1, ఫిబ్రవరి 2023, బుధవారం

దేహపుష్టి కలిగించు సిద్దయోగాలు

 దేహపుష్టి కలిగించు సిద్దయోగాలు - 


 * ప్రతినిత్యం రెండు అమృతపాణి అరటిపండ్లు తినుచున్న మంచి దేహపుష్టి , బలము కలుగును. 


 * ఉదయము మరియు మధ్యాహ్న సమయములో మినుములతో చేసిన గారెలు రెండు నుంచి నాలుగు తినుచున్న మంచి దేహపుష్టి కలుగును. 


 * ఆవునెయ్యిలో మినుములు వేయించి దానిని పిండిచేసి దానిలో బెల్లం మరియు నెయ్యి కలిపి పూటకు రెండు చెంచాల చొప్పున తీసుకొనుచున్న దేహబలం కలుగును. 


 * బూరుగ జిగురును చింతగింజ అంత మోతాదులో ఒక కప్పు నీటిలో కలుపుకుని తాగుచున్న శరీరానికి మంచిబలం కలుగును. 


 * ఒక కప్పు వేడినీటిలో తేనె కలిపి సేవించుచున్న మంచి దేహపుష్టి కలుగును. 


 * పెద్ద పల్లేరు కాయలను ఆవుపాలలో ఉడికించి ఆ తరువాత చూర్ణం చేసి పంచదారలో కలిపి పూటకు పదిగ్రాముల చొప్పున సేవించుచున్న మంచి దేహపుష్టి కలుగును. 


 * నేలగుమ్మడి చూర్ణమును ఒక స్పూన్ పాలతో కలిపి సేవించుచున్న మంచిదేహపుష్టి కలుగును. 


                 

        దేహపుష్టి కొరకు కొన్ని పదార్దాలు కూడా నిత్యం ఆహారంలో ఉండేలా చూసుకోండి .అవి ఏమిటో మీకు వివరిస్తాను. 


    అల్లము , ఉత్తరేణి చెట్టు బియ్యం , ఉశిరికాయ , కొబ్బరి కురిడి , కొబ్బరిపాలు , చేపనూనె , జీడిపండు , జీడిమామిడి , పటికపంచదార , తియ్యటి దానిమ్మ , బాదంపప్పు , ఆవుపాలు , కర్పూర శిలాజిత్ , కుందేలు మాంసం , కర్బుజాపండు , తాటికల్లు , నీరుల్లిపాయ , పచ్చకర్పూరం , బూడిద గుమ్మడికాయ , శనగలు , మెంతికూర , వెన్న . 


        దేహాన్ని పుష్టిగా ఉంచుకోవాలి అనుకునేవారు శరీరం నందు వేడిపెరగకుండా చూసుకోవాలి వీలైనంత వరకు శరీరానికి వేడిచేయు పదార్దాలను భుజించకపోవడం మంచిది . 


        ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

కామెంట్‌లు లేవు: