2, నవంబర్ 2022, బుధవారం

12 రోజుల లో 9జ్యోతిర్లింగాలను దర్శించుట

 సొంతంగా 12 రోజుల లో 9జ్యోతిర్లింగాలను దర్శించుట ఎలా?

ఓం నమో గణాధి పతయే నమః ఓం నమః శివాయ

ఈ క్రింద తెలిపిన ప్లాన్ వీలైనంత తక్కువ ఖర్చు తో జ్యోతిర్లింగ దర్శనం కోసం వ్రాయబడినది. శివ భక్తులకు సాయ పడుదామన్న ఆశ తో ఈ ప్లాన్ వ్రాసాను. ప్లాను లో వున్న రైళ్లు ప్రతి రోజు నడిచేవి. విరామం లేకుండా ప్రయాణం కొందరికి కష్టం. మీకు అనువైన ప్రయాణించే ప్లాన్ చేసుకోగలరు. మీకు అనువైనట్టు ప్లాన్ చేసుకుంటారని రైల్వే స్టేషన్ కోడ్స్ ని () లోపల వ్రాసాను. కొన్ని కొత్త స్పెషల్ రైళ్లు ఉండొచ్చు, ప్లాన్ చేసినప్పుడు చూసుకోగలరు. ఒక్కోసారి రైలు లేట్ కావొచ్చు అది కూడా అలోచించి ప్లాన్ చేసుకో గలరు. గుడి లో శివాష్టోత్తరం లేక మీకు అవసరమైన మంత్రాలు చదవండి, లేక శివ నామం స్మరించండి. అభిషేకం కొరకు రాగి లేదా వెండి పాత్ర తీసుకు వెళ్ళండి. ఈ ప్లాన్ గుడి లో ఉంటే ఇతర భక్తులకు కూడా ఉపయోగ పడును. దయ చేసి ఈ ప్లాన్ గుడి లో నే ఉంచ గలరు. నేను మీ వంటి ఒక శివ భక్తుడిని. నేను టూర్ ఆపరేటర్ ను కాను. ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి. శీఘ్రమేవ శివ దర్శన ప్రాప్తిరస్తు.

1వ రోజు: బేగంపేట్ (BMT) లో రాత్రి 9:00 కి ట్రైన్ # 57549 ఔరంగాబాడ్ పాసెంజర్ (ఈ రైలు లో స్లీపర్ క్లాస్ భోగిలు ఒకటి లేదా రెండు వున్నాయి) ఎక్కి మరుసటి రోజు పొద్దున్న 6:30 కి పర్లీ (PRLI) రైల్వే స్టేషన్ లో దిగండి. ఈ ట్రైన్ పాసెంజర్ కాబట్టి లేట్ కావొచ్చు. OR మీరు విజయవాడ (BZA) నుంచి యాత్ర ప్రారంభిస్తుంటే, ట్రైన్# 17206 కాకినాడ సాయి నగర్ షిర్డీ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి లేదా ట్రైన్# 17208 విజయవాడ లో సాయి నగర్ షిర్డీ ఎక్ష్ప్రెస్స్ పొద్దున్న10.30 కి ఎక్కి, పర్లీ (PRLI) రైల్వే స్టేషన్ లో రాత్రి 12:05 కి దిగండి (ప్రయాణ సమయము 13 గంటలు). హైదరాబాద్ లో బయలుదేరు వారు 17206, 17208 రైళ్లు సికింద్రాబాద్ లో కూడా ఎక్కొచ్చు (ప్రయాణ సమయము7 గంటలు).

2వ రోజు: పర్లీ(PRLI) రైల్వే స్టేషన్ నుండి బైజనాథ్ గుడి 3KMs దూరం లో వుంది. స్టేషన్ బైట ఆటోలు దొరుకును. ఉదయం బైద్యనాథ్ జ్యోతిర్లింగ[1] దర్శనం చేసుకున్న పిమ్మట బస్సు లో పర్భానీ (PBN) (67KMs) రైల్వే స్టేషన్ కి 10:30 AM లోగ చేరుకొని ట్రైన్# 12715 స్చఖండ్ ఎక్ష్ప్రెస్స్ 10.37 AM ఎక్కండి లేదా ట్రైన్# 17618 తపోవన్ ఎక్ష్ప్రెస్స్ 11.17 AM కి ఎక్కండి. ఔరంగాబాద్ (AWB) రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం 2:30 PM కి దిగి ఔరంగాబాద్ సెంట్రల్ బస్టాండ్ కి వెళ్ళండి (3 KMs) ఆటోలు కలవు. ఔరంగాబాద్ బస్టాండ్ లో గ్రిశ్నేశ్వర్ వెళ్లే బస్సు ఎక్కి గ్రిశ్నేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించండి (30 KMs). గ్రిశ్నేశ్వర్ జ్యోతిర్లింగ గుడి దెగ్గర లో రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి (ఇక్కడ నుంచి ఎల్లోరా గుహ లు1KM దూరం లో వుంది, ఈ గుహలను పూర్తి గా చూడాలంటే ఒక రోజు పడ్తుంది). గ్రిశ్నేశ్వర్ నుండి ఔరంగాబాద్ బస్సు స్టాండ్ కి చేరుకొండి.

3 వ రోజు: ఔరంగాబాద్ బస్సు స్టాండు లో నాశిక్ బస్సు ఎక్కండి. నాశిక్ బస్టాండ్ (దూరం 187 కిలోమీటర్లు) ప్రయాణ సమయం 5 గంటలు. నాశిక్ బస్సు స్టాండ్ లో త్రియంబక్ కి వెళ్లే బస్సు ఎక్కి (దూరం 30 కిలోమీటర్లు) త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం[3] దర్శించుకోండి (రాత్రి 9:00 PM వరకు గుడి తెరచి ఉంటుంది) దర్శనం తరువాత, గోదావరి ఆవిర్భవించిన క్షేత్రం దర్శించండి. గుడి దెగ్గర రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.

4 వ రోజు: పొద్దున్నే 06:00 AM బయలుదేరి నాశిక్ బస్సు స్టాండ్ చేరుకోండి. 07:00 గంటలకు నాశిక్ బస్సు స్టాండ్ లో మంచర్ వెళ్లే గవర్నమెంట్ బస్సు (ప్రైవేట్ బస్సు ఎక్కితే లేట్ అవుతుంది) ఎక్కి మంచర్ బస్సు స్టాండ్ లో 11:00 AM కి దిగండి (దూరం 150 KMs). మంచర్ బస్టాండ్ లో భీమా శంకర్ బస్సు ఎక్కి భీమశంకర్ (61KMs, 2hours) లో భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని [4] దర్శించుకొండి (బస్సు స్టాండ్ దెగ్గర లో నే గుడి వున్నది). మధ్యాహ్నం 2:00 PM కి భీమశంకర్ బస్టాండ్ లో పూణే బస్సు ఎక్కి పూణే (PUNE) రైల్వే స్టేషన్ కి చేరుకొండి (110 KMs, 3 hours). రాత్రి7:50PM కి ట్రైన్# 11090 పూణే భగత్ కి కోతి ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి. ఒక వేళారోజు గురువారం ఐతే డైరెక్ట్ సోమనాథ్ ట్రైన్ రాత్రి 7:50 PM ట్రైన్# 11088 పూణే వెరావల్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.

5 వ రోజు: అహ్మదాబాద్ (ADI) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న7:45AM కి దిగి ట్రైన్# 11464 జబల్పూర్ సోమనాథ్ ఎక్ష్ప్రెస్స్ 8:15AM కి లేదా ట్రైన్#19119 అహ్మదాబాద్ సోమనాథ్ ఎక్ష్ప్రెస్స్ 10:40 AMఎక్కి వెరావల్(VRL) రైల్వే స్టేషన్ లో సాయంత్రం5:35PM కి లేదా 7:30PM కి దిగండి. అక్కడ బల్క తీర్థ్ దర్శించి, ప్రభాస్ తీర్థ్ త్రివేణి సంగమం లో స్నానం చేసి సోమనాథ్ జ్యోతిర్లింగ[5] దర్శనం చేసుకుని ట్రైన్# 19251 సోమనాథ్ ఒక ఎక్ష్ప్రెస్స్ వెరావల్ లో రాత్రి 11:10 కి ఎక్కండి.

6 వ రోజు: ద్వారకా (DWK) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:10 AM కి దిగి, ద్వారకాధీశ్ దర్శనం, నాగేశ్వర జ్యోతిర్లింగ [6] దర్శనం చేసుకుని ట్రైన్# 19006 (సౌరాష్ట్ర మెయిల్) మధ్యాహ్నం 1:00 PM కి ద్వారకా స్టేషన్ లో ఎక్కండి. {(optional) లేదా ఒక రోజు ద్వారకా లో నే ఉండి ద్వారకాధీశ్ గుడి, ఆది శంకరాచార్య మఠం, భేట ద్వారకా, భద్కేశ్వర్ మహాదేవ్ గుడి, గోపి తలాబ్, గోమతి నది దర్శించండి.}

7 వ రోజు: వడోదర(BRC) రైల్వే స్టేషన్ లో రాత్రి 12:48 AM కి దిగి, ట్రైన్# 12961 అవంతిక ఎక్ష్ప్రెస్స్ రాత్రి 1:10 AM కి ఎక్కండి. ఈ రెండు రైళ్ళకి కి మధ్య సమయం ఇంచు మించు 20 నిముషాలు. రైలు దొరకదు అనుకుంటే మీరు వెళ్లే రోజు వున్న వీక్లీ రైలు లేదా స్పెషల్ రైలు చూసుకోండి లేదా వడోదర లో రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి. మరుసటి రోజు రాత్రి 9:50 PM కి ట్రైన్# 19309 GNC ఇండోర్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.

8-9 వ రోజు: ఉజ్జయిని (UJN) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 4:00 AM కి దిగి బడే గణేష్ జి కా మందిర్ ఎదురుగా వున్న సత్రం లో రూమ్ తీస్కోండి. శిప్రా నది లో స్నానం చేసి మహాకాళేశ్వర జ్యోతిర్లింగ[7] దర్శనం చేస్కోండి. సత్రం లో రూమ్, హాల్, డార్మిటరీ + ఉచిత భోజనం (సత్రం లో వున్న వారికి మాత్రమే) ఉంటుంది. ఉజ్జయిని లో మహాకాళేశ్వరునికి భస్మ హారతి చూడ దలిచిన వారు పొద్దున్న 10:00 AM కి టెంపుల్ కౌంటర్ లో మీ ఫోటో ID కార్డు గ్జిరోస్ కాపీ ఇస్తే రేపు పొద్దున్న 4:00 AM కి జరగబోయే భస్మ హారతి కి పెర్మిషనిస్తారు. ఆన్లైన్ బుకింగ్ నెల రోజుల ముందు చేసుకోవాలి. ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడి దెగ్గర ఉజ్జయిని దర్శన్ బస్సెక్కండి (టికెట్ వెల ఇంచుమించు 50 రూపాయలు) రెండు ట్రిప్పులు పొద్దున్న ఇంచుమించు 8:00 AM కి మధ్యాహ్నం ఇంచుమించు 2:00 PM కి మొదలవుతుంది, అది ఎక్కితే స్థానికంగా వున్న గుళ్లను చూడవొచ్చు. భర్తృహరి గుహలు, సాందీపని ఆశ్రమం శ్రీకృష్ణ పరమాత్ముడు విద్యనభ్యసించిన ఆశ్రమం, శక్తిపీఠం (అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి) ఆటో వాడు చాలా తీసుకుంటాడు. తరువాత ఓంకారేశ్వర (135 kms) బస్సుఎక్కి, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ[8] దర్శనం చేసుకోండి. పక్కనే వున్న స్వామి గజానన ఆశ్రమం లో రూమ్ తీసుకోండి. స్వామి గజానన ఆశ్రమం లోవిశాల మైన రూంలు చాలా తక్కువ ధరకి దొరుకుతాయి + చాలా నీట్ గా ఉంటాయి + ఆశ్రమం లో వున్న వారికీ ఉచితంగా భోజనం పెడతారు లేదా ఐదు రూపాయలు తీసుకుంటారు ముందే టోకెన్ తీసుకోవాలి.

10 వ రోజు: పొద్దున్నే నర్మదా నది లో స్నానం చేసి మళ్ళి వీలయితే ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించి ఖండ్వా (70KMs) బస్సు ఎక్కి ఖండ్వా (KNW) రైల్వే స్టేషన్ కి ప్రొద్దున్న 10:00 AM లోపల చేరుకొండి. అక్కడ ట్రైన్# 11093 మహానగర ఎక్ష్ప్రెస్స్ లేదా ట్రైన్# 12167 లోకమాన్య తిలక్ టెర్మినస్ వారణాసి సూపర్ ఎక్ష్ప్రెస్స్ ప్రొద్దున్న 10:00AM కి ఎక్కండి.

11 వ రోజు: వారణాసి (కాశి) (BSB) రైల్వే స్టేషన్ కి పొద్దున్న 3:45 AM కి చేరుకొండి. కాశి లో గోదోలియా చౌక్ దెగ్గర రూమ్ లేదా డార్మిటరీ తీస్కొని ఫ్రెష్ ఐ కాశి విశ్వేశ్వర జ్యోతిర్లింగ[9] దర్శనం చేసుకోండి, తరువాత కాశి విశాలాక్షి శక్తిపీఠ దర్శనం చేసుకోండి, తరువాత తిల్ బండేశ్వర్ శివ లింగాన్ని (బెంగాలీ తొల దెగ్గర వుంది) దర్శించుకోండి. తిల్ బండేశ్వర్ శివలింగం సంవత్సరానికి ఒక నువ్వుల గింజంత పెరుగుతుంది, ఇక్కడ తెలుగు పూజారి వుంటారు(ఈ శివ లింగాన్ని దర్శించిన వారు కాశీ లో అన్ని శివ లింగాలు దర్శించినట్టే). వారాహి మాత ఆలయం పొద్దున్న ఎనిమిది వరకే తెరచి ఉంటుంది. మృత్యుమ్ జయ మహాదేవ్ గుడికి వెళ్లి అక్కడ బావి లో నీరు తాగండి. కాల భైరవుని కూడా దర్శించుకోండి. ముఖ్యమైనది మధ్యాహ్నం 12:00 నుంచి 12:10 వరకు మణికర్ణికా ఘాట్ లో సంకల్పం చెప్పుకుని స్నానం చెయ్యాలి. ఆ సమయం లో స్నానం చేస్తే లోకం లో వున్న సకల నదులలో స్నానం చేసిన దాని కంటే ఉత్తమం (చాగంటి కోటేశ్వర్ రావు గారి ప్రవచనం). రామేశ్వరం లోని శివ లింగానికి అభిషేకం కొరకు వేరుగా ఒక పాత్ర లో గంగ జలం తీసుకో గలరు. కాశి అన్నపూర్ణ మాత మందిరం లో ఉచిత భోజనానికి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకుని రుచికరమైన తెలుగు భోజనం చేయగలరు. అదే టోకెన్తో (టోకెన్ లేకుండా కూడా అన్నం వడ్డిస్తారు టోకెన్ తప్పని సరి కాదు) భోజనం రెండు బిల్డింగులు లో పెడతారు ఒకటి గుడి దెగ్గర (లైన్ ఉండొచ్చు) ఇంకొకటి గుడి గేట్ నెంబర్ (ఏమిటో గుర్తులేదు కనుక్కోగలరు) దెగ్గర లైన్ ఉండదు. మీకు ఇష్టమైతే వారికి అన్నదానానికి కొంత నగదు ఇవ్వగలరు (ఎవ్వరు అడగరు మీ ఇష్టం). కాశి లో అన్నదానం చేయడం అదృష్టం. మీరు ఒకరి భోజనానికి సరిపోయే నగదు కూడా ఇవ్వొచ్చు. కాశి లో ఒకరికి అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం ఉంటుంది (చాగంటి కోటేశ్వరావు గారి ప్రవచనం). సాయంత్రం 5:00 PM కి సికింద్రాబాద్ (SC) రైల్వే స్టేషన్ వెళ్ళుటకు ట్రైన్# 12792 సికింద్రాబాద్ ఎక్ష్ప్రెస్స్ వారణాసి రైల్వే స్టేషన్ ఎక్కండి లేదా విజయవాడ వెళ్ళుటకు ట్రైన్# 12296 సంఘ మిత్ర ఎక్ష్ప్రెస్స్ ముఘల్ సారాయి (MGS) రైల్వే స్టేషన్ లో రాత్రి 11:27 PM కి ఎక్కండి. మీరు ప్రయాగ లో స్నానం చేయ్యాలంటే వారణాసి నుండి ప్రయాగ (రైలు లో ప్రయాణ సమయం 3:30 గంటలు) ముందుగా వేరే రైలు లో చేరుకొని అలాహాబాద్ రైల్వే స్టేషన్(ALD) (ప్రయాగ) లో స్నానం చేసి రాత్రి 8:40 PM కి హైదరాబాద్ వెళ్లే అదే రైలు 12792 సికింద్రాబాద్ ఎక్ష్ప్రెస్స్ అలాహాబాద్ రైల్వే స్టేషన్ లో ఎక్కండి.

12 వ రోజు: సికింద్రాబాద్ కి రాత్రి 10:00 PM కి చేరుకొండి లేదా విజయవాడ కి ప్రొద్దున్న 6:05 AM కి చేరుకొండి.

కామెంట్‌లు లేవు: