14, సెప్టెంబర్ 2025, ఆదివారం

బృహద్ధర్మపురాణంలో

 బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి


బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పుచేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రము చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివినవారిని అనుగ్రహిస్తారు. దీనిని ఎవరైతే వారి పుట్టిన రోజునాడు తండ్రికి నమస్కరించి వారి వద్ద చదువుతారో వారికి పితరుల అనుగ్రహం లభిస్తుంది.


బ్రహ్మఉవాచ:-


1. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ; సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే ఎవరివలన ఈ జన్మవచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సులవల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.


2. సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే; సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ


సెప్టెంబర్-2015-


సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమాన మైనవారు సకల పుణ్యతీర్ధములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారములు,


3. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః; సదా... పరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివ రూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు,


4. దుర్లభం మానుషమిదం యేనలబ్దం మాయా వపుః సంభావనీయం ధర్మార్దే తస్మై పిత్రే నమో నమః ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించినదో ఆ పితృదేవతలకు నమస్కారములు.


5. తీర్ధస్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం: మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః ఎవరిని చూసినంతనే అనేక తీర్ధస్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహా గురు వులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు.


6. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం; అశ్వమేధ శతై: తుల్యం తస్మై పిత్రే నమో నమః ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరు లకు నమస్కారములు.


ఫలశృతి:


ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం ప్రాతురుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితం నానాపకర్మకృత్వాపి యఃసౌతి పితరం సుతః సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీభవేత్ పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యధార్హతి


-యస్.వి.యస్.ఎన్.శర్మ


35

వెంటనే జరుగుతుంది.

 కాలాన్తరేహ్యనర్థాయ 

 గృధ్రో గేహోపరిస్థితః |

ఖలో గృహసమీపస్య సద్యోనర్థాయదేహినామ్ || 


ఒక డేగ ఇంటిపై కూర్చుంటే, అప్పుడప్పుడు చెడు జరగవచ్చు. ఒక దుష్టుడు ఇంటి దగ్గర ఉంటే, చెడు వెంటనే జరుగుతుంది.


...కలివిడంబనమ్

13, సెప్టెంబర్ 2025, శనివారం

భువనవిజయం

 శ్రీకృష్ణదేవరాయల కాలంలోని "భువనవిజయం"లో ఉన్న ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజ కవులు అంటారు. 

వారు:-

1. అల్లసాని పెద్దన (మనుచరిత్ర, హరికథా సారం).

2. నంది తిమ్మన (పారిజాతాపహరణం).

3. ధూర్జటి (శ్రీకాళహస్తీశ్వర శతకం).

4. మాదయ్యగారి మల్లన (రాజశేఖర చరిత్ర).

5. అయ్యలరాజు రామభద్రుడు (రామాయణ కథ).

6. పింగళి సూరన (ప్రభావతీ కళ్యాణం, కళాపూర్ణోదయం).

7. రామరాజభూషణుడు (వసుచరిత్ర).

8. తెనాలి రామకృష్ణుడు (ఉద్భట, పాండురంగ మహత్యం).


అష్టదిగ్గజాలు :-

ఎనిమిది దిక్కులయందలి ఏనుగులు ( భార్యలతో సహా )


1. ఐరావతం (అభ్రం)

2. పుండరీకం (కపిల)

3. వామనం (పింగళ)

4. కుముదం (అనుపమ)

5. అంజనం (తామ్రపర్ణి)

6. పుష్పదంతం (శుభ్రదంతి)

7. సార్వ భౌమం (అంగన)

8. సుప్రతీకం (అంజనా వతి)

మలేరియా జ్వరమునకు

 మలేరియా జ్వరమునకు తులసితో చికిత్స -

      

మలేరియా జ్వరం వర్షాకాలం నందు విపరీతంగా వ్యాప్తి చెందును. ఇది ఇప్పుడు సర్వసాధారణం అయినది. దీనికి ఇతర వైద్యులు "క్యూనైన్ "మందుగా వాడటం జరుగుతుంది. దీనిచే జ్వరం తగ్గును. కానీ తలనొప్పి , చెవులలో హోరుమను శబ్దం , తలతిరుగుట , చెవుడు మొదలుకొని హృదయసంబంధ కాంప్లికేషన్స్ అగుపిస్తున్నాయి. మన ఆయుర్వేద వైద్యం నందు తులసితో ఎటువంటి సైడ్ ఎఫక్ట్స్ లేకుండా ఈ జ్వరాన్ని సులభంగా నివారించవచ్చు. 

  

. నివారణోపాయాలు - 

 

* 7 మిరియాలు , 7 తులసి ఆకులు కలిపి నమిలి మ్రింగుచున్న మలేరియా జ్వరం 3 రోజులలో హరించును . 

 

* మానిపసుపు , పిప్పిళ్ళు , వెల్లుల్లి , జీలకర్ర , శొంఠి , తులసి , నారింజ పిందెలు , వావిలి వ్రేళ్ళు , ఆకుపత్రి వీటిని సమాన భాగాలుగా కలిపి చూర్ణించి పూటకు అరతులం వంతున ఇచ్చుచున్న చలిజ్వరములు తగ్గును. 

 

* తులసి ఆకులు 60 గ్రా , కొద్దిగా మందార పుష్పదళములు , కొద్దిగా ఉమ్మెత్త పుష్పదళములు , మిరియాలు 10 గ్రా , కొద్దిగా నీరువేసి మర్దించి బఠాణి గింజంత పరిమాణంతో మాత్రలు చేసి చలిజ్వరం వచ్చుటకు గంట ముందుగా రెండు మాత్రలు తీసుకున్న చలిజ్వరం రాకుండానే పోవును.అలాగే రొజు మార్చి రొజు వచ్చు మలేరియా జ్వరం లందు మంచి ఫలితాన్ని ఇచ్చును . 

 

* మలేరియా జ్వరం మొండిగా ప్రతిసంవత్సరం వస్తూనే ఉండిన తులసీదళములు , మిరియాలు నీటిలో వేసి ఉడికించిన కషాయములో కొద్దిగా బెల్లం , నిమ్మరసం కలిపి వేడిగా ఉన్నప్పుడే కాఫీ వలే తాగి రగ్గు కప్పుకొని పడుకోవలెను . ఇలా మూడు గంటలకు ఒకమారు చేయుచుండిన మంచి ఫలితం ఉండును. 

 

* తులసి వ్రేళ్ళ కాషాయం త్రాపిన బాగుగా చెమటపట్టి చలిజ్వరం వెంటనే తగ్గును. 

 

* మలేరియా జ్వరం ప్రతిసంవత్సరం భాదించుచున్న వ్యక్తికీ తులసిరసం , పుదీనా రసం , అల్లం రసం ఒక్కొక్కటి 5 గ్రాముల వంతున కలిపి తాగుచున్న మంచి ఫలితం కనిపించును.

  

గమనిక - 

      

తులసి చెట్టు వైద్యం కొరకు కుండీలలో ఇంట్లో పెంచుకొనుట చాలా మంచిది.

  

తులసితో వైద్యంలో నా అనుభవ యోగం. - 

        

. ప్రతిరోజు 2 స్పూన్స్ తులసి రసం ఇచ్చి టాబ్లెట్ లేకుండా రక్తపోటు 170 నుంచి 130 కి తీసుకొనివచ్చాను కేవలం 2 వారాలలోనే ఇలా కొంతకాలం తులసిరసం వాడటం వలన రక్తపోటు పూర్తిగా పోతుంది. 



 మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

కొడుకుల్ పుట్టరటంచు


కొడుకుల్ పుట్టరటంచు నేడు రవివేకుల్ జీవనభ్రాంతులై! కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నేగతుల్ వడసెన్? పుత్రులులేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదం బపుత్రుకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! 28


ఈశ్వరా! లోకంలోని జనులు ఎంత అవివేకులు! కొడుకులు పుట్టలేదని, తమకు ఉత్తమగతులు లేవని అజ్ఞానంతో ఏడుస్తున్నారు. కౌరవచక్రవర్తి దృతరాష్ట్రునకు వందమంది కొడుకులు పుట్టారు కదా! వారి వల్ల అతడు ఎంత ఉత్తమగతిని పొందాడు. బ్రహ్మచారిగా ఉండి అపుత్రకుడైన శుకమహర్షికి ఏ దుర్గతులు కలిగెను. ఇదంతా భ్రాంతి తప్ప మరొకటి కాదు. అపుత్రకుడైన వానికి మోక్షమార్గము మూసుకొని పోవునా? వట్టిది. "జ్ఞానేనహి నృణాం మోక్షః"



Panchaag



 

11, సెప్టెంబర్ 2025, గురువారం

Panchaag



 

9, సెప్టెంబర్ 2025, మంగళవారం

దేవరకొండ బాగంగాధర తిలక్

 🙏దేవరకొండ బాగంగాధర తిలక్ 🙏

తెలుగు కవితావరణంలో అమృతం కురిపించిన దేవరకొండ బాలగంగాధర తిలక్‌ … ఎప్పటికీ గుర్తుండిపోతాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో 1921 ఆగస్టు 1న పుట్టిన తిలక్‌ … తన 11వ ఏటనే కథ రాయడం, 16వ ఏట నుంచే కవిత్వం అల్లడం ప్రారంభించారు. విశాఖపట్నం ఏవిఎన్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి, అనారోగ్య కారణాల చేత ఉన్నత విద్య అభ్యసించలేకపోయారు. తణుకులో ‘సాహితీ సరోవరం’ పేరిట విజ్ఞాన పరిషత్‌ను స్థాపించి, సాహిత్య సృజన సాగించారు.

తిలక్‌ అనారోగ్య సమస్య మానసికమైనది. లేనిపోని జబ్బులు తనకే ఉన్నాయనే భావం హైపో కాండ్రియాసిస్‌ వల్ల సైకోన్యూరోసిస్‌, గుండె సంబంధమైన వ్యాధులతో 1946 నుంచి 1954 వరకు ఎనిమిదేళ్లపాటు మంచానికే పరిమితమయ్యారు. ఆ దశలోనే ‘బాధాగళము’, ‘మండోదరి’ వంటి పద్య కవిత్వం రాశారు తిలక్‌. ఆరోగ్యం కుదుట పడ్డాక 1954 – 1966 మధ్య ఒక పుష్కర కాలం పాటు అన్ని సాహితీ ప్రక్రియల్లోనూ విస్తారంగా రచనలు చేశారు. ఇరుగు- పొరుగు, సుచిత్ర ప్రణయం, సుప్తశిల, పొగ, భరతుడు (ఏకపాత్రాభినయం) వంటి నాటికలు; సుశీల పెళ్ళి, సాలెగూడు వంటి నాటకాలు కూడా రాశారు. కావ్యసృష్టి, గాంధీ జీవితం ఒక మహాకావ్యం, హేమంత హసంతిక, కావ్యరసం, యుద్ధం వంటి వ్యాసాలు రాశారు. తన మిత్రులకు గొప్ప జీవిత స్పర్శ, సాహిత్య సౌరభం ఉన్న లేఖలు రాశారు. మాక్సిం గోర్కీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్ఫూర్తితో కథలు రాశారు. సుందరి సుబ్బారావు, ఊరి చివర ఇల్లు కథలు ఎంతో ప్రసిద్ధం. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆయన సృజియించిన వచన కవిత్వం మరొక ఎత్తు. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల ప్రభావంతో ఆయన భావాభ్యుదయ కవిత్వాన్ని ఆవిష్కరించారు. శ్రీశ్రీ మహాప్రస్థానం, తిలక్‌ అమతం కురిసిన రాత్రి సాహితీ ప్రపంచంలో విహరిద్దామనుకునే పాఠకులకు, వర్ధమాన కవులకు రెండు అద్భుత ద్వారాలుగా నిలుస్తాయి. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం తిలక్‌కు కరతళామలకం. ఆధునిక జీవితాన్ని అభివర్ణించడానికి వృత్త పరిధి చాలక శ్రీశ్రీ లాగానే, వచన గేయాన్ని ఎంచుకున్నారు. అది తన చేతిలో ఒకనొక ప్రత్యేకతని సంతరించుకొని, సౌందర్యాన్ని సేకరించుకుంది.

‘అమృతం కురిసిన రాత్రి’లో ”అందరూ నిద్ర పోతున్నారు- నేను మాత్రం- తలుపు తెరచి ఇల్లు విడిచి- ఎక్కడికో దూరంగా- కొండ దాటి కోన దాటి- వెన్నెల మైదానంలోకి వెళ్లి నిలుచున్నాను” అంటూ పాఠకున్ని కూడా వెన్నెల మైదానంలోకి తీసుకుపోతారు. ”నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు/ నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు/ నా అక్షరాలు వెన్నెలలో ఆడుకోనే అందమైన ఆడపిల్లలు” అని తిలక్‌ చెప్పుకున్నారు. ఇందులోని మొదటి రెండు వాక్యాలూ తిలక్‌ తన వస్తువుల గురించి, మూడవది తన శైలిని గురించి చెప్పుకున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ”పాడువోయిన ఊరు”లో – అది అంతా యిసుక- చరిత్రలో ఒక మసక- ఇది నశించిన గ్రామం- విశ్వసించే ఒక శ్మశానం- కాలిపోయే ఇల్లులా జీవితం ఒరుగుతుంది- కాలం పాడు నుయ్యిలా నా కన్నులకు కనబడింది అంటూ భాష సరళతను భావగాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు తిలక్‌. ‘సైనికుడి ఉత్తరంలో’ ఇక్కడ నేను క్షేమం- అక్కడ నువ్వు కూడా- ముసలి అమ్మ- పాత మంచం కోడు- మన చిన్నబ్బాయి- చెరువులో కొంగా” అంటూ ప్రారంభమైన ఉత్తరం- ”నేనిది వరకటి నేను కాను – నాకు విలువల్లేవు – చంపడం, చావడం తప్ప- కనిపించే ఈ యూనిఫారం కింద- ఒక పెద్ద నిరాశ, ఒక అనాగరికత బ్రిడ్జి కింద నదిలా రహస్యంగా ఉంది” అని సైనికుడు భార్యకు రాసే ఉత్తరాన్ని వివరించారు తిలక్‌.

సంఘవంచితుల పట్ల ఎంత కారుణ్యాన్ని చూపిస్తారో సంఘ దురన్యాయాల పట్ల అంతే క్రోధాన్ని ప్రదర్శిస్తారు తిలక్‌. ‘ఆర్తగీతం’లో ”నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలి వాణ్ణి- నేను చూసాను నిజంగా నీరంధ్ర వర్షాన వంతెన కింద- నిండు చూలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని- నేను చూశాను నిజంగా తల్లి లేక, తండ్రి లేక, తిండి లేక, ఏడుస్తూ ఏడుస్తూ- ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ పక్కనే నిద్రించిన మూడేళ్ళ పసి బాలుణ్ణి …” ఇలా వంచితుల దీన గాధల్ని వివరిస్తూ- ఇది ఏ నాగరికతకు ఫలశృతి? ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి? ఏ బుద్ధ దేవుని జన్మభూమికి గర్వ స్మ ృతి” అనే ప్రశ్నలతో తన క్రోధాన్ని ప్రదర్శించారు. ‘న్యూ సిలబస్‌’ అనే కవితలో సౌత్‌ ఆఫ్రికా ప్రధాన మంత్రికి సామరస్యం ప్రధాన లక్ష్యం- రష్యా నేత కశ్చేవ్‌కి ప్రపంచ శాంతి ఒకటే గమ్యం- అమెరికన్‌ కెనడీకి పరోపకారం స్పూనుతో పెట్టిన ఆహారం అయినా యుద్ధం ఎందుకంటే తమ్ముడు! అది మన ప్రారబ్దం అంటూ అని ఆనాడే వాపోయారు. కష్ణశాస్త్రి, శ్రీశ్రీ ప్రభావంతో కవిత్వం రాసినా వచన కవితా ప్రక్రియను తన అసమాన ప్రతిభా సంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్ళిన వాడు తిలక్‌.

‘నవత కవిత’లో – ”గంతలు కట్టినంత మాత్రాన గాడిద గుర్రం కాదు- ఖద్దరు ధరించిన ప్రతివాడు గాంధేయుడు కాడు- ఆధునికత ఉన్నంత మాత్రాన ప్రతీదీ శిరోధార్యం కాదు- ఆహార్యం మార్చినంత మాత్రాన సామాన్యుడు మహారాజవడు- అంత్యప్రాసలు వేసినంత మాత్రాన ప్రొసైక్‌ భావం పోయెట్రీ అవదు- కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసును- కాళిదాసుకు తెలుసు- పెద్దన్నకి తెలుసూ – కృష్ణ శాస్త్రికి తెలుసు- శ్రీశ్రీకి తెలుసు” అంటూ కవిత్వానికి ప్రామాణికాలను నిర్దేశించారు తిలక్‌. ‘నీడలు’ కవితలో ”చిన్నమ్మా – నేను వెళ్ళొస్తాను- చీకటి పడుతోంది- చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకొంది- శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది- దారంతా గోతులు ఇల్లేమో దూరం- చేతిలో దీపం లేదు- ధైర్యమే ఒక కవచం” అంటూ ఆశావాహ దక్పథాన్ని పాఠకులకు కలిగిస్తారు.

తిలక్‌ రాసిన ‘తపాలా బంట్రోతు’ గేయం బాగా ప్రాచుర్యం పొందింది. ”ఎండలో, వానలో – ఎండిన చివికిన- ఒక చిన్న సైజు జీతగాడు – చెవిలో పెన్సిల్‌- చేతిలో సంచి- ఖాకీ దుస్తులు- అరిగిన చెప్పులు- ఒక సాదా పేదవాడు- ఇంటింటికి- వీధి వీధికి ప్రతిరోజూ తిరిగేవాడు- ప్రైమినిష్టరా ఏం అని అంటూనే అదృష్టాద్వం మీద నీ గమనం- శుభా శుభాలకి నువ్వు వర్తమానం- నీ మ్యాజిక్‌ సంచిలో- ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం!” అంటూ తన పోస్టుమేన్‌ స్నేహితున్ని రాజును చేశారు తిలక్‌. ”ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిలాగా వెళ్లిపోయే నిన్ను చూసినపుడు – తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు” అనే ముగింపు గుండెల్ని పిండేసినట్లుంటుంది.

కృష్ణశాస్త్రి ‘కృష్ణపక్షం’ లాగా, శ్రీశ్రీ మహాప్రస్థానం లాగా తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’ కూడా ఆధునికాంధ్ర కవిత్వ చరిత్రలో ఒక మైలురాయి. అనేక ముద్రణలు పొంది ప్రజల అభిమానాన్ని ఈనాటికీ చూరగొంటోంది. ఎందరో యువతీ యువకుల్ని కవులుగా తీర్చిదిద్దుతోంది. ఈ కవితా సంపుటికి 1969లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తిలక్‌ మరణానంతరం లభించాయి, ునజు చీ×+ను ఉఖీ చీజుజుA= గా ఇంగ్లీష్‌ లో అనువాదమైంది.

”సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు- అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు- చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి” అంటూ బలమైన కంఠంతో విశ్వ మానవ కళ్యాణానికి నిబద్ధుడై కరుణ కలికితురాయిగా తమ అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ అమృతం కురిసిన రాత్రులను, కవిత ఝరులను ప్రవహింపచేశారు దేవరకొండ బాలగంగాధర తిలక్‌. సృజనశక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో – 45 ఏళ్ళ నడి వయసులో ఆయన 1966 జూన్‌ 30న అనారోగ్యంతో కన్నుమూయడం తెలుగు సాహితికి తీరని లోటు! ”యువకవి- లోక ప్రతినిధి- నవ భావామృత రసధుని- కవితా సతినొసట నిత్య రస గంగాధర తిలకం – సమకాలిక సమస్యలకు స్వచ్ఛస్ఫటిక ఫలకం- నడి నింగి మాయమయాడా – మన మిత్రుడు కవితా పుత్రుడు- కదన క్షాత్రుడు- సకల జగన్మిత్రుడు” అంటూ శ్రీశ్రీ తిలక్‌కు నివాళులు అర్పించారు. మనమూ స్మరించుకుందాం.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

8, సెప్టెంబర్ 2025, సోమవారం

నీలకంఠేశ్వరా


నీలకంఠేశ్వరా!   


మ: నిను సేవించిన గల్గు మానవులకున్ వీటీవధూటీఘటీ/

ఘనకోటీ శకటీకటీ తటిపటీ గంధేభవాటీ పటీ/

ర, నటీ, హారిసువర్ణహార మకుటీ ప్రఛ్ఛోటికా పేటికల్/

కనదామ్నాయమహాతురంగ!

శివలింగా! నీలకంఠేశ్వరా!


ఎఱ్ఱాప్రెగ్గడ:-నీలకంఠేశ్వర శతకం.


         కాకతి రాజుల కాలంలో వీరశైవం మహోన్నత స్థితిని అందుకొన్నది. ఆమహా తరుణంలో శివకవులు నలుముఖముల విజృభించి అద్భుతమైన సాహిత్య సృజన చేశారు. నాడు శతకసాహిత్యం ఆవిర్భావ దశలో ఉన్నను మంచి మంచి శతకాలు వెలిశాయి. అందులో నీలకంఠశతకం ఒకటి."ట"కార యమకంతో నాట్యంచేసిన యీపద్యం నాటి కవులకు గల భాషాధికారానికి నిలువుటద్దం!


అర్ధములు: వీటీవధూటీ ఘటీ-వారాంగనా సముదాయము;కోటీ:కోటిధనము;శకటీకటీ- వాహన(బండ్లు)సముదాయము;తటిపటీర:నదీతీరములయందుపెరిగినచందనవృక్షములు;గంధేభవాటీ- మదగజ సముదాయము;పటీర-చందన: నటీ-నాట్యకత్తెలు;హారి-మనోహరమైన; సువర్ణహార-బంగరుహారములు;మకుటీ-కిరీటములు;ప్రఛ్ఛోటికా-పల్లకీలు;పేటికల్- పెట్టెలు; కనత్-ప్రకాశించు; ఆమ్నాయమహాతురంగ-వేదములే గుర్రములైనవాడా!; 


భావము:- ఓనీలకంఠేశ్వరా! వేదాశ్వా! నిను పూజించిన వారికి ఏమికొదవ?వారాంగనా సముదాయములేమి,అనేకకోట్ల ధనమేమి?వాహన సముదాయములేమి? ,చందనవృక్షాదులేమి, మదగజాదులేమి, కర్పూరాది సుగంధద్రవ్యాదులేమి,నట్టువరాండ్రేమి? బంగరు హారాదులేమి.సర్వము సంపన్నమే! నీవు శంకరుడవుగదా! స్వామీ !సదానీసేవాభాగ్యము ననుగ్రహింపుము.


విశేషాంశములు: భోగపుకాంతలు నాటి విలాస జీవనమునకు ప్రతీకలు.


గజాంతమైశ్వర్యం"-అనునది నాటి నానుడి. మదగజములు గలిగినవాడు ధనవంతులలో మేటి.

.చందనము కర్పూరాది సుగంధవస్తుసేవనము నాటిధనికుల జీవనరీతి.


బంగరుగద్దెలు హారములు మంజూషలు వారి అపారమైన ఐశ్వర్యమునకు నిదర్శనములు.


అలంకారం: వృత్యనుప్రాసము.

7, సెప్టెంబర్ 2025, ఆదివారం

Panchaag