3, జులై 2022, ఆదివారం

పొడుపు పద్యము

 తే.గీ.పడతి నాలుగు వర్ణముల్ పదములోన

కలికి మొదటి వర్ణము బోవ ఘస్రమగును

అతివ తుదిమూడు నుతొలగ హస్తమగును

తెలిసి యున్నచో చెప్పుము తెలుగు లేమ

పి.మోహన్ రెడ్డి.



. ... జాతీయ తెలుగు సాహితీ పీఠము …

  తేనియల్ చిందు నా భాష తెలుగుభాష

        డా. నలవోలు నరసింహా రెడ్డి


          …… పొడుపు పద్యము …...

ఆ. అబ్ధి కొఱకు మాట అక్కరాల్ నాలుగు 

 ఒండు, రెండు నాల్గు గొప్పు ''నీరు" 

మూడు, రెండు, నాల్గు చూడ నయ్యది ''రంగు"   

పదము తెలుప వలయు పసిడి బాల..! 84

కామెంట్‌లు లేవు: