శరీర దోషాలు తొలగించి చర్మవ్యాధులు హరించే దివ్యమైన సున్నిపిండి -
కావలసిన పదార్దాలు -
• పచ్చ పెసలు - 1 కిలొ .
• బావంచాలు - 100 గ్రాములు .
• వట్టి వేళ్లు - 100 గ్రాములు .
• కచ్చురాలు - 100 గ్రాములు .
• మంజిష్ట - 100 గ్రాములు .
• మంచి పసుపు - 100 గ్రాములు .
• కస్తూరి పసుపు - 100 గ్రాములు .
• ఉలవలు - 100 గ్రాములు .
• బత్తాయి తొక్కలు - 100 గ్రాములు .
• కరక్కాయ బెరడు - 100 గ్రాములు .
• ఉసిరికాయ బెరడు - 100 గ్రాములు .
• తానికాయ బెరడు - 100 గ్రాములు .
• ఎండు ఖర్జూరాలు - 100 గ్రాములు .
• కుంకుడు కాయ పెచ్చులు - 100 గ్రాములు
* సుగంధపాల వ్రేళ్లు - 100 గ్రాములు .* తుంగ గడ్డలు - 100 గ్రాములు .* దానిమ్మ పండ్ల బెరడు - 100 గ్రాములు .* ఎండు గులాబీ రేకులు - 100 గ్రాములు . * మరువము - 100 గ్రాములు . * ధవనము - 100 గ్రాములు . * జాపత్రి - 100 గ్రాములు . * యాలుకలు - 100 గ్రాములు . * కురువేరు - 100 గ్రాములు . * తులసి ఆకులు - 100 గ్రాములు .
తయారీ విధానం -
పచ్చ పెసలు చిన్న మంట పైన కళాయిలో
పోసి కొద్దిగా నెయ్యివేసి దోరగా వేయించి దించి విసిరి బరక బరకగా పిండి తయారుచేసుకోవాలి . దానిలో పైన చెప్పిన పదార్దాలను శుద్ది చేసుకుని సరైన మోతాదుల్లో విడివిడిగా చూర్ణాలు మెత్తగా చేసుకుని పెసరపిండిలో కలుపుకోవాలి.
వాడేవిధానం -
స్నానానికి అరగంట ముందు ఈ సున్నిపిండిని తగినంత తీసుకుని పుల్లటి మజ్జిగతో కలిపి మెత్తగా పిసికి శరీరం అంతా రుద్దుకోవాలి . ఆరిన తరువాత ఒక్కో భాగాన్ని రుద్దుతూ స్నానం చేయాలి . ఈ సున్ని పిండి రాసుకోవడానికి అర్ధ గంట ముందు నువ్వులనూనెని శరీరముకి పట్టించి ఈ సున్నిపిండి రుద్దుకొని స్నానం ఆచరించిన అద్బుత ఫలితాలు వస్తాయి. స్నానానికి గోరువెచ్చటి నీటిని వాడిన చాలా మంచిది .
ఉపయోగాలు -
• ఈ సున్నిపిండి ఉదయం , సాయంత్రం వాడటం వలన శరీరం నందలి 7 పొరలు శుద్ది చెందును .
• శరీరం లోపలి భాగంలోని మలినాలు బహిష్కరించబడతాయి .
• చర్మం పైన మచ్చలు , చారలు , పగుళ్లు , పుండ్లు , దురదలు , దద్దుర్లు , వాపులు హరించును .
• మృత చర్మ కణాలు నిర్మూలించబడతాయి .
• చర్మానికి సహజకాంతి వృద్ది చెందును .
• శరీర నల్లధనం , మొటిమల సమస్యలు నివారించబడును.
• శరీరానికి మంచి తేజస్సు కలుగును.
• సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు కలవారికి అద్బుతంగా పనిచేయును .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి