3, ఏప్రిల్ 2024, బుధవారం

*ఆ పై కోర్టు*

 *ఆ పై కోర్టు* - *The Ultimate Court*


కొన్నేళ్ల క్రితం, జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, ఒడిశాలో పూరీలోగల న్యాయ కళాశాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడ్డారు. అయన కాలేజీ ఫంక్షన్‌కి వెళ్లే ముందు రోజు పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్లాడు.


జగన్నాథుని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా, సింహద్వారం దగ్గర ఎవరో "రంగనాథ్ బాబు" అని చాలాసార్లు పిలవడం విన్నారు. ఇంత పెద్ద స్వరంతో తనని ఎవరు పిలుస్తున్నారు! అది కూడా గుడి ద్వారం దగ్గర! అది తననేనా లేక ఇంకెవరినైనా పిలుస్తున్నారా అని ఆశ్చర్యపోతూ, సందిగ్ధంలో వెనక్కి తిరిగి చూడగా, కుష్టు రోగియైన ఒక బిచ్చగాడు కనిపించాడు. అతని శరీరం అంతా గాయాలు మరియు చేతులు, కాళ్ళకు కట్టులతో అతనిని పిలుస్తున్నాడు.


మీరు ఎవరు, నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని జస్టిస్ మిశ్రా ప్రశ్నించారు. అప్పుడు కుష్టు రోగి అతనితో, "అయ్యా, మీరు నన్ను గుర్తుపట్టలేదా?

నేను కొన్ని సంవత్సరాల క్రితం పేరుమోసిన కులియా డాకు(బందిపోటు)ని, మీరు ఒడిషా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను మీ క్లయింట్‌ని. దోపిడీ మరియు హత్య కేసులో దిగువ కోర్టు నాకు జీవితకాల కఠిన శిక్ష విధించింది. కానీ మీరు ఒడిశా హైకోర్టులో నాకు అనుకూలంగా వాదించి, నాకు ఎలాంటి శిక్ష పడకుండా విడుదల చేయించారు. కానీ సార్ నిజానికి నేను నిందితుడిని, ఆ వ్యక్తిని హత్య చేసి డబ్బు మరియు బంగారం దోచుకెళ్లాను. అదేవిధంగా ఇతర కేసుల్లో కూడా నేను ఎలాంటి శిక్ష లేకుండా విడుదలయ్యాను.


అతను కొనసాగించాడు, "సర్ నేను మానవుల కోర్టు నుండి ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛను పొందాను. కానీ సార్ నిజానికి నేను నిందితుడిని, ఆ వ్యక్తిని హత్య చేసి డబ్బు, బంగారం దోచుకెళ్లాను. అదే విధంగా ఇతర కేసుల్లో కూడా నేను ఎలాంటి శిక్ష లేకుండా విడుదలయ్యాను." అయ్యా నేను మానవుల కోర్టు ద్వారా స్వేచ్ఛ పొందాను, కానీ ఆ సర్వశక్తిమంతుడి కోర్టులో నేను తీవ్రంగా శిక్షించబడ్డాను, నా శరీరం అంతా కుష్టువ్యాధి వచ్చి, అవయవాలను కోల్పోయాను. నా బంధువులు నన్ను అసహ్యించుకుని గ్రామం నుండి వెళ్లగొట్టారు. నేను రోడ్డు మీద పాకుతూ ఆహారం కోసం అందరినీ వేడుకుంటున్నాను. గుడి ద్వారం దగ్గర అప్పుడప్పుడూ ఎవరైనా భోజనం పెడతారు, లేకుంటే నేను ఆహారం తీసుకోకుండా అలాగే ఉంటాను.

అది విన్న జస్టిస్ మిశ్రా బరువెక్కిన హృదయంతో వంద రూపాయల నోటు ఇచ్చి మౌనంగా వెళ్లిపోయారు.


లా కాలేజీ ఫంక్షన్‌లో జస్టిస్ మిశ్రా కన్నీళ్లతో ఈ వాస్తవ సంఘటనను వివరించారు. మేము మా *తెలివితేటలు ఉపయోగించి, ఎవరినైనా విడిపించడానికి లేదా శిక్షించడానికి వాదిస్తాము. కానీ పైన ఇంకొక ఉన్నత న్యాయస్థానం ఉంది, అందులో తెలివితేటలు పని చేయవు, మరియు దోషులు తప్పించుకోలేరు. దోషికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది.*  


 *అదే కర్మ యొక్క చట్టం (Law of Karma)*


ప్రస్తుత పరిస్థితుల్లో, మన రాష్ట్రంలో, దేశంలో, రాజకీయ నాయకులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అధికారం కారణంగా చట్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీల మద్దతుతో, తమపై ఆరోపించబడిన (తీవ్రమైన నేరారోపణలతో సహా) కేసుల నుండి, చట్టం నుండి, న్యాయప్రక్రియ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.


కానీ ఏ ఒక్కరు కర్మ యొక్క చట్టం (Law of Karma) నుండి తప్పించుకోలేరు. 🙏🙏🙏

కామెంట్‌లు లేవు: