12, సెప్టెంబర్ 2021, ఆదివారం

ఆచార్య సద్బోధన

 *ఆచార్య సద్బోధన*


మనలో ప్రేమ, స్ఫూర్తి లేనిదే దివ్యానుగ్రహమునకు మనం నోచుకోలేము. మనకు మనం హృదయంలో నుంచి వచ్చిన భావనతో భగవంతుని సేవ ఒనర్చితే మనల్ని ఏదీ అడ్డుకోలేదు.


"నేను" ను పక్కనపెట్టి ఏ పని చేసినా దానికి తిరుగులేదు. మనలో దయార్ద్రత, భక్తి భావన ఉంటే మన ప్రయత్నంలో విజయం తప్పక చేకూరుతుంది.


ఆధ్యాత్మికత నిగూఢ రహస్యాలను వెలికితీస్తుంది. అది కేవలం మత గురువులకి, బోధకులకి మాత్రమే కాదు, అణకువ, సహనం, నిస్వార్థత కలిగిన భక్తులకు కూడా అన్వయిస్తుంది.


మనలో ఆధ్యాత్మిక దృక్పథం ఉంటే తప్ప ప్రాపంచిక కష్టాలను ఎదుర్కొనలేము. అందువలన జ్ఞానకవచం ధరించి మనల్ని మనం కాపాడుకోవాలి.


అది శాశ్వతంగా కాపాడుతుంది. సదా నిలిచి ఉంటుంది.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: