి కిరణాలు*


*కం‌. ప్రేమన్నది విలువైనది*

*ప్రేమను మోసంబు లేక పెంచుము నెపుడున్*

*ప్రేమ విలువ తెలిసి కొనుచు* 

*నేమైనను చేయవలయు నిష్టము పెరుగున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

గమ్యం చేరలేము

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🏵️ *అడుగు వెయ్యకుంటే గమ్యం చేరలేము.. ప్రయత్నం లేకుండా విజయం సాధ్యం కాదు.. సంతోషం అనేది మనం ఎక్కడ ఉన్నామో కాదు.. మనం ఎలా జీవిస్తున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది.. అయ్యిందేదో మంచికే అయ్యింది.. అవుతున్నదేదో అది మంచికే అవుతుంది.. అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది.. నేనేమి పోగొట్టుకున్నానని నీవు విచారిస్తున్నావు?.. నేనేమి తెచ్చానని నీవు పోగొట్టుకున్నావు?.. నేనేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది.. నీవు ఏదైతే పొందావో అది ఇక్కడ నుండే పోదావు.. ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు.. ఈరోజు నీవు నా సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కాదా!!.. మరి రేపు మరొకరి సొంతం కాగలదు.. పరివర్తన చెందటం అనేది లోకం యొక్క పొగడ.. పరివర్తనను ఆనందంగా అంగీకరించాలంటే భగవంతుని ధ్యానం తప్పనిసరి*🏵️ కోరికలు, అత్యాశ అనేవి ప్రయాణంలో తీసుకువెళ్లే వస్తువులు వంటివి.. అవి అంత ఎక్కువ అయితే జీవిత ప్రయాణం అంత కష్టం గా ఉంటుంది🏵️🏵️మీ *అల్లంరాజు భాస్కర శర్మ శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3. గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినారకి రాలేను వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా మందులు పంపబడును వైద్య సలహాలు ఉచితం.9440893593.9182075510* 🙏🙏🙏

25నవంబర్ 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

   🍁 *మంగళవారం*🍁

*🌹25నవంబర్ 2025🌹*      

   *దృగ్గణిత పంచాంగం* 

                    

           *స్వస్తి శ్రీ విశ్వావసు* 

           *నామ సంవత్సరం*

 *దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్ల పక్షం*


*తిథి  : పంచమి* ‌రా 10.56 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : ఉత్తరాషాఢ* రా 11.57 వరకు ఉపరి *శ్రవణం*

*యోగం : గండ* మ 12.50 వరకు ఉపరి *వృద్ధి*

*కరణం  : బవ* ఉ 10.12 *బాలువ* రా 10.56 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.30 సా 05.30 - 06.30* 

అమృత కాలం  : *సా 05.00 - 06.45*

అభిజిత్ కాలం  : *ప 11.32 - 12.17*

*వర్జ్యం    : ఉ 06.35 - 08.19 & రా.తె 04.13 - 05.56*

*దుర్ముహూర్తం  : ఉ 08.32 - 09.17 రా 10.38 - 11.29*

*రాహు కాలం   : మ 02.43 - 04.08*

గుళికకాళం      : *ప 11.54 - 01.19*

యమగండం    : *ఉ 09.05 - 10.30*

సూర్యరాశి :*వృశ్చికం*                         

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 06.27*

సూర్యాస్తమయం :*సా 05.40*

*ప్రయాణశూల   : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.16 - 08.32*

సంగవ కాలం         :     *08.32 - 10.47*

మధ్యాహ్న కాలం    :    *10.47 - 01.02*

అపరాహ్న కాలం    : *మ 01.02 - 03.17*


*ఆబ్ధికం తిధి         : మార్గశిర శుద్ధ పంచమి*

సాయంకాలం        :  *సా 03.17 - 05.32*

ప్రదోష కాలం         :  *సా 05.32 - 08.05*

రాత్రి కాలం           :*రా 08.05 - 11.29*

నిశీధి కాలం          :*రా 11.29 - 12.20*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.35 - 05.26*

*****************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*


*యశోజయంచ మే దేహి* 

*శత్రూన్ నాశయ నాశయ*

*స్వాశ్రితానామ భయదం*  

*య ఏవం స్తౌతి మారుతిం*

*హానిమేతో భవేత్తస్య*  

*సర్వత్ర విజయీ భవేత్.!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

సంపూర్ణ మహాభారతము*

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🕉️సోమవారం 24 నవంబర్ 2025🕉️*


             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!


                            5️⃣4️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


    *సంపూర్ణ మహాభారతము* 

        

            *54 వ రోజు*                  

          *జరాసంధ వధ*```


శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలసి కపట బ్రాహ్మణ రూపాలలో కపట స్నాతక వ్రతం స్వీకరించారు. జరాసంధుని నగరమైన గిరివ్రజపురం సమీపించారు. ఆ పురం చుట్టూ ఉన్న పర్వతాలు ప్రాకారాలలా ఆ పురాన్ని రక్షిస్తున్నాయి. పక్కనే చైత్యకమనే కొండ ఉంది. దానిపై మూడు ఢక్కలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు భీమార్జునులకు ఆ ఢక్కలను చూపి “భీమా నగరంలోకి ఎవరన్నా కొత్త వారు ప్రవేశిస్తే ఆ ఢక్కలు మోగుతాయి” అని చెప్పాడు. భీమార్జునులు ఆఢక్కలను పగులకొట్టి చైత్యకపర్వత మార్గంలో నగరంలో ప్రవేశించారు. శ్రీకృష్ణుడు భీమార్జునులు సిగలో పూలు అలంకరించుకున్నారు. స్నాతకుల మాదిరి గోశాలలో ప్రవేశించారు. జరాసంధునికి బ్రాహ్మణులంటే భక్తిప్రపత్తులు మెండు కనుక బ్రాహ్మణులు రాజమందిరంలోకి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. బ్రాహ్మణవేషాలలో ఉన్న శ్రీకృష్ణుడు  భీమార్జునులకు అర్ఘ్యపాద్యాలను ఇచ్చాడు. వారు వాటిని పుచ్చుకోలేదు. జరాసంధుడు సందేహపడి వారిని “మీరు గంధపుష్పాలు ధరించినా స్నాతకులుగా లేరు. మీ ఆకారాలు క్షత్రియుల మాదిరి ఉన్నాయి. మీరు ఎవరు? ఎందుకు వచ్చారు?" అని అడిగాడు. 


అందుకు శ్రీకృష్ణుడు, భీమార్జునులు 

“మేము క్షత్రియ స్నాతకులము. ముఖద్వారం గుండా మిత్రుల ఇంటికి, దొంగ ద్వారం గుండా శత్రువుల ఇంటికి ప్రవేశించడం క్షత్రియ ధర్మం" అన్నారు. 


జరాసంధుడు "నేను ఎవరికీ అపకారం చేయలేదు. నేను బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు భక్తుడను. ఉత్తమ క్షత్రియ ధర్మాలు ఆచరిస్తున్నాను. మీకు నేనెలా శత్రువునైయ్యాను?" అన్నాడు. 


“ఓ జరాసంధా! ధర్మరాజు 

ఆజ్ఞపై శత్రుసంహారానికి వచ్చాము. ఉత్తమ క్షత్రియుడిని అని చెప్పుకుంటున్న నీవు క్షత్రియులను పట్టి బంధించి శివునకు బలి ఇచ్చి శివపూజలు ఎలా నిర్వహిస్తావు? ఉత్తమ క్షత్రియులు ఇలా చేస్తారా? నిష్కారణంగా సాధు హింస చేసే వారు, జనులను హింసించే వారు అందరికి శత్రువులు కారా? నిర్ధోషులైన సాటి కులం వారిని చంపడం పాపం కాదా. అలాంటి పూజలు ఫలిస్తాయా? నీలాంటి పాపులను విడిచి పెడితే మాకు పాపం వస్తుంది. కనుక నీతో యుద్ధానికి వచ్చాము. నేను కృష్ణుడిని, ఇతను భీముడు, అతడు అర్జునుడు. ఇప్పటికైనా చెరలో ఉన్న రాజులను విడిచిపెడితే సరి లేని యడల వీరు నీ గర్వమణచి వారిని విడిపించకలరు" అని శ్రీకృష్ణుడు అన్నాడు. 


జరాసంధుడు కోపించి “పరాక్రమంతో రాజులను జయించడం నేరమా. పరమ శివునకు బలి ఇవ్వడానికి తెచ్చిన వారిని నేను ఎందుకు

వదిలి పెడతాను. సైన్యంతో వస్తే సైన్యంతో యుద్ధం చేస్తాను. లేనియడల మీ ముగ్గురితో కానీ, ఇద్దరితో కానీ, ఒక్కరితో కానీ యుద్ధం చేస్తాను మీకు ఏది ఇష్టమో చెప్పండి" అన్నాడు. 


శ్రీకృష్ణుడు “ముగ్గురు నీతో యుద్ధం చేయడం ధర్మంకాదు. మా ముగ్గురిలో నీకు సరిజోడుని కోరుకో. అతను మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడు" అని అన్నాడు. 


జరాసంధుడు “నాకు సరిజోడు భీముడే. కనుక అతనితో యుద్ధం చేస్తాను" అని చెప్పాడు. 


జయాపజయాలు దైవాధీనం కనుక జరాసంధుడు ముందుగా అతని కుమారుడు సహదేవునికి రాజ్యాభిషేకం చేసాడు. పురోహితుల చేత మంగళ శాసనాలు పొంది భీముని మల్ల యుద్ధానికి పిలిచాడు. భీముడు-  జరాసంధుడు ఘోరంగా తలపడ్డారు. ఒకరిని ఒకరు జయించాలన్న కాంక్షతో ఒకరిని మించి ఒకరు భీకరంగా తల పడ్డారు. ఇలా కార్తీక శుద్ధ పాడ్యమి నుండి త్రయోదశి వరకు సాగింది. అప్పటికి జరాసంధుడు అలసి పోయాడు. 


శ్రీకృష్ణుడు “భీమా! జరాసంధుడు అలసి పోయాడు. ఇది తగిన సమయం, అతడిని సంహరించు!” అన్నాడు. 


భీమసేనుడు తన తండ్రి వాయుదేవుని తలచుకుని జరాసంధుని గిరా గిరా తిప్పి నూరు సార్లు విసిరి వేసాడు. అతడి ఎముకలు విరిచి ఘోరంగా సంహరించాడు. జరాసంధుని మృతదేహాన్ని అతని ముఖద్వారం ముందు పడవేశాడు.  


శ్రీకృష్ణుడు మగధవాసులకు అభయం ఇచ్చాడు. జరాసంధుని చెరలో ఉన్న రాజులను విడిపించాడు. జరాసంధుడి కుమారుడైన సహదేవునికి ధైర్యం చెప్పాడు.తరువాత వారు ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. ధర్మరాజుకు జరిగినది చెప్పి విడిపించిన రాజులను చూపించాడు. రాజులంతా వారి వారి రాజ్యాలకు పయనమయ్యారు.  శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

జీవనోపాధి

  జీవనోపాధి

ఇప్పుడు మనము తెలుసుకొని పోయేటువంటి జీవనోపాధి మధ్యతరగతి లేక దిగువ మధ్యతరగతి యువతులు తమ భర్తలకి అండగా ఉండి కొంత సంపాదన చేయాలి అనేటువంటి కాంక్ష ఉన్న వాళ్ల కోసం కేటాయించుకున్నటువంటిది

తక్కువ పెట్టుబడితో చేసుకునేటువంటి ఒక చిరు వ్యాపారం దీనికి ప్రారంభంలో ఒక వెయ్యి లేక రెండు వేల లోపు గానే ఖర్చవుతుంది కావాల్సింది ఏమిటి ఎలా చేయాలి ప్రతిదీ వివరంగా తెలుసుకుందాం

ఈ రోజుల్లో ప్రతివారు ఉదయం పూట ఏదో ఒక ఫలహారం చేస్తూ ఆఫీసుకు లేక తమ తమ వ్యాపారాలకు వెళ్లడం కద్దు చాలా మటుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్లు లేక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాళ్ళు వాళ్ళ పని సమయాలను బట్టి ఇంట్లో ఫలహారాలు చేసుకోవటం కొంతమందికి చాలా కష్టంగా పరిణమిస్తున్నది అందుకనే దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అని ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం అర్రులు చాస్తూ ఉన్నారు కొంతమంది తాము సొంతంగా ఫలహారాలు చేసుకోలేక పోవటం చేత దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్ కి వెళ్లి ఫలహారాలని ప్యాక్ చేసుకొని తెచ్చుకొని తింటున్నారు ఇంకా కొంతమంది ఓపిక చేసుకొని ఇంట్లోనే దోశల పిండి ఇడ్లీ పిండి తయారు చేసుకుని రెండు మూడు రోజులు దోసెలు లేక ఇడ్లీలు చేసుకోవటం మనందరికీ తెలిసినదే ఇంట్లో దోసెలు లేక ఇడ్లీలు చేసుకుంటే బయట ఫలహారసాల నుండి తెచ్చుకున్న ఇడ్లీలు లేక దోసెల కన్నా చాలా తక్కువ ఖరీదుకే చేసుకోవచ్చు కాకపోతే అది కొంత శ్రమతో కూడుకున్న పని కాబట్టి ఈరోజుల్లో దోసెలు చేసుకోవటానికి కానీ ఇడ్లీలు చేసుకోవటానికి గాని అప్పటికప్పుడు రెడీమేడ్ గా రుబ్బినటువంటి పిండి మనకు కొన్ని ప్రదేశాలలో జరుగుతున్నా యి నాకు తెలిసినంత మటుకు హైదరాబాదులో సూపర్ మార్కెట్లలో ఈ పిండ్లు జరుగుతున్నట్లు సమాచారం ఈరోజు నేను బెంగళూరులో ఒక మహిళ ఇడ్లీ పిండి అమ్మడం చూసి ఈ పోస్టు పెడుతున్నాను ఆమె రెండు మూతలు ఉన్నటువంటి బకెట్లను తీసుకొని వాటిని రెండు లాస్టిక్ స్టూళ్లమీద పెట్టుకొని ఒక స్టీలు డబ్బా మరియు ఒక కొల పాత్ర కొన్ని ప్లాస్టిక్ సంచులు అంటే కవర్లు పెట్టుకొని ఉన్నది ఒక కుల పాత్రడు పిండి ఆమె 50 రూపాయలకి అమ్ముతున్నది దానికి కొంచెం నీళ్లు కలుపుకొని దోశల పిండి లాగా చేసుకుని దోసెలు చేసుకోవచ్చు లేదా ఆ పిండిని అదే విధంగా ఇడ్లీల పాత్రలో వేసుకొని ఇడ్లీలు చేసుకోవచ్చు ఇక్కడ మన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం సహజంగా చేసుకునేటువంటి ఇడ్లీ పిండి మినప పిండిని రుబ్బుకొని అందులోపడా ఇడ్లీ రవ్వని కలుపుకొని తయారు చేసుకుంటాం కానీ ఇక్కడి వాళ్ళు అట్లా కాకుండా మినప్పప్పు నీ నానబెట్టి దానికి ఇడ్లీ బియ్యం అని ప్రత్యేకంగా కొంచెం లావుగా ఉండే బియ్యం దొరుకుతాయి వాటిని కలిపి అవి కూడా నానబెట్టి రెండిటిని కలిపి మిషన్ లో రుబ్బుతారు అట్లా రుబ్బిన పిండిని అటు ఇడ్లీలు తయారు చేసుకోవటానికి ఇటు దోసెలు తయారు చేసుకోవడానికి ఉభయాత్ర ఉపయోగిస్తారు

ఆమె తీసుకున్నా రెండు మూత ఉన్న బకెట్లలో ఒక బకెట్లో చాలా చిక్కగా ఉన్నటువంటి పిండి ఉన్నది రెండవ బకెట్లో నీళ్లు కలిపి జావగా చేసి ఉన్నటువంటి పిండి ఉన్నది అంటే ఆ పిండి అమ్మటానికి సిద్ధంగా ఉన్న పిండి అన్నమాట ఈ బకెట్లో ఉన్న పిండి పూర్తిగా అమ్మిన తర్వాత చిక్కగా ఉన్న పిండిలో నీళ్లు కలిపి మళ్ళీ ఈ రెండో బకెట్లోకి మార్చి ఇది కూడా అమ్మటం చేస్తుంది అంటే దాన్ని బట్టి నాకు తెలిసిందేమిటంటే చిక్కగా ఉన్న పిండిని నీళ్లు కలపటం వల్ల ఒక బకెట్ పిండి రెండు లేక అంతకన్నా ఎక్కువ బకెట్ల పిండిగా తయారవుతుందన్నమాట అంటే ఆమె ఒక కుల పాత్రను పట్టుకొని దానిని ఆ పిండి నిండా నింపుకొని ఒక స్టీల్ గిన్నెలో ప్లాస్టిక్ కవర్ పెట్టి ఆ కవర్ లోపల పిండిని పెట్టి ప్యాక్ చేసి ఇస్తున్నది ఒక పాత్రడు పిండి 50 రూపాయలని ముందే చెప్పుకున్నాం. అట్లా ఆ రెండు బకెట్లలో పిండి అమ్ముతే ఆమెకు దాదాపు ఒక 50 లేక అంతకన్నా ఎక్కువ కొలపాత్రలపిండి అవుతుండవచ్చు అంటే 50 రూపాయలు ఇంటూ 50 అంటే మనకు 2500 నుంచి 3000 రూపాయల దాకా ఆ పిండి అమ్మడం వల్ల లాబించవచ్చు అని అంచనా వేసుకోవచ్చు

పిండి తయారు చేసుకోవడానికి కావలసిన ముడి సరుకులు మినప్పప్పు లేక మినప గుండ్లు ఒక రెండు కిలోలు ఒక మూడు లేక నాలుగు కిలోల ఇడ్లీ బియ్యం కావాలి

కిలో మినప గుండ్లు 150 రూపాయల చొప్పున లెక్కిస్తే రెండు కిలోలకి 300 రూపాయలు అవుతాయి అదే విధంగా కిలో ఇడ్లీ బియ్యం 70 రూపాయలు చొప్పున చూసుకుంటే నాలుగు కిలోలకి 280 రూపాయలు బియ్యం ఖర్చు అవుతాయి వెరసి ఒక 700 రూపాయలు దాకా ముడి సరుకు ఖర్చవుతుంది ఒక రవంత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ రుబ్బినందుకు మొదట్లో రుబ్బుడు మిషన్ ఉండకపోయినా పర్వాలేదు ఈరోజుల్లో ప్రతి కాలనీలో రుబ్బుడు మిషన్ అద్దెకు దొరుకతున్నాయి 





భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ।

ఉభయోరపి దృష్టోఽన్తః త్వనయోస్తత్త్వదర్శిభిః ।। 16 ।।


ప్రతిపదార్థ: 


న — కాదు; అసతః — తాత్కాలికమైనదానికి; విద్యతే — ఉన్నది; భావః — ఉనికి; న — లేదు; అభావః — అంతం; విద్యతే — ఉన్నది; సతః — శాశ్వతమైనదానికి; ఉభయో — రెంటిలో; అపి — మరియు; దృష్టః — చూడబడినది; అంతః — సారాంశం; తు — నిజముగా; అనయోః — వీటిలో; తత్త్వ — వాస్తవమును; దర్శిభిః — జ్ఞానదృష్టికలవారిచే.


తాత్పర్యము :r


అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్త్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు.


 వివరణ:


శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రకారం, ఒక మూడు అస్తిత్వములు ఉన్నవి.


భోక్తా భోగ్యం ప్రేరితారం చ మత్వా


సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్ (1.12)



క్షరం ప్రధానమమృతాక్షరం హరః


క్షరాత్మానా వీశతే దేవ ఏకః (1.10)



సంయుక్తమేతత్ క్షరమక్షరం చ


వ్యక్తావ్యక్తం భరతే విశ్వమీశః (1.8)


 


ఈ వేద మంత్రములు అన్నీ ప్రతిపాదించేది ఏమిటంటే - భగవంతుడు, జీవాత్మ, మరియు మాయ – ఈ మూడూ కూడా నిత్యము, శాశ్వతము.


1. భగవంతుడు నిత్యశాశ్వతుడు, అంటే ఆయన సత్ (ఎల్లప్పుడూ ఉంటాడు). అందుకే వేదాల్లో ఆయనకు ఒక పేరు సత్-చిత్-ఆనంద స్వరూపుడు (నిత్యుడు-జ్ఞానస్వరూపుడు- ఆనంద సింధువు).


2. ఆత్మ నాశనములేనిది. అందుకే అది 'సత్'. కానీ, ఈ శరీరం ఏదో ఒక రోజు నశిస్తుంది అందుకే ఇది 'అసత్' (తాత్కాలికం). ఆత్మ కూడా సత్-చిత్-ఆనంద రూపమే కానీ ఇది 'అణు' (అతి సూక్ష్మమైన) మాత్రమే. కాబట్టి ఇది అణు-సత్, అణు-చిత్, అణు-ఆనంద స్వరూపము.


3. దేని నుండి అయితే ఈ జగత్తు సృష్టించబడిందో, ఆ 'మాయ' కూడా నిత్యమైనదే లేదా 'సత్'. కానీ, మన చుట్టూ కనిపించే అన్నీ భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవే, మళ్ళీ అవి కాలంలో నశిస్తాయి. ఈ విధంగా అవన్నీ కూడా 'అసత్' లేదా తాత్కాలికమైనవి అని చెప్పవచ్చు. భౌతిక ప్రపంచం 'అసత్' అయినా, మాయ మాత్రం 'సత్'.


ఈ ప్రపంచం 'అసత్' అన్నప్పుడు దాన్ని 'మిథ్య' అని తప్పుగా అనుకోవద్దు. అసత్ (తాత్కాలికము) అంటే మిథ్య (లేనిది) కాదు. కొంత మంది తత్త్వ వేత్తలు ఈ ప్రపంచం 'మిథ్య' (ఉనికి లేనిది) అంటారు. వారు ఏమంటారంటే, మనలోని అజ్ఞానం వల్లనే మనకు అన్నీ ఉన్నట్టు అనిపిస్తున్నాయని, మనం బ్రహ్మ జ్ఞానంలో స్థితులమై ఉంటే, ఈ జగత్తు ఉనికి ఉండదు అని. కానీ, ఇది గనక నిజమే అయితే, బ్రహ్మ జ్ఞానులకు ఈ జగత్తు కనుమరుగైపోవాలి. వారు తమ అజ్ఞానాన్ని నశింపచేసుకున్నారు కాబట్టి ఈ ప్రప్రంచం ఉనికి వారికి ఉండకూడదు. మరి అప్పుడు ఆ మహాత్ములు భగవత్-ప్రాప్తి నొందిన తర్వాత కూడా పుస్తకాలు ఎందుకు, ఎలా రాసారు? పెన్ను, పేపరు ఎక్కడ నుండి వచ్చాయి? బ్రహ్మ-జ్ఞాన పరులు ఈ జగత్తుకు చెందిన వస్తువులు వాడటం బట్టి, ఈ జగత్తు వారికి కూడా ఉన్నదని తెలుస్తున్నది. అంతేకాక, బ్రహ్మ జ్ఞానులకు కూడా తమ శరీర పోషణకు ఆహారం అవసరమే. వేదాల్లో 'పశ్వాదిభిశ్చావిశేషత్’ అని చెప్పబడింది. ‘అన్ని ప్రాణులలాగానే బ్రహ్మ-జ్ఞానులకు కూడా ఆకలి వేస్తుంది, వారు కూడా ఆహారం తినాలి.’ ఈ జగత్తు ఉనికి వారికి లేకపోతే వారు ఎలా మరియు ఎందుకు ఆహారం భుజించాలి?


ఇంకా, తైత్తిరీయ ఉపనిషత్తులో పలుమార్లు, ఈ జగత్తు అంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పబడింది.


సోఽకామయత బహు స్యాం ప్రజాయేయేతి స తపోఽతప్యత స


తపస్తప్త్వా ఇదంసర్వమసృజత యదిదం కిం చ తత్సృష్ట్వా


తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య సచ్చ త్యచ్చాభవత్


నిరుక్తం చానిరుక్తం చ నిలయనం చానిలయనం చ విజ్ఞానం


చావిజ్ఞానంచ సత్యం చానృతం చ సత్యమభవత్ యదిదం


కిం చ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి (2.6.4)


 


భగవంతుడు ఈ జగత్తుని సృష్టించడమే కాదు, ప్రతి పరమాణువులో వ్యాపించి ఉన్నాడు అని ఈ వేద మంత్రం, ప్రతిపాదిస్తున్నది. భగవంతుడు ప్రతి పరమాణువులో వాస్తవంగా ఉన్నట్లయితే, ఈ ప్రపంచం లేకుండా ఎలా ఉంటుంది? ఈ జగత్తు మిథ్య అనటం, భగవంతుడు ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న నిజాన్ని వ్యతిరేకించటమే అవుతుంది. ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, జగత్తుకి ఉనికి ఉంది కానీ అది అనిత్యము, అశాశ్వతము అని వివరిస్తున్నాడు. అందుకే దీనిని 'అసత్' లేదా 'తాత్కాలికము' అన్నాడు; దాన్ని మిథ్య లేదా 'లేనిది' అనలేదు

పంచాంగం 25.11.2025 Tuesday,

 ఈ రోజు పంచాంగం 25.11.2025 Tuesday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస శుక్ల పక్ష పంచమి తిథి భౌమ వాసర ఉత్తరాషాఢ నకత్రం గండ యోగః బవ తదుపరి బాలవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు. 

  

 

శ్రాద్ధ తిథి: పంచమి

 


నమస్కారః , శుభోదయం

25-11-2025 మంగళవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

25-11-2025 మంగళవారం రాశి ఫలితాలు


మేషం


చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------


వృషభం


ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. 

---------------------------------------


మిధునం


వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు.

---------------------------------------


కర్కాటకం


దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------


సింహం


ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దాయదులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి.

---------------------------------------


కన్య


మిత్రుల కలయిక మరింత ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------


తుల


దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన పనులలో అధిక శ్రమ ఫలితాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------


ధనస్సు


ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.

---------------------------------------


మకరం


చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

---------------------------------------


కుంభం


ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలు ఉన్నవి.

---------------------------------------


మీనం


ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

---------------------------------------

పెళ్ళి లో ఖర్చులు

 *పెళ్ళి లో ఖర్చులు తగ్గించడమే ప్రధాన ఉద్దేశ్యం, ఎందుకంటే పెళ్ళి వలన ఎవరూ అప్పులతో బాధపడకూడదు, అలాగే భార్యాభర్తల గొడవలు కోర్టుల దాకా వస్తున్నందు వలన, పెళ్ళి వీలైనంత తక్కువ ఖర్చుతో ముగించడమే మంచిది.*

⭐⭐⭐ కేవలం ముఖ పరిచయం ఉన్న అందరిని వేల సంఖ్యలో పిలవడం (పిలిచిన వారు ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు. Attend అయిన వారికి 6 నెలల తరువాత అసలు సదరు పెళ్లికి వెళ్లామని కూడా గుర్తుండదు)

⭐⭐⭐ ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళి అంత ఆర్భాటం చేయడం. (కాబోయే వధూవరులను, పెళ్లి కాకుండానే, ఒక చోట కూర్చోపెట్టి, ఆహ్వానితులకు అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమనడం)

⭐⭐⭐ పెళ్లి కాకుండానే pre wed photo shoot అని సినిమా లెవెల్లో వింత, సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు photos కి pose. ఇంకా ఆ photos(కొన్ని intimate వి) కూడా పెళ్లి తంతులో భాగంగా పెద్ద TV screen పైన ప్రదర్శించడం. పనికిమాలిన మంగళ స్థానం పేరున అమ్మాయిని నడి బజారులో కూర్చోబెట్టి అందరి ముందు తల స్నానం చేయించడం ఏమిటి నీతిమాలిన సంస్కృతి. ఈ మధ్య చిన్న పిల్లలను సైతం వధూవరులుగా అలంకరించి నడి బజార్లో మంగళ స్థానాలు చేయడం, స్టేజీల పైన కూర్చోబెట్టి ఆర్భాటాలు చేసి వారికి చిన్నప్పటి నుండే పెద్దరికం కట్టబెట్టడం చూస్తుంటే ఇది ఒక వింత ఆచారంగా భావించాల్సి వస్తుంది. దేశంలో ఎక్కడలేని ఈ వింత సంస్కృతి ఈమధ్య మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నది. దీన్ని రాబోవు తరాలు తగ్గించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

⭐⭐⭐ పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డెకరేషన్ 10 గంటల్లో, ఇంకో ఫంక్షన్ ఉంటే పీకి పారేయడం.

⭐⭐⭐ Photos Natural (candid) గా, తీయకుండా photographer కోసమే పెళ్లి చేసుకున్నట్టు, వాడు చెప్పిన వింత భంగిమల్లో pose ఇచ్చి ఫోటోల పరమార్ధం లేకుండా పోయింది. (photographer bill కూడా లక్షల రూపాయలు)

⭐⭐⭐ పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి, జీవితంలో మళ్ళీ ఇంకో function కి వాడకుండా, డబ్బు వృధా చేయడం

⭐⭐⭐ భోజనాల పేరుతో, సమయంతో నిమిత్తం లేకుండా, అల్పాహారం, chat, 20 రకాల స్వీట్స్, 50 రకాల వంటకాలు, 10 రకాల fruits, 5 రకాల డిసెర్ట్స్ (ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు, ఆహుతులు, అన్ని తినే ప్రయత్నం చేయడం ఒక వింత. భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు)

⭐⭐⭐ పెళ్లి తంతు తరువాత కిలోమీటర్ క్యూలో నిలబడి, స్టేజి ఎక్కి, మొక్కుబడిగా అక్షింతలు, వధూవరుల నెత్తిన చల్లి, వాటిని బూట్లు తొడుకున్న కాళ్లతో తొక్కి, photos కి pose ఇవ్వడం ఆ (photos జీవితంలో ఎవరికి చూసే తీరిక కూడా ఉండదు), అనే ప్రక్రియ కూడా ఆక్షేపనీయం.

⭐⭐⭐ పెళ్లి జరిపించే పంతుళ్ళు మాటలను, శ్లోకాలను పట్టించుకోకుండా, కెమెరామాన్లు, వీడియో గ్రాఫర్ల భంగిమల కోసం జరుగుతున్న తంతు ఒక చిత్రాతి విచిత్రం.

⭐⭐⭐ DJ MUSIC అనే పేరుతో, చెవులు, మెదడు భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో, అర్థం పర్థం లేని సినిమా పాటలు.

⭐⭐⭐ కర్ణ కఠోరంగా పాడే orchestra బృందం (వీళ్లు కూడా భయంకరమైన సౌండ్ లెవెల్స్ maintain చేస్తారు).

⭐⭐⭐ ఇంకా mehendi అని ,సంగీత్ అని, bachelor పార్టీ అని , అదనపు ఈవెంట్స్.

⭐⭐⭐ మద్యంతో కూడిన విందైతే, హాజరు 110%(బందు మిత్ర సపరివారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్ గా పాటిస్తారు)

⭐⭐⭐ ఒక పెగ్గు కెపాసిటీ వాడు 3 పెగ్గులు, 3 పెగ్గుల కెపాసిటీ వాడు 10 పెగ్గులు లాగేస్తారు.

⭐⭐⭐ తదనంతరం పెళ్ళికొడుకు ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్ పూజ పవిత్రత మంట కలుపుతూ, మాంసాహార వంటలతో, మళ్ళీ పెళ్లి నాటి ప్రహసనం రిపీట్.

⭐⭐⭐ ఇంకా హనీమూన్ అనే కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్స్ (ఇది కూడా లక్షల్లో)

⭐⭐⭐ ఇక గిఫ్ట్స్ పేరుతో వచ్చే తాత్కాలిక వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు.

⭐⭐⭐ అందుకని పగ తీర్చుకొనేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు, పచ్చడి సీసాలు వగైరా ఇవ్వడం.

⭐⭐⭐ పైన చెప్పినవన్నీ మధ్యతరగతి వారు, తాహతుకి మించి, ఈ మధ్య విపరీతంగా పాటిస్తు, అప్పుల పాలవుతున్నారు

⭐⭐⭐ ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ, ఎదుటివారి ఆడంబరాలను చూసి మేము సైతం అని అప్పులు చేసి బంధువర్గాలకు మొక్కుబడిగా ఫోన్చేసి మేము పిలిచాము అని చాటింపు చేసుకొని, ఇతర ముఖ్యమైన పనుల వల్ల ఫంక్షన్ కి వెళ్ళని వారితో కక్షలు పెంచుకోవడం ఎక్కడి సంస్కృతి. అందుకే మన ఆడంబరాలకు ఇతరులను ఇబ్బంది పెట్టడం మానుకుందాం ముఖ్యమైన ఫంక్షన్లకు మాత్రమే బంధువులందరిని ఆహ్వానిద్దాం చిన్న చిన్న ఫంక్షన్లను కుటుంబంలోనే చేసుకుందాం.

⭐⭐⭐ రెండు కుటుంబాల కలయికని కొత్త బంధువులని ఆర్దికంగా కృంగదీయకండి. ఉన్నంతలో వేడుకని బాగా చేసుకోండి. వేరే వారి వేడుకలతో పోల్చుకోకండి. ఎందుకంటే దేశంలో ధనవంతులతో పోటీపడి వివాహవేడుకలో చూపించుకోకూడదు. మనకి ఉన్నది దానిలో చేసుకోవడం వలన, పిల్లలకి ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. 

⭐⭐⭐ ఆర్థికంగా వెనుకబడకండి. పెళ్ళి అనేది వధూవరుల తల్లిదండ్రులకి భారం అవ్వకూడదు. కొత్త దంపతులకి ఆర్థిక భరోసా ఇవ్వండి. పిల్లలు ఫుట్టడానికి హాస్పిటల్స్ కి ఖర్చులు పెట్టా ల్సిన దుస్దిలో ఉన్నాము. పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఆస్తులు ఇవ్వడం, బంగారు ఇవ్వడం కోసం, పెళ్ళి ఖర్చులను ఆదాచేయండి. 

      ||సర్వేజనాః సుఖినో భవంతు||

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం - పంచమి - ఉత్తరాషాఢ -‌‌ భౌమ వాసరే* (25.11.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*