1, నవంబర్ 2021, సోమవారం

శ్రీమద్వాల్మీకి రామాయణం


ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 


(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)


                ----------------------- 


          11. ప్రజా జీవనం - నాగరికత 


అ) అయోధ్య తరతరాల ప్రజలకు ఆయురారోగ్యభాగ్యాలని కొల్లలుగా పంచియిచ్చిన దివ్యభూమి. 

ఆ) జ్ఞానులయెడ రక్షకులు గౌరవం కలిగి రాజ్యపాలన చేసేవారు. 

ఇ) స్త్రీ పురుషులు 

     - ధర్మప్రవర్తనచే శ్రేష్ఠులు, 

     - ఇంద్రయనిగ్రహం కలవారు, 

     - సదాచార సంపన్నులు, 

     - సత్స్వభావం కలవారు. 

ఈ) అయోధ్యలో

       - కామాతురుడుగానీ, 

       - లోభిగానీ, 

       - క్రూరుడుగానీ, 

       - విద్యావిహీనుడుగానీ, 

       - నాస్తికుడుగానీ ఎంతవెదికినా కానరాడట. 

ఉ) అయోధ్య జనులు 

    - ధర్మాత్ములు, 

    - అనేక శాస్త్రాలను అధ్యయనం చేసినవారు, 

    - సుఖసంతోషాలతో, శాంతంగా జీవించేవారు. 


      వీటన్నింటికీ మూలం సత్యధర్మాలు, 

     "సత్యం వద - ధర్మం చర" అనేదే ప్రధానం. 


      తద్విరుద్ధంగా, ఈ రెంటి లోపంవల్లే, లంకలో రావణుడూ అతని పరివారమూ విలాసవంతమైన జీవితాలు గడిపినప్పటికీ, నాశనమయ్యారు. 

      ధర్మాచరణతోనున్న విభీషణుడే లంకాధిపతి అయ్యాడు. 

      కేవలం భౌతిక భోగలాలసత మాత్రమే అయితే, అది దేనికి దారితీస్తుందో రావణ పరివారం ద్వారా తెలుస్తుంది. 


      అయోధ్యలో శ్రీరాముని నుంచీ అట్టడుగు స్థాయివరకూ అంతా త్యాగం కనిపిస్తుంది. 

      పలు అంతస్తుల భవనాలలో నివసిస్తున్నా, జీవనం సత్య - ధర్మబద్ధంగా ఉండడంవల్ల, అయోధ్య ఏ రంగంలోనైనా ఆదర్శవంతంగా కనబడుతుంది. 


ముగింపు 


      శ్రీమద్రామాయణంలో ప్రస్తుత విద్యావిషయాలైన 

1. చరిత్ర, 

2. సార్వభౌమత్వము - సామ్రాజ్యవాదము, 

3. భూగోళ శాస్త్రము, 

4. ఆర్థిక, వాణిజ్య విషయాలు, 

5. పరిపాలనా విధానం, 

6. గణితం - సంఖ్యా శాస్త్రం, 

7. భౌతిక శాస్త్రాలు, 

8. జీవశాస్త్రం, 

9. సాంకేతిక విజ్ఞానం, 

10. వైద్యశాస్త్రం, 

11. ప్రజా జీవనం - నాగరికత వంటివాటికి సంబంధించి పరిశీలించినప్పుడు, 

        ఏ విద్యావిషయంపైన అయినా, 

      శ్రీమద్వాల్మీకి రామాయణ కథ 

      ఆ విషయానికి సంబంధించి, 

     - మౌలికంగా, 

     - సమగ్రంగా, 

     - ఆదర్శవంతంగా అనేక విషయాలు బోధపడతాయి. 


       శ్రీమద్రామాయణం వల్ల మన మస్తిష్కమే ఒక "విజ్ఞాన సర్వస్వం" (Encyclo Paedia)గా అయి, 

      - అనూహ్యమైన సత్ఫలితాలతో, 

      - సుఖసంతోషాలతో కూడిన, 

      - దైవత్వ జీవతాన్ని కలిగి, 

        మన దేశం ప్రపంచంలోనే శక్తివంతమై ఉంటుంది. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

కామెంట్‌లు లేవు: