2, ఫిబ్రవరి 2023, గురువారం

కృష్ణ మందిర్

 Hyderabad మిత్రులు అందరూ దయచేసి..ఈ గుడినీ ఓ మారు దర్శించాలని మనవి🙏🙏


ఈ గుడి హైదరాబాద్ లోని కిషన్ బాగ్ లో ఉన్న భైరవ స్వామి గుడి., ఇక్కడి పంతులు గారి పరిస్థితి ఏమిటంటే ఆర్థిక పరిస్థితి బాగా లేక ఆ పంతులుగారు ఆటో నడిపిస్తున్నారు 


కాబట్టి చుట్టూ పక్కల ఉన్నవాళ్లు ఆ గుడికి తరచుగా వెళ్ళండి ఆ ప్లేట్ లో ఓ 20 సమర్పించండి.,


ఈ గుడితో పాటు పక్కనే కాశిబుగ్గ ఆలయం, కృష్ణుని గుడికూడా ఉంది..,


పాపం కృష్ణ మందిర్ ముందే ఓ పెద్ద చెత్త కుప్ప., చుట్టూ ముస్లిం ఏరియా..,


కాశీ బుగ్గ ఆలయం గొప్పతనం ఏంటి అంటే నాచ్యురల్ గా నీళ్లు భూమినుంచి ఊరి శివుణ్ణి అభిషేకం చేస్తూ వెళతాయి., పైగా ఇది 200 సంవత్సర క్రితం కట్టింది..


కాబట్టి ఈ మూడు గుడులకు చుట్టూ పక్కన ఉన్నవారు వెళ్ళండి వెళ్తూ ఉంటే పూజలు జరుగుతూ ఉంటే శక్తి ఉత్తేజం చెందుతుంది..


ఈ గుడులకు వెళ్లిన వాళ్ళు హుండీలో కాకుండా ఆ పళ్ళెంలో మాత్రమే దక్షిణ వేసి అక్కడి పూజారిని ఆదుకోండి... వాళ్ళ పరిస్థితి కష్టంగా ఉంది... 🙏


Sudha Krish పెట్టిన పై పోస్ట్ చదివి నిన్న సాయంత్రం ఆ ప్రదేశానికి వెళ్ళాను. అది అత్తాపూర్ దాటాక కిషన్ బాగ్ లో ఉంది.

మేముంటున్న మియపూర్ ఏరియా కి సుమారు 25 కి.మీ దూరం.


ముందుగా భైరవస్వామి దేవాలయం చూద్దామని వెళ్లాం. కానీ దానికి ముందే చాలా పెద్ద తలుపులతో పూర్వం రాజులు నిర్మించిన దేవాలయం లాగా ఒకటి కనిపించింది. ఏమిటో ఆ దేవాలయం అని చూస్తే దాని పేరు

 "శ్రీ మురళీమనోహర స్వామి" వారి దేవాలయం. బహుశా దీనినే కృష్ణ దేవాలయం అంటున్నారేమో.


ఈ దేవాలయం కనీసం 250 సం. ల క్రిందట కట్టబడి నట్లు ఉంది. చాలా విశాలమైన ప్రాంగణం ఉంది. దేవాలయం చిన్నదే కానీ ప్రహరీ గోడ ని అనుకుని లోపల అంతా రాతి మంటపం నిర్మించి ఉంది. కొంత శిథిలావస్థకు చేరిన స్థితిలో ఉంది.


అహోబిలం మఠం స్వామి వారు 1750 సం. లో ఈ దేవాలయానికి విచ్చేసినట్లు శిలాఫలకం ఉంది.


ఈ స్వామి వారి మూర్తి చూడటానికి నిజంగా రెండు కళ్ళు చాలవు. పేరుకు తగ్గట్టే స్వామి వారి మూర్తి మురళీ మనోహరం.


ఈ దేవాలయానికి రెండు కధలు వ్యాప్తిలో ఉన్నాయి. మొదటి దాని ప్రకారం ఢిల్లీలో వుండే రాజా రఘు రాం బహదూర్ కి పిల్లలు లేరు. అయితే ఒకరోజు రాజా వారికి కలలో హైదరాబాద్ లో ఒక తోట, దానిలో భూమిలో 5 అడుగుల క్రింద ఉన్న కృష విగ్రహం కనిపించాయట. వెంటనే రాజా వారు అనుచరులతో కలిసి గుర్రాలు పై హైదరాబాద్ వచ్చి అన్ని తోటల్లో వెతకగా ఈ తోటలో కృష్ణుని విగ్రహం కనిపించడం, ఈ ఆలయం నిర్మించి విగ్రహం ప్రతిషించారట. ఈ దేవాలయం నిర్మించిన వెంటనే వారికి సంతానం కలిగింది అని ఒక కథనం. 


రెండో కథ ఏమిటంటే.. నిజాం దగ్గర వకీల్ లేదా నిజాం కు ఎజెంట్ గా పైన చెప్పిన రాజవారు వుండేవారు అని వారే ఈ దేవాలయం నిర్మించారు అని.


ఈ దేవాలయం పక్కనే సయ్యద్ షా నిజముల్లా హుసైన్ దర్గా ఉంది. 


ఈ దేవాలయం ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. చుట్టూ ఎక్కువ శాతం ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి.. చూడబోతే ఈ విలువైన 

స్థలం కబ్జాకు గురి అయ్యే అవకాశాలు ఉండటంతో దేవాదాయశాఖ పెద్ద నోటీసులు అంటించింది.


అక్కడకు పోయిన తరువాత నాకు అర్ధం అయింది ఏమిటంటే ఈ దేవాలయాలకు భక్తులు ఉత్సవాలు సమయంలో తప్ప సాధారణ రోజుల్లో రావడం సంఖ్య తగ్గిపోవడానికి ఈ ప్రాంతం ఒక కారణం కావచ్చు. 


ఈ దేవాలయానికి దగ్గరలోనే భైరవస్వామి వారి దేవాలయం ఉంది. చాలా చిన్న దేవాలయం ఈ దేవాలయం కూడా సుమారు 200 సం. ల క్రిందట కట్టినట్లు చెపుతున్నారు. ఈ దేవాలయానికి కూడా లోపల వైపు అంతా శిథిలావస్థకు చేరిన రాతి మంటపం ఉంది.


చూడబోతే పైన చెప్పిన మురళీమనోహర దేవాలయంలో మంటపం, దీనిలో మంటపం నిర్మాణ శైలి ఒకే లాగా అనిపించాయి.


ఇక్కడ పూజారి గారి పేరు నట్వర్ నాధ్ శర్మ. ఉత్తరాది బ్రాహ్మణులు.

ఇక్కడ భక్తులు ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో పూజారి గారు ఖాళీ సమయాల్లో పొట్ట కూటి కోసం ఆటో నడుపుకుంటున్నారు.

వారి గూగుల్ పే నెంబర్: 8886511504.


పై కారణాలు దృష్ట్యా మనకు దగ్గరలో గల ఇటువంటి దేవాలయాలు గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే కనీసం శని ఆదివారాలు లేదా శలవు రోజుల్లో అయినా ఈ దేవాలయాలు దర్శించే భక్తుల సంఖ్య పెంచవచ్చు. మన భక్తులు ఎంత ఎక్కువగా దర్శిస్తే దేవాలయాలు అంత ఎక్కువగా ప్రాచుర్యం పొంది ప్రాచీన వైభవం సంతరించుకుంటాయి, కబ్జాకు గురి కాకుండా నిలబడతాయి.


ఈ దేవాలయాలకు దగ్గరగా మరొక ముఖ్య దేవాలయం ఉంది. అదే కాశిబుగ్గ ఆలయం.

కాశీ బుగ్గ ఆలయం గొప్పతనం ఏంటి అంటే నాచ్యురల్ గా నీళ్లు భూమినుంచి ఊరి శివుణ్ణి అభిషేకం చేస్తూ వెళతాయి. ఇది కూడా 200 సంవత్సర క్రితం కట్టింది..


నిన్న నాకు టైం సరిపోక ఆ దేవాలయం దర్శించలేకపోయాను. మరొక్క సారి వెళ్ళాలి.


అందువల్ల అందరూ ఈ దేవాలయాలు తప్పక దర్శించి ఆలయాల పునర్వైభవానికి తమ సహకారం అందించండి..🙏🙏🙏

కామెంట్‌లు లేవు: