9, జూన్ 2025, సోమవారం

Panchaag


 

సమస్యా పూరణలు ★★★ సమస్య.గొజ్జె దున్నాయె, మేకలు బజ్జెలాయె. 1] తే.గీ. "దున్నగొజ్జె - బజ్జెలు- మేకలన్ని" యనుచు, చెప్పుమని బల్కె గురుడది, - శిష్యునొకని, వాడు- తత్తఱబిత్తజై పలుకనపుడు, గొట్టెదున్నాయె,మేకలు బజ్జెలాయె. 2] అల్పబుద్ధులు– తామెప్పుడధికమనుచు, కోరి, వ్యాప్తికై –డప్పాల గొట్టుకొనుచు, విర్రవీగెడు కాలమ్ము పెరిగెనపుడు, గొట్టెదున్నాయె– మేకలు బజ్జెలాయె. 3] "పాకు"గొజ్జెయు– మితిమీరి వాగుచుండె, "బంగ్ల"మేకలు –గతిదప్పి వచ్చుచుండె, భరతసింహమ! నీవింక వదలబోకు! గొట్టెదున్నాయె మేకలు బజ్జెలాయె. సురభి శంకరశర్మ, అష్టావధాని.

 M


★★★


సమస్య.గొజ్జె దున్నాయె, మేకలు బజ్జెలాయె.


1] తే.గీ. "దున్నగొజ్జె - బజ్జెలు- మేకలన్ని" యనుచు, చెప్పుమని బల్కె గురుడది, - శిష్యునొకని, వాడు- తత్తఱబిత్తజై పలుకనపుడు, గొట్టెదున్నాయె,మేకలు బజ్జెలాయె.


2] అల్పబుద్ధులు– తామెప్పుడధికమనుచు, కోరి, వ్యాప్తికై –డప్పాల గొట్టుకొనుచు, విర్రవీగెడు కాలమ్ము పెరిగెనపుడు, గొట్టెదున్నాయె– మేకలు బజ్జెలాయె.


3] "పాకు"గొజ్జెయు– మితిమీరి వాగుచుండె, "బంగ్ల"మేకలు –గతిదప్పి వచ్చుచుండె, భరతసింహమ! నీవింక వదలబోకు! గొట్టెదున్నాయె మేకలు బజ్జెలాయె.


సురభి శంకరశర్మ, అష్టావధాని.

⚜ శ్రీ సుందరనారాయణ ఆలయం

 🕉 మన గుడి : నెం 1137


⚜ మహారాష్ట్ర : నాసిక్


⚜  శ్రీ  సుందరనారాయణ ఆలయం



💠 గంగా ఘాట్ సమీపంలో ఉన్న పురాతన ఆలయాలలో ఇది ఒకటి. గంగాధర్ యశ్వంత్ చంద్రచూడ్ దీనిని 1756లో నిర్మించారు. 

లక్ష్మి మరియు  సరస్వతితో పాటు విష్ణువు ప్రధాన దేవత. 


💠 ఈ ఆలయాన్ని "సుందర నారాయణ (విష్ణువు)" అని పిలవడానికి ప్రధాన కారణం, ఒకసారి జలంధర్ (దుష్ట రాక్షసుడు) భార్య వృంద ఇచ్చిన శాపం వల్ల విష్ణువు వికారంగా మారాడు.


💠 పురాణాల ప్రకారం, ఈ ప్రాంతం ఒకప్పుడు శివునికి అత్యంత భక్తుడైన జలంధర్ అనే దుష్ట రాక్షసుడిచే వెంటాడబడే ప్రదేశం. 

ఆ రాక్షసుడు క్రూరంగా ఉండి దుష్ట పనులు చేసినప్పటికీ, అతనికి ధర్మబద్ధమైన మరియు సద్గుణవంతురాలైన భార్య వృందా దేవి ఉండేది. 

అతని భక్తికి శివుడు ఎంతో ఆకర్షితుడై ఆ రాక్షసుడికి అమరత్వం అనే వరం ఇచ్చాడు. ఈ వరం జలంధర్ ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించేలా చేసింది.


💠 మానవాళిని రక్షించడానికి రాక్షసుడిని చంపడం ఎంత ముఖ్యమో దేవతలు గ్రహించారు. 

ఈ గొప్ప పనిలో సహాయం చేయడానికి దేవతలు విష్ణువును సంప్రదించారు. జలందర్ భార్య యొక్క పవిత్రత మరియు భక్తి అతని జీవితానికి కవచంగా పనిచేస్తుందని విష్ణువు అర్థం చేసుకున్నాడు. 


💠 విష్ణువు జలందర్ రూపాన్ని స్వీకరించి తన భార్యతో జీవించడం ప్రారంభించాడు.

అతను జలందర్‌ను చంపాడు. జలందర్ భార్య దేవి వృంద ఈ విషయం తెలుసుకున్నప్పుడు, ఆమె విష్ణువును నల్లగా మరియు వికారంగా మారమని శపించింది. 

ఆ స్త్రీ శాపం అతన్ని నల్లగా మార్చింది మరియు అతను తన అసలు రూపాన్ని తిరిగి పొందడానికి గోదావరి నదిలో పవిత్ర స్నానం చేయాల్సి వచ్చింది. 

తన అసలు రూపాన్ని తిరిగి పొందిన తర్వాత, విష్ణువును సుందరనారాయణ అని పిలుస్తారు.


💠 ఈ ఆలయం ముఖ్యంగా మొఘల్ శిల్పంతో ముడిపడి ఉన్న వంపుతిరిగిన గూడును ప్రదర్శిస్తుంది. 

తూర్పు ముఖంగా ఉన్న ఆలయంలో తోరణాలు మరియు గోళాకార గోపురాలతో కూడిన మూడు వరండాలు ఉన్నాయి. 


💠 లక్ష్మీ మరియు సరస్వతితో చుట్టుముట్టబడిన ప్రధాన దేవత విష్ణువును గర్భగుడిలో ఉంచారు. గోడలపై హనుమంతుడు, నారాయణ మరియు ఇందిరల చిన్న శిల్పాలు ఉన్నాయి. 


💠 ఈ ఆలయం గురించి అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే ఇది నిర్మించబడిన కోణం. 

ప్రతి సంవత్సరం మార్చి 21న ఉదయించే సూర్యుని కిరణాలు మొదట విగ్రహాలపై నేరుగా పడతాయి. ఈ పవిత్ర కార్యక్రమాన్ని చూడటానికి ఈ రోజున వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.


💠 ఇది మరాఠా నిర్మాణ శైలిలో మరియు హేమద్‌పంతి నిర్మాణ శైలిలో సంక్లిష్టమైన పనితనంతో పూజకు అత్యంత పురాతనమైన ఆలయాలలో ఒకటి. 

గర్భగుడి ప్రాంతంలో విష్ణువు యొక్క అందమైన విగ్రహం ఉంది, ఇది సాధారణంగా పండుగల యొక్క వివిధ దశలలో పండ్లు మరియు పువ్వులతో అలంకరించబడుతుంది. 

ముఖ్యంగా పండుగలు లేదా రామ నవమి మరియు కార్తీక పూర్ణిమ వంటి ఇతర వేడుకల సమయంలో ప్రజలు పూజించడానికి అక్కడికి వెళతారు. మతపరమైన ప్రదేశం కావడంతో, ఆలయ వాతావరణం ప్రశాంతంగా మరియు ఆధ్యాత్మికంగా ఉంటుంది.


💠 దాని నిర్మాణ నిర్మాణాన్ని పరిశీలిస్తే, సుందరనారాయణ ఆలయానికి శతాబ్దాల పురాతన చరిత్ర ఉందని స్పష్టంగా తెలుస్తుంది. 

ఈ స్మారక చిహ్నం నిర్మాణం 13వ శతాబ్దంలో యాదవుల పాలనలో జరిగిందని చెబుతారు, తద్వారా సమకాలీన భవన నిర్మాణ శైలులను ప్రతిబింబిస్తుంది. అప్పటి నుండి ఈ ఆలయం కొన్ని నిర్మాణాత్మక మార్పులు మరియు సౌందర్య మెరుగుదలలకు గురైంది, అదే సమయంలో సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను నిలుపుకుంది.


💠 విష్ణువు ఆలయం కావడంతో, ఈ ఆలయం మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన ప్రార్థనా స్థలాలలో ఒకటి మరియు ముఖ్యమైన యాత్రా కేంద్రంగా ఉంది. చారిత్రాత్మకంగా, శతాబ్దాల క్రితం కూడా ఆచరణలో ఉన్న సంప్రదాయాలు మరియు ఆచారాలను తగిన గౌరవంతో నిర్వహించడం ద్వారా ఇది నాసిక్ యొక్క మతపరమైన జీవితానికి అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.


💠 సమయాలు: 

ఉదయం 6 - మధ్యాహ్నం 12 మరియు సాయంత్రం 5 - రాత్రి 9 గంటల వరకు.



💠 నాసిక్ సెంట్రల్ బస్ స్టేషన్ నుండి 2 కి.మీ దూరంలో, సుందరనారాయణ ఆలయం నాసిక్ లోని పంచవటి ప్రాంతంలోని రామ్ కుండ్ సమీపంలోని అహిల్యబాయి హోల్కర్ వంతెన మూలలో ఉంది.



 రచన

©️ Santosh Kumar

18-09-గీతా మకరందము

 18-09-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక -ఇక సాత్త్వికత్యాగమును వివరించుచున్నారు-


కార్యమిత్యేవ యత్కర్మ 

నియతం క్రియతేఽర్జున ! | 

సఙ్గం త్యక్త్వా ఫలం చైవ 

స త్యాగస్సాత్త్వికో మతః || 


తాత్పర్యము:- ఇది చేయదగినదియే యని తలంచి శాస్త్రనియతమగు ఏ కర్మము అభిమానము, ఫలము విడిచిపెట్టబడి చేయబడుచున్నదో అట్టి (కర్మమందలి సంగఫల) త్యాగము సాత్త్వికత్యాగమని నిశ్చయింపబడినది.


వ్యాఖ్య:- త్యాగమనగా సంగత్యాగమేకాని, ఫలత్యాగమేకాని కర్మత్యాగముకాదని ఈశ్లోకముద్వారా స్పష్టముగ వెల్లడియగుచున్నది. మఱియు “కార్యమ్" అని చెప్పినందువలన శాస్త్రనియతమగు కర్మ మనుజుడు తప్పక చేయవలెననియే బోధితమగుచున్నది. తామసుడు శాస్త్రవిధి తెలియక దాని నాచరించకనుండును. రాజసుడు తెలిసియు ఆచరించుట కష్టమని భావించి దానిని చేయకుండును. సాత్త్వికుడు తెలిసియు, కష్టములకు జంకక - సంగమును, ఫలమును త్యజించి దాని నాచరించును. సాత్త్వికునిదే ఉత్తమపద్ధతియనియు, ఆతడు కావించిన త్యాగమే ఉత్తమత్యాగమనియు ఈశ్లోకముద్వారా విదితమగుచున్నది. కావున అద్దానినే విజ్ఞులవలంబించవలెను.


ప్రశ్న:- సాత్త్వికత్యాగముయొక్క లక్షణమేమి?

ఉత్తరము: - శాస్త్ర నియతమగు కర్మను, "ఇది తప్పక చేయవలెను" అని యెంచి ఫలమును, సంగమును (ఆసక్తిని) వదలివైచి చేయుట సాత్త్వికత్యాగమనబడును.

తిరుమల సర్వస్వం -265*

 *తిరుమల సర్వస్వం -265*

 *శ్రీవారి సంవత్సర సేవలు - 2* 

2 *ఈ ఉత్సవాలు శ్రావణశుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి దినాలలో; సంపంగిప్రాకారంలో నున్న శ్రీవేంకటరమణుని కళ్యాణమంటపంలో జరుగుతాయి.*


 ముందురోజు సాయం సమయాన విష్వక్సేనుల వారు వసంతోత్సవ మండపం చేరుకుంటారు. అక్కడ మృత్సంగ్రహణం (పుట్టమన్ను సేకరించడం), అంకురార్పణ జరిగిన తరువాత పవిత్రోత్సవాలు ప్రారంభ మవుతాయి.


 మొదటి రోజైన దశమి నాడు 'పవిత్రాల ప్రతిష్ఠ', శాంతిహోమాలు, ఉభయదేవేరిసహిత మలయప్పస్వామి వారికి అభిషేకాలు, రాత్రివేళలో పూర్ణాహుతి అర్పించడంతో మొదటిరోజు ఉత్సవాలు ముగుస్తాయి.


 రెండవరోజైన ఏకాదశి నాడు పూర్ణాహుతి పూర్తయిన తరువాత; ఆలయం లోపల, బయటా ఉన్న ఉపాలయాలకు, బలిపీఠం మరియు ధ్వజస్తంభానికి పవిత్రాల సమర్పణ జరుగుతుంది. తదనంతరం పూర్ణాహుతితో రెండవరోజు కార్యక్రమం ముగుస్తుంది.


 మూడవరోజు విశేషహోమం మరియు పూర్ణాహుతితో మూడురోజుల పవిత్రోత్సవాలు సుసంపన్నమవుతాయి. ఈ ఉత్సవాలతో దోషపరిహారం జరిగి, ఆలయ పవిత్రత ఇనుమడిస్తుందని ప్రతీతి.

ఆణివార ఆస్థాన మహోత్సవం


 1843 వ సంవత్సరంలో అప్పటి ఆంగ్లపాలకులు తిరుమల ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతుల కప్పగించినట్లు ఇంతకు మునుపే తెలుసుకున్నాం. యాదృచ్ఛికంగా జరిగిందో లేదా శుభ ముహూర్తాన్ననుసరించి జరిగిందో తెలియదు కానీ ఆ యాజమాన్య మార్పిడి సరిగ్గా తమిళమాసమైన 'ఆణిమాసం' ఆఖరి రోజున జరిగింది. అదే రోజు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభ మవుతుంది. 'కర్కాటక సంక్రాంతి' గా కూడా పిలువబడే ఈ పర్వదినం, ప్రతి ఏడాది జూలై 16 లేదా 17 వ తారీఖుల్లో వస్తుంది. సరిగ్గా దీనికి ఆరుమాసాల ముందు జనవరి 15 వ తారీఖున, ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమయ్యే రోజున మనం మకరసంక్రాంతి జరుపుకుంటాము. తిరుమలలో తమిళులు అధికంగా అనుసరించే సౌరమానం ప్రకారం జరుపుకునే ఉత్సవాలలో ఇది కూడా ఒకటి.


 ఆలయ వ్యవహారాలు మహంతుల చేతికి వచ్చినప్పటి నుండి ఆలయ వార్షిక లెక్కల్ని అదే రోజు, లాంఛనంగా ప్రారంభించడం ఆనవాయితీగా వచ్చింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని, ఆణిమాసం ఆఖరి రోజున, అట్టహాసంగా *'ఆణివార ఆస్థాన మహోత్సవం'* జరుప బడుతుంది. తరువాతి కాలంలో మిగిలిన అన్ని ఆర్థిక, ధార్మిక, వాణిజ్య సంస్థల్లా ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రారంభిస్తున్నప్పటికీ; అనాదిగా వస్తున్న *'ఆణివార ఆస్థానోత్సవం'* మాత్రం అదే రోజు జరుపబడుతోంది.


 ఆరోజు ప్రాతఃకాల కైంకర్యాలను యథావిథిగా నిర్వహిస్తారు. అయితే, ప్రతినిత్యం కొలువు శ్రీనివాసునికి మునపటి రోజు ఆదాయవ్యయాలను అప్పగించే 'కొలువు' లేదా 'దర్బారు' సేవ మాత్రం జరగదు. ఏకంగా వార్షిక లెక్టల్నే స్వామివారికి నివేదిస్తారు కాబట్టి, ఆరోజుకిక దినవారీ లెక్కలు ఉండవన్న మాట. తరువాత తిరుమామణి మంటపంలో సర్వభూపాలవాహనంపై ఉభయదేవేరీ సమేతులైన మలయప్పస్వామిని; వారి ప్రక్కగా సర్వసేనాధిపతి విష్వక్సేనుణ్ణి వేంచేపు చేస్తారు. విశేష నైవేద్యసమర్పణ జరిగిన తరువాత జియ్యంగార్లు విమాన ప్రదక్షిణమార్గం లోని పరిమళపు ఆర నుండి ఆరు పట్టువస్త్రాలను పెద్ద వెండితట్టలో నుంచి తీసుకు వస్తారు. ఆ ఆరింటిలో మూలవిరాట్టుకు ధోవతి అంగవస్త్రాలుగా చెరి ఒకటి; ఆకాశరాజు కిరీటం, నందక ఖడ్గం, మలయప్పస్వామికి, విష్వక్సేనుల వారికి ఒక్కొక్కటి చొప్పున అలంకరిస్తారు. అప్పుడు గత సంవత్సరం ఆదాయవ్యయాల వివరాలను, నగదు నిల్వలను, సంబంధిత ఆలయాధికారులు స్వామివారికి విన్నవిస్తారు. ఆణివార ఆస్థానమహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించడం ద్వారా సకలసంపదలు స్వామివారి సొంతమని; మిగిలిన వారందరు వారికి పరిచారకులేనని; వారి ప్రతినిధులుగా మాత్రమే వారి సంపదను, ఆదాయాన్ని పరిరక్షిస్తున్నారన్న సందేశం పంపబడుతుంది. తద్వారా ఆలయానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల నిర్వహణలో జవాబుదారీతనం మరింత పెరుగుతుంది.


 తరువాతి ఘట్టంలో జియ్యంగారి అధికారిక మొహరును, 'లచ్చన' అని పిలువబడే తాళం చెవులగుత్తిని స్వామివారి పాదాలకు తాకించి జియ్యరువారికి అందజేస్తారు. ఆ తరువాత గమేకార్లు (ప్రసాదం గంగాళాలను రవాణా చేసే కార్మికులు), మహంతుమఠం వారు, తాళ్ళపాక మరియు తరిగొండ వంశీయులు హరతు లర్పిస్తారు. తదనంతరం ఉత్సవానికి విచ్చేసిన భక్తులు, సిబ్బంది నుండి ఒక్కొక్క రూపాయి చొప్పున కానుకలు స్వీకరించి శ్రీవారి ఖజానాకు జమ చేస్తారు. దీనిని 'రూపాయి హారతిగా' వ్యవహరిస్తారు.


 ఆణివార ఆస్థానోత్సవ సందర్భంగా ఆరోజు సాయంకాలం మలయప్పస్వామిని, ఉభయ దేవేరులను పుష్పపల్లకిలో అధిరోహింప జేసి, మాడవీధుల్లో అత్యంత వైభవోపేతంగా ఊరేగిస్తారు.


 ఈ ఆర్జితసేవను కాంచిన భక్తులకు పూర్వజన్మ వాసనలు నశించి, సుఖశాంతులు ఏర్పడుతాయని భక్తుల విశ్వాసం.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వం – తృతీయాశ్వాసం*


*402 వ రోజు*

*కర్ణార్జునుల యుద్ధం*

కర్ణుడు అర్జునుడు ఢీకొన్నారు. యుద్ధం తీవ్రం అయింది. అర్జునుడితో కృష్ణుడు " అర్జునా ! అడుగో కర్ణుడు నీ ప్రతాపం చూపించు. కర్ణుడి శరీరం నిండా శరములు నాటు. కర్ణుడు నీకు ఎందులో సరి రాడు. అర్జునా ! విజృంభించి కర్ణుడిని వధించు " అన్నాడు. కర్ణుడిని కూడా కౌరవ వీరులు ఉత్సాహ పరుస్తున్నారు. " కర్ణా ! ఇన్నాళ్ళు అడవులలో మృగముల మాదిరి తిరిగిన పాండవులు ఇప్పుడు యుద్ధానికి వచ్చారు. నువ్వు అర్జునుడిని చంపితే మిగిలిన పాండవులు తిరిగి అడవులకు పోతారు. సుయోధనుడు కురుసామ్రాజ్యాధిపతి ఔతాడు. నీ శక్తిని అంతా ఉపయోగించి అర్జునుడిని చంపు " అన్నాడు. కర్ణుడు అర్జునుడి శరీరంలో పది బాణములు నాటాడు. అర్జునుడు కర్ణుడి శరీరంలో పందొమ్మది బాణములు నాటాడు. కర్ణుడు అర్జునుడి మీద తొమ్మది పదునైన బాణములు ప్రయోగించాడు. అతడు కృష్ణుడిని కూడా వద లేదు. అది చూసిన అర్జునుడు తన బాణములతో కర్ణుడిని రక్తం కారేలా కొట్టాడు. కర్ణుడు కోపించి కృష్ణార్జునులను పదునైన బాణములతో గాయపరిచాడు. అర్జునుడు కర్ణుడి సారధిని, అశ్వములను కొట్టి కర్ణుడి మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. కర్ణుడు వారుణాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేసాడు. అర్జునుడు కర్ణుని మీద మేఘాస్త్ర ప్రయోగం చేసి కౌరవ సేనలను మేఘాలతో కప్పి అంధకారం సృష్టించాడు. కర్ణుడు అనిలాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేసాడు. ఇంతలో అర్జునుడు ఇంద్రశక్తిని ప్రయోగించాడు. కర్ణుడు మంత్రశక్తితో ఇంద్రశక్తిని నిర్వీర్యం చేసి అర్జునుడి మీద పదునైన బాణములు వేసాడు. అది చూసిన భీముడు " తమ్ముడా అర్జునా ! ఈ కర్ణుడు ఈ రోజు మనతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చాడు. నీ ప్రతిజ్ఞా భంగం కాకుండా నీవు చంపుతావా ! లేక నాగదా ఘాతంతో అతడి తల ముక్కలు చెక్కలు చేయనా ! " అన్నాడు. అది చూసి కృష్ణుడు " అర్జునా ! నీవు ప్రయోగించిన దివ్యాస్త్రాలను కర్ణుడు తిప్పి కొడుతున్నాడు. పైగా నిన్ను తీవ్రంగా తన బాణములతో గాయపరుస్తున్నాడు. నీ పరిస్థితి కౌరవసేనలో ఉత్సాహాన్ని పాండవసేనలో నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. కారణం తెలియక ఉంది. నా చక్రాన్ని ఇస్తాను దానిని ప్రయోగించి కర్ణుడి తల తుంచు " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! అంత పని వద్దులే నేను కర్ణుడి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను " అని బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. అది కర్ణుడి మీదకు వేగంగా రాసాగింది. కర్ణుడు బెదరక నిశ్చలంగా నిలబడి తన మంత్రశక్తితో దానిని నిర్వీర్యం చేసి కృష్ణార్జునులను తన బాణములతో గాయపరిచాడు. అర్జునుడు కర్ణశల్యులను మీద తొమ్మిదేసి బాణములను ప్రయోగించాడు. కర్ణుడు అర్జునుడి వింటి నారిని తెంచాడు. అర్జునుడు నారిని సరి చేసుకుని కర్ణుడి వింటి నారిని తెంచాడు. అర్జునుడి ధాటికి తాళ లేని కర్ణుడి చక్రరక్షకులు పారి పోయారు. అది చూసి సుయోధనుడు అర్జునుడిని చంపమని తన సైన్యమును ప్రోత్సహించాడు. సుయోధన బలగాలు అర్జునుడిని చుట్టుముట్టాయి. అర్జునుడు వాడి అయిన బాణములు ప్రయోగించి వారిని చెదరగొట్టాడు. ఇరు పక్షముల వీరులు యుద్ధం వదిలి కర్ణార్జునుల యుద్ధం వీక్షించసాగారు. సుయోధనుడు " యోధులారా ! కర్ణుడు అత్యంత పరాక్రమంతో పోరుతుండగా మీరు చూస్తూ ఉండటం భావ్యమా ! పోయి కర్ణుడికి సాయపడండి " అన్నాడు. ఆమాటలకు రోషపడి కౌరవ వీరులు అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు పదునైన బాణములు వేసి వారి కేతములు, రధములు, ధనస్సులను విరిచి అశ్వములను పంపాడు. ముందుకు పోతే అర్జునుడు చంపు తున్నాడు. వెనక్కు పోతే సుయోధనుడు హెచ్చరిస్తున్నాడు. కౌరవ వీరులు అయోమయ అవస్థకు లోనయ్యారు.

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

మూఢం అంటే ఏంటి?*

 *మూఢం అంటే ఏంటి?*


మూఢం అంటే శుభకార్యాలు చేయడానికి వీలులేని రోజులు. ఏ పని చేయకుండా పనికిరాని కాలంగా, విడిచిపెట్టే కాలంగా దీనిని భావిస్తారు. హిందువులు గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గ్రహస్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయరు. మూఢం సమయంలో శుభకార్యాలు చేయకూడదు. కొన్ని తప్పులు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.

ఎందుకు మూఢం వస్తుంది, ఈ సమయంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదు?

మూఢం అనేది రెండు రకాలు. 

1) గురు మూఢం,

2) శుక్ర మూఢం అని అంటారు. ఇక ఇప్పుడు వచ్చేది  జూన్ 10వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు గురు మూఢం.ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ మూఢం రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మూఢం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు.ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఎప్పుడూ కూడా గురు బలం, శుక్ర బలం ఉంటేనే జరుపుతారు. ఈ మూఢం సమయంలో గురు గ్రహానికి శుక్ర గ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు. అందుకే దీనిని మూఢం అని అంటారు.

*మూఢం సమయంలో ఏం చేయకూడదు?*

మూఢం సమయంలో 1)పెళ్లిచూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు.

2)పెళ్లిళ్లు కూడా ఈ సమయంలో జరపకూడదు. ఒకవేళ పెళ్లిళ్లు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు. గొడవలు పడుతూ ఉంటారు. విడిపోయే అవకాశాలు ఉన్నాయి.

శుభకార్యాలని ఈ మూఢం సమయంలో ప్రారంభించకూడదు. అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంది.

3)లగ్న పత్రికలు రాసుకోకూడదు. పెళ్లి పత్రికల జోలికే వెళ్ళకూడదు.

4)మూఢం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడటం కూడా తప్పు.

5)పసి పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు.

6) కొత్త వ్యాపారాలని మొదలుపెట్టకూడదు. పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

7)చెవులు కుట్టించకూడదు.

8)కొత్త వాహనాలు కొనుగోలు చేయరాదు

9)శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేయకూడదు.

10)ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం, సొంత ఇంటికి వెళ్లిపోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి. 11)దేవుడికి మొక్కలు చెల్లించుకోవడం కూడా ఈ మూఢం సమయంలో చేయకూడదు.

12)వ్రతాలు చేయడం, విగ్రహ ప్రతిష్టాపనలు లాంటివి కూడా చేయకూడదు.

13)ఈ మూఢం సమయంలో వైభవంగా పుట్టిన రోజులు చేయకూడదు.

14)చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది.

*మూఢం సమయంలో ఏం చేయవచ్చు?*

1)చిన్న పిల్లలకు అన్నప్రాసన చెయ్యచ్చు.

2)దూర ప్రయాణాలు చెయ్యచ్చు.

3)ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా చేయించుకోవచ్చు.

4)భూముల అమ్మడం, భూములు కొనడం వంటివి చేయొచ్చు.

5)అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పులేదు.

6)రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేయొచ్చు.

7)విదేశాలకు వెళ్లడం, కొత్త ఉద్యోగంలో చేరడం వంటివి చేయొచ్చు. 

8)కొత్త బట్టల్ని కొనుగోలు చేయొచ్చు. 

9)ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లొచ్చు. 10)దేవాలయాల్లో అన్నదానాలు చేయడం, సీమంతం వేడుకలు చేసుకోవడం, దైవ కార్యాలను నిర్వహించడం చేయొచ్చు.

11)నవగ్రహ శాంతులు, హోమాలు చేయించుకోవచ్చు.

12)మూఢం సమయంలో బాలింతలు, గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయొచ్చు.


🙏🙏🙏🙏🙏

⚜ శ్రీ చక్రతీర్థ - చక్ర నరసింహ ఆలయం

 🕉 మన గుడి 


⚜  ఒడిస్సా : పూరీ 


⚜  శ్రీ చక్రతీర్థ - చక్ర నరసింహ ఆలయం 



💠 జగన్నాథ ఆలయానికి సమీపంలో ఉన్న చక్రతీర్థ ఆలయం ఒడిశాలో తప్పక సందర్శించాల్సిన ఆలయాలలో ఒకటి. 


💠 ఒడిశా భారతదేశంలో సాంస్కృతికంగా గొప్ప రాష్ట్రం అనే వాస్తవాన్ని సమర్థిస్తూ, ఈ ఆలయం ఒక ప్రధాన ఉదాహరణ. 


💠 ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు మరియు యాత్రికుల దృష్టిని ఆకర్షించింది, వారు ఒడిశా పర్యటనను ప్లాన్ చేసుకునేటప్పుడు ఇక్కడకు తప్పనిసరిగా వెళ్లాలి. 


💠 చక్రతీర్థ ఆలయం పూరికి ఉత్తరాన ఉంది మరియు ఇది నృసింహ దేవునికి అంకితం చేయబడిన ఆలయం. స్థానికంగా ఈ ఆలయాన్ని చక్ర నారాయణ ఆలయం, చక్ర నృసింహ ఆలయం లేదా చక్ర నరసింహ ఆలయం వంటి అనేక పేర్లతో పిలుస్తారు.


💠 ఇది పూరి పట్టణం యొక్క ఉత్తర చివరలో మరియు జగన్నాథ ఆలయం నుండి 3 కి.మీ దూరంలో ఉంది. స్థానికులు ఈ ఆలయాన్ని చక్ర నరసింహ ఆలయం, చక్ర నృసింహ ఆలయం మరియు చక్ర నారాయణ ఆలయం వంటి వివిధ పేర్లతో పిలుస్తారు.

 ఈ ఆలయంలో, జగన్నాథుని దైవిక ఆయుధమైన పెద్ద చక్రం, నల్ల గ్రానైట్‌తో తయారు చేయబడిన గర్భగుడిలో నీటిలో పూజించబడుతోంది, మధ్యలో చక్రనారాయణ అని పిలువబడే నారాయణ విగ్రహం ఉంది. 

మహాలక్ష్మి నివాసం ఇక్కడ ఉన్నందున చక్రతీర్థానికి మరో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.


💠 ఆలయం యొక్క ప్రధాన దేవతలు అభయ నృసింహ, చక్ర నృసింహ మరియు లక్ష్మీ నృసింహ అని పిలువబడే నృసింహుని మూడు చిత్రాలు. 

చక్ర తీర్థంలో పూజించబడే నృసింహుని ఈ 3 విభిన్న రూపాలు. 


 అభయ నృసింహ రూపం :

శ్రీ బలభద్రుడిని సూచిస్తుంది.  


చక్ర నృసింహ రూపం: 

 సుభద్రా దేవిని సూచిస్తుంది మరియు


లక్ష్మీ నృసింహ రూపం : 

జగన్నాథుడిని సూచిస్తుంది.


💠 పురాణాలలో, విశ్వంలోని మొదటి 3 దేవుళ్ళు, బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు వరుసగా చక్ర నృసింహ, లక్ష్మీ నృసింహ మరియు అభయ నృసింహ రూపాల్లో కూడా వ్యక్తీకరణను కనుగొన్నారు.


💠 ఒకప్పుడు పూరీలో తుఫాను సంభవించినప్పుడు నీలచక్రం (జగన్నాథ ఆలయం పైభాగంలో ఉన్న చక్రం) దాని స్థానం నుండి స్థానభ్రంశం చెంది, ఆకాశం మీదుగా ఎగిరి చివరకు చక్రతీర్థంలో పడిందని స్థానిక ప్రజలు నమ్ముతారు.


💠 'దారు' (నవకళేవర సమయంలో జగన్నాథ ఆలయం యొక్క దేవతల సృష్టి కోసం దైవిక చెక్క దుంగ) సముద్రం గుండా మొదటిసారిగా చక్రతీర్థంలో నేలను తాకిందని కూడా నమ్ముతారు.


💠 చక్రతీర్థ ఆలయానికి జగన్నాథ ఆలయంతో దగ్గరి సంబంధం ఉంది మరియు ప్రతి సంవత్సరం జగన్నాథుడి నుండి అగ్న్యమాల నృసింహుని వద్దకు వస్తుంది.  


💠 ఈ ఆలయంలో నృసింహ జన్మ (నృసింహ స్వామి జననం) ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.


💠 ఈ ఆలయంలో చక్రనారాయణ్ అని పిలువబడే జగన్నాథుని విగ్రహం మరియు నల్ల గ్రానైట్ తో చెక్కబడిన చక్రం ఉన్నాయి. ఈ చక్రం ఎల్లప్పుడూ నీటిలోనే ఉంటుంది.


💠 స్థానికుల కథనం ప్రకారం, పూరీలో ఒకసారి తుఫాను సంభవించినప్పుడు, తుఫాను సమయంలో జగన్నాథ ఆలయం పైభాగంలో ఉన్న చక్రం ఆకాశంలో ఎగిరి చక్రతీర్థ ఆలయంలో పడిపోయింది. 


💠 మరొక పురాణం ప్రకారం, దరు (జగన్నాథ ఆలయంలో దేవతలు చెక్కబడిన దుంగ) మొదటిసారి ఇక్కడే భూమిని తాకింది. 


💠 సందర్శించడానికి ఉత్తమ సమయం

చక్రతీర్థ ఆలయాన్ని సందర్శించడానికి జూలై-మార్చి నెలల మధ్య సమయం ఉత్తమం.


💠 చక్రతీర్థ ఆలయానికి జగన్నాథ ఆలయంతో దగ్గరి సంబంధం ఉంది మరియు ప్రతి సంవత్సరం జగన్నాథుడి నుండి అగ్నీమాల నృసింహుడికి వస్తుంది. 

ఈ ఆలయంలో నృసింహ జన్మ (నృసింహ జన్మ) పండుగను ఎంతో భక్తితో జరుపుకుంటారు.

కుల విద్య,

 ఉత్తమా కుల విద్యా చ 

మధ్యమౌ కృషి వాణిజౌ।

అథమా సేవకా వృత్తి-

ర్మృత్యు శ్చౌర్యోపజీవనమ్।।


కుల విద్యా-తర తరాలుగా వచ్చే కుల విద్య,

ఉత్తమా-మిక్కిలి గొప్పది.

చ-మరియును,

కృషి-వ్యవసాయమును

వాణిజౌ-వ్యాపారమును,

మధ్యమా-మధ్యమమైనవి.

సేవకా వృత్తిః-సేవా ధర్మము,

అధమా-నీచ మైనది.

చౌర్య-దొంగతనము చేస్తూ,

ఉపజీవనం-బ్రతకడం,

మృత్యుః-చావే గదా।।


ఈలోకంలో విద్య లన్నింటిలో కుల విద్య మహోన్నత మైనది.వ్యవసాయమూ , వాణిజ్యమూ మధ్యమమైనవి.సేవా ధర్మము నీచమైనది.ఇంక దొంగతనము మరణముతో సమానము సుమా।।

9-6-25/సోమవారం/రెంటాల

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి) 


సులభాః పురుషా రాజన్సతతం ప్రియవాదినః.

అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః

(వా.రా 3.37.2)

*అర్థం:*

రాజా, ఆహ్లాదకరమైన మాటలు మాట్లాడే వ్యక్తులను కనుగొనడం ఎల్లప్పుడూ సులభం, కానీ (చెవులకు) అసహ్యకరమైన కానీ (జీవితంలో) ప్రయోజనకరమైన పదాలను ఉపయోగించే వక్త మరియు శ్రోతను పొందడం కష్టం.

_(ఈ మాటలు రాక్షసుడైన మారీచుడు రావణునితో చెప్పాడు. రాక్షసుడైనా ఏ కాలానికైనా సరిపడే సత్యం వచించాడో చూడండి.)_

శ్రీ శంకరాచార్య కృత 'వేదసార శివ స్తోత్రం' తో శుభోదయం 


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష* 

ధర్మో రక్షతి రక్షితః