25, జులై 2022, సోమవారం

పచ్చ కుంకుమ

 *"కుబేర పచ్చ కుంకుమ"*



మన భారతదేశంలో

"పసుపు-కుంకుమ"లను మంగళకరమైనవిగా, 'సౌభాగ్య'చిహ్నాలుగా భావించి, పవిత్రంగా చూసుకుంటారు !!


ఏ శుభకార్యానికైనా, పూజలకైనా,

ముందుగా......సిధ్ధం చేసుకునేవి.......,

'పసుపు-కుంకుమ"లే !!


పసుపులో పచ్చి పసుపు , కస్తూరి పసుపు, ఛాయ పసుపు, కొమ్ములు, దుంప పసుపు,అని పలు రకాలు !! అలాగే........,

కుంకుమలో కూడా పలు రకాలు వున్నాయి !! ఎరుపు, ముదురు ఎరుపు,సింధూరపు రంగు, మీనాక్షీ కుంకుమ,( ఈ కుంకుమ మొగలి పూవుల సువాసనతో వుంటుంది.)మొ.

ఎక్కువగా వాడుకలో వున్నాయి !!


కానీ. 'కుంకుమ'లో 'ఆకుపచ్చ' రంగు కుంకుమ గురించి మనకు తెలీదు !! దీనినే "కుబేరపచ్చ కుంకుమ" అంటారు !!


ఈ కుబేరపచ్చ కుంకుమకు ఓ ప్రత్యేకత ఉంది !!

పురాణాలలో వర్ణించబడిన ఈ కుంకుమ,

'కుబేరునికి చాలా ప్రీతికరమైనది' !!

అలాగే.........,

'పార్వతీదేవి' కి ప్రీతికరమైన రంగు కూడా,

ఈ........'పచ్చ రంగే' !!


ఈ 'కుంకుమ' గురించి

#శివపురాణం యిలా వివరించింది !!


'పరమశివుని భక్తుడైన కుబేరుడు' ఒకసారి కైలాసానికి వెళ్ళాడట !!

అక్కడ ఏకాంతంగావున్న శివపార్వతులను చూశాడట !ప్రతిరోజూ...దేవిని పవిత్రంగా ఆరాధించే కుబేరునికి ఆరోజు 'అంబిక' ను దర్శించగానే..

'కామవికారానికి, లోనయ్యాడట !!

ఒక్క క్షణం 'పార్వతీ దేవి'ని, తన భార్యగా ఊహించుకున్నాడట !!


'సర్వజ్ఞాని' ఆ......... సర్వేశ్వరునికి, ఇది తెలియకుండా ఉంటుందా ??

సర్వేశ్వరునికి కోపం వచ్చింది !! శివుని అర్ధభాగమైన సతీదేవి ఉగ్రురాలైంది !!

శివపార్వతులిద్దరూ కుబేరుని వైపు ఉగ్రంగా చూశారు !!

ఆ......చూపుల తీక్షణతకు, కుబేరుని దేహం కాలి కమిలిపోయిందట !!

కుబేరుడు గడగడా వణికి పోయాడు !! పరమశివుని కాళ్ళమీదపడి, మన్నించమని

వేడుకున్నాడు !!


మా ఇద్దరి కోపం వలన ఏర్పడిన యీ ఉగ్రత, మా ఇరువురి శాంత స్వరూపాలు ఒకటైనప్పుడు చల్లదనంగా మారుతుంది !!

అప్పుడు.......ఆ చల్లదనమే నీ దేహాన్ని తాకి, నీ చర్మం కమిలి పోవడం తగ్గి మామూలు రూపం లభిస్తుంది !!అని పరమేశ్వరుడు కుబేరుని, దీవించాడు !!


అప్పుడు కుబేరుడు.........,

పరమేశ్వరుడే గతి అని అనేక స్తోత్రాలతో, స్తుతించాడట !!

త్వరగానే పార్వతీ పరమేశ్వరులు కుబేరుని కరుణించారట !!

వారి అనుగ్రహంతో కుబేరునికి, స్వస్ధత చేకూరిందట !!


అయినా............,

శరీరం కాలిన ప్రదేశాలలో, తప్పుకి శిక్ష గా, మచ్చలు శాశ్వతంగా వుండి పోయాయట !!


పరమేశ్వరుని కంఠం చుట్టూగల నీలం వర్ణం, పార్వతీ దేవి పసిమి ఛాయ.......,

{అంబిక మంగళరూపిణిగా దర్శనమిచ్చి నప్పుడు, పసుపు వర్ణంగానే దర్శనమిస్తుంది !! ఆ పసుపు వర్ణాన్ని, తన దేహానికి పసుపు నలుగుపెట్టి తీసిన

పసుపుతో వినాయకమూర్తిని చేయడం మనకు తెలుసు}

ఈ.....నీల వర్ణం, ఆ....పసుపు వర్ణం రెండూ కలసినప్పుడు,

అక్కడ ఒక అద్భుతం జరిగిందట !!

ఆ రెండింటి కరుణా కిరణాలు పడిన ప్రదేశంలోని మట్టి అంతా 'ఆకుపచ్చ'గా మారి పోయిందట !!

{నీలం....పసుపు రంగులను మిశ్రం చేస్తే,

ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది} !!


కుబేరుడు ఆ........'ఆకుపచ్చ మట్టి'ని తన శరీరానికి, పూసుకోగానే మాడి కమిలిన దేహమంతా, మామూలు స్థితిని పొంది, శివపార్వతుల ఆగ్రహంనుండి విముక్తి పొందాడట !!

అంతే కాకుండా.............,

ఆ......పచ్చమట్టిని తన పట్టణానికి తీసుకొని వెళ్ళి, నిత్యం శరీరానికి ధరించేవాడట !!


ఆనాటి నుండి 'పచ్చరంగు' కుబేరునికి


 ప్రీతిపాత్రమయిందట !!

'పచ్చరంగు కుంకుమ' కుబేర చిహ్నంగా అయి, పురాణాలలో ఎంతో పవిత్రతను సంతరించుకుంది !!


చర్మ రోగానికి ఈ కుంకుమ అద్భుతంగా పనిచేస్తుంది. ఈనాటి వైద్యుల ఉవాచ

కామెంట్‌లు లేవు: