2, జులై 2024, మంగళవారం

తిరుమల కు వెళ్తున్న బ్రాహ్మణులకు

 *తిరుమల కు వెళ్తున్న బ్రాహ్మణులకు శుభవార్త.*

ఇరవై నాలుగు గంటలు, 365 రోజులు ఆ దేవదేవుడు, తిరుమల వేంకటేశ్వర స్వామి మన కోసం నిలబడి మన బాధలు తీరుస్తూ కల్పవృక్షం గా తిరుమల లో వెలిశారు. *శ్రీహరి భక్తులకు సేవ చేస్తే చాలు శ్రీ హారి మనకు అనుగ్రహిస్తారు అని పురాణాలు చెప్తున్నాయి.  

 సాక్షాత్తు జగద్గురువులు *శ్రీ శృంగేరి భారతి తీర్థ స్వామి* అసిస్సుల తో  మరియు వారి అనుగ్రహం తో  *తిరుమల శృంగేరి మఠం* వారు మన బ్రాహ్మణులకు ప్రతి రోజు *అన్న ప్రసాద వితరణ ను ప్రారంభించారు.*

 *శ్రీ శారద అన్న ప్రసాదం అనే పేరు తో  కార్యక్రమాన్ని ప్రారంభించారు*. 

శుచిగా శుభ్రంగా బ్రాహ్మణుల చేత వండించి వితరణ చేస్తారు. ఇది బ్రాహ్మణులకు శుభవార్త.

ఈ సృష్టిలో విశిష్టమైనది మానవజన్మ. 

ఈ జన్మకు సార్థకత చేకూర్చేది వితరణ. 

ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తిరుమల చేరుకుని స్వామి దర్శనం కోసం ఆర్తి తో ఎదురుచూస్తున్న భక్తులకు, కాస్త ఆకలి తీర్చే కార్యక్రమం శృంగేరి మఠం వారు చేస్తున్న అన్న ప్రసాద వితరణ. 

ప్రతి రోజూ ఈ కార్యక్రమం స్థానిక శృంగేరి మఠం నందు జరుగుతుంది . ఇది గొప్ప యజ్ఞం.  ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్న వారు *శ్రీమాన్ కే చంద్ర శేఖర్ గారు ధర్మాదికారి, శృంగేరి మఠం*. తిరుమల శృంగేరి మఠం వారికి మనం అందరం సహకరించాలి. 

కాబట్టి ఈ సమాచారం అందరికీ అందించండి. వారి నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీ రాక ను ముందే వీరికి తెలియజేయగలరు . 0877 2277269, 9440271698.


మీ

*Dr K Chandrasekhar Sastry*

Dharmadhikari

Sri sringeri mutt, Tirumala

కామెంట్‌లు లేవు: