11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

తేనె పూసిన కత్తి

 ✍

 _కొన్ని పదాలు పైకి ప్రగతి శీలం గాను, ఆదర్శవంతంగానూ కనిపిస్తాయి. నిజానికి ఆ పదాలు తేనె పూసిన కత్తి లాంటివి. అలాంటి పదాలను పదే పదే ఉపయోగించడం వెనుక అమాయక హిందువులను దెబ్బతీసే మహా కుతంత్రం ఉన్నది. అలాంటి వాటిలో ఐదు పదాలను గురించి నేను మీకు వివరిస్తాను. ఈ పదాలను పదేపదే వాడే నాయకులతో మేధావులతో అత్యంత అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన_ .


 *సెక్యులర్/లౌకిక:* 

---------------------

ఈ పదం 1950 జనవరి 26 నాడు అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో లేదు. ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ రద్దు అయిన సమయంలో ఎలాంటి చర్చ లేకుండా రాజ్యాంగ ప్రవేశిక లో బలవంతంగా చేర్చడం జరిగింది.

ఈ సెక్యులర్ అనే పదాన్ని ఉపయోగించి... హిందూ పురాతన సంస్కృతిని వెలుగులోకి రానివ్వకుండా.... భారతీయ వీరులను అవమానించే తీరులో రాయబడ్డ పుస్తకాలతో.....ఈ దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 _కాబట్టి తిరిగి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సెక్యులర్ అనే పదాన్ని తొలగించేందుకు మనం పోరాటం చేయాలి._ 


 *ఫెడరల్/సమాఖ్య:* 

------------------------

అనేక రాష్ట్రాలు కలిసి ఒక ఒప్పందం ద్వారా దేశంగా ఏర్పడితే అటువంటి దేశాన్ని ఫెడరల్ అని అంటారు. దీనికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉదాహరణ.

  భారత రాజ్యాంగంలో ఫెడరల్ అనే పదమే లేదు. కానీ మాటిమాటికీ అనేకమంది కుహనా మేధావులు, కొంత మంది రాజకీయ నాయకులు ఫెడరల్ ప్రభుత్వము  అని పదే పదే వాడుతున్నారు.

  దీని వెనుక కూడా భయంకరమైన కుట్రకోణం ఉన్నది. ఫెడరల్ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వము బలహీనంగా ఉంటూ రాష్ట్రాలపై అధికారాన్ని కలిగి ఉండదు. కేంద్ర ప్రభుత్వాన్ని బలహీనం చేసి వేర్పాటువాద ఉద్యమాలను బలోపేతం చేయడమే ఈ కుహనా మేధావుల అసలు లక్ష్యం.

దేశ విచ్ఛిన్నానికి దారి తీసే రాజ్యాంగంలో లేని ఫెడరల్ అనే పదాన్ని మాటిమాటికి ఉపయోగించడం దేశానికి ప్రమాదకరం _కాబట్టి ఇటువంటి భావజాలాన్ని తిప్పికొట్టాలి_ .


 *లిబరల్/ఉదారవాద:* 

------------------------------

మైనారిటీలను బుజ్జగించడం కోసం.... వెయ్యేళ్ళ పాటు వలసవాద ప్రభుత్వాలు భారతదేశ ప్రజలను నాశనం చేసిన తీరును కప్పిపుచ్చడం కోసం..... హిందువులను రెండవ తరగతి పౌరులుగా ఉంచడం కోసం.... _లిబరల్ అనే పదాన్ని ఉపయోగిస్తూ  హిందుత్వాన్ని వెలుగులోకి రాకుండా ఈ నక్కజిత్తుల కుహనా మేధావులు అడ్డుపడుతున్నారు_ .


*హిందూ-- ముస్లిం భాయ్ భాయ్* :

--------------------------------------------

భారతీయ తాత్విక గ్రంధము లైన ఉపనిషత్తుల ప్రకారం సకల మానవులు సోదరులే. ఇందులో భిన్నాభిప్రాయం లేదు. కానీ ఖురాన్ ప్రకారం ప్రపంచంలోని ముస్లింలు మాత్రమే సోదరులు. హిందువులను వారు హీనజాతి గా భావిస్తూ కాఫీర్లు అని పిలుస్తారు.

 _కాబట్టి ఈ అర్థంలేని సిద్ధాంతం అనవసరమైనది_ .


*గంగా- జమున తెహజీబ్:* 

----------------------------------

క్రైస్తవ ,ఇస్లాం మతాలు పుట్టడానికి  వేల సంవత్సరాల ముందే... గంగా జమున నదులు హిందువులకు అత్యంత పవిత్రమైన నదులు. అయితే ఈ పదాన్ని హిందూ ముస్లిం ఐక్యత కోసం వాడుతుంటారు. ముస్లింల శాస్త్రాల ప్రకారం నదులపై వారికి ఎటువంటి పవిత్రమైన ఆరాధనా భావం లేదు. భారత స్వతంత్ర ఉద్యమం లో బ్రిటిష్ వాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవడం కోసం ఈ పదాన్ని వాడేవారు. కానీ ఇస్లాం మతం కోసం వారికి మరొక దేశం కావాలని రక్తపాతాన్ని సృష్టించి పాకిస్తాన్ దేశాన్ని ముస్లింలు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి గంగా జమున తెహజీబ్ అనే పదం మిథ్య.... భ్రాంతి అనే విషయం స్పష్టమైపోయింది.

    _*దేశ విభజన నుండి నేటి వరకు కూడా జరిగిన నరమేధాన్ని చూసి కూడా ఈ పదాన్ని ఇప్పటికీ ప్రయోగించడం అంటే దాని వెనుక కుట్ర కోణం ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి* ._ 


--SBR TALKS



కామెంట్‌లు లేవు: