2, ఫిబ్రవరి 2022, బుధవారం

ఆలోచించాలా? వద్దా?

 ॐ   ఇప్పటికైనా ఆలోచించాలా? వద్దా? 


"మన జాతీయత - విద్యాభ్యాసం/అక్షరాస్యత" 


ఈరోజ ఫిబ్రవరి 2వతేదీ ప్రత్యేకత తెలుసా? 


    మెకాలే మన ప్రాచీన విద్యావిధాన, సంస్కృతులను నాశనం చేసేందుకుగాను, తను ఆ కారణాలను ధైర్యంగా చూపుతూ, తన విద్యావిధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టే ప్రతిపాదనపై, బ్రిటిష్ పార్లమెంటునుద్దేశించి 2/2/1835నాడు చేసిన ప్రసంగం యథాతథంగా. 


    (Lord Mecauley's address to the Brirish Parliament on 2nd February 1835) 


    "I have travelled across the length and breadth of India and I have not seen one person who is a begger, who is a thief. 

    Such wealth I have seen in the country, 

    such high moral values, 

    people of such caliber, 


    that I do not think we would ever conquer this country, 

    unless we break the very backbone of the nation, which is her spiritual and cultural heritage and therefore, 


    I propose that we replace 

  - her old and ancient education system, 

  - her culture for if the Indians think that all that is foreign and English is good and 

    greater than their own, 

    they will lose 

  - their selfesteem, 

  - their native culture and 

    they will become that we want them, 

    a truely dominated nation." 


                    అనువాదం 


    "భారత దేశంలో, అటునుంచి ఇటు, ఇటునుంచి అటు మొత్తం ప్రయాణం చేశాను. 

    నాకు భిక్షుకుడుగానీ,  దొంగగానీ ఒక్కడంటే ఒక్కడైనా కనిపించలేదు. 

    అంత గొప్ప సంపద, నైతికపు విలువలు కలిగిన దేశం అది. ప్రజలు ఎంతో తెలివిగలవారై ఉన్నారు. 

    ఆ దేశాన్ని మనం ఎప్పటికీ ఆరోహించలేము. 

    దాని బలమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని ఛిన్నాభిన్నంచేసి, దాని నడ్డి విరవాలంటే, ఆ దేశపు ప్రాచీన విద్యావిధానాన్నీ, వాళ్ళ సంస్కృతినీ మార్చాలని ప్రతిపాదిస్తున్నా. 

    అపుడే హిందువులు విదేశీయత మరియు ఆంగ్లము గొప్పవని భావించి, వారి స్వాభిమానాన్నీ, స్వదేశీయ సంస్కృతినీ కోల్పోతారు. 

    అప్పుడు ఆ దేశం మనమీద ఆధారపడే మనం కోరుకున్న జాతి అవుతుంది." 


దీని పర్యవసానానికి ముందు వాస్తవాలు


I. ఈ విధానం ప్రకటింపబడి, బ్రిటిష్ పార్లమెంటు అనుమతించిన ఆంగ్ల విద్యాబోధన, మన దేశంలో "మెకాలే విద్యావిధానం"గా 1853లో ప్రవేశపెట్టబడడానికి 18 సంవత్సరాలు పట్టింది. 

    ఆ విషబీజ వృక్ష ఫలాలే, ఇప్పుడు దేశంలో మనం చూస్తున్న దుష్పరిణామాలు. 


II. మెకాలే ఈ ప్రతిపాదనకి ముందు, 1823 సంవత్సరం భారతదేశంలో అక్షరాస్యతపై రెండు సర్వేలు జరిగాయి. 


1. ఉత్తర భారతదేశంలో Dr. Leitner నాయకత్వంలో చేసినది. 

    దాని ప్రకారం ఉత్తర భారతదేశంలో అక్షరాస్యత 97%. 

2. దక్షిణ భారతదేశంలో Sir Munro నాయకత్వంలో జరిగిన సర్వే. 

    దాని ప్రకారం దక్షిణ భారతదేశంలో అక్షరాస్యత 100%. 


III. 1853 సంవత్సరం మెకాలే ఆంగ్ల విద్యావిధానం ప్రారంభించక ముందు 1850 సంవత్సరం భారతదేశంలో 


- గురుకులాలు 7.32 లక్షలు, 

  అన్నిచోట్ల ఉచిత విద్య. 


- గ్రామాలు 7.5 లక్షలు. 


మనముందున్న ప్రశ్నలు 


1. మనదేశ ప్రస్తుత దుఃస్థితికి మూలకారణంపై ఇంతకన్నా ఋజువు కావాలా?

2. మనకి స్వాతంత్ర్యం దేనికి వచ్చింది? 

3. స్వతంత్ర భారతంలో భారతీయత నేతిబీరకాయలో నేయిలాగా లేదూ? 

4. మన దేశ సంస్కృతి సంప్రదాయాలనూ స్వాభిమానాన్నీ పునరుద్ధరించుకోవాలా? వద్దా? 

5. దీనినుంచీ మారి, స్వదీశీయతకు మార్గం కనుక్కోవాలా? వద్దా? 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

కామెంట్‌లు లేవు: