23, జనవరి 2024, మంగళవారం

పదార్థాలకు విషం కలిసినప్పుడు

 పదార్థాలకు విషం కలిసినప్పుడు ఆయా పదార్థాల           

సేవన వలన కలుగు విపరీతాలు - పదార్థ లక్షణాలు. 


  *  విషము కలిసిన అన్నమును అగ్ని యందు వేసిన ఛటఛటమను ధ్వని కలుగును. నెమలి కంఠము నందలి రంగు వలే పొగ వెలువడును. ఆ పొగని భరించుట చాలా కష్టం అగును. మంటలు కలిసి ఉండక విడివిడిగా వెలువడును. చకోర పక్షి విషము కలిసిన అన్నమును చూసిన వెంటనే ఎర్రగా ఉండు దాని నేత్రములు తెల్లబడును. కోకిలకు స్వరము చెడిపొవును.


 *  విషము కలిసిన ఆహారము నుండి వెలువడు ఆవిరి తగిలినచో హృదయము నందు బాధ , కనులు తిరుగుట, తలనొప్పి తగ్గును. ఇటువంటి సమయంలో చెంగల్వకోష్టు , ఇంగువ, వట్టివేర్లు , తేనె చేర్చి నశ్యము చేయించవలెను . 


 *  విషము జీర్ణాశయం నందు చేరినపుడు ఒళ్లంతా మంటలు , అతిసారం, కడుపులో గూడ గూడ మనుట , శరీరం తెల్లబడుట జరుగును.


 *  మద్యము నందు , జలము విషము కలిసిన ద్రవం నందు గీతలు , నురుగు, బుడగలు కలుగును. విషము కలిసిన ద్రవము నందు మన శరీరఛాయ కనపడదు. ఒక వేళ కనిపించిన జంట నీడలుగా , రంధ్రములతో కూడినట్టుగా , పలుచగా , వికృతాకారముగా కనపడును.


 *  కూరలు , పప్పులు , అన్నము, మాంసము అను వాటి యందు విషము కలిసిన చితచితలాడుచూ రుచిని కోల్పోయి చద్దివానివలే దుర్గన్ధమును కలిగి ఉండును. అన్ని పండ్ల యందు కూడా విషపూరితం అయినపుడు వాటికి ఉండు సహజసిద్ధ రుచి , సువాసన కోల్పోవును. పచ్చికాయలకు విషము తగిలిన వెంటనే పండును. పండిన వానికి విషము తగిలిన వెంటనే కుళ్లిపోవును.


 *  దంతములకు తగిలిన దంతములు విరిగిపోవును. నాలుక , పండ్లచిగుళ్ళు , పెదవులు వాచును .


 *  తలకు పూయు నూనె యందు విషము కలిసిన ఆ నూనె జిగటలుగా సాగును. నూనె చిక్కబడి రంగు మారును . అది శరీరముకు తగిలిన పొక్కులు పుట్టి బాధ కలుగును. పొక్కుల నుంచి స్రావం కలుగును. చర్మం పుండు అగును. చెమటలు పుట్టును . జ్వరం కలుగును. మాంసం విడిపోవును.  నలుగుపిండి , స్నానం చేయు జలము , తలస్నానం చేయు కుంకుడు రసం నందు కూడా విషం కలిసిన పైన చెప్పిన లక్షణాలు కలుగును.


 *  విషము కలిసిన లేపము తలకు పూసిన జుట్టు ఊడిపోవును. తలయంతయు బాధ కలుగును. కన్ను , ముక్కు, చెవి మొదలగు రంధ్రముల నుంచి రక్తం కారును . శిరస్సు నందు గడ్డలు లేచును .


 *  ముఖమునకు పూసుకోను ముఖలేపనం నందు విషము కలిసిన ముఖం కమిలినట్లు అగును. తామర కాడపైన ఉండే విధంగా సన్నని ముళ్ళు వంటివి ముఖంపైన లేచును .


 *  ముక్కుతో పీల్చే వాటి యందు విషము కలిసిన శరీర రంధ్రముల నుంచి రక్తం బయటకి వచ్చును. శిరోభాధ , కఫం బయటకి కారుట జరుగును.


 *  పువ్వులకు విషము తగిలినచో వాటి సువాసన కోల్పోవును . వర్ణం మారును , వాడిపోవును . విషము సోకిన పువ్వుల వాసన చూసిన శిరోభాధ కలిగి నేత్రముల యందు నీరు చేరును .


 *  చెవిలో వేసుకోను తైలం నందు విషము కలిసిన వికృతి కలిగి ధ్వని గ్రహించు శక్తి తగ్గును. చెవి యందు వాపు , పోట్లు , రసి కారుట కలుగును.


 *  కంటికి పెట్టుకొను కాటుక యందు విషము కలిసినచో కన్నీరు జిగురుగా మారును , కనులు మండును . గుడ్డితనం కూడా కలుగును.


 *  పాదుకలు యందు విషం ఉన్నచో పాదముల యందు వాపు , రసికారుట, పాదములు మొద్దుబారుట, పొక్కులు కలుగుట అను లక్షణములు సంభంవించును.


 *  నగల యందు విషము కలిసిన అవి మాములుగా ప్రకాశించవు . కాంతి తగ్గి ఉండును. ధరించిన శరీరభాగాలను హింసించును. వొళ్ళంతా మంటలు కలుగచేయును . చర్మం, మాంసం ఊడిపడును.  


            పైన చెప్పినవిధముగా ఆయా పదార్థాలలో విషము కలిసినపుడు విషము యొక్క తీక్షణత వలన అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. ఇప్పుడు నేను మీకు వివరించిన విషలక్షణాల గురించి రాజులకు వారివారి గురువులు తప్పకుండా వివరించేవారు.


  

 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: