23, జులై 2021, శుక్రవారం

త్వమేవాహమ్‌

 *THVAMEVAAHAM త్వమేవాహమ్‌*


కన్నతల్లి కడుపులోంచి బయటపడి......

తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి......

పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు.......

ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా 

సాగే ప్రస్థానం.......

పేరే......


             *నేను =I*


*ఈ "నేను"* ప్రాణశక్తి అయిన "ఊపిరి"కి మారుపేరు!


*ఊపిరి ఉన్నంతదాకా "నేను"* అనే భావన కొనసాగుతూనే ఉంటుంది....


*జననమరణాల మధ్యకాలంలో* సాగే జీవనస్రవంతిలో ...ఈ 

*"నేను"* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది...


*ఈ "నేను"* లోంచే 

*నాది* అనే భావన పుడుతుంది!


*ఈ *నాది* లోంచే....


1.నా వాళ్ళు, 

2.నా భార్య,

3.నా పిల్లలు,

4.నా కుటుంబం,

5.నా ఆస్తి,

6.నా ప్రతిభ, 

7.నా ప్రజ్ఞ, 

8.నా గొప్ప... 


అనేవి పుట్టుకొచ్చి....


చివరికి ఈ *"నేను"* అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,

ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా ప్రజ్వరిల్లుతుంది.


              *EGO అహం* 


అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ *”నేను"*, *”నేనే సర్వాంతర్యామిని* అని విర్రవీగుతుంది.


*నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.*


1. పంతాలతో 

2. పట్టింపులతో, 

3. పగలతో, 

4. ప్రతీకారాలతో...... 


తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.


1 .బాల్య, 

2.కౌమార, 

3.యౌవన, 

4.వార్ధక్య,  


దశలదాకా....విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ఈ

*నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.


*వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.*


 *సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.*


 *సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన ఈ నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.


*కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.*


 *మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.*


*మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.*


*1.నేనే* శాసన కర్తను, 


 *2.నేనే* ఈ సమస్త భూమండలానికి అధిపతిని, 


*3.నేనే* జగజ్జేతను... 


అని మహోన్నతంగా భావించిన ఈ *నేను* 

లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. - ఎప్పటిలా

రోజు మారుతుంది.


*ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన ఈ ‘నేను’* కథ అలా సమాప్తమవుతుంది.


*అందుకే ఊపిరి ఆగకముందే ఈ “నేను”*

గురించి తెలుసుకో అంటుంది “శ్రీమద్భగవద్గీత”

“SRIMADBHAGAVATH GEETHA”....


*చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం* మాత్రమే!


   *అది శాశ్వతం కానే కాదు*


ఈ *నేను* గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన 

*”వైరాగ్యస్థితి”* అభిలాషికి సాధ్యమవుతుంది.


*వైరాగ్యం* అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. 

*దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం.తామరాకుమీద నీటి బొట్టులా జీవించ గలగడం*.


*స్వర్గ-నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.*


*మనిషి ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే-నరకం*


*అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం-స్వర్గం.*


*ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే-వేదాంతం*.


1. నిజాయితీగా,

2. నిస్వార్థంగా, 

3.సద్ప్రవర్తనతో,

4. సచ్ఛీలతతో, 

5.భగవత్‌ ధ్యానం 


తో జీవించమనేదే

*వేదాంతసారం*.


*అహం బ్రహ్మాస్మి* అంటే 

*అన్నీ నేనే* అనే స్థితి నుంచి

*త్వమేవాహమ్‌* అంటే *నువ్వేనేను* అని 

భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే

*మానవ జన్మకు సార్థకత* 

      🙏 *శుభమ్ భూయాత్*🙏

కామెంట్‌లు లేవు: