*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*పాదారవింద శతకం - 2*
*శ్లోకము - 21*
*నమస్యాసంసజ్జన్నముచిపరిపంథిప్రణయినీ-*
*నిసర్గప్రేంఖోలత్కురలకులకాలాహిశబలే ।*
*నఖచ్ఛాయాదుగ్ధోదధిపయసి తే వైద్రుమరుచాం*
*ప్రచారం కామాక్షి ప్రచురయతి పాదాబ్జసుషమా ॥*
*భావము :*
*అమ్మా! ఇంద్రపత్ని శచీదేవి, నీ పాదములకు ప్రణమిల్లినపుడు, ఆమె ముంగురులు, పాలసముద్రమువంటి నీ పాదములపై తేలియాడుచున్న నాగులవలే కనిపించు చున్నవి. ఇక నీ ఎర్రని పాదముల కాంతి క్షీరసముద్రముపై అనేకమైన పగడములవలే ప్రతిబింబించు చున్నది.*
🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి