23, ఏప్రిల్ 2023, ఆదివారం

250 బియ్యం బస్తాలు

 250 బియ్యం బస్తాలు


పరమాచార్య స్వామివారు రామేశ్వరంలోని శ్రీమఠం శాఖకి బియ్యాన్ని పంపమని 1964 ప్రారంభం నుండే బియ్యం దాతలకు చెబుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా తోచి మేనేజరు కూడా ఎక్కువ బియ్యం నిల్వకి ఏర్పాట్లు చేసాడు. కాని అతను ఈ విషయంలో చాలా అసహాయతతో అప్పుడప్పుడు తన అసహనాన్ని స్వామివారికి గట్టిగానే వినిపిస్తున్నాడు. 


కాని పరమాచార్య స్వామివారు ఈ విషయంలో కాస్త మొండిగా వ్యవహరించి రామేశ్వరంలోని వారి శాఖామఠంలో 250 బస్తాల బియ్యం నిల్వచేసేట్టు చర్యలు తీసుకున్నారు. 1964 డిసెంబరు మాసంలో పెద్ద తుఫాను రామేశ్వరంని తాకింది. 


ఆ తుఫాను దెబ్బకి రామేశ్వరం చేరడానికి ఉన్న ఒక్క మార్గం పంబన్ వారధి ధ్వంసమైంది. ధనుష్కోటి పట్టణం మొత్తం సముద్రంలో కలిసిపోయింది. సముద్రుని అలల ఆవేశం వల్ల రామేశ్వర ద్వీపానికి ఆహారం పంపించడం జరగని పని. 


పరమాచార్య స్వామివారు ముందుచూపుతో రామేశ్వరంలోని మఠంలో నిల్వచేయించిన 250 బియ్యం బస్తాలే ప్రకృతి విలయం దెబ్బకి సర్వం కోల్పోయిన రామేశ్వరంలోని వేలాదిమంది ప్రజలకి ఆహారమై వారి కడుపు నింపింది. 


_/\_ శ్రీ చంద్రశేఖరం ఆశ్రయే _/\_


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: