14, మార్చి 2024, గురువారం

*గురు పాదాల విలువ*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


           *గురు పాదాల విలువ*

                   ➖➖➖✍️


*భారతదేశం నుంచి అమెరికాకి వచ్చి ఓ నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తున్న ఓ స్వామీజీ దగ్గరకి, హిందూ మతంపై ఆసక్తి గల ఓ అమెరికన్‌ వచ్చి, హిందూ మతం గురించిన ఎన్నో పుస్తకాలు తీసుకెళ్ళి చదివాడు.*


*ఆ పుస్తకాలని తిరిగి ఇచ్చేసాక స్వామీజీతో ఇలా చెప్పాడు…*


*“హిందూ మతంలో నాకంతా నచ్చింది, ఒక్కటి తప్ప.”*


*“ఏమిటది? అందులో నీకేం లోపం కనబడింది? ".*


*“పాద నమస్కారాలు. శిష్యులు గురువుగారి పాదాలనాశ్రయించడం. పాదాలు శరీరంలో అధమస్థానంలో ఉంటాయి. శరీరంలో బురద, మురికి, మట్టి లాంటివి అధికంగా అంటేది పాదాలకే. అలాంటి పాదాలకి ఓ పవిత్ర స్థానం ఇవ్వడం నాకు నచ్చలేదు. గురువు శరీరంలోని ఏదో ఓ అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నప్పుడు, అది ఉన్నత స్థాయిలోని శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బావుండేది అనిపిస్తోంది. గురువు కాలి బొటనవేళ్ళ నించి గంగా యమునలు ప్రవహిస్తూ ఉంటాయని, ఆ నీటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రమౌతాడని చదివాను. కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది?" అడిగాడా అమెరికన్‌ సీరియస్‌గా.*


*స్వామీజీ చిన్నగా నవ్వి ..... “అలా నదివద్దకి వెళ్ళి మాట్లాడుకుందాం పద.”*


*ఇద్దరూ నది ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ కొందరు జాలర్లు నదిలో చేపలు పడుతున్నారు.*


*నీళ్ళల్లో నిలబడి వలని దూరంగా విసురుతున్నారు. వలలో చేపలు పడ్డాక, వాటిని పట్టుకుని బుట్టలో వేసుకుని మళ్ళీ వలని దూరంగా విసురుతున్నారు.*


*“జాలర్ల వలలో ఏ చేపలు పడుతున్నాయి? వారి పాదాల వద్ద ఉన్నవా? లేక దూరంగా వున్న చేపలా?” ప్రశ్నించాడు స్వామీజీ.*


*“దూరంగా ఉన్నవే” చెప్పాడు అమెరికన్‌ వినమ్రంగా.*


*“భగవంతుడు ఆ జాలరి వంటివాడు. అతని చేతిలోని వల మాయ. దేవుడు విసిరే వలలో గురు పాదాలను ఆశ్రయించిన చేపలు అనే శిష్యులైన భక్తులు మాయకి చిక్కరు. దాంతో మోక్షాన్ని పొందుతారు.*


*గురు పాదాలను ఆశ్రయించకుండా, వాటికి దూరంగా వుండే జీవులు మాయలో చిక్కుకుని జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూంటారు." వివరంగా చెప్పారు స్వామిజీ.*


*గురువు పాదాల మహిమను వర్ణించ శక్తి సామర్ధ్యములు ఎవ్వరికీ లేవు.*


*న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |*

*తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః||*


🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కామెంట్‌లు లేవు: