4, జులై 2025, శుక్రవారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🍁శనివారం 5 జూలై 2025🍁*

``

           *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

     *వాల్మీకి రామాయణం*               

            *89వ భాగం*

```

సుగ్రీవుడు అలా అనగానే ఇన్ని కోట్ల వానరాలు లంక యొక్క అంతఃపురాల మీద పడిపోయి రావణ అంతఃపురంతో సహా అన్ని ఇళ్ళని అగ్నికి ఆహుతి చేశాయి. ఆ ఇళ్ళల్లో ఉన్న రకరకాల వస్త్రాలు, బంగారు పాత్రలు, ముత్యాలు, రత్నాలు మొదలైనవన్నీ కాలిపోయాయి. బాలురు, వృద్ధులు మినహాయించి లంకలో ఉన్న మిగిలిన మూలబలంలోని రాక్షసులు చాలామంది కాలిపోయారు. 


ఇదేసమయంలో రామచంద్రమూర్తి క్రుద్ధుడై ధనుష్టంకారం చేశాడు. ఒకపక్క ధనుష్టంకారం, ఒకపక్క వానర ఘోష, ఒకపక్క రాక్షసుల అరుపులు, ఒకపక్క రామ బాణ పరంపర వచ్చి లంకా పట్టణ ప్రాసాదముల మీద పడిపోతోంది. 


ఎక్కడా చూసినా అరుపులతో పరిస్థితి ఘోరంగా ఉంది.

అప్పుడు రావణుడు కుంభకర్ణుడి కుమారులైన కుంభుడు, నికుంభుడిని యుద్ధానికి పంపాడు. వాళ్ళతో పాటు ప్రజంఘుడు, మకరాక్షుడు అనే తన కుమారుడిని యుద్ధానికి పంపాడు.


అప్పుడు సుగ్రీవుడు కుంభుడిని, హనుమంతుడు నికుంభుడిని, అంగదుడు ప్రజంఘుడిని, రాముడు మకరాక్షుడిని సంహరించారు.


ఈ వార్త విన్న రావణుడు విశేషమైన శోకాన్ని పొంది, మళ్ళీ ఇంద్రజిత్ ని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు.


ఆ ఇంద్రజిత్ మళ్ళీ అదృశ్యమయిపోయి బాణ పరంపరతో వానరాలని కొట్టడం మొదలుపెట్టాడు.


అప్పుడు లక్ష్మణుడు రాముడితో…  

“అన్నయ్యా! వీడు ఎన్నోసార్లు యుద్ధానికి వస్తున్నాడు. నువ్వు నాకు అనుమతిని ఇవ్వు, సమస్త రాక్షసజాతి నశించిపోవాలని సంకల్పించి, అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేస్తాను” అన్నాడు.


రాముడన్నాడు…  

“పారిపోతున్నవాడిని, ప్రమత్తుడై ఉన్నవాడిని, కనపడకుండా మాయా యుద్ధం చేస్తున్నవాడిని, వెన్ను చూపి పారిపోతున్నవాడిని, శరణాగతి చేసినవాడిని కొట్టకూడదు. పైగా బ్రహ్మాస్త్రం వేస్తే సమస్త భూమండలం క్షోభిస్తుంది. అందుకని ఒక్కడిని సంహరించడం కోసం అలాంటి అస్త్ర ప్రయోగం చెయ్యకూడదు. మనం అదును చూసి, వాడు ఎటువైపు తిరుగుతున్నాడో, బాణాలు ఎటువైపు నుండి వస్తున్నాయో చాలా నిశితంగా పరిశీలించు. ఇవ్వాళ వాడు ఎక్కడో అక్కడ దొరకకపోడు, అప్పుడు తీవ్రమైన వేగం కలిగిన బాణములతో ఇంద్రజిత్ ని కొట్టి భూమి మీద పడేస్తాను. లక్ష్మణా! ఇది నా ప్రతిజ్ఞ" అన్నాడు.


రాముడి మాటలను విన్న ఇంద్రజిత్ అనుకున్నాడు.. 'ఈ రామలక్ష్మణులు నన్ను కనిపెట్టి కొట్టడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి నేను ఏదో ఒక మోసం చేసి, రామలక్ష్మణుల దృష్టిని నా నుంచి మరల్చాలి' అనుకుని ఆలోచించాడు. 


అప్పుడాయన వెంటనే సీతమ్మని మాయ చేత సృష్టించి తన రథంలో కూర్చోపెట్టాడు.


ఆయనకి ఎదురుగా హనుమంతుడు ఒక పర్వతాన్ని పట్టుకొని వస్తున్నాడు. అప్పుడా ఇంద్రజిత్ తన రథంలో ఉన్న మాయా సీత చెంపల మీద ఎడాపెడా కొట్టాడు. వాడు అలా కొడుతుంటే ఆవిడ… 'హా రామా, హా రామా' అని ఏడుస్తోంది. 


అలా ఏడుస్తున్న సీతమ్మని చూసిన హనుమంతుడు తట్టుకోలేక ఆ పర్వతాన్ని కిందపడేసి, ఏడుస్తూ…  

“దుర్మార్గుడా, ఆమె మహా పతివ్రత, రామ కాంత. సీతమ్మని అలా కొడతావా, నాశనమయిపోతావురా నువ్వు, నేను, సుగ్రీవుడు నిన్ను విడిచిపెట్టము, నీ శిరస్సు గిల్లేస్తాను. సీతమ్మని వదులు” అని హనుమంతుడు బాధతో ఏడుస్తూ అరిచాడు.


అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు… “ఆమె స్త్రీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కాని మాకు దుఃఖాన్ని కల్పించింది కాబట్టి ఈమెని మాత్రం నేను విడిచిపెట్టను" అని చెప్పి ఒక ఖడ్గాన్ని తీసుకొని ఆమె శరీరాన్ని చీరేశాడు. అప్పుడా మాయా సీత మరణించి ఆ రథంలో పడిపోయింది. తరువాత ఇంద్రజిత్ ఆ రథంతో వెళ్ళిపోయాడు.


ఎప్పుడైతే సీతమ్మ పడిపోయిందో అప్పుడు హనుమంతుడు యుద్ధం మానేసి, ఏడుస్తూ, పెద్ద పెద్ద కేకలు వేస్తూ… “ఇంకా ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తారురా. ఏ తల్లిని రక్షించడానికి యుద్ధానికి వచ్చామో ఆ తల్లిని సంహరించాడు. ఇంక నేను యుద్ధం చెయ్యను" అని ఏడుస్తూ రాముడి దగ్గరికి వెళ్ళి… 

“రామా! దుర్మార్గుడైన ఇంద్రజిత్ వానరులందరూ చూస్తుండగా సీతమ్మని తీసుకొచ్చి, సంహరించి తీసుకెళ్ళిపోయాడు. ఇంక సీతమ్మ లేదు" అని చెప్పాడు.


ఈ మాటలు విన్న రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు.

తరువాత వాళ్ళు రాముడి ముఖం మీద కొన్ని నీళ్ళు పోసి ఆయనని లేపారు.


అప్పుడు లక్ష్మణుడు అన్నాడు… 

“అన్నయ్యా! నువ్వు ‘ధర్మము ధర్మము ధర్మము’ అని ఇన్నాళ్ళు పట్టుకు తిరిగావు. ఆ ధర్మం నీకు ఏ ఫలితాన్ని ఇచ్చింది. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల రాజ్య భ్రష్ట్రుడివి అయ్యావు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల తండ్రిగారు మరణించారు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల సీతమ్మ అపహరింపబడింది, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల జటాయువు మరణించాడు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల 14 సంవత్సరాలుగా అరణ్యాలలో తిరుగుతున్నావు. ధర్మాన్ని విడిచిపెట్టిన రావణుడు అంతఃపురంలో కులుకుతున్నాడు, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అధర్మంతో ఉన్నవాడు అంత సంతోషంగా ఉన్నాడు, ధర్మంతో ఉన్న నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు. ఇంకా ధర్మము ధర్మము అని ఎందుకంటావు అన్నయ్యా, ఆ ధర్మాన్ని విడిచిపెట్టు. మనం కూడా అధర్మాన్నే స్వీకరిద్దాము” అన్నాడు. 


వెంటనే విభీషణుడు పరుగు పరుగున వచ్చి… “ఎంతమాటన్నావు లక్ష్మణా, సీతమ్మని ఇంద్రజిత్ సంహరిస్తే రావణుడు ఊరుకుంటాడనుకున్నావా? ఎంతోమంది చెప్పినా సీతమ్మని విడిచిపెట్టనివాడు ఇంద్రజిత్ సీతమ్మని చంపితే ఊరుకుంటాడా. ఆ ఇంద్రజిత్ మహా మాయావి, మీరు అంతలోనే వాడి మాయ మరిచిపోయారు. వాడు మాయా సీతని సంహరించి తీసుకుపోయాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా. పెద్ద ఊడలు దిగిపోయిన మర్రి చెట్టు ఒకటి ఉంది, దాని చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది. వాడు అక్కడికి వెళ్ళి నికుంభిలా హోమం చేస్తాడు. అక్కడ వాడు నికుంభిలా దేవతని ఉద్దేశించి హోమాన్ని పూర్తి చేసి, వాడి గుర్రాల మీద, ఆయుధముల మీద ఆ అక్షతలని చల్లుకొని యుద్ధ రంగంలోకి వస్తే దేవేంద్రుడు కూడా వాడితో యుద్ధం చెయ్యలేడు. సీతమ్మ చనిపోయింది అనుకుని మీరు ఇక్కడ ఏడుస్తున్నారు, కాని వాడు అక్కడ హోమం చేస్తుంటాడు. రామా! నన్ను అనుగ్రహించు, నాతో లక్ష్మణుడిని తీసుకెళ్ళి ఆ హోమం పూర్తవకుండానే వాడిని సంహరిస్తాను” అన్నాడు.


అప్పుడు రాముడు లక్ష్మణుడిని ఆశీర్వదించి, హనుమ మొదలైన వీరుల్ని సాయంగా పంపారు.


విభీషణుడు లక్ష్మణుడిని ఇంద్రజిత్ హోమం చేసుకునే చోటుకి తీసుకెళ్ళాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రజిత్ ఆ హోమం చెయ్యడం కోసం సిద్ధపడుతున్నాడు. తన హోమాన్ని ఎవరూ పాడుచెయ్యకుండా చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు.


అప్పుడు విభీషణుడు… “లక్ష్మణా! నువ్వు ఒకపక్క నుంచి సైన్యాన్ని బాణాలతో కొట్టి కాకావికలం చెయ్యి, అప్పుడు ఇంద్రజిత్ కనపడతాడు. అదే సమయంలో హనుమ వెళ్ళి రాక్షస సైన్యాన్ని తుదముట్టించెయ్యాలి. అంతమంది అక్కడ పడిపోతుంటే వాడు అక్కడ కూర్చుని హోమం చెయ్యలేడు. కాబట్టి రథం ఎక్కి వస్తాడు, అప్పుడు నువ్వు వాడిని కొట్టాలి” అన్నాడు.


వెంటనే లక్ష్మణుడు బాణ ప్రయోగం చేశాడు. అప్పుడా సైన్యం పక్కకి తప్పుకుంది, వాళ్ళు పక్కకి తప్పుకోగానే ఆ మర్రి చెట్టు కనపడింది. వెంటనే హనుమంతుడు అరివీరభయంకరుడై ఆ రాక్షసులని మర్దించేశాడు. హనుమ ప్రతాపం ముందు ఆ రాక్షస సైన్యం నిలబడలేక పెద్ద హాహాకారాలు చేశారు. 


ఆ హాహాకారాలు విన్న ఇంద్రజిత్ హోమాన్ని ఆపి 'ముందు హనుమంతుడిని సంహరించి, అప్పుడు హోమం చేస్తాను' అని అనుకొని రథం ఎక్కాడు. 


అప్పుడాయన ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. 


ఆ టంకారానికి ఇంద్రజిత్ లక్ష్మణుడి వైపు చూశాడు.


అప్పుడు లక్ష్మణుడు.. “దుర్మార్గుడా, హనుమతో యుద్ధం ఎందుకు, నీతో యుద్ధం చెయ్యడానికి నేను వచ్చాను. పౌరుషం ఉంటే నాతో యుద్ధం చెయ్యి” అన్నాడు.


అప్పుడు ఇంద్రజిత్ …

“ఇంతకముందు నిన్ను రెండు మూడుసార్లు కొట్టాను, అయినా బుద్ధి లేకుండా మళ్ళీ వచ్చావు. చూడు నీకు ఎటువంటి యుద్ధం చూపిస్తానో ఇవ్వాళ” అని ఇద్దరూ యుద్ధం మొదలుపెట్టారు.


లక్ష్మణుడి పక్కన ఉన్న విభీషణుడిని ఇంద్రజిత్ చూసి అన్నాడు… “నువ్వు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగావు, నువ్వు స్వయానా నా తండ్రికి తమ్ముడివి, నాకు పినతండ్రివి. నీ కొడుకు వరసైన నన్ను చంపడానికి ఇవ్వాళ శత్రువులతో చేతులు కలిపావే, నీకు ఇలా చెయ్యడానికి సిగ్గుగా లేదా. శత్రువులతో చేతులు కలిపి తనవారిని చంపినవాడు చివరికి ఆ శత్రువుల చేతులలోనే చనిపోతాడు” అన్నాడు. 


విభీషణుడు అన్నాడు… “నీ తండ్రియందు, నీయందు పాపం ఉంది కనుక నేను మిమ్మల్ని విడిచి ధర్మాత్ముడైన రాముడి పక్కకి వచ్చాను” అన్నాడు.


అప్పుడు ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. ఇద్దరూ ఒకరిని ఒకరు బాణాలతో కొట్టుకున్నారు. లక్ష్మణుడు వేసిన బాణాలకి ఇంద్రజిత్ యొక్క ధనుస్సు ముక్కలయిపోయింది. తరువాత ఇంద్రజిత్ బాణాలతో లక్ష్మణుడి కవచాన్ని పగలగొట్టాడు. ఇద్దరూ సింహాలలా యుద్ధం చేశారు. విభీషణుడు ఆ రాక్షసుల మీద బాణాలని వేసి వాళ్ళని సంహరించాడు. ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి 3 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆఖరికి ఇంద్రజిత్ యొక్క సారధిని లక్ష్మణుడు కొట్టాడు. అప్పుడా ఇంద్రజిత్ ఒక చేతితో సారధ్యం చేస్తూ లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. అప్పుడు నలుగురు వానర వీరులు ఆ రథం యొక్క గుర్రాలని కిందకి లాగేసి ఆ రథాన్ని నాశనం చేశారు.


లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలని వేసినా ఇంద్రజిత్ సంహరింపబడకపోయేసరికి విభీషణుడు అన్నాడు… “ఆ ఇంద్రజిత్ పౌరుషం పెరిగిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ ఇంద్రజిత్ ని సంహరించు” అన్నాడు.

```

*ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది*

*పౌరుషే చా అప్రతిద్వంద్వః తదైనం జహి రావణిమ్*

```

అప్పుడు లక్ష్మణుడు రెండు కోరలు కలిగిన సర్పంలాంటి ఒక బాణాన్ని తీసి, వింటినారికి తొడిగి “మా అన్న రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, దశరథుడి కొడుకే అయితే, పౌరుషం ఉన్నవాడే అయితే నా ఎదురుగా నిలబడిన ప్రతిద్వంది అయిన ఇంద్రజిత్ నిగ్రహింపబడుగాక” అని బాణ ప్రయోగం చేశాడు. 


ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్ కంఠానికి తగలగానే ఆయన శిరస్సు శరీరం నుండి విడిపోయి కింద పడిపోయింది. ఇంద్రజిత్ మరణించాడు.```


       *రేపు…90వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

శనివారం🚩* *🌹05 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        *🚩శనివారం🚩*

  *🌹05 జూలై 2025🌹*        

    *దృగ్గణిత పంచాంగం*  

                   

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - శుక్లపక్షం*


*తిథి  : దశమి* సా 06.58 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం   : స్వాతి* రా 07.51 వరకు ఉపరి *విశాఖ*

*యోగం : సిద్ధ* రా 08.36 వరకు ఉపరి *సాధ్య*

*కరణం   : తైతుల* ఉ 05.45 *గరజి* సా 06.58 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ10.30-12.00 సా04.00 - 06.30*

అమృత కాలం  : *ఉ 09.57 - 11.45*

అభిజిత్ కాలం  : *ప 11.46 - 12.38*

*వర్జ్యం          : రా 02.07 - 03.54*

*దుర్ముహూర్తం  : ఉ 05.40 - 07.24*

*రాహు కాలం   : ఉ 08.56 - 10.34*

గుళికకాళం       : *ఉ 05.40 - 07.18*

యమగండం     : *మ 01.50 - 03.28*

సూర్యరాశి : *మిధునం*

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 05.47*

సూర్యాస్తమయం :*సా 06.55*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.40 - 08.16*

సంగవ కాలం         :      *08.16 - 10.53*

మధ్యాహ్న కాలం    :     *10.53 - 01.30*

అపరాహ్న కాలం    : *మ 01.30 - 04.07*

*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ శుద్ధ దశమి*

సాయంకాలం        :  *సా 04.07 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.55*

రాత్రి కాలం           :*రా 08.55 - 11.50*

నిశీధి కాలం          :*రా 11.50 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.12 - 04.56*

--------------------------------------------------

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి*


*🙏శ్రీ వేంకటేశ్వర స్వామి🙏* 

*🔯సహస్రనామ స్తోత్రం*🔯


        *నాగరాజపాలనం*  

       *భోగినాథశాయినం*  

        *నాగవైరిగామినం*  

    *నగారిశత్రుసూదనమ్*  

       *నాగభూషణార్చితం*


*🌹ఓం నమో వేంకటేశాయ🌹*


***************************

   *🍁శ్రీ ఆంజనేయ స్తోత్రం🍁*


      *నమో వాయుపుత్రాయ*  

     *భీమరూపాయధీమతే*

     *నమస్తే రామదూతాయ*  

     *కామరూపాయశ్రీమతే!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🚩🪷🌹🛕🌹🌷🪷🌷🚩

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

పంచ గయలు*

 *పంచ గయలు* 


మన దేశంలో మొత్తం 5 గయలు ఉన్నాయని చెబుతారు. 


*1. శిరోగయ, 2. నాభిగయ, 3. పాదగయ, 4. మాతృగయ, 5. పితృగయ.* 


 1. *శిరోగయ* : బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో *“శిరోగయ”* గా వెలసింది. దీనినే బుద్ధగయ అని కూడా అంటారు.


 2. *నాభిగయ* : జాజ్ పూర్, ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను *“నాభిగయ”* అని అంటారు.


 3. *పాదగయ* : పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్‌లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని *“పాదగయ”* అంటారు.


 4. *మాతృగయ* : గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని *“మాతృగయ”* అని అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కి 33 కి||మి|| దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.


5. *పితృగయ* : బధరీనాథ్, ఉత్తర ప్రదేశ్‌లోని అలకనందా నదీ తీరంలో గల *“బ్రహ్మకపాలం”* అనే ప్రదేశాన్ని *“పితృగయ”* అంటారు.

దండం దశగుణం భవేత్"*

 *"దండం దశగుణం భవేత్"*


దండిస్తే కాని పని జరగదు అనే సందర్భంలో "దండం దశగుణం భవేత్" అంటూంటారు. _"దేవుడికైనా దెబ్బే గురువు"_ అంటే కొడితేగాని పని జరగదు అని భావం. 

కానీ ఈ శ్లోకం పూర్తిగా చూద్దాం.


*విశ్వామిత్రా హి  పశుషు*

*కర్దమేషు జలేషు చ |*

*అంధే తమసి వార్ధక్యే*

*దండం దశగుణం భవేత్ ||*


ఇది శ్లోకం.

 మరి దీనిలోని అర్థం - 

1. వి - పక్షులు, 

2. శ్వా - కుక్కలు, 

3. అమిత్ర - మిత్రులుకానివారు (శత్రువులు), 

4. అహి - పాములు, 

5. పశు - పశువులు, 

6. కర్దమేషు - బురదలో, 

7. జలేషు - నీటిలో, 

8. అంధే - గుడ్డితనంలో,

9. తమసి - చీకటిలో, 

10. వార్ధక్యే - ముసలితనంలో 

దండం - కర్ర,

దశగుణం - 10 గుణాలను, 

భవేత్ - కలిగిస్తుంది. 


అంటే కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపు చేయడానికి, బురదలోను, నీటిలోను, గ్రుడ్డితనంలోను, చీకటిలోను, ముసలితనంలోను ఆపుగా(ఆసరాగా) ఉంటుంది. కావున కర్ర ఈ పది రకాలుగా ఉపయోగపడుతుంది - అని భావం.


~సాహితీనందనం

జెండా రూపశిల్పి

 జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా..


జాతి గుండెల్లో పింగళి వెంకయ్య...!!


జాతి గుండెలో త్రివర్ణమై ఎగురుతూ

తెలుగువాడిగా ఖ్యాతిని పొందుతూ

స్వాతంత్ర్య సమరం లో జెండాగా వెలుగొంది

దేశభక్తికి నిలువెత్తు రూపముగా నిలిచే...


జాతి చేతికి ఘనమైన పతాకం

ప్రతి హృదయములో ఎగురుతుంది ప్రతి క్షణం

మూడు రంగుల ముచ్చట గొలుపుతూ

నింగిలో రెపరెపలాడుతుంది అనుక్షణం..


పింగళి వెంకయ్య మదిలో మెదిలిన రూపం

యావత్ జాతి చేతిలో మెరిసిన కంకణం

గుండె నిండా ధైర్యము నింపే జెండా

చిరునవ్వులతో విశ్వంలో ఎగురుతుంది నిత్యం...


భారతీయుడికి చిహ్నంగా నిలిచింది

ప్రపంచ వేదికలో చిరునామాగా తిరుగుతుంది

స్వాతంత్ర్యానికి గుర్తుగా సగర్వంగా నవ్వుతూ

చేతి పిడికిలి కర్రలో మువ్వర్ణమై తిరుగుతుంది....


జాతి మరిచిపోతున్న మహానేత ఇతను

గుర్తు చేయుట మనందరి బాధ్యత

జాతికి ఆయుధమైన త్రివర్ణం అతను 

దేశ సంగ్రామపు నిజమైన రూపం ఈ కేతనం..


జెండాకిచ్చే గౌరవం రూప శిల్పి 

జాతి కీర్తిని భుజాలపై మోసే దేశభక్తుడు 

జాతి మనుగడలో ఆణిముత్యం 

స్వాతంత్ర్య సమరంలో అసామాన్య విజేత..


జోహార్లు జోహార్లు పింగళి వెంకయ్య

జాతి జెండాలో నిన్ను చూస్తూ మురిసిపోతూ 

నీ ఇచ్చిన ఈ త్రివర్ణం సమైక్యతగా కదులుతూ 

యావత్ దేశం మొత్తం రుణపడి ఉంది నీ త్యాగానికి..


కొప్పుల ప్రసాద్

నంద్యాల

9885066235

నయమొసంగును

 ऊँ!

----

" తేటగీతి..

--

*వి* నయమొసంగును కీర్తిని విస్తృతముగ 

*శా* స్త్రవిజ్ఞానగరిమయు సత్కృతియును 

*లా* తివిధముగనుండిన రక్తిఁబోవు

*క్షి* తిలోప్రతిష్టఁగలుఁగు క్షేమమలర !!! "

----

పోతనార్యుని పద్య మాధురి

: పోతనార్యుని పద్య మాధురి పొందు భాగవతోత్తముల్

లేత కొబ్బరి లౌజు జూసిన, లేచిపోయెదరంతలో,

పోతపోసిన ఖండ చక్కెర పోలు లీలల దేలుచున్

పూతరేకులు తిన్నవెంటనె పుల్లనైనవటందురే 🙏🙏🙏 భూమికాకర్షణ పుష్టిగా గలదని

         తెలిపినందుకొకడు విలువబడసె

శక్తిసూత్రముజూపి జగతినందికొకడు

         శాస్త్రజ్ఞుడైపోయి చాలమెరసె

విద్యుదయస్కాంత వివరములను దెల్పి

         విజ్ఞుడంచొకడిల పేరుపొందె

సృష్టి నీవిడినట్టి చిరమైన శక్తినే

          మరలవెలుపలకు మరలజేసి


రన్న నిజమరయగలేక నవనిజనులు

శాస్త్రవేత్తలె ఘనులన సరియె కనగ

పూర్ణవిధుభాస కోదాడు పురనివాస

పాపనిష్కాస రఘునాథ పరమపురుష

శ్రీకాళహస్తీశ్వరా

 🌻శ్రీకాళహస్తీశ్వరా నమోస్తు🌻


భవదీయ నామంబు ప్రత్యహ మందునన్ 

           భజియించు నుత్తమ భక్తతతికి

దుశ్శకునంబులు దూరంబుగా నుండు 

          గ్రహదోష కష్టముల్ కలుగ కుండు 

శలభంబు లెంతగా సంరంభమున పడ్డ

         కాలెడు ననలమున్ గప్ప గలవె !

అరయ నీ మానవు  లెఱిగియు న్నన్నియున్

         సతతంబు నీసేవ సల్పు కొనియు

పడెడు నిడుముల నెల్లను బాపు కొనక 

కోలు పోయదరేలనో కాల మంత ?

భక్త పాలన శంకరా ! పరమ పురుష !

ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ !             29*



ఈ ప్రాణముల్ నేను కాపాడు కొనుటకు

        నన్య దైవతముల న్నడుగ నెపుడు

నడుగంగ బోయిన న్ననయంబు నీదు పా 

        దార్చనారతులనే నడుగ బోదు

నీ పద పద్మముల్ నిరతంబు గొల్చెడు

       మహితమౌ భక్తిలో మసలునాకు

నింకనున్ గోరంగ నేముండు శంకరా !

         భక్తి సాధకమైన ముక్తి దప్ప

ఇట్టి నాపైన దయజూపి పట్టి కరము

చింతలనుదీర్చి నీలోన చేర్చు కొనుము

కరుణ చూపుము నా పైన కామదహన ! 

ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ !              30*


✍️గోపాలుని మధుసూదనరావు🙏

పద్యతాంబూలం

 పద్యతాంబూలం 


గెంతుల పినవయసున పిత, 

కాంతుడు కళ్యాణమునను, కన్నసుతుండున్, 

పంతమునకన్నదమ్ములు, 

చెంతన మగతలపె లేని చేడియ గలదే?  


చిగురొత్తగ తల్లిని, చెరి 

సగమని దెచ్చిన సుదతిని, సరి వదినమ్మన్, 

బగి తోబుట్టును, తనయను, 

మగువను బ్రతుకున తలవని మగవాడేడీ?


ఇలా, ఇద్దరూ ఒకరికొకరు కావాలిగా, 

అందుకే, జంట తాంబూలములు..😀


🙏🕉️🙏


- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్

వారాహీ మాత🙏

 🙏 వారాహీ మాత🙏

వారాహీ మాత గురించి ఒక్కొక్క పురాణం లో ఒకోరకంగా చెప్పబడింది. వారాహీ మాతను గురించి వివరిస్తాను

వారాహీ దివా న స్మరేత్ అని శాస్త్ర వచనం 

వారాహీ మాతను పగటి పూట స్మరింపరాదు అంటే జపించకూడదు. మాత విశ్రాంతి తీసుకునే సమయం.ఆ తల్లికి నిద్రాభంగం అవుతుంది 

వారాహీ మాత ఆవిర్భాము గురించి వివిధ పురాణాలలో వివిధములుగా వివిధ వాహనాలతో వివిధ ఆయుధాలతో ఉన్నది. అవి ఒక్కసారి పరిశీలిద్దాము.

వారాహి దేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకామెగా, దశమహావిద్యలలో ఒకామెగా కొలుస్తారు. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహ స్వామి. నేపాల్ లో ఈమెను బారాహి అంటారు.( వబయో రభేదః )

వారాహి

పులిని వాహనంగా కలిగి వరాహ ముఖం, పది చేతులతో వారాహి దేవి ఉంటుంది .


ఆయుధములు

త్రిశూలం, ఖడ్గం

వాహనం

గేదె, సింహం, పులి, గుర్రం


వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఈమె ప్రతిరూపాలే.


మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యంలో శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది.

రక్తబీజుడిని చంపడం కోసం దుర్గా దేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది. ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు. వారాహి ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతులలో ఖడ్గం, డాలు, అంకుశం ఆయుధాలుగా కలిగి ఉంది.

దేవీ మాహాత్మ్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే, ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడ్ని సంహరిస్తుంది. వామన పురాణాం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది.


మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి, వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలపబడి ఉంది.


దేవీ భాగవత పురాణం ప్రకారం వారాహిని, ఇతర మాతృకలతో పాటుగా, అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది. రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది.


వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది. ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత.


మత్స్యపురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడి లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు.


దేవీ పురాణం వారాహీ దేవిని విచిత్రంగా వరాహా స్వామికి తల్లిగా (వరాహజననిగా) వర్ణించింది.


వారాహిని శైవులు , వైష్ణవులు , శాక్తులు పూజిస్తారు . వారాహిని సప్త-మాతృకల సమూహంలో పేర్కొన్నారు., ఇవి శక్తి మతంలో పూజించబడుతున్నాయి, అలాగే శివునితో సంబంధం కలిగి ఉంటాయి .


వారాహి ఒక రాత్రి దేవత మరియు కొన్నిసార్లు ధ్రుమ వారాహి ("చీకటి వారాహి") మరియు ధూమావతి ("చీకటి దేవత") అని పిలుస్తారు. తంత్రం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు వారాహిని పూజించాలి. పరశురామ కల్పసూత్రం ఆరాధన సమయం అర్ధరాత్రి అని స్పష్టంగా పేర్కొంది. శక్తలు వారాహిని రహస్య వామమార్గ తాంత్రిక పద్ధతుల ద్వారా పూజిస్తారు, ఇవి ప్రత్యేకంగా పంచమకార ఆరాధనతో సంబంధం కలిగి ఉంటాయి - ద్రాక్షారసం, చేపలు, ధాన్యం, మాంసం మరియు కర్మ సంయోగం . గంగానది ఒడ్డున ఉన్న కాళరాత్రి ఆలయంలో ఈ పద్ధతులు పాటిస్తారు, ఇక్కడ రాత్రిపూట మాత్రమే వారాహికి పూజలు చేస్తారు; గుడి పగటిపూట మూసివేయబడుతుంది. వారాహిని లలితా త్రిపురసుందరి దేవత యొక్క అభివ్యక్తిగా లేదా "దండనాయక" లేదా "దండనాథ"గా భావిస్తారు.

 శక్తిమతం యొక్క శ్రీ విద్యా సంప్రదాయం వారాహిని పరా విద్య ("అతీంద్రియ జ్ఞానం") స్థాయికి పెంచింది . దేవీ మహాత్మ్యం దీర్ఘాయువు కోసం వారాహిని ప్రేరేపించాలని సూచించింది. వారాహి పూజకు మరియు సిద్ధులను పొందేందుకు ముప్పై యంత్రాలు మరియు ముప్పై మంత్రాలు నిర్దేశించబడ్డాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే లలితా దేవి ఇచ్చా శక్తి, రాజమాతంగేశ్వరి జ్ఞానశక్తి వారాహీ మాత క్రియాశక్తి.

మన పురాణాల ప్రకారం మహా శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు,వీరే బ్రహ్మీ ,మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండీ.

8.వ మాతృక గా నారసింహి

9.వ మాతృక గా వినాయకి నీ ఆరాధించడం జరుగుతుంది,భక్తులకు కొంగుబంగారంగా మనల్ని ఎప్పుడు చల్లగా చూసేందుకు వీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు,ఈ సప్త మాతృక స్వరూపిణి ఈ వారాహి మాతగా పరిగణించపడుతోంది, ఈ వారాహిరూపం రూపాన్ని పోలిఉండి,నల్లని శరీరఛాయాతో మేఘ వర్ణంతో ఎనిమిది చేతులతో, అభయ వరద హస్తం,శంకు చక్ర, రోకలి నాగలి,పాశం హలం ఆయుధాలతో భక్తులకు దర్శనం ఇస్తుంది,ముఖ్యంగా లలితదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు ఈ వారాహిమాత,అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామాలలో వినిపిస్తుంది,వారాహి మాతను భక్తి శ్రద్ధలతో కొలిచినవారికి,భక్తుల పాలిట కొంగు బంగారమై,తన పైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై గొప్ప యోధురాలిగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్ని తొలగించి,శత్రుభయం,జ్ఞానసిద్ధి బుద్ధి, ధనప్రాప్తి,ఇంకా అనేక అనేక సకల జయాలు సిద్ధిస్తాయి,అలాగే ఈమె అజ్ఞాచక్ర కుండలిని జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది, అందుకే ఆమెను ఆజ్ఞచక్రేశ్వరి అన్నారు,శుంభ నీశుoబ,రక్త బీజ వధలోను ఈమె ప్రస్తావన ఉంది.

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ